24, జులై 2021, శనివారం

శ్రీ వ్యాసమునీంద్ర

 వ్యాసం వశిష్ఠ నప్తారం 

శక్తేః పౌత్ర మకల్మషం

పరాశరాత్మజం వందే 

శుకతాతం తపోనిధం

వ్యాసాయ విష్ణురూపాయ 

వ్యాస రూపాయ విష్ణవే

నమోవై బ్రహ్మనిధయే 

వాసిష్టాయ నమోనమః


మమ జన్మదినే సమ్యక్ 

పూజనీయః ప్రయత్నతః 

ఆషాఢ శుక్ల పక్షేతు 

పూర్ణిమాయాం గురౌతథా

పూజనీయే విశేషణ 

వస్త్రాభరణ ధేనుభిః

దక్షిణాభిః మత్స్యరూప

 ప్రపూజయేత్

ఏపం కృతే త్వయా 

విప్రః మత్స్య రూపస్య దర్శనం

భవిష్యతి నసందేహొమ 

యైవోక్తం ద్విజోత్తమ."


నేను జన్మించిన ఆషాఢ శుద్ద

పౌర్ణమినాడు ఈ గురుపూజను

శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు

కనుక గురువారము అయితే, 

అది మరింతగా శ్రేష్టమైనది. 

వస్త్ర, అభరణ గోదానములతో

అర్ఘ్య పాద్యాలతోటి నా రూపాన్ని

పూజించువారికి నా స్వరూప

సాక్షాత్కారం లభిస్తుంది అని

సాక్షాత్తు వ్యాస మహర్షి చెప్పారు.


అద్వైతతత్త్వసుఖాంబోధివిహరమహిమాన్వితతపోతేజసం

చతుర్వేదవిభజనకారణసనాతనధర్మసుప్రతిష్టితజ్ఞానపీఠం

భారతభాగవతాదిగ్రంధరచనాచాతుర్యజ్ఞానమయప్రదీపం

శ్రీ వ్యాసమునీంద్ర మమ దేహి కరావలంబం ||


🔯

కామెంట్‌లు లేవు: