2, జూన్ 2024, ఆదివారం

మనస్సు-భగవంతుడు*

 *మనస్సు-భగవంతుడు*

శ్రీ నీలకంఠ దీక్షితులు రచించిన శ్లోకాన్ని ఉటంకిస్తూ జగద్గురువులు, ఏదైనా రాయి ప్రకాశవంతముగా కనిపిస్తేనే మన దృష్టి మళ్ళుతుందని, మాములు రాయి వైపు మనం చూడమని చెప్తూ ఇలా అన్నారు. 

*పాషాణా సర్వ ఏవైతే పద్మరాగేషు కో గుణః ।*

 *ప్రకాశః కశ్చిదత్రాస్తి పరత్ర స న విద్యతే*.

మౌల్యము లేని ఒక సాధారణ రాయివలన మన మనస్సు చెదిరిపోకుండా ఉంటుంది. అదే విధంగా మనం జపం చేస్తూ కూర్చున్నప్పుడు ప్రపంచం మొత్తం విలువలేనిదిగా పరిగణించబడాలి. అప్పుడే మన మనస్సు సంచరించదు. భగవంతునియందు  స్థిరపడుతుంది.


*జగద్గురువు శంకరాచార్య*

*శ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు.*

కామెంట్‌లు లేవు: