7, నవంబర్ 2025, శుక్రవారం

మోక్షప్రదాయని

నీవు లేక నేను లేను నేను లేక నీవు లేవు అనేది ఒక సినిమా పాట అది మనందరికీ తెలిసిందే ఆ పాటలోపడా ఒక ప్రేమికులను ఉద్దేశించి అది రాసి ఉండవచ్చు కానీ ఒక భక్తుడికి భగవంతుడికి ఈ పాట సంపూర్ణంగా అనువర్తించవచ్చు భగవంతుడు నేను అంటే భక్తుడు ఇద్దరు వేరు కాదు నీవు లేకుండా నేను లేను అంటే నీవే నేను నేనే నీవు భగవంతుడా నీవు నాయందు ఉన్నావు నేనే భగవంతుడు అయి ఉన్నాను అనేటువంటి నగ్న సత్యం తెలుసుకోవడమే అది ఈ జీవితానికి పరమార్థం అదే మోక్షప్రదాయని

పాఠకులకు మనవి

పాఠకులకు మనవి మీరు మన బ్లాగులో కుడివైపు గడియారాన్ని చూస్తున్నారు కదా అందులో సూచించే సమయం మీ దేశానికి సంబంధించిన నిజమైన సమయమా లేకపోతే ఇండియా సమయమా మీరు ఒక్కసారి మీ కామెంట్ రూపంలో పెట్టగలరు 

సుశ్రుతుడు

 ఆయుర్వేద పితామహుడు సుశ్రుతుడు గురించి విశేషాలు -


 

జననం - క్రీ .పూ 1000 సంవత్సరం .

 జన్మస్థలం - వారణాసి .

 తండ్రి - విశ్వామిత్రుడు .

 గురువు - ధన్వంతరి . 

 రచనలు - సుశ్రుత సంహిత .

       

          ప్రాచీన వైద్య శాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహానుభావుడు , ప్రముఖుడు . ప్రపంచంలో సాటిలేని మేటి శస్త్రచికిత్స నిపుణుడు ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీ చేయడంలో నిష్ణాతుడు . ఇతని కాలం నాటికే అంటే దాదాపు 3000 సంవత్సరాల క్రితం నాడే వైద్యరంగంలో భారతదేశం నేటి ప్రపంచం కన్నా ఎంతో ముందు ఉన్నది. దీనికై ఎంతోమంది భారతీయ వైద్యశాస్త్రవేత్తలు ఈ వైద్యరంగానికి ఎనలేని సేవలు చేశారు .

               

       ప్రపంచం వైద్యశాస్త్రం గురించి కళ్లు తెరవకముందే వైద్యశాస్త్రాన్ని ప్రకాశింపచేసినది భారతీయులే . శస్త్రచికిత్సా రంగంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన పరికరాలు ఉపయోగించడంలో సుశ్రుతుడు ఆద్యుడు అని చెప్పవచ్చు. దాదాపు 101 రకాల శస్త్రచికిత్సా పరికరాలను సుశృతుడు వివిధ సందర్భాలలో ఉపయోగించేవాడు . తెగిపోయిన అవయవాలను తిరిగి వాటి స్థానంలో అతికించడంలో సుశ్రుతుడుని మించినవారు మరొకరు లేరు .

       

         మొట్టమొదట శవపరీక్ష నిర్వహించింది కూడా ఈయనే . శవాన్ని పరిశీలించడం ఆ మరణం ఏ విధముగా సంభవించిందో నిర్ధారించడంలో సుశృతుడు కడు నిష్ణాతుడు . అదేవిధముగా చెడు రక్తాన్ని శరీరం నుండి తొలగించడంలోనూ , ఆరోగ్యవంతమైన రక్తాన్ని శరీరానికి అందించడంలోనూ , మూత్రనాళాల్లో , మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్లను తొలగించడంలోనూ మరియు అనేక నిగూడ మరియు భయంకర రోగాలను అనతికాలంలో అతి సునాయాసముగా నయంచేయడంలో సుశ్రుతుడుది అందవేసిన చేయి .

                  

     సుశృతుడు రాసిన సుశ్రుత సంహిత నందు శల్యతంత్రం ( శస్త్రచికిత్స , సర్జరి ) గురించి మరియు అష్టాంగ వైద్యవిధానం గురించియు మరింకెన్నో విషయాలకు సంబంధించిన పలువివరాలను క్షుణ్ణంగా ఈ గ్రంథంలో సుశృతుడు వివరించిన కారణంగా ఈ గ్రంథం ప్రమాణ గ్రంధంగా గ్రహింపబడుతుంది. సుప్రసిద్ధ రససిద్ధుడు ఆచార్య నాగార్జునుడు ఈ గ్రంథం ప్రశస్తమైనది అని ప్రస్తుతించాడు . ఈ గ్రంథాన్ని క్రీ . పూ 800 వ సంవత్సరం నందు అరబ్ భాషలోకి అనువదించుకొని వెళ్లి వారివారి ప్రాంతాలలో వైద్యశాస్త్ర అభివృద్ది చేసుకున్నారు . రోమన్లు కూడా భారతీయ మౌళిక ఔషధవిధానాన్ని అనుసరించారు. 

        

     ఇప్పుడు మీకు ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు సర్జరీ చేసే విధానం గురించి మీకు వివరిస్తాను.

 

    ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్స చేసిన విధానం - 

      

    చెట్టుయొక్క ఆకుని తీసి తెగియున్న ముక్కుభాగమును సరిగ్గా కొలతపెట్టి అంతప్రమాణం గల చర్మమాంసములు తో కూడిన పోరని దగ్గరగా ఉండు చెక్కిలి భాగం క్రిందనుండి మీదకి కోసి మీదభాగం పట్టు ఉండునట్లు ఉంచి ఆ పొరని ముక్కు యొక్క మొదలు వరకు పదునైన అంచుతో శస్త్రం తో గీచి రక్తం స్రవించునట్లు చేసి దానితో అంచులని అతికించి నాసారంధ్రములకు రెండింటికి తేలికైన గలగడ్డితో చేసిన గొట్టములని దూర్చి పైన ముక్కుయొక్క ఆకారంనకు సరిగ్గా ఆ కండపోరని సర్ది అప్రమత్తముగా , శీఘ్రముగా మీదకి ఎత్తి సూత్రాదులతో ( దారాలతో ) చక్కగా బంధనం చేసి దానిపైన రక్తచందనం , యష్టిమధూకం , రసాంజనం వీని చూర్ణంని చల్లి ఆ పైన తెల్ల దూదిపింజతో కప్పి నువ్వులనూనెని మాటిమాటికి వేసి తడుపుచుండవలెను . మరియు ఆ రోగికి జీర్ణం అయ్యేంత తగినంత నెయ్యిని త్రాగించి కొంచం స్థిమితపడిన తరువాత శాస్త్రానుసారం విరేచనం చేయించవలెను. 

         

        ఇలా చేయుచూ చక్కగా ఆ పోర అతుకుకున్న తరువాత అంతకు ముందు కొంచం పట్టు ఉంచిన కండ భాగాన్ని ఛేదించవలెను . ఇలా చక్కగా అతుకుకొనిన తరువాత కొంచం కృశించి ఉన్నచో ఆ భాగం నకు వెనక చెప్పిన తైలాది చికిత్సలను అనుసరించి ఆ భాగం పెరుగునట్లు చేయవలెను . ఒకవేళ అక్కడ మాంసం ఎక్కువుగా వృద్ధిచెంది యున్నచో సమముగా ఉండునట్టి ఉపాయం జూచి తగ్గించి సరిచేయవలెను . ఒక్కోసారి లలాటభాగం నందలి మాంసపుపొర కూడా కోసి అతకవలసి యుండును.

       

      ఈ విధముగా సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్సలు కడు ఉపాయంతో సులభముగా చెసెడివారు .  


       ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

గమనిక -

           

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

         నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

కార్తీకపురాణం - 17 వ అధ్యాయము*

 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴

     🍁 _*శుక్రవారం*_🍁

🕉️ *నవంబర్ 7, 2025*🕉️


*కార్తీకపురాణం  - 17 వ అధ్యాయము*


🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️

             

*ధన లోభికి తత్వోపదేశం*```


అప్పుడు అంగీరసుడు మునులతో ఇలా అంటున్నాడు…. “ఓ మహా మునులారా! ఓ ధనలోభి! మీకు కలిగిన సంశయాలకు సమాధానమిస్తాను. సావధానంగా వినండి” అంటూ ఇలా చెప్పసాగారు.


“కర్మల వల్ల ఆత్మ దేహధారణ సంభవిస్తున్నది. కాబట్టి, శరీరోత్పత్తి కర్మకారణంగా జరుగుతోందనే విషయాన్ని గుర్తించాలి. శరీరధారణం వల్ల ఆత్మ కర్మను చేస్తుంది. కర్మ చేయడానికి శరీరమే కారణమవుతోన్నది. స్థూల, సూక్ష్మ శరీర సంబంధాల వల్ల ఆత్మకు కర్మ సంబంధాలు కలుగుతాయని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దాన్ని మీకు చెబుతున్నాను. ఆత్మ అనగా… 

ఈ శరీరాన్ని అహంకారంగా ఆవహించి వ్యవహరించేది అని అర్థం” అని వివరించాడు.


దీనికి ధనలోభుడు తిరిగి ఇలా అడుగుతున్నాడు… “ఓ మునినీద్రా! మేం ఇప్పటి వరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాం. ఇంకా వివరంగా చెప్పండి. వ్యక్య్తార్థ జ్ఞానం, పదార్థ జ్ఞానం, అహం బ్రహ్మ అనే వ్యక్య్తార్థ్య జ్ఞానం గురించి తెలియజేయండి” అని కోరాడు.


అప్పుడు అంగీరసుడు తిరిగి ఇలా చెబుతున్నాడు “ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను-నాది అని చెప్పే జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాతంర్యామి అయిన పరమాత్మ న్ణ అనే శబ్దం. శరీరానికి ఆత్మలా షుటాదులు లేవు. సచ్చిదానంద స్వరూపం, బుద్ది, సాక్షి, జ్ఞానరూపి, శరీరేంద్రియాలను ప్రవర్తింపజేసి, వాటికంటే వేరుగా ఉంటూ… ఒకే రీతిలో ప్రకాశించేదే ఆత్మ. నేను అనేది శరీరేంద్రియానికి సంబంధించినది. ఇనుము అయస్కాంతాన్ని అంటిపెట్టుకుని ఎలా తిరుగుతుందో… ఆత్మకూడా శరీరాన్ని, శరీర ఇంద్రియాలను ఆశ్రయించి తిరుగుతుంది. అవి ఆత్మ వల్ల పనిచేస్తాయి. నిద్రలో శరీరేంద్రియాల సంబంధం ఉండదు. నిద్ర మేల్కొన్నతర్వాత నేను సుఖనిద్ర పొందాను అని భావిస్తారు. శరీర ఇంద్రియాలతో ప్రమేయం లేకుండా ఏదైతే సుఖాన్నిచ్చిందో అదే ఆత్మ. దీపాన్ని గాజుబుడ్డి ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా ఆత్మకూడా దేహ, ఇంద్రియాలను ప్రకాశింపజేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం. తత్వమసి మొదలైన వ్యాక్యాల్లో త్వం అనే పదం కించిత్ జ్ఞాత్వాదిశాశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. త్వం అంటే నీవు అని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మాలను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుస్తుంది. అదే ఆత్మ. దేహలక్షణాలు జన్మించుట, పెరుగుట, క్షీణించుట వంటివి ఆరు క్రమాలుంటాయి. అయితే ఆత్మకు అలాంటి లక్షణాలు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం ఉన్నది. వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వం, ఉపదేశం, సంపూర్ణత్వం నిరూపించబడి ఉందో… అదే ఆత్మ. ఒక కుండను చూసి, అది మట్టితో చేసిందని ఎలా గుర్తిస్తామో… అలాగే ఒక దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి. జీవుల కర్మ ఫలాలను అనుభవించేవాడు పరమేశ్వరుడేనని, జీవులు ఆ కర్మలను ఫలాలని భావిస్తారని తెలుసుకోవాలి. అందువల్ల మానవుడు గుణసంపత్తు కలవాడై… గురుశుశ్రూష ఒనర్చి, సంసార సంబంధమైన ఆశలను విడిచి, విముక్తిని పొందాలి. మంచి పనులు తలచినంతనే చిత్తశుద్ధి, తద్వారా జ్ఞానం, భక్తి, వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందుతారు. అందువల్ల సత్కర్మానుష్టానం చేయాలి. మంచి పనులు చేస్తేగానీ ముక్తి లభించదు” అని అంగీరసుడు వివరించాడు.```


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత  వశిష్ట ప్రోక్త  కార్తీక మహాత్యమందలి*


  *పదిహేడవ అధ్యాయము*  

        *పదిహేడవ రోజు*

 *పారాయణము సమాప్తం*


           🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*

🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

6, నవంబర్ 2025, గురువారం

వందేమాతరం

 *🇮🇳పూర్తి వందేమాతరం🇮🇳*


వందేమాతరం

వందేమాతరం


సుజలాం సుఫలాం మలయజ శీతలామ్

సస్యశ్యామలాం మాతరం వందేమాతరం

శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్

ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్

సుహాసినీం సుమధుర భాషిణీమ్

సుఖదాం వరదాం మాతరం వందేమాతరం


కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే

కోటి కోటి భుజై ధృత కర కరవాలే

అబలాకేనో మాం ఎతో బలే

బహుబల ధారిణీం నమామి తారిణీం

రిపుదల వారిణీం మాతరం వందేమాతరం


తుమి విద్యా తుమి ధర్మ

తుమి హృది తుమి మర్మ

త్వంహి ప్రాణః శరీరే

బహుతే తుమి మా శక్తి

హృదయే తుమి మా భక్తి

తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం


త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ

కమలా కమలదళ విహారిణీ

వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం

అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందేమాతరం

శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం

ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం

తరం కనుమరుగవుతోంది

 *ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది. అన్నం తినేముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం. ఇరుకు ఇళ్లల్లో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం. బాధ్యతల్ని ఎరిగిన తరం. 'నేను' అనకుండా 'మనం' అంటూ బతికిన తరం. డిగ్రీలు లేకున్నా, జీవితాన్ని చదివిన తరం. గడియారం లేకున్నా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం. ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం. కాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం. మొబైల్ ఫోన్ లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం. TV లు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం. GPS లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం. సాంకేతికత లేకున్నా సుఖసంతోషాలతో బతికిన తరం. ACలు, కూలర్లు లేకున్నా

ఆరుబయట హాయిగా నిద్రించిన తరం. మినరల్ వాటర్ కు బదులు చెరువు/బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికిన తరం. పిజ్జాలు, బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు, పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం. రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం. ఆరో ఏడు వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం. ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి - అటు తెలుగు లోనూ, ఇటు ఇంగ్లీష్ లోనూ పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం. కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం. క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్ లో టీచర్ నాలుగు దెబ్బలు వడ్డిస్తే - వాడికి మరో పది దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం. వీధి నాటకాలను, తోలు బొమ్మలాటలను, బుర్రకధలను ఆస్వాదించిన తరం. సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు-తెలుపు సినిమాలు చూసిన తరం. ఇంటిముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం. పనిమనుషులతో, యోగాలతో, జిమ్ లతో పని లేకుండా, బండెడు చాకిరీ చేసుకుంటూ, చెమటను చిందించి వందేళ్లు బతికిన తరం. బంధాలకు, బంధుత్వాలకు విలువనిచ్చిన తరం. ఆస్తులకన్నా, ఆప్యాయతలకు, అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం. ఉమ్మడికుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం. భేదాభిప్రాయాలున్నా అందర్నీ కలుపుకుని వెళ్ళగలిగిన తరం. వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం. ఇతరుల మేలు కోరుకున్న తరం. నీతి నిజాయితీలతో మోసాలు చెయ్యకుండా బతికిన తరం. రాళ్లు తిన్నా అరిగించుకోగలిగిన తరం. కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం. హార్ట్ ఎటాక్, క్యాన్సర్ ల గురించి తెలియని తరం. బీపీలు, షుగర్ లను దరిచేరనీయని తరం. లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం. కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం. ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం. ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం. పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం. త్యాగాలతో పిల్లల భవిష్యత్ కు పునాదులు వేసిన తరం. కులమతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన తరం. అలాంటి తరంలోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు. వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. వెళ్లిపోతున్న ఆ తరం వాళ్ల నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే - భవిష్యత్తు అంధకారమే!

