శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం
సాంఖ్యయోగం: శ్రీభగవానువాచ
అవ్యక్తో௨యమచింత్యో௨యమవికార్యో௨యముచ్యతే
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి(25)
అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి(26)
ఆత్మ జ్ఞానేంద్రియాలకు గోచరించదు. మనస్సుకు అందదు. వికారాలకు గురికాదు. ఈ ఆత్మతత్వం తెలుసుకుని నీవు విచారించడం మాను. అర్జునా.. శరీరంతోపాటు ఆత్మకు కూడా సదా చావు పుట్టుకలుంటాయని భావిస్తున్నప్పటికీ నీవిలా శోకించవలసిన పనిలేదు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి