ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
3, డిసెంబర్ 2023, ఆదివారం
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
ఆ క్షణంలో త్రిశంకుడు శ్వపచుడుగా మారిపోయాడు. సువర్ణరత్నకుండలాలు ఇనవరాత
కుండలాలైపోయాయి. చందనచర్చ - దుర్గంధభూయిష్టమైపోయింది. దివ్యపీతాంబరం నల్లని మలివవస్త్రంగా
మారిపోయింది. శరీరం గజవర్ణంలోకి దిగింది. వైగనిగ్యం సౌకుమార్యం అంతరించి పళ్ళికలు పళ్ళికలుగా
బండబారింది. శక్త్యుపాసకుడైన వసిష్ఠుడి రోషానికి తిరుగులేదుకదా! అందుకనే శ్రీదేవీ ఉపాసకులకు
ఎప్పుడూ కించపరచకూడదు. వసిష్ఠుడంటే గాయత్రీ జపనిష్ఠుడైన మహామునీశ్వరుడు.
తస్మాత్ శ్రీశక్తి భక్తో హి నావమాన్యః కదాచన |
గాయత్రీ జపనిష్టా హి వసిష్టో మునిపత్తమః ॥
(12-35)
త్రిశంకుడు తన రూపాన్ని చూసుకుని బోరున విలపించాడు. రాజధానికి తిరిగివెళ్ళేందుకు
మనస్కరించలేదు. అడవిలోకే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళను ? ఏమి చెయ్యను? రూపం చూస్తే వాళే
రోతగా ఉంది. ఇంటికి వెడితే భార్య తిరస్కరిస్తుంది. కొడుకు దుఃఖిస్తాడు. సచివులు అసహ్యించుకుంటాడు.
బంధుమిత్రులు దూరం తొలగుతారు. ఇలా జీవించడంకన్నా మరణించడమే మేలు. విషం తాగవా?
మడుగులో దూకనా ? తాడుపేని ఉరిపోసుకోవా? చితిపేర్చుకుని అగ్నిలో ప్రవేశించనా? నిరాహారుడిపై
ప్రాయోపవేశం చెయ్యనా ? ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే జన్మజన్మలకూ ఇదే వెంటాడుతుందా ? ఈ
శాపమూ ఈ శ్వపచత్వమూ తప్పవా ? ఈ ఆలోచన రావడంతోనే త్రిశంకుడి ధోరణి మారిపోయింది. ఎట్టి
పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోనుగాక చేసుకోను. చేసుకున్న కర్మను ఈ జన్మంలోనే ఈ దేహంతోనే
అనుభవించాలి. అనుభవించడంతోనే కర్మవిపాకం క్షయమవుతుంది. ప్రారబ్ధకర్మలు క్షయించడానికి
అదొక్కటే మార్గమని పెద్దలు చెప్పారు. అందుచేత చేసుకున్న కర్మ శుభమైనా అశుభమైనా అనుభవించక
తప్పదు. ఆశ్రమాలను సందర్శిస్తూ తీర్థక్షేత్రాలను సేవిస్తూ అంబికాదేవిని ధ్యానిస్తూ సాధువణ్ణమలకు
పరిచర్యలు చేస్తూ నా దుష్కర్మమ నశింపజేసుకుంటాను. అదృష్టం బాగుంటే ఏ మహామభావుడో ఏ
మహర్షియో ఏ సాధుపుంగవుడో సంగతపడవచ్చు. ఏదైనా ఉపకారం చెయ్యవచ్చు.
ప్రారబ్ధకర్మణాం భోగాదవ్యథా న క్షయో భవేత్ |
తస్మాన్మయాత్ర భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్
1 (12-46)
ఇలా ఒక విశ్చయానికి వచ్చి గంగాతీరం చేరుకున్నాడు
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
ఆ క్షణంలో త్రిశంకుడు శ్వపచుడుగా మారిపోయాడు. సువర్ణరత్నకుండలాలు ఇనవరాత
కుండలాలైపోయాయి. చందనచర్చ - దుర్గంధభూయిష్టమైపోయింది. దివ్యపీతాంబరం నల్లని మలివవస్త్రంగా
మారిపోయింది. శరీరం గజవర్ణంలోకి దిగింది. వైగనిగ్యం సౌకుమార్యం అంతరించి పళ్ళికలు పళ్ళికలుగా
బండబారింది. శక్త్యుపాసకుడైన వసిష్ఠుడి రోషానికి తిరుగులేదుకదా! అందుకనే శ్రీదేవీ ఉపాసకులకు
ఎప్పుడూ కించపరచకూడదు. వసిష్ఠుడంటే గాయత్రీ జపనిష్ఠుడైన మహామునీశ్వరుడు.