ఆలోచించండి!!!!

*Plz share it to all ur friends*

Spread lots of love, positivity and smiles today....

Tomorrow might be too late...!

✍🏻🚩 సర్వే జనాః సుఖినోభవంతు. 🚩

త్రిపుర' పౌర్ణమి విశిష్టత....

 *'త్రిపుర' పౌర్ణమి విశిష్టత.....* 


*కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఇది అత్యంత మహి మాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే.. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అత్యంత ప్రభావంతమైనవి. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక్కటీ ఒక ఎత్తు.*


*అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి. పౌర్ణమిరోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాల్లో రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీదా, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలపై బియ్యప్పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అలంకరించుకొని* *వెలిగించాలి. శివాలయంలో ధ్వజస్తంభంపై నందాదీపంతో పేరుతో అఖండదీపాన్ని, ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరిణల్లో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులు, నదులు వంటి జల వనరుల్లో విడిచి పెడతారు. ఇలా చేయడం వల్ల అప్లైశ్వర్యాలు కలగడంతో పాటు ఎంతో పుణ్యం వస్తుంది.*


*వైజ్ఞానికపరంగా ఆలోచిస్తే ఈ కార్తీక దీపాల వెలుగుల నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలోని కాలుష్యం తగ్గిపోయి వాతావరణం శుద్ది అవుతుంది. ఫలితంగా ఆరోగ్యం చేకూరుతుంది. కార్తీక పౌర్ణమి నుంచి ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగి స్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం అని దీనికి పేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్ధం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల వరం ఇవ్వదలచుకోలేదట శివుడు. అందుకే 'అల్పాయుష్కుడు, అతి మేధావి అయిన కొడుకు కావాలా... పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా?' అని అడిగితే... కుమారుణ్ణి కోరుకున్నారా దంపతులు. శివుడి వరం తోటి ఆ దంపతులకి కుమారుడు పుట్టాడు. అయితే ఆ కుమారుడు పెరుగుతున్న కొలదీ ఆ తల్లిదండ్రుల్లో గుబులు పెరుగుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తుపై వారి దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశాడు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి అసలు విషయం తెలిసింది ఆ సాధ్వికి, తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుడ్ని ప్రార్దించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం.*


*ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని మరోపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు నగరాలను వరంగా పొందారు. అలాగే ఎవరివల్లా మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంపై, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురునీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు, ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో లోకాలన్నింటా కల్లోలం సృష్టించారు. వివిధ లోకవాసులు విసిగిపోయి బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేను... మీరు విష్ణువు దగ్గరకు వెళ్ళండి అని చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటబెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడని, అందువల్ల కార్తీక పౌర్ణమికి ఈ పేరు వచ్చిందని పురాణ కథనం.*


*కార్తీక పౌర్ణమిరోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం వంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ప్రస్తుతకాలంలో ఉద్యోగాల బిజీలో కానీ ఇతర ఏ కారణం చేతనైనా రోజూ దేవుడ్ని పూజించి దీపారాధన చేసే సమయం లేని వారు, నిష్ఠను ఆచరించలేని వారు కార్తీక పౌర్ణమినాడు ఆచరిస్తే చాలు... నెలంతా పూజ చేసిన ఫలితం కలుగుతుంది. ఈ రోజున స్త్రీల కొరకు ప్రత్యేకంగా ఉపవాసం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి ఫలహారంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల కడుపు చలువ అంటే బిడ్డలకు రక్ష కలుగుతుందని పెద్దలంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం. ఈ రోజు మరో ప్రత్యేకత ఏంటంటే... శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం. కార్తీకపౌర్ణ మిరోజు శివుడు త్రిపురాసురులను సంహరించి ఇంటికి వస్తాడు. విజయంతో తిరిగి వచ్చిన పరమశివుడికి దిష్టి తగలకుండా ఉండటం కోసం పార్వతీదేవి జ్వాలాతోరణోత్సవం నిర్వహించిందట. అదే పద్ధతిలో ఈ రోజున శివాలయాల్లో జ్వాలాతోరణోత్సవాన్ని జరుపుతుంటారు. కార్తీకపౌర్ణమి రోజున శివాలయానికి వెళ్లి దీపారాధన చేసి ఈ జ్వాలా తోరణోత్సవాన్ని చూడటం వల్ల సమస్త దోషాలు నశించి సకల శుభాలు చేకూరతాయట. ఇంకా ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారీ రోజు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానాఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, కృత్తికావ్రతం వంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రద క్షిణ, లక్షవత్తులు, లక్షరుద్రం వంటి పూజలు చేస్తారు.*


*ప్రత్యేకతలు*


*దైవదర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామదానం, దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అను గ్రహిస్తాయని కార్తీక పురాణంలో ఉంది. ఎవరి శక్తి సామర్ధ్యాలను బట్టి హరిహరులను సేవించి వారి కరుణా కటాక్షాలు పొందాలి. వీరిని ఎంత నిష్ఠతో పూజిస్తే అంత శుభఫలితాలు ఉంటాయి.*


*┈┉━❀꧁గురుభ్యోనమః꧂❀━┉┈*

నాటి_పాతాళ_లోకమే_నేటి_అమెరికా

 #నాటి_పాతాళ_లోకమే_నేటి_అమెరికా..... 


పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారు. 


👉 సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు. 


👉 ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా (శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉప న్యాసంలో చెప్పారు.) 


👉 కాలిఫోర్నియాకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)  (సగర పుత్రులు బూడిద కుప్పలు గా  మారిన ప్రదేశం) 


👉 హార్స్‌ల్యాండ్ (Horse land) (యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమనీ నదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి. 


👉 వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తోలి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియానే. దీని పురాతన నామం మహాబలి భూమి, ఇప్పుడది మలిబు(Malibu) అనే పేరుగా రూపాంతరం చెందింది. 


👉 ఈ మలిబు నగరంకు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం. 


👉 బలిచక్రవర్తిని శ్రీ మహా విష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది. 


👉 పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 50,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువుగా సొరంగం తవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము. 


👉 రాముడి ఆజ్ఞ మీద హనుమంతుల వారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజిస్తారు. మధ్య అమెరికా, హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca నగరాన్ని Lost City of the Monkey God గా వ్యవహరిస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారు (Theodore Morde అనే అమెరికన్ సాహసికుడు 1939 లో వెల్లడించారు.) 


👉 “సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ" అనగా సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు. 


👉 భూమినుండి 50000 యోజనాల దూరంలో పాతాళం ఉన్నది. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పు కున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది. 


👉 అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, Oregon లో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీచక్ర యంత్రం బయలు పడడం ఇవన్నీ కూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే. 


👉  మూల అమెరికన్లు (రెడ్ ఇండియన్లు) విగ్రహారాధన చేస్తారు. ఇప్పటికీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడు తుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్సికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార ఛాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారత దేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం The light of India లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయా సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు. వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఉన్నది. 


