ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
18, సెప్టెంబర్ 2023, సోమవారం
రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు
రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు
రామాయణం ఒక భూగోళ శాస్త్రము.
సీత జాడకోసం వెతకడానికి వెళుతున్న వానరులకు సుగ్రీవుడు వింధ్య పర్వతం నాకు నలు దిక్కులా ఏమేమి విశేషాలున్నాయో, ఎటు వైపు ఏ నదులు, దేశాలు, ఏ ఏ సముద్రాలున్నాయో నిశితంగా వివరిస్తాడు. రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు నేటికి కొన్ని మారినప్పటికీ మనం నేటికీ కొన్ని అన్వయిన్చుకోవచ్చును. అంతే కాక ఇప్పట్లోలాగా ఉపగ్రహాలు, గూగుల్ మ్యాపులు లేకుండా ఎంత ఖచ్చితంగా భూగోళ వివరాలను ఎలా వివరించాగలిగాడో ఒక సారి ఆలోచించండి. ఒకసారి అప్పుడు సుగ్రీవుడు చెప్పిన వివరాలు అవలోకించండి.
తూర్పు దిక్కునకు వినతుడి ఆధ్వర్యంలో వానర సైన్యాన్ని పంపుతూ అటు వైపు వివరాలిలా చెబుతాడు:
ముఖ్యమైన నదులు : గంగ, సరయు, కౌశికి, యమునా నది, యామునగిరి , సరస్వతి , సింధు;
నగరాలు : బ్రహ్మమాల , విదేహ, మాళవ, కాశి, కోసల, మగధ నగరాలు, పుండ్ర, అంగ,
అవి దాటాక సముద్రములో గల పర్వతములు, వాటి మధ్య ద్వీపములు, ( నేటి మన భారత దేశ ఈశాన్య రాష్ట్రాలను ఒకసారి పరికించండి)
తరువాత శిశిరము అను పర్వతము పిమ్మట సముద్రము (అండమాన్ సీ)
యవద్వీపము, సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపం, – బంగారు వెండికు నెలవైనవి (బర్మా, లాఓస్, ఇతరత్రా) ఇక్కడ చేపలను పచ్చిగా తింటారు. కొన్ని నేడు సముద్ర గర్భంలో కలిసిపోయి ఉండవచ్చును.
తరువాత శోననదము, అటుపై నల్లగా వుండే ఇక్షు సముద్రం ( నేడు ఒక సారి చూడండి ముదురు ఆకుపచ్చ రంగులో – సుమారు నలుపు రంగులో కనబడుతుంది సౌత్ చైనా సి )
అటుపై లోహితము, మధు సముద్రము (ఈస్ట్ చైనా సి)
తరువాత శాల్మలీ ద్వీపము (తైవాన్)
ఋషభము అని పర్వతము
మధుర జలధి (జపనీస్ సి )
ఔర్వుడు వలన హయముఖము (అగ్నిశిఖరం) (కొరియా)
13 యోజనాల దూరం లో బంగారు పర్వతము – జాత రూప శిలము
ఉదయాద్రి (ల్యాండ్ of రైసింగ్ sun ) (జపాన్ )
తరువాత క్షీరోదము అను సముద్రము (నార్త్ పసిఫిక్ ఓషన్)
అక్కడ వరకు మాత్రమె అతను చెప్పగలిగాడు. ఒకసారి మీరు గూగుల్ మ్యాప్ పరికించి చూడమని మనవి.
దక్షిణ దిక్కుకు అంగదుడు, హనుమంతుడు వంటి వీరులను పంపుతూ అక్కడి వివరాలిలా చెబుతాడు.
నదులు : గోదావరి, మహానది, కృష్ణవేణి, వరద , మహాభాగా
దేశాలు : మేఖల, ఉత్కళ, దశార్ణ , అవంతి, విదార్ధ, మూషిక, వంగ, కాలింగ, కౌశిక దండకారణ్యం, గోదావరి పాయఆంద్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ, మలయ పర్వతం అటుపై కావేరి,
పాండ్య దేశానంతరం మహా సముద్రం (బే of బెంగాల్ ) దానిలో మహేంద్రగిరి అటుపై 100 యోజనాల దూరంలో లంక
మరొక 100 యోజనాల దూరంలో పుష్పితకము (ఆస్ట్రేలియా ) , అటుపై 14 యోజనాల దూరంలో సూర్యవంతము(న్యూ జీలాండ్) ,విఅడుత్యము , కుంజరము, భోగవతి ,వృషభ పర్వతము (అంటార్క్టిక)
అది దాటాక భూమి సరిహద్దు
పశ్చిమ దిక్కుకు సుషేణుడు
వున్న రాజ్యాలు : సౌరాష్ట్ర, బాహ్లిక, శూరా, భీమ, అటుపై మరుభూమి మిట్ట నెలలు ( ఎడారులు ) ఆఫ్ఘనిస్తాన్ తరువాత సముద్రము
మురచీ , అవంతి , అటుపై సింధు నదము (మనలను సింధు నాగరికత పేరుతో నేడు ఆంగ్లేయులు హిందూ అని పిలుస్తున్నారు), అటుపై హేమగిరి, పారియాత్రము, చక్రవంతము – కొండ
60 యోజనాల దూరంలో వరాహగిరి – ప్రాగ్జోతిష పురము (భారతంలో చెప్పిన ప్రాగ్జోతిష్ పురము వేరు), సర్వ సౌవర్ణ పర్వతము, మరి కొన్ని పర్వతాలు
మేరు పర్వతము ( ఇతః పూర్వం మనము ముచ్చటించుకున్న మేరు పర్వతం మన భూగోళానికి రిఫరెన్స్ గా వున్న పాయింట్)
10000 యోజనాల దూరంలో అస్తాద్రి ( యునైటెడ్ కింగ్డమ్) (రవి అస్తమించని దేశం )
తరువాత సరిహద్దు
ఉత్తర దిక్కుకు శతవాలి
ముందుగా హిమవత్పర్వతము అటుపై మ్లేచ్చ దేశములు, పులిందులు, ఇంద్రప్రస్థ, Tankana, చీనా, పరమ చీనా,(నేటి చైనా ) కాల ప్రవతము,(కజాక్స్తాన్ ), హేమగర్భము (మంగోలియా) సుదర్శనము
దేవసాఖ శైలము అటుపై శూన్య ప్రదేశము (రష్యా) తరువాత తెల్లని హిమం తో కూడుకున్న పర్వతము – కైలాసము, అటుపై క్రౌన్చగిరి, ఇంకా హిమం తో వున్నా మరి కొన్ని పర్వతాలు (రస్యా )
లవణ సముద్రము ( కార సి), సోమగిరి (బోల్షెవిక్) పిమ్మట సరిహద్దు
అంతకు మునుపు టపాలలో మనకున్న టెక్టోనిక్ ప్లేట్ లు కదులుతున్నాయని ప్రస్తావించడం జరిగింది. కాలగర్భంలో ఎన్నో భౌగోళిక మార్పులు జరిగాయి. కొన్ని ఖండాలకు ఖండాలు సముద్ర గర్భంలో కాలిపోయాయి, కొత్తవి వెలికి వచ్చాయి. కానీ కొన్ని మార్పు లేకుండా వున్నాయి.
ఇక్కడ మనం గమనించ వలసినది ఏమిటంటే ఇంత టెక్నాలజీ లేకుండా ఎప్పుడో రచించ బడిన రామాయణంలో ఇంత ప్రస్ఫుటంగా భౌగోళిక వివరాలు పొందు పరచబడి వున్నాయి🙏🙏
మోదీ కాదు (కర్మ) యోగి !
మోదీ కాదు (కర్మ) యోగి !
మోదీ అనగానే అందరూ ఓ గుజరాతీ అనో, హిందూత్వవాది అనో, ఆరెస్సెస్ స్వయం సేవక్ అనో, రాజకీయ నాయకుడనో, ముఖ్యమంత్రనో, ప్రధాని అనో...
ఇలా తమకు తోచింది భావిస్తుంటారు! ఆయనంటే పడని వారు ఇంకా బోలెడు విధాలుగా భ్రమించి భయపడుతుంటారు!
కానీ, నిజంగా మోదీ ఎవరు?
మోదీ ఒక కర్మ యోగి! తన కోసం తాను సన్యాసిగా మారి పరివ్రాజకుడైపోదామనుకున్న అవధూత...
ఇవాళ్ల మన కోసం... కర్మ యోగిగా మారి నిత్యం కష్టపడుతోన్న దైవం పంపిన దూత!
ఆయన ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. భార్యని పట్టించుకోలేదు. ఇలాంటి మాటలే మీడియా వాగుతుంది కానీ...
ఇంటి నుంచి బయలుదేరిన ఆ సత్యాన్వేషి తరువా ఏం చేశాడు? ఇది తెలిసి కూడా చెప్పదు!
మీడియా చెప్పని మోదీ పరివ్రాజక జీవితం ఏంటంటే...
ఇల్లు వదిలి బయలుదేరిన నరేంద్రుడు దేశమంతా తిరిగాడు. ఆరెస్సెస్ ప్రచారక్ గా కాదు.
కేవలం ఒక సత్యాన్ని అన్వేషించే సనాతన ఆత్మ స్వరూపిగా! అలా తిరిగి తిరిగి ఆయన చివరకు మోక్షం కోరే అందరూ చేరే కేంద్రానికే చేరాడు!
హిమాలయాలకు!
హిమాలయాల్లో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించిన మోదీ మానస సరోవరం కూడా సందర్శించారు.
మౌంట్ ఎవరెస్ట్ పర్వతం అధిరోహించి ( పర్వత శిఖరాగ్రం అధిరోహించలేదు. ) తిరిగొచ్చారు.
స్వరాష్ట్రంలోని రాజ్ కోట్ కు వచ్చాక రామకృష్ణ మఠం చేరుకుని అక్కడి స్వామీజీ...
ఆత్మస్థానందజీ మహారాజ్ ను ఆశ్రయించారు. తనకు సన్యాస దీక్ష ప్రసాదించమని అభ్యర్థిచారు.
కానీ, అక్కడే విచిత్రం జరిగింది! రామకృష్ణ మఠం స్వామీజీ నరేంద్రుడికి సన్యాసం ఇవ్వలేదు!
ఆయన తన స్వంత మోక్షం కోసం కాక జాతి విముక్తి కోసం కృషి చేయాల్సి వుందని నచ్చజెప్పి తిరిగి పంపారు!
ఆ రోజు నుంచీ మోదీ యోగికి బదులు కర్మ యోగి అయ్యారు! సన్యాసి కాని సన్యాసి అయ్యారు!
ఇల్లు వదలటం, హిమాలయ యాత్ర, స్వామీజీని ఆశ్రయించటం... వీటి తరువాత అప్పుడు మొదలైంది ఆరెస్సెస్ స్వయం సేవక్ శకం!
ఆరెస్సెస్ ఆఫీసులో గది శుభ్రం చేయటం, టీ పెట్టడం లాంటి చిరు పనులతో మొదలైన మోదీ జీవితం ప్రచారక్ గా ఉజ్వలమైంది!
ఆయన మీద ఎన్నో బాధ్యతలు పెట్టిన సంఘ్ ని ఆయన ఏనాడూ నిరాశపరచలేదు! అడుగడుగునా తన సత్తాతో ఆశ్చర్యపరిచారు!
అందుకే, ఆరెస్సెస్ మోదీ అనే తమ అణ్వయుధాన్ని బీజేపికి బహూకరించింది.
పార్టీ కార్యకలాపాల్లో తలమునకలైన మోదీ ఏమేం చేశారో అంతా బహిరంగమే!
ఇవాళ్ల గుజరాత్ బీజేపీ సర్వ విధాలా అజేయంగా వుండటానికి ఆయన పాత్ర కూడా కీలకం! అందుకే, గుజరాత్ సీఎం పీఠం ఆయనను అనివార్యంగా వరించేసింది!
మోదీ... ముఖ్యమంత్రి నుంచీ ప్రధాని ఎలా అయ్యాడో... ఇంకా చాలా మందికి తెలిసిన ప్రస్థానం! అసలు ఒక్క రోజు,
ఒక్క గంట కూడా ప్రతిపక్షంలో వుండకుండా రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలటం... కేవలం రాజకీయ చాతుర్యమేనా? కానేకాదు... మోదీ వెనుక ఆధ్యాత్మిక శక్తే... ఆయనను , మిగతా మరుగుజ్జు స్వార్థ రాజకీయ నేతల్ని వేరు చేసేది!
ఒక పరీక్షిత్తు, ఒక విక్రమాదిత్యుడు, ఒక చంద్రగుప్తుడు, ఒక శాతవాహనుడు, ఒక పుష్యమిత్ర శుంగుడు, ఒక ఛత్రపతి శివాజీ, ఒక నరేంద్ర దామోదర్ దాస్ మోదీ !🌹🇮🇳🙏
జ్యోతి ఈవెంట్స్* వారి *దసరా కార్నివాల్*
*జ్యోతి ఈవెంట్స్* వారి *దసరా కార్నివాల్*
మన స్టాల్ హోల్డర్స్ అందరికీ సువర్ణ అవకాశం. అల్కాపురి పార్క్ యాజమాన్యం మనకి ఎగ్జిబిషన్ & సేల్ నిర్వహించడానికి అవకాశం కల్పించింది.
సుమారుగా 50 స్టాల్స్ తో మనము ఎగ్జిబిషన్ అండ్ సేల్ నిర్వహించుకోవచ్చును.
దసరా పండుగని పురస్కరించుకుని ఈనెల ముందుగానే మనము సెప్టెంబర్ 30వ తేదీ మరియు అక్టోబర్ 1వ తేదీ ఎగ్జిబిషన్ అండ్ సేల్ నిర్వహించడానికి సంసిద్ధులైనాము.
ఈ రెండు రోజులు అందరికీ చక్కటి వ్యాపారము తప్పకుండా కలుగుతుంది. ఈ పార్కు నందు పెట్టుకున్న స్టాల్ హోల్డర్స్ అందరికీ కూడా ఎగ్జిబిషన్లోనే కాకుండా తర్వాత కూడా చాలాసార్లు బిజినెస్ జరగడం జరిగింది.
*స్టాలు ధర:-* ఒక్కరోజు అయితే ₹800, అదే రెండు రోజులకి బుక్ చేసుకుంటే ₹1400 మాత్రమే. జ్యోతి ఈవెంట్స్ లో మెంబర్షిప్ ఉన్నవారికి 10% రాయితీ.
*సంప్రదించగలరు:-*
*తంగిరాల జ్యోతి*
*7416223176*
*JYOTHI EVENTS*
బసవ పురాణం - 34 వ భాగము
🎻🌹🙏బసవ పురాణం - 34 వ భాగము
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌷గోవూరుబ్రహ్మయ్య కథ
🌸గోవూరు బ్రహ్మయ్య అనే భక్తుడు ఒక జైనునితో వాదించి ఓడించాడు. జైనుడు ‘ఈ వాదాలెందుకు? ఈ మర్రి చెట్టును కాలిస్తే బతికిస్తావా?’ అన్నాడు.
🌿సరేనని బ్రహ్మయ్య చిరునవ్వు నవ్వాడు. జైనుడు మర్రిచెట్టును కాల్చాడు. బ్రహ్మయ్య దానిపై భస్మం చల్లి బతికించి జైనులందరినీ ఓడించాడు.
🌷తేడర దానయ్య
🌸పొట్ల చెరువు అనే నగరంలో ఏడు వందల జైనవసదులున్నాయి. ఇరవై వేలమంది జైనులు అందులో వున్నారు. భల్లహడనే నగర పాలకునికి జైనా చార్యుడే గురువు సింహభల్లహుని భార్య సగ్గలదేవి.
🌿ఆమె శివభక్తురాలు. గురువు తేడర దాసయ్య. భర్త చెప్పినా వినక గురువును పాదపూజకై పొట్లచెరువు పిలిపించింది.దాసయ్యకూ జైనులకూ శాస్తవ్రాదం జరిగింది. అందులో దాసయ్య సమస్త సిద్ధాంతాలు ఖండించాడు. ‘
🌸రామనాధుడే’ కర్త వేదాల ప్రకారం ఏకమేవ రుద్రో’ అనీ ‘లింగమధ్యే జగత్సర్వ’మనీ ‘లింగబాహ్యాత్పరం నాస్తి’ అనీ ఉన్నది కాబట్టి ‘ఈశ్వరుడే పరదైవం’ అని ప్రతిపాదించాడు.
🌿ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే ఈ కుండలో ఈశ్వరుడున్నాడు పట్టుకో’’ అని జైనులు ఒక కుండలో నాగు పామును పెట్టి తెచ్చారు. తేడర దాసయ్య శివనామస్మణ చేసి కుండలో చేయి పెట్టి పామును పైకి తీశాడు.
🌸సర్పం స్ఫటికలింగమై పైకి వచ్చింది. ఆ లింగాన్ని ఉత్తరేశ్వరుడనే పేర అక్కడే ప్రతిష్ఠ చేసి బల్లహునితో సహా సమస్త ప్రజలనూ శైవంలో చేర్పించాడు.
🌷హిరియ నాచయ్య కథ
🌿మారుడిగ అనే చోట హిరయ నాచయ్య అనే భక్తుడు ఉండేవాడు. అక్కడ పదిహేడు వందలమంది జైనులు విజృంభించి శివాలయాన్ని పడగొట్టి పూజారిని హింసించారు.
🌸అది చూచి నాచయ్య పదిహేను వేల లింగాలను బండ్లకెత్తించి పనె్నండు వేల శివభక్తులతో వచ్చి మారుడిగలో దిగి యుద్ధానికి సిద్ధమైనారు.
🌿అందులో పదముగ్గురు తేరసులు అనేవారు నాచయ్యకు వదనం చేసి తమ తలలు తామే తరుక్కొని చేత బట్టుకొని జైనులపై పడ్డారు. జైనులు చిందర వందర అయినారు.
🌸జైన వసతులన్నింటిలోనూ లింగ ప్రతిష్ఠలు చేసి తిరిగి తమ తలలు తాము యధాస్థానంలో ఉంచుకొని తమ నాయకుడైన నాచయ్య మహిమను ప్రదర్శించారు.
🌷సోమన్నగారి కథ
🌸హుళిగఱ అను నగరంలో సోమన్న అనే శివభక్తుడున్నాడు. త్రికాల శివస్పర్శ అతని నియమం. ఒకనాడు కన్నులు కనబడక శివస్పర్శ చేయలేక భుజింప కూర్చొని యుండగా జైనులు వచ్చిరాశివాలయానికితీసుకుపోతాము’
🌿అని చేయి పట్టుకొని వెళ్లి జైన విగ్రహానికి మోకరిల్లజేయించి ‘జినుడు ప్రత్యక్షమైనాడులే!’ అన్నారు నవ్వుతూ. సోమన్న రోషంతో ‘మూర్ఖులారా! వంచన చేస్తారా?’ అని బలవంతంగా కన్నులు తెరిచి చూచాడు.
🌸జిన విగ్రహం పగిలి నడుమ లింగం ఆవిర్భవించింది. జైనులు భయభీతులైనారు. లింగాన్ని సోమేశుడనే పేర నాటినుండీ అంతా పిలవసాగారు.
🌷వైజకవ్వ కథ
🌿పూర్వం వైజకవ్వ అనే భక్తురాలు ఉండేది. ఆమె భర్త జైనుడు. జైనులకోసం వంటలు చేయించాడు. ‘ఒక్క లింగ ప్రాణి అయినా తినకుండా వంటలు వ్యర్థమవుతున్నాయే
🌸అని వైజకవ్వ దుఃఖిస్తూ ఉండగా శివుడు శివముని రూపంలో వచ్చి వైజకవ్వ వంట ఆరగించాడు. అది చూచి జైనులు మండిపడి వైజకవ్వ మొగుడితో చెప్పారు.
🌿అతడు ‘జైనులకు పెట్టకుండా ఒక శివుడికి పెట్టావా?’ అని కోపగించి భార్యను కొట్టసాగాడు. కానీ వైజకవ్వను శివుడు కాచాడు. ఆమెపైన పడే దెబ్బలన్నీ జైనులపైబడి జైనులు ప్రాణాలు విడవసాగారు.
🌸‘్భర్త శైవేతరుడైనప్పుడు అతనిని విడవడమే ధర్మం’ అని భావించి వైజకవ్వ శివుణ్ణి ప్రార్థించి పురుషునిగా మారిపోయింది. వైజకనాథుడనే పేర ప్రసిద్ధుడైనాడు.
🌷షోడ్డలదేవు బాచయ్యగారి కథ
🌿షోడ్డలదేవు బాచరసు అనే భక్తుడు బిజ్జలుని కొలువులో ఉండేవాడు. శివరాత్రికి సౌరాష్ట్రం పోవాలని సంకల్పించి ప్రభువుతో చెప్పగా ‘చాలు చాలు నీవు పోతే ధాన్యం పని ఎవరు చూస్తారు?’ అని రాజు మందలించాడు.
🌸గత్యంతరం లేక బాచరసు ‘నేను రాలేను ప్రభూ. నీవే రా’ అని ప్రార్థించాడు. సౌరాష్ట్ర లింగం ధాన్యపుగాదెలోప్రత్యక్షమైంది...సశేషం...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
పద్యాల నైవేద్యం*
*వినాయకునికి పద్యాల నైవేద్యం*
అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు!
వినాయకచవితి తెలుగువాళ్ళకి ఆహ్లాదకరమైన పండగ. వినాయకుడంటే తెలుగువాళ్ళందరికీ ఒక రకమైన ఆప్యాయత. ఎందుకో మరి! అతని రూపమే చిత్రం! అతని వాహనం మరీ విచిత్రం! ఇష్టమైన పిండివంటలు సరే సరి! మరే దేవుణ్ణైనా మనం గడ్డితో పూజిస్తామా! అతనితో ఎన్ని సరదాలు, మరెన్ని సరాగాలు! ఆ చనువుతోనే కాబోలు నిన్న రాత్రి ఎలక గుఱ్ఱాన్నెక్కి సరాసరి నా కల్లోకి వచ్చేసి పిచ్చాపాటీ మొదలుపెట్టాడా స్వామి!
వినాయకుడు: రేపు వినాయకచవితి గుర్తుందా!
నేను: అయ్యో ఎంత మాట! నాకు గుర్తులేకపోవడమేమిటి, మాకు సెలవు కూడానూ!
వినాయకుడు: అయితే మరి నాకేం నైవేద్యం పెడుతున్నావ్?
నేను: అదీ...మరీ...స్వామీ... మా ఆవిడ ఉండ్రాళ్ళో ఏవో చేస్తానంది. ఆవిడ దయా మీ ప్రాప్తం!
వినాయకుడు: అది కాదోయ్! నువ్వు పెట్టే నైవేద్యమేవిటీ అని అడుగుతున్నా...
నేను: నేనా? ఏంటంటున్నారు స్వామీ?
వినాయకుడు: అదేనయ్యా, నీ బ్లాగులో పండగలకీ పబ్బాలకీ పద్యాలు వేస్తున్నావు కదా! ఆ తెలుగు పద్యాల ప్రసాదం గురించి నేనడుగుతున్నది.
నేను: ఓ, అదా! అయినా మా తెలుగు పద్యాలు మీకు ఆనతాయా అని...
వినాయకుడు: అదేంటయ్యా అలా అంటావ్! అసలు నాకు సంస్కృతశ్లోకాల కన్నా తెలుగు పద్యాలే ప్రీతిపాత్రం తెలుసా!
నేను: అవునా స్వామీ! అదేం?
వినాయకుడు: నన్ను తల్చుకోగానే అందరికీ గుర్తుకొచ్చే సంస్కృత శ్లోకం ఏంటో చెప్పు.
నేను: శుక్లాంబరధరం విష్ణుం...
వినాయకుడు: అవునా! మరి నన్ను తల్చుకోగానే గుర్తుకొచ్చే మీ తెలుగు పద్యం ఏవిటి?
నేను: తోండము నేకదంతమును...
వినాయకుడు: ఊ...పూర్తిగా చదువు.
నేను:
తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసముల్
కొండొక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ! ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!
వినాయకుడు: చూసావా! నువ్వు చదివిన ఆ సంస్కృత శ్లోకం నేనుకూడా చాలా కాలంనుంచీ నా గురించే అనుకుంటున్నాను. కానీ కొంతమంది అది నాది కాదు, అసలందులో నాగురించి ఏవిటుందని సందేహం వెలిబుచ్చారు. దాంతో నాక్కూడా అనుమానం వచ్చేసింది, అది నా గురించేనా అని. అదే మీ తెలుగు పద్యం చూడు. స్పష్టంగా, వివరంగా నా గురించి ఎంత చక్కగా చెప్తోందో! అందికే మీ తెలుగు పద్యాలంటే నాకిష్టం!
నేను: బావుంది స్వామీ! మీకు తెలుగు పద్యాలిష్టమని విని చాలా ఆనందంగా ఉంది!
వినాయకుడు: మీ తెలుగు కవులు ఎన్నెన్ని రకాలుగా నన్ను ప్రస్తుతించారు! అవన్నీ గుర్తు చేసుకుంటే నా బొజ్జ నిండిపోతుందనుకో!
నేను: అలాగా!
వినాయకుడు: అవునయ్యా! అతనెవరూ... జిగిబిగి కవిత్వం రాసాడు. ఆ... అల్లసాని పెద్దన. అతను బలే గడుసువాడు సుమా! నా గురించి బలే పద్యాన్ని రాసాడు. ఏదీ ఆ పద్యం ఒక్కసారి చదివి వినిపించూ.
నేను:
అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!
వినాయకుడు: తస్సాదియ్యా! కవంటే ఇతనేనయ్యా. నాక్కూడా ఎప్పుడూ రాలేదిలాంటి అల్లరి ఆలోచన! దీనికి మీ విమర్శకులేవో చాలా లోతైన విశ్లేషణలు చేస్తారు. అసలిది నా గురించే కాదనీ ఏదో వేదాంతం చెప్తారు. కానీ నాకవేవీ పట్టవు. నా గురించి అలాటి చమత్కారమైన ఆలోచన చేసాడు చూడూ! అది నాకు బలే బలే అద్భుతంగా అనిపించింది.
నేను: అవును స్వామీ! పెద్దనవలె కృతిసెప్పిన పెద్దనవలె అని అందుకేగా మేం అనుకునేది! అయితే ఇంతకన్నా ముందే కేతన కవి ఇలాంటిదే మరో చిత్రమైన ఆట మీచేత ఆడించాడు స్వామీ!
వినాయకుడు: అవునా! ఎందులో? ఏదీ ఆ పద్యం కూడా వినిపించు మరి.
నేను: ఈ పద్యం దశకుమారచరిత్రములోది. వినండి.
గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసిపట్టి యా
మిక్కిలి కంటికిం దనదు మిక్కిలి హస్తము మాటుసేసి యిం
పెక్కెడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవింపగా
దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతుం బ్రసన్నుగాన్!
వినాయకుడు: ఓరి మీ అసాధ్యంగూలా! మీ తెలుగుకవులు భలే వాళ్ళయ్యా! నా చేత ఎన్నెన్ని చిత్రమైన చేతలు చేయించారూ! నా రెండు చేతులతోనూ మా నాన్న రెండు కళ్ళూ మూసేసి, మా నాన్న మూడో కంటిని నా మూడో చేత్తో, "హస్తంతో", అంటే తొండంతో మూసేసానా! ఆ నిప్పుకంటి జోలికి వెళితే నా తొండమేం గానూ!
నేను: పొండి స్వామీ మీరు మరీను! పరమేశ్వరుని చిత్తం చిగురిస్తే, ఆ కన్ను మంటలు కురిపిస్తుందా ముద్దులు కురిపిస్తుంది కానీ.
వినాయకుడు: ఆలా అంటావా! అయితే ఓకే. ఇంతకీ, నన్ను మొట్టమొదట కావ్యంలో ప్రత్యేకంగా స్తుతించిన కవి ఎవరో చెప్పు?
నేను: నన్నెచోడుడు అనుకుంటాను స్వామీ!
వినాయకుడు: ఓహో! అతనే కదూ మా తమ్ముడు పుట్టుకగురించి కుమారసంభవం తెలుగులో రాసిన కవి. ఏదీ అతను రాసిన పద్యం వినిపించు.
నేను: చిత్తం.
తను వసితాంబుదంబు, సితదంతముఖం బచిరాంశు, వాత్మ గ
ర్జన మురుగర్జనంబు, గర సద్రుచి శక్రశరాసనంబునై
చన మదవారివృష్టి హితసస్య సమృద్ధిగ నభ్రవేళ నా
జను గణనాథు గొల్తు ననిశంబు నభీష్టఫల ప్రదాతగాన్!