👉 వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114BC నుండి మొదలు అవుతుంది. ఇంచు మించు మనం మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరి పోతుంది. వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ వుహ్ అంటారు. వారి పండగలు కూడా మన దసరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారుకూడా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ వున్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియజెయ్య వలసిన అవసరం ఉంది.


ఒకసారి నడిచే దేవుడు కంచి పరమాచార్య వారు మూల అమెరికన్ల మంత్రాలకు మన మంత్రాలకు ఉన్న సంబంధం వివరించారు. ఒకప్పుడు ఈ లోకాలన్నింటిలో ఒకే ధర్మం విలసిల్లేది. 


అక్కడివారి వద్ద తాళం కనబడుతోంది. కేవలం హిందూ ధర్మంలో ఆ తాళం, దాని చిక్కుముడి విప్పే తాళంచెవి కూడా ఉన్నాయి అని పరమాచార్యులు అన్నారు. 


♦️♦️♦️♦️♦️♦️♦️ 



5, నవంబర్ 2025, బుధవారం

ప్రతి ఫలం

 15, సెప్టెంబర్ 2024, ఆదివారం

ప్రతి ఫలం

 


 ప్రతి ఫలం 


కొన్ని సందర్భాలలో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇవ్వవచ్చు.  ఇటువంటి దానికి నిదర్శనంగా శ్రీ ఆది శంకరుల ఒక వృత్తాంతం తెలుపుతారు. 


ఆది  శంకరుల వారు సన్యాసాశ్రమం సవీకరించిన తోలి రోజుల్లో అంటే ఇంకా స్వామి బాల్యంలోనే వున్నారు.  బిక్షాటన కొరకు ఒకసారి ఒక గుడిశముందు నిలబడి " భవతి బిక్షం దేహి" అని యాచించారట  కానీ ఆ గృహంలోనుంచి ఎంతసేపటికి ఎవ్వరు రాలేదు.   అయినా కానీ మన శంకరులవారు ఇంకా నిరీక్షిస్తూ ఆ గుడిసె ముందే ఉన్నారు.  కొంతసేపటికి ఒక పేదరాలు వణుకుతున్న చేతులతో స్వామికి లేదు అని చెప్పటానికి మనస్కరించక ఒక ఉసిరిక పండును మాత్రం ఆయన జోలెలో వేసిందట. ఆమె దైన్యతను గమనించిన శంకరాచార్యులవారు ఒకసారి ఆమె గుడిసెను సంపూర్ణంగా పరికించి చుస్తే మొత్తం ఇల్లంతా కాళీగా ఎటువంటి వస్తువులు లేకుండా  ఉండటం చూసి ఆమె కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నదని తెలుసుకున్నారు. 


ఆది శంకరాచార్యుల వారి  మనస్సు ఆర్ద్రతమైనదట. వెంటనే శంకరాచార్యులవారు మహాలక్షిని స్తుతిస్తూ స్తోత్రము చేశారట.  ఆయన స్తోత్రానికి ప్రసన్నమైన అమ్మవారు ఆయనకు ప్రత్యక్షం అయి నాయనా ఎందుకు నన్ను పిలిచావు అని అడిగింది.  దానికి శంకరులవారు అమ్మా ఇది నీకేమైనా న్యాయంగా ఉన్నదా ఈ సాద్వి మణి  దీనత్వం చూసి నీకు కొంచమైనా దయరాలేదా తల్లి అని వేడుకొన్నాడు. అప్పుడు అమ్మవారు నాయనా నేను ఏమి చేతును ఆమె గతజన్మలో పూర్తిగా పిసినారిగా వుంటూ ఎవరికి కూడా ఎటువంటి దానధర్మాలు చేయకుండా ఉండి పూర్తిగా పుణ్యరహితంగా ఉండటం వలన ఆమెకు ఈ జన్మలో ఈ దారిద్యం దాపురించింది అని అన్నది.   అమ్మా ఆమె ఏ పుణ్యము చేయలేదు సరే మరి ఆమె భర్త పుణ్యము వలన అయినా ఈమెకు కొంత ఊరట కలగాలి కదా తల్లి అని అన్నాడు. దానికి తల్లి నాయనా ఆమె భర్త ఈమెకన్నా ఎక్కువ పాపాత్ముడు . అందుకే వారిద్దరిని కలిపాడు పరమేశ్వరుడు.  ఇద్దరు ఒకరిని మించిన వారు ఇంకొకరు.  కాబట్టి వారు ఈ దారిద్యాన్ని అనుభవిస్తున్నారు అని అన్నారు అమ్మవారు. 


నాయనా ప్రస్తుత పరిస్థితుల్లో వారి దారిద్యాన్ని బాపటం ఆ పరమేశ్వరుని వశం కూడా కాదు వారు అంత పాపాత్ములు అని తల్లి ఉన్నసంగతి ఉన్నట్లు చెప్పింది.  అప్పుడు ఆలోచించటం శంకరులవారి వంతయినది శంకరులు అంటే సాక్షాత్తు శంకరులేకదా మరి శంకరాచారులవారు ఊరుకుంటారా.  తల్లి నీవు చెప్పింది నిజమే కావచ్చు  ఆ సాద్విమణి ఏ పుణ్యము గత జన్మలో చేసి ఉండకపోవచ్చు.  మరి ఈ జన్మలో విషయం ఏమిటి తల్లీ అని అమ్మవారిని మరల వినమ్రుడై అడిగాడు.  ఈ జన్మలోకూడా ఆమె ఏ రకమైన దానం చేయలేదు అని లక్ష్మీదేవి  బదులిచ్చింది. అప్పుడు శంకరులవారు ఒక్కసారి ఆమె గుడిశ మొత్తం పరికించి చూడు తల్లీ అని వేడుకున్నాడు.  మొత్తం చూసిన మహాలక్షి ఏమున్నది నాయనా అని అన్నది.  తల్లీ నేను చెప్పేది కూడా అదే ఆ సాద్వీమణికి ఇవ్వటానికి ఏమిలేకపోయినా నాకు ఒక ఉసిరిక పండును దానం చేసింది తల్లీ మరి ఆ దానఫలితాన్ని ఇవ్వవా అని మరల వేడుకొన్నాడు. అప్పుడు శంకరుని తెలివికి మెచ్చుకొనిన లక్ష్మీ దేవి ఆ ఇంట బంగారపు ఉసిరికాయలను వర్షించిందట దానితో ఆ పేదరాలి పేదరికం అంతా మటుమాయం అయిపొయింది. 


ఆది శంకరులు లక్షి అమ్మవారిని ప్రసన్నురాలిగా చేసిన స్తోత్రం కనకధారా స్తోత్రముగా చాల ప్రసిద్ధి చెందింది.  ఈ స్తోత్రాన్ని భక్తితో రోజు పారాయణ చేసే భక్తులకు సిరి సంపదలు సమకూరుతాయని ప్రతీతి. త్రికరణ శుద్ధిగా అకుంఠిత దీక్షతో ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తే తప్పకుండా ఆ మహాలక్షి ప్రత్యక్షం అవుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి అని అంటారు. .  


చూసారా సత్పురుషునికి చేసిన ఒక చిన్న దాన ఫలితంగా యెంత ఫలితం లభించిందో కదా.  కాబట్టి మనం ఎప్పుడూ సపాత్ర దానాన్ని చేయాలి. అంటే పాత్రనెఱిగి దానం చేయాలి.  దానం చేసేటప్పుడు దాన గ్రహీత మీరు చేసే దానానికి యోగ్యుడా కాదా అని నిర్ధారణ చేసుకొని మరి దానం చేయాలి. మీరు చేసిన దాన ద్రవ్యముతో దాన గ్రహీత ఏదైనా పాపపు కృత్యాలు చేస్తే మీకు దానఫలితంగా పుణ్య ఫలం రాకపోగా ఆ పాపంలో భాగం వస్తుంది. అంటే డబ్బులు ఇచ్చి మరి పాపాలను కొనుక్కోవటం అన్నమాట. 