వినాయకుడు: బావుందయ్యా! నన్ను కాస్తా నల్లనివాణ్ణి చేసేసి వర్షాకాలంతో పోల్చాడే యీ కవి! మరి నేను పుట్టింది వానాకాలంలోనే కదా! ఇంకా ఎవరెవరు ఏం చమత్కారాలు చేసారో త్వరగా వినిపించు.
నేను: కాస్త ప్రౌఢమైన చమత్కారమేదో చేసిన కవి ఒకడున్నాడు స్వామీ. అతను రామరాజభూషణుడు, ఉరఫ్ భట్టుమూర్తి. ఆ పద్యం నాకు సరిగా అర్థం కాలేదు. మీరే వివరించాలి!
వినాయకుడు: ఏవిటి నేనా! ఇప్పుడంత సమయం లేదే. సరే చదువు చూద్దాం.
నేను:
దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయంగ్రాహముం
గంతుద్వేషికి గూర్చి శైలజకు దద్గంగాఝరాచాంతి న
త్యంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృ
స్వాంతంబు ల్వెలయింపజాలు నిభరాడ్వక్త్రుం బ్రశంసించెదన్!
వినాయకుడు: అబ్బో, యీ భట్టుమూర్తి చాలా ఘటికుడయ్యా! వాక్యాలని అటూ ఇటూ చేసి అన్వయం కష్టం చేసిపారేసాడు! మధ్యలో శ్లేష ఒకటి!
నా తొండంతో ముందు గంగ నీళ్ళన్నీ పీల్చేసి సవతిపోరు లేకుండా మా అమ్మ పార్వతికి ఆనందాన్ని ఇచ్చానట! తర్వాత నా దంతంతో వెండి కొండని ఒక్కసారి కదిలిస్తే, ఆ ఊపుకి, మా తల్లి పార్వతి మా తండ్రి శివదేవుని దగ్గరగా హత్తుకొందిట. ఆ రకంగా తండ్రికి ఆనందాన్ని కలిగించేనట. ఇలా తల్లిదండ్రులిద్దరికీ ఆనందాన్ని చేకూర్చి నేను వాళ్ళ కుమారులలో అగ్రస్థానాన్ని (కుమారస్వామికి అన్ననే కదా!) సంపాదించానట. దానికి నన్ను ప్రశంసిస్తున్నాడోయ్ మీ భట్టుమూర్తి!
నేను: బాగా వివిరించారు స్వామీ! స్వయంగా మీ నోటితో దీని వివరణ వినడం పరమానందంగా ఉంది!
వినాయకుడు: అది సరేగానీ, ఇన్నేసి చమత్కారాలు గుప్పించిన పద్యాలు కాకుండా, వినసొంపుగా హాయిగా మనసుకి హత్తుకొనే పద్యాలు ఎవరూ రాయలేదా?
నేను: ఎందుకు రాయలేదు స్వామీ! అలాటివాటికి పెట్టింది పేరు పోతన, ఆ తర్వాత కొంతవరకూ మొల్ల.
వినాయకుడు: అయితే తొందరగా వినిపించు మరి!
నేను: పోతన తనకి సహజమైన అంత్యప్రాసలతో రాసిన పద్యం ఇదిగో:
ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం
సాదికి దోషభేదికి బ్రసన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికిన్
మోదక ఖాదికిన్ సమద మూషికసాదికి సుప్రసాదికిన్!
వినాయకుడు: ఆహా! పోతన పద్యంలో తీయని మకరంద ధార జాలువారుతునే ఉంటుంది. మరి మొల్ల పద్యమో?
నేను: చిత్తం సిద్ధం!
చంద్రఖండ కలాపు జారు వామనరూపు
గలిత చంచలకర్ణు గమల వర్ణు
మోదకోజ్జ్వలబాహు మూషికోత్తమవాహు
భద్రేభవదను సద్భక్తసదను
సన్ముని స్తుతిపాత్రు శైలరాడ్దౌహిత్రు
ననుదినామోదు విద్యాప్రసాదు
బరశువరాభ్యాసు బాశాంకుశోల్లాసు
నురుతరఖ్యాతు నాగోపవీతు
లోకవందిత గుణవంతు నేకదంతు
నతుల హేరంబు సత్కరుణావలంబు
విమల రవికోటితేజు శ్రీవిఘ్నరాజు
బ్రథిత వాక్ప్రౌఢికై యెప్డు ప్రస్తుతింతు!
వినాయకుడు: చాలా బావుంది! సీసంలోని తూగు మరే పద్యానికొస్తుంది! అన్నట్టు సీసమనగానే గుర్తుకొచ్చింది. అసలుసిసలు తెలుగుకవి, మీ శ్రీనాథ కవిసార్వభౌముడు నా గురించేమీ రాయలేదా?
నేను: అయ్యో పొరపాటైపోయింది స్వామీ! మరచిపోయాను. ఇదిగో మీ గురించి అతను రాసిన సీసం!