మన పూర్వికులు అందుకేనేమో అన్నిదానాలలోకి అన్నదానం గొప్పది అని అన్నారు. అన్నదానం చేయటం  వలన రెండు విషయాలు అవగతం  అవుతాయి. ఒకటి అన్నం తిన్న దాన గ్రహీత ఇక నాకు చాలు అంటాడు అంటే అతను మీ దానంతో తృప్తి చెందుతాడు. కాబట్టి అతని తృప్తివలన మీకు దాని ఫలితంగా పుణ్యఫలం వస్తుంది.   ఇంకొక విషయం. మీరు పెట్టిన అన్నాన్ని మీ సమక్షంలోనే ఆరగిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో అన్న దానం వలన పాపం రాదు.  ఏదానానికైనా పాత్రను యెరిగి దానం చేయాలి కానీ అన్నదానానికి మాత్రం ఆకలితోవున్న ఎవ్వరికైనా చేయవచ్చు. పుణ్య ఫలితం ఒకేవిధంగా ఉంటుంది.  అన్నదానం కేవలం మనుస్యులకు మాత్రమే చేయాలనీ నియమం లేదు. పశుపక్ష్యాదులకు కూడా చేయవచ్చు. నిత్యం పక్షులకు అన్నం పెట్టె వారికి ఈ జన్మలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి జీవితం కలుగుతుంది. వారి పితృదేవతలు కూడా సంతోషిస్తారు.


కాబట్టి ప్రతివారు  ఇతర దానాలకన్నా అన్నదానమే శ్రేష్ఠము కావున అన్నదానాన్ని విరివిగా చేయటం శ్రేయస్కరం. . అన్నదానాన్ని ప్రోత్సహించండి. ఆలా అని రోజు ఒక్కరికే అన్నాన్ని పెట్టి మనుషులను ఏ పని పాట చేసుకొని సోమరులుగా తయారు చేయకూడదు.  


అన్నదానం తరువాత చెప్పుకోదగిన దానం విద్య దానం. ప్రతి విద్వంసుడు తాను సముపార్జించిన విద్యను పలువురికి దానం చేసి విద్యావంతులను చేయాలి.  విద్యావంతుడైన వాడు తన విద్యతో చక్కగా జీవితాంతం సంపాదించుకొని తానూ సుఖపడి పలువురిని సుఖపెట్టగలడు.  కాబట్టి విద్యాదానం చేయటం కూడా చాలా మంచి విషయం. 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః 


చేరువేల భార్గవ శర్మ

కార్తీకపురాణం - 15 వ అధ్యాయము*

 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴

   🪷 _*బుధవారం*_🪷

🕉️ *నవంబర్ 5, 2025*🕉️


*కార్తీకపురాణం - 15 వ అధ్యాయము*


🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️

             

*దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట*

```

అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - “జనకా! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమ”ని ఇట్లు చెప్పెను..

          

“ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును.

            

శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల, విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విడువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు.

          

నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ద త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను.

           

ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినయెడలను, లేక, ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు..

           

“సరస్వతీ నదీతీరమున శిధిలమైన దేవాలయ మొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్రహృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీకమాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనముజేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లుపెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులుజేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభమునుండి చేయు చుండెను.

          

ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను.

         

అది కార్తీకమాస మగుటవలనను, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను.

             

ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచిచూడగా, ప్రక్కనొక మానవుడు నిలబడి యుండుటను గమనించి “ఓయీ! నీవెవ్వడవు? ఎందుకిట్లు నిలబడియుంటివి?" అని ప్రశ్నించగా, 


“ఆర్యా! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నోటకరచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి వుండగ, నా అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని.

         

కాని, ఓ మహానుభావా! నేను యెందుకీ మూషిక జన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"మని కోరెను.


అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని, "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ, ధనాశపరుడై దేవపూజలు, నిత్యకర్మలు మరచి, నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు, మంచివారలను, యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తిచేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు,

సమస్త తినుబండారములను కడుచౌకగా కొని, తిరిగి వాటిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక యితరులకు యివ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు.

మరణించిన తరువాత యెలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమనుభవించుచుంతివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది.

కాన, నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్తిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"మని అతనికి నీతులు చెప్పి పంపించెను.```


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి*


      *పదిహేనవ అధ్యాయము*  

      _*పదిహేనవ రోజు*_ 

 *పారాయణము సమాప్తం*


           🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*

🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

బుధవారం*🌷 *🪷05నవంబర్2025🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌷 *బుధవారం*🌷 

 *🪷05నవంబర్2025🪷*    

    *దృగ్గణిత పంచాంగం* 

              

          *ఈనాటి పర్వం*     

         *జ్వాలాతోరణం*

          *కార్తీక పౌర్ణమి* 


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరదృతువు*

*కార్తీకమాసం - శుక్లపక్షం*


*తిథి  : పౌర్ణమి* ‌సా 06.48 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*

*వారం    : బుధవారం* ( సౌమ్యవాసరే )

*నక్షత్రం  : అశ్విని* ఉ 09.40 వరకు ఉపరి *భరణి*

*యోగం : సిద్ధి* ఉ 11.28 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం  : భద్ర* ఉ 08.44 *బవ* సా 06.48 ఉపరి 

 *బాలువ* (06) తె 04.51 ఆపైన *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*

అమృత కాలం  : *రా 02.23 - 03.47*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం    : ఉ 06.09 - 07.33 & సా 06.01 - 07.25*

*దుర్ముహూర్తం  : ప 11.28 - 12.14*

*రాహు కాలం   : ప 11.51 - 01.17*

గుళికకాళం      : *ఉ 10.25 - 11.51*

యమగండం    : *ఉ 07.33 - 08.59*

సూర్యరాశి : *తుల                        

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయం :*ఉ 06.16*

సూర్యాస్తమయం :*సా 05.43*

*ప్రయాణశూల   : ఉత్తరం దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.06 - 08.24*

సంగవ కాలం         :     *08.24 - 10.42*

మధ్యాహ్న కాలం    :    *10.42 - 01.00*

అపరాహ్న కాలం    : *మ 01.00 - 03.18*

*ఆబ్ధికం తిధి         : కార్తీక పౌర్ణమి*

సాయంకాలం        :  *సా 03.18 - 05.35*

ప్రదోష కాలం         :  *సా 05.35 - 08.06*

రాత్రి కాలం           :*రా 08.06 - 11.26*

నిశీధి కాలం          :*రా 11.26 - 12.16*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.27 - 05.17*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🔯శ్రీ సరస్వతీ కవచం🔯*


*ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై* 

*స్వాహా మాం వారుణేఽవతు*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🪷🍃🌷

    🌹🌷🪷🌷🌷🪷🌹

పదకొండు ఇంద్రియాలు

 పదకొండు ఇంద్రియాలు

సృష్టిలో మానవజన్మ ఎంతో క్లిష్టమైనది. అతడు పుట్టడంతోనే అతనిలో మమేకమై ఉన్నవి పదకొండు ఇంద్రియాలు. అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు.


ఆ పదకొండులో....


1. అయిదు జ్ఞానేంద్రియాలు,

2. అయిదు కర్మేంద్రియాలు, మనసు ఉన్నాయి.


1.శ్రోత్రం (చెవి),

2.త్వక్‌ (చర్మం),

3.చక్షుషీ (కన్నులు),

4.జిహ్వా (నాలుక),

5.నాసికా (ముక్కు) అనేవి జ్ఞానేంద్రియాలైతే,


1.పాయు (మలద్వారం),

2.ఉపస్థ (మూత్రద్వారం),

3.హస్త (చేతులు),

4.పాద (కాళ్లు),

5.వాక్‌ (మాట) అనేవి కర్మేంద్రియాలు.

ఈ పదింటికి చివర మనసు.


ఇదీ ఇంద్రియ సమూహం.

ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి.

ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి.

ఇంద్రియనిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య.

ఇంద్రియాలు గుర్రాల వంటివని, రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తాయని, అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయని,

కనుక సారథి వంటి మనిషి ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనువు.


1.మనిషి సంయమనాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలనే వింటాయి.

2.చర్మం పనికిరాని స్పర్శను కోరుతుంది.

3.కళ్లు అశ్లీలాన్ని చూస్తాయి.

4.నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది.

5.ముక్కు దుర్గంధాలనే స్వీకరిస్తుంది.

6.మల, మూత్రద్వారాలు పనిచేయకుండా పోతాయి.

7.కాళ్లూ చేతులూ హింసను ఆచరిస్తాయి.

8.మాట అదుపు తప్పుతుంది. ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తయితే,

9.మనసు అనే పదకొండో ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు.

అసలు పది ఇంద్రియాలను మంచిగాను, చెడుగాను మార్చేది మనసే.

మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి.

అందుకే వాల్మీకి- ‘ఇంద్రియాల సత్‌ప్రవర్తనకు, అసత్‌ప్రవర్తనకు మనసే మూలకారణం’ అని రామాయణ మహాకావ్యంలో అంటాడు.

చెడు వినకుండా, చెడు కనకుండా, చెడు అనకుండా, చెడు తినకుండా, చెడు ఆఘ్రాణించకుండా ఉండగలిగేవాడే జితేంద్రియుడని శాస్త్రాల ప్రబోధం.

ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి. జ్ఞానం లేని కర్మాచరణ పిచ్చివాడి చేతిలో రాయి వంటిదే.

అది ఎవరిమీదనైనా పడవచ్చు. నిప్పును తాకితే కాలుతుందని తెలిసిన జ్ఞాని, నిప్పును తాకడానికి సాహసించడు. 

ఆ విషయం తెలియని బాలుడు నిప్పును తాకి చేతులు కాల్చుకుంటాడు.

కనుక ఏ పనిచేసే సమయంలో అయినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం.

లేకుంటే ఇంద్రియాలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి.

ఇంద్రియాలు అదుపులో ఉన్నంతవరకు మనిషి ఉజ్జ్వలంగా వెలిగిపోతాడు.

ఇంద్రియాల్లో ఏ ఒక్కటి అదుపుతప్పినా, అన్ని ఇంద్రియాలూ క్రమంగా పట్టుతప్పిపోతాయి.

పర్యవసానంగా మనిషిలోని ప్రజ్ఞ నశించిపోతుంది.

ప్రకృష్టమైన (విశిష్టమైన) జ్ఞానమే ప్రజ్ఞ. అంటే అన్నింటినీ చక్కగా గుర్తించే గుణం. 

అది ఉన్నంతకాలం మనిషి మెదడు అనే యంత్రం పనిచేస్తుంది.   

మెదడును చక్కగా ఉంచుకోవడానికి ‘ఆయుర్వేదం’ ఇలా మార్గోపదేశం చేస్తోంది-


’పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం స్వీకరించాలి. అలా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడంవల్ల ఇంద్రియాలన్నీ పటిష్ఠంగా ఉంటాయి. అవి దృఢంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి వర్ధిల్లుతుంది’ 

ఇంద్రియాల వెనక ఉన్న ఇంతటి సాంద్రమైన విషయాన్ని మనిషి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

అందువల్ల జితేంద్రియుడు (ఇంద్రియాలను జయించినవాడు) కావాలో, ఇంద్రియజితుడు (ఇంద్రియాలతో ఓడిపోయినవాడు) కావాలో తేల్చుకోవలసింది మనిషే!

4, నవంబర్ 2025, మంగళవారం

కార్తీకపురాణం - 14 వ అధ్యాయము*

 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴

  🍁 _*మంగళవారం*_🍁

🕉️ *నవంబర్ 4, 2025*🕉️


*కార్తీకపురాణం - 14 వ అధ్యాయము*


🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️

               

(ఆబోతును అచ్చుబోసి వదులుట {వృషోత్సర్గము} )

```

వశిష్ఠుల వారు, జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మాహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి..


“ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానముచేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానముచేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములను నశింప జేసుకొందురు. వారికి కోటియాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలును తమ వంశమం దెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజూచుచుందురు.


ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియైననూ చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును.


కావున ప్రతిసంవత్సరం కార్తీక మాసమున తనశక్తికొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధనచేసి ఆరాత్రియంతయు జాగారముండి మరునాడు తమశక్తి కొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములననుభవింతురు.

```


*కార్తీకమాసములో విసర్జింపవలసినవి:*

```

ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు. తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారమునాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందున భోజనం చేయరాదు.


కార్తీకమాసమున నెలరోజులూ కూడా కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విస్మరించరాదు.


కార్తీకమాసమున వేడినీటితో స్నానము కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరీ సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.


ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతిదగ్గరగాని, చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.```


శ్లో!! గంగే యమునే చైవ గోదావరి సరస్వతీ

నర్మదా సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధింకురు!!```

అని పై తెలిపిన శ్లోకం పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను. సాయం కాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలెను.

```

కార్తీక మాస శివపూజాకల్పము:```

1. ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి


2. ఓం పరమేశ్వరాయ నమః - ఆవాహనం సమర్పయామి


3. ఓం కైలాసవాసాయ నమః - నవరత్నసింహాసనం సమర్పయామి


4. ఓం గౌరీనాథాయ నమః - పాద్యం సమర్పయామి


5. ఓం లోకేశ్వరానమః - ఆర్ఘ్యం సమర్పయామి


6. ఓం వృషభవాహనాయనమః - స్నానం సమర్పయామి


7. ఓం దిగంబరాయ నమః - వస్త్రం సమర్పయామి


8. ఓం జగన్నాథాయనమః - యజ్ఞోపవీతం సమర్పయామి


9. ఓం కపాలధారిణే నమః - గంధం సమర్పయామి


10. ఓం సంపూర్ణ గుణాయనమః - పుష్పం సమర్పయామి


11. ఓం మహేశ్వరాయ నమః - అక్షతాన్‌ సమర్పయామి


12. ఓం పార్వతీనాథాయ నమః - ధూపం సమర్పయామి


13. ఓం తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి


14. ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి


15. ఓం త్రిలోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి


16. ఓం శంకరాయనమః - సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి


17. ఓం భవాయనమః - ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి


ఈప్రకారముగా కార్తీకమాసమంతయు పూజించవలెను. శివసన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసినయెడల ధన్యుడగును. పూజానంతరము తనశక్తినిబట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను.


ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము, వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన, తులసికోటవద్ద కర్పూర హారతులతో దీపారధన చేసిన ఎడల, వారికీ, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును.


శక్తి కలిగియుండికూడా యీ వ్రతము నాచరించనివారు వంద జన్మలు నానాయోనులందునా జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, యెలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోకతముగా ఆచరించిన యెడల పదిహేను జన్మలయొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.```


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి*


  *పద్నాల్గవ అధ్యాయము*  

      _*పద్నాల్గవ రోజు*_ 

 *పారాయణము సమాప్తం*


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*

🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

ఏకాదశ రుద్రులు

 1 *కోనసీమలో కొలువైన ఏకాదశ రుద్రులు* 🙏


*🕉️శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తారు🕉️*

.

*”🕉️విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమ:” అని రుద్రనమకంలో చెప్పబడినది.*


*🕉️దీనిప్రకారం ఏకాదశ రుద్రుల పేర్లు –

 1. విశ్వేశ్వరుడు 

2.మహాదేవుడు

3. త్రయంబకుడ 

4.త్రిపురాంతకుడు 

5.త్రికాగ్నికాలుడ

6.కాలాగ్నిరుద్రుడు

7. నీలకంఠుడు, 

8,మృత్యుంజయుడు

9.సర్వేశ్వరుడు 

10. సదాశివుడు

11. శ్రీమన్మహాదేవుడు* 


*🕉️ఈ ఏకాదశ రుద్రులు నవ్యాంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో నెలకొనివున్నారు. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ఈ ఏకాదశ రుద్రులు సమావేశమవుతారు. అలా సమావేశమైన ఏకాదశ రుద్రులను ఒకేచోట చూస్తే మంచిదనే విశ్వా సంతో వేలాదిమంది భక్తులు విచ్చేస్తారు*.


*1. 🕉️విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం. (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వరస్వామి): పూర్వకాలంలో ఒక బ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆ పులి శివ లింగరూపాన్ని పొందిందని కథ. వ్యాఘ్రము శివునిగా అవతరించు టచే వ్యాఘ్రేశ్వరస్వామి అని పిలువబడెను*