కలితశుండాదండ గండూషితోన్ముక్త
సప్తసాగర మహాజలధరములు
వప్రక్రియా కేళివశ విశీర్ణ సువర్ణ
మేదినీధర రత్నమేఖలములు
పక్వ జంబూఫల ప్రకటసంభావనా
చుంబిత భూభృత్కదంబకములు
వికట కండూల గండక దేహమండలీ
ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు
శాంభవీశంభు లోచనోత్సవ కరములు
వాసవాద్యమృతాశన వందితములు
విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు
మించి విఘ్నోపశాంతి గావించు గాత!
వినాయకుడు: అబ్బబ్బా! ఏవి ధారా, ఏవి ధారా! ఇందుకేగా ఇతన్ని ప్రసిద్ధ ధారాధుని అని పిలిచేది. సెభాష్!
అవునూ, నువ్వందరూ పాతకవులనే చెప్తున్నావ్, ఆధునిక కాలంలో నా గురించి పట్టించుకున్న కవే లేడా ఏంటి?
నేను: అయ్యో లేకేం స్వామీ! పైన చెప్పిన కవులందరూ తమ కావ్యాల్లో ఒక పద్యంలో మిమ్మల్ని స్తుతిస్తే, ఏకంగా ఒక పద్య ఖండికనే మీకు సమర్పించిన ఆధునిక కవి ఒకరున్నారు. అతనే, కరుణశ్రీ అలియాస్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. తన ఉదయశ్రీలో మీకు "నమస్తే" చెప్పారు.
వినాయకుడు: అవన్నీ వినడానికి ఇప్పుడు నాకు సమయం చాలదు. అవతల మీవాళ్ళందరూ నన్ను ఎన్నెన్ని రూపాల్లో తయారుచేసారో, ఎన్నెన్ని పిండివంటలు చేసారో చూడ్డానికి వాహ్యాళికి వెళ్ళాలి. నువ్వు కూడా తొందరగా నిద్రలేచి పూజ చేసుకోవాలి కదా! మచ్చుకి ఒక్క పద్యం వినిపించు చాలు. ఆనక మిగతావి వింటాను.
నేను: సరే అలాగే స్వామీ! చిత్తగించండి.
ఎలుకగుఱ్ఱము మీద నీరేడు భువనాలు
పరుగెత్తి వచ్చిన పందెకాడు
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు
"నల్లమామా!" యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లుకుఱ్ఱ
వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని
నూఱేండ్లు నోచిన నోముపంట
అమరులందగ్ర తాంబూలమందు మేటి
ఆఱుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్రవిద్యార్థి! లెమ్ము జోహారు లిడగ!
వినాయకుడు: నేను విష్ణుమూర్తిని "నల్ల మామా" అని ఆటపట్టిస్తానా! ఆహా బలే అయిడియా ఇచ్చాడే ఇతను! ఎంతైనా మీ తెలుగుకవులకి సరసం ఎక్కువే సుమీ!
మొత్తానికివాళ పంచభక్ష్య పరమాన్నాలతో విందుభోజనం చేసినట్టుంది! బావుంది నీ పద్య నైవేద్యం!
కాకపోతే ఇన్ని పద్యాలు చూసి నాకొకటే లోటుగా అనిపిస్తోంది.
నేను: లోటా! ఏవిటి స్వామీ?
వినాయకుడు: మీ తెలుగు కవులు ఇందరిగురించి కావ్యాలు రాసి, నా గురించి మాత్రం రాయలేదే అని వెలితిగా అనిపిస్తోంది. మా తమ్ముడు కుమారస్వామి గురించి కూడా వెయ్యేళ్ళ కిందటే ఎవరో రాసారని చెప్పావే, మరి ఇన్నాళ్ళై నా కథని ఎవరూ కావ్యంగా ఎందుకు రాయలేదు?
నేను: అవును స్వామీ! మీరు చెప్పే దాకా నాక్కూడా తట్టలేదు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యంగానే ఉంది.
వినాయకుడు: పోనీలే. ఇంతమంది రాసిన పద్యాలు చెప్పేవు కదా. సొంతంగా నువ్వొక్క పద్యం నా గురించి యిప్పుడు చెప్పకూడదూ. విని దానితోనే సంతృప్తి పడతాను.
నేను: అయ్యో అంత కన్నా మరో భాగ్యం ఉంటుందా! అవధరించండి!
శ్రీకంఠుని సతి ప్రేమకి
ఆకారమ్మైన సామి! హరుని దయన్ నూ
త్నాకృతి దాల్చిన గజముఖ!
చేకూర్చుము సిద్ధి బుద్ధి స్థిరముగ మాకున్!
నేనిలా పద్యం చదివానో లేదో, అలా అదృశ్యమైపోయాడా గణనాథుడు! నా పద్య ప్రభావమేనో ఏమో! సరే పొద్దున్న యథావిథిగా పూజా కార్యక్రమాలు సాగించి, మా ఆవిడ చేసిన పిండివంటలు స్వామికి నైవేద్యం పెట్టి నేను తిని, ఇదిగో నా నైవేద్యాన్ని మీ ముందు పెట్టాను. ఆరగించండి మరి!
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