*2. 🕉️మహాదేవరుద్రుడు- కె.పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి): విశ్వామిత్రుని తపోభంగం చేసిన తరువాత మేనక స్వర్గానికి వెళ్ళ డానికి ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయింది. అపుడు శివుని ప్రార్ధించగా ఆయన ఒక శివలింగాన్ని మేనకకు ఇచ్చి ఆ ప్రదేశంలో ప్రతిష్ఠింపుమనెను. మేనక ఆ లింగాన్ని కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి)లో ప్రతిష్ఠించి స్వర్గానికి వెళ్ళిందని పురాణ కథ. మేనకచే ప్రతిష్ఠింప బడుటచే మేనకేశ్వర స్వామి అని పిలువబడెను*.

 

*3. 🕉️త్రయంబకేశ్వరుడు- ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి): రావణుని సంహరించిన తరువాత శ్రీరామ చంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండ గా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి విమానం కదలకుండా నిలిచి పోయింది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివ లింగాన్ని ప్రతిష్ఠించెనని కథ కలదు. అపుడు వారి పుష్పకవిమానము ముందు కు కదలగా వారందరూ ఆనందభరితులైరి. రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనంద రామేశ్వ రుడని పిలువబడెను.*

 

*4. 🕉️త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక (శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వే శ్వరస్వామి): తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సం#హ రింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామం లో శివలింగరూపంలో ఆవిర్భవించెనని కథ. అపుడు ఆ గ్రామపు బ్రాహ్మ ణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను..*


*5. 🕉️త్రికాగ్నికాలరుద్రుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమే త శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి): మూడు అగ్నుల యందు హోమం చేసిన ద్రవ్యా లను స్వీకరించి శివుడు లింగ రూపాన్ని పొందుటచే త్రికాగ్నికాలునిగా పిలువబడి అగస్త్య మహర్షిచే నేదునూరులో ఈ శివలింగం ప్రతి ష్ఠింపబడి నది. శ్రీ ఉమాచెన్నమల్లేశ్వరస్వామిగా కొలువబడుచున్నాడు*.

 

*6. 🕉️కాలాగ్ని రుద్రుడు- ముక్కామల (బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ రాఘవేశ్వరస్వామి): రావణ సంహారం తరు వాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈ ప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రాలను, ఖడ్గం ప్రసాదించెను. రాఘవునిచే ప్రతిష్ఠింప బడుట వల్ల రాఘవేశ్వరస్వామి అని, పాండవ వనవాసంలో శివుడు అర్జు నుని పరీక్షింపదలచి కిరాతుని వేషంలో అర్జునుని ధైర్యపరా క్రమాలను చూచి పాశుపతాస్త్రం ప్రసాదించెనని, ఆయనే ఈ కాలాగ్ని రుద్రుడని మరొక కథ* .


*7. 🕉️నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి): దేవతలు- రాక్షసులు క్షీరసాగర మధన సమయం లో వెలువడిన విషవాయువులను శివుడు తన కంఠమునందు నిక్షిప్తం చేసికొని నీలకంఠుడైనాడు. ఆ గరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంత భోగాలను అందించేవాడు, అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించిన వాడు అగుటవల్ల అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను*.

 

*8. 🕉️మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీ చెన్నమల్లేశ్వరస్వామి): శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యు ముఖము నుండి రక్షించి, యముని జయించి ”మృత్యుంజయుడు” అయ్యె ను. ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి గ్రామంలో లింగరూపంలో ఆవిర్భవించి చెన్న మల్లేశ్వ రస్వామిగా పిలువబడెను.*


*9. 🕉️సర్వేశ్వర రు ద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి): దక్షుని యజ్ఞంలో సతీదేవి తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తన కాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్ప డిన అగ్నిజ్వాలల్లో కాలి బూడిద అయినపుడు శివుడు ఆగ్రంహంచి ఉగ్రరూపుడై నృత్యము చేసి తన జటాజూట ములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీర భద్రుడు జన్మించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసాడు. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారంలో వేదపండి తు లైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను*.

 

*10. 🕉️సదాశివ రుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమే త శ్రీచెన్నమల్లేశ్వర స్వామి): పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరు గొప్ప వారని వాదనకు దిగి శివుని వద్దకు వచ్చారు. అపుడు శివుడు ఆద్యంతములు లేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణు వును తన పాదాలను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదాలను కను గొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. కాని బ్రహ్మ మాత్రం శివుని శిరస్సును చూడకపోయినను ఒక ఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితినని చెప్పెను. శివునికి ఆగ్రహం వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆ లింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేద పండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను*.


*11. 🕉️శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు): పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్ర కమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆ మహాదేవు డు పుల్లేటికుర్రు గ్రామంలో లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి ”పుండరీకపురము” అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీ కము అనగా వ్యాఘ్రము (పులి) అని అర్ధం. వ్యాఘ్రేశ్వరరంలో వ్యాఘ్రేశ్వర స్వామి ఉండుటచేత ఈ గ్రామంలో శివుడు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి అని పిలువబడెను*. 


*🕉️సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు.🕉️*

అగ్గిపెట్టె ఫోను (చిన్ననాటి జ్ఞాపకాలు)

 

అగ్గిపెట్టె ఫోను (చిన్ననాటి జ్ఞాపకాలు)

మనలో అగ్గిపెట్టె ఫోను గురించి తెలియని వాళ్ళు ఎందరు వున్నారు చెప్పండి. ఈ రోజుల్లో పిల్లకు ఆడుకోవటానికి అనేకమైన ఆట వస్తువులు మార్కెట్లో దొరుకుతున్నాయి.  అంతే కాక వాటిని కోనేటంత ఆర్థికస్తోమత ఈ నాటి తల్లిదండ్రులకు వుంటున్నది. చిన్నపిల్లల చేతుల్లో కూడా సెల్ఫోనులు, టాబిలెట్లు, లాప్టాప్లు ఉండటం చేత వాళ్లకు వాళ్ళ తెలివితేటలతో ఆటవస్తువులను చేసుకొని ఇతర స్నేహితులతో కలిసి ఆడటానికి తగిన సమయంలేదు అంతే కాకుండా వాళ్లకు తెలియనుకూడా తెలియదు. అన్నీ ఆధునికమైన ఆటవస్తువులే వాటి ఖరీదులు ఆకాశాన్ని అంటుతున్నా కూడా తల్లిదండ్రులు కొనక మానటం లేదు.  కానీ పూర్వకాలంలో అట్లా కాదు ఒక ఇంట్లో ఐదు నుండి పదిమంది పిల్లలు ఉండేవారు ఒకడు హైస్కూలు చదువు చదువుతుంటే ఇంకొకడు ప్రేమారి స్కూల్లో ఇక చిన్నది లేక చిన్నవాడు అమ్మ వడిలో బడినుంచి వచ్చిన పిల్లలకు ఇంట్లోకి రాగానే తన తమ్ముడు లేక చెల్లెలిని ఎత్తుకొని ఆడించే పని ఉండేది అమ్మా వీడు ఏడుస్తున్నాడు. వీడు ఉచ్చపోశాడు, దొడ్డికి పోయాడు అని తల్లితో చెపితే వంట చేసుకుంటున్న తల్లి తన చేతిని పవిట కొమ్ముకు తుడుచుకొంటూ ఏరా తమ్ముడిని చూసుకోలేవా ప్రతిదానికి నన్ను పిలవాలా అవతల పోపు మాడిపోతున్నది, దోశ కాలిపోతుంది అని విసుకు కుంటూ వచ్చి చంటి పిల్లవాడిని చూసుకుంటుండేది.  మరి ఇప్పుడు యెడ పిల్లలకు చంటిపిల్లలను చూసుకునే ప్రేమ, భాద్యత లేదు. అందుకే పిల్లలకు వాళ్ళ తోబుట్టువులమీద తల్లిదండ్రులమీద ప్రేమ సన్నగిల్లుతుంది. అవునా కాదా. ఇంట్లో చంటివానికి విరోచనాలు అయ్యాయి అంటే ఇంటిల్లపాతి మేలుకొని ఉండేవారు.  భగవంతుడా మా తమ్ముడికి విరోచనాలు తొందరగా తగ్గించేయి   అని . విజ్ఞేశ్వర నీకు 11 గుంజిళ్లు తీస్తాను అని మరీ మొక్కుకునేవారు. అది అన్నా లేక అక్కల ప్రేమ తల్లులు పిల్లలను కంటే అక్కలు వాళ్ళను సాకేవారు. పోత పాలమీద వున్న పిల్లలైతే పాలు పట్టటం కూడా అక్కల పనే .  సీతా  రా ఆడుకుందాము అంటే ఉండేవే మా తమ్ముడికి పాలు పట్టి వస్తా అనే సీతలు లక్స్మీలు నాగమణిలు ఎంతమందో మీకు జ్ఞాపకం ఉందా, తొక్కుడుబిళ్ల, దాగుడు మూతలు, గుంజిళ్ళు ఆడుతూ ఆడపిల్లలు వీధులలో ఉండేవారు. మరి ఇప్పుడు చూద్దామన్నా ఒక్కళ్ళు కూడా లేరు. వీధిలో ఆడుకునే పిల్లలతో తండ్రిగారి స్నేహితులు ఎమ్మా మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా అంటే ఒక్కొక్కసారి వున్నారని లేకపోతె ఆటలో నిమగ్నులైన పిల్లలు ఆదమరచి మా నాన్నగారు ఇంట్లో లేరు అంటే మరుసటిరోజు ఆయన వచ్చి ఏమండీ సీతారామయ్యాగారు నిన్న మీరు ఇంట్లో లేరా ఎక్కడిపోయారు అని అడిగితె అప్పుడు నాన్నగారు నేను ఎక్కడి వెళ్ళాను ఇంట్లోనే కదా వున్నాను, అంటే మీ అమ్మాయి సీత మీరు ఇంట్లో లేరని అన్నదే అంటే ఎమ్మా నేను లేనని అన్నవా మామయ్యతో అని అడిగితె ఏమో నాన్న  నాకు జ్ఞాపకం లేదు అనే అమ్మాయిలు కోకొల్లలు. నిజానికి తోటి స్నేహితులతో ఆటలాడే పిల్లలకు వారి లోకమే వేరు వారికి ఇల్లు, తల్లిదండ్రులు మదిలో వుండనే వుండరు. అది కదా బాల్యం అంటే. ఇట్లా చెప్పుకుంటూ వెళితే అనేకమైన విషయాలు ఉంటాయి. ఇక విషయానికి వద్దాం. 

చిన్నప్పుడు స్వయంగా చేసుకొని ఆదుకునే ఒక ఆట టెలిఫోను ఆట. ఆ రోజుల్లో గడ్డఫోను (P&T ) ఫోన్ ఏ కొంతమంది ధనవంతులకు మాత్రమే వుండెది ఎప్పుడైనా ఏ పిల్లవాడో అరే నేను హైదరాబాదులో  మా మామయ్యా వాళ్ళ ఇంట్లో ఫోనులో మాట్లాడాను తెలుసా అని ఒక రమణారావు అంటే వాడి చుట్టూ తోటి స్నేహితులందరూ చేరి అరె ఫోను యెట్లా ఉంటుంది అందులో మాటలు యెట్లా వస్తాయి ఆ హ్యాండిల్ యెంత బరువు ఉంటుంది. నీవు మాట్లాడింది నల్ల ఫొనేనా లేక అది ఇంకో రంగులో ఉందా అని అనేక ప్రశ్నలతో ముంచెత్తు తారు . వాళ్ళ ప్రశ్నలకు ఓపికగా సమాదానాలు చెప్పే రమణారావు తన తోటి స్నేహితులకన్నా తానూ ఎంతో గొప్ప పని చేసినట్లు బిల్డప్ చేసి వాళ్ళతో ప్రవర్తించటం. చాలామందికి  గతంలో వున్న అనుభవమే. 

పిల్లలలో కొంత తెలివితేటలు ఎక్కువ వున్న వాళ్ళు అగ్గిపెట్టి ఫోను చేసేవారు.  దానిని తోటి స్నేహితులు ఒకరి తరువాత ఒకరుగా మాట్లాడే వారు. అరే నేను ముందు అంటే నేను ముందు అని పోట్లాడుకునే వారు. ఈ ఫోను తయారీకి రెండు అగ్గి పెట్టలను తీసుకొని వాటిలొని లోపలి అరలను తీసుకొని ఫై కేసును పారేసి అరలమధ్యన ఒక పిన్నీసుతో చాలా  జాగ్రత్తగా ఒక సన్నని రంధ్రాన్ని చేసి దానిలోకి దారాన్ని పంపి ఆ దారానికి ఒక చిన్న చీపురు పుల్లను కట్టాలి. దారం ఒక 10 నుంచి 20 అడుగులు తీసుకొని దాని రెండొవ కొసకు కూడా ఇదేవిధంగా అగ్గిపెట్టె అరను కట్టాలి. ఇక మీ ఫోను సిద్ధం. ఈ ఫోను తయారు చేయటానికి నైపుణ్యం వున్న బాలునికి ఒక పది నిముషాలు చాలు. ఒక వైపు వున్న  అగ్గిపెట్టను (అరను) నోటి ముందు పెట్టుకొని మాట్లాడితే రెండవ వైపు అగ్గిపెట్టెను అవతలి వాడు చెవిలో పెట్టుకొని వింటే మాట వినపడుతుంది. తరువాత రెండవ వాడు తన అగ్గిపెట్టెను నోటిముందు పెట్టుకొని మాట్లాడితే మొదటివాడు తన అగ్గిపెట్టను చెవిలో పెట్టుకొని వినవచ్చు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మైక్రోఫోనుగా స్పీకర్ గా  ఒకే అగ్గిపెట్టి పని చేస్తుందన్నమాట. ఇట్లా మాట్లాడేటప్పుడు రెండు విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. ఒకటి దారం సాధ్యమైనంత గట్టిగ ఉండాలి. రెండు. ఆ దారాన్ని ఎవ్వరు తాకకూడదు. మొదటి వాడు అగ్గిపెట్టి ముందు మాట్లాడితే ఆ శబ్ద తరంగాలు అగ్గిపెట్టి లోపలి కాగితాన్ని తాకి శబ్ద తరంగాలకు అనుగుణంగా అది కదిలి ఆ తరంగాలను దారం ద్వారా రెండవ అగ్గిపెట్టి లోపలి కాగితాన్ని కదిలించి మరలా శబ్దాన్ని పుట్టిస్తుంది. ఇది అది పనిచేసే విధానం. నిజానికి ఇందులో పూర్తిగా ఫిజిక్స్ వున్నది.  కానీ ఏ మాత్రం శాస్త్రీయ పరిజ్ఞానం లేని ఆ వయస్సులో అది తయారుచేయటం. దానిని ఉపయోగించి ఆడుకోవటం నిజంగా ఒక ఆనందదాయకమైన విషయం కదా. మీరేమంటారు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