తస్మాత్ శ్రీశక్తి భక్తో హి నావమాన్యః కదాచన |
గాయత్రీ జపనిష్టా హి వసిష్టో మునిపత్తమః ॥
(12-35)
త్రిశంకుడు తన రూపాన్ని చూసుకుని బోరున విలపించాడు. రాజధానికి తిరిగివెళ్ళేందుకు
మనస్కరించలేదు. అడవిలోకే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళను ? ఏమి చెయ్యను? రూపం చూస్తే వాళే
రోతగా ఉంది. ఇంటికి వెడితే భార్య తిరస్కరిస్తుంది. కొడుకు దుఃఖిస్తాడు. సచివులు అసహ్యించుకుంటాడు.
బంధుమిత్రులు దూరం తొలగుతారు. ఇలా జీవించడంకన్నా మరణించడమే మేలు. విషం తాగవా?
మడుగులో దూకనా ? తాడుపేని ఉరిపోసుకోవా? చితిపేర్చుకుని అగ్నిలో ప్రవేశించనా? నిరాహారుడిపై
ప్రాయోపవేశం చెయ్యనా ? ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే జన్మజన్మలకూ ఇదే వెంటాడుతుందా ? ఈ
శాపమూ ఈ శ్వపచత్వమూ తప్పవా ? ఈ ఆలోచన రావడంతోనే త్రిశంకుడి ధోరణి మారిపోయింది. ఎట్టి
పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోనుగాక చేసుకోను. చేసుకున్న కర్మను ఈ జన్మంలోనే ఈ దేహంతోనే
అనుభవించాలి. అనుభవించడంతోనే కర్మవిపాకం క్షయమవుతుంది. ప్రారబ్ధకర్మలు క్షయించడానికి
అదొక్కటే మార్గమని పెద్దలు చెప్పారు. అందుచేత చేసుకున్న కర్మ శుభమైనా అశుభమైనా అనుభవించక
తప్పదు. ఆశ్రమాలను సందర్శిస్తూ తీర్థక్షేత్రాలను సేవిస్తూ అంబికాదేవిని ధ్యానిస్తూ సాధువణ్ణమలకు
పరిచర్యలు చేస్తూ నా దుష్కర్మమ నశింపజేసుకుంటాను. అదృష్టం బాగుంటే ఏ మహామభావుడో ఏ
మహర్షియో ఏ సాధుపుంగవుడో సంగతపడవచ్చు. ఏదైనా ఉపకారం చెయ్యవచ్చు.
ప్రారబ్ధకర్మణాం భోగాదవ్యథా న క్షయో భవేత్ |
తస్మాన్మయాత్ర భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్
1 (12-46)
ఇలా ఒక విశ్చయానికి వచ్చి గంగాతీరం చేరుకున్నాడు
మల్టీ మిల్లెట్ మొలకల ప్రోటీన్ పౌడర్ మాల్ట్ చేయు విధానము:
పదార్ధాలు--
కొర్రలు, సామలు,అరికలు, ఊదలు,అండు కొరలు,సజ్జలు,రాగులు,వరిగెలు,జొన్నలు,పెసలు,ఉలవలు,కందిపప్పు,అలసంద,పచ్చి బఠాణి,అక్రోట పప్పులు,బాదంపప్పు,నల్లమిరియాలు,యాలుకలు
1.పాలతో చేయు విధానము: ఒక గ్లాసు పాలు గిన్నెలో పోసి స్టౌ పైన పెట్టి మరగనివ్వాలి .పాలు మరిగే లోపు ఒక స్పూను ప్రోటీన్ పౌడర్ చిన్న కప్పులో వేసి కొద్దిగా నీరు పోసి ఉండలు లేకుండా కలిపాలి.తరువాత ఈ మరిగిన పాలలో ఈ నీటితో కలిపిన మిశ్రమం వేసి కలిపి 2 నిమిషాలు సన్న మంట పై ఉంచాలి. తరువాత రుచికి తగినంత పంచదార లేదా కొద్దిగా చల్లారాక బెల్లము పొడి కానీ వేసుకొని తాగవచ్చు.
2.మజ్జిగ తో కలుపుకొని త్రాగు విధానము:
ఒక 1/2 గ్లాసు నీళ్ళు గిన్నెలో పోసి స్టౌ పైన పెట్టి మరగనివ్వాలి.ఈ లోగా 1 స్పూను ప్రోటీన్ పౌడర్ చిన్న కప్పులో వేసి నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలిపి మరిగే నీటిలో పోసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి.తరువాత చల్లారాక అందులో అర గ్లాసు మజ్జిగ పోసి తగినంత ఉప్పు లేదా సైంధవ లవణం కలిపి త్రాగాలి.
*మనో నేత్రాలు..*
దాదాపు నాలుగు సంవత్సరాల కాలం క్రితం..
"వాట్సాప్ లో గురుచరణ్ అనే గ్రూప్ ను నిర్వహిస్తున్నాము..మీరు ఇతర గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్న మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి అనుభవాలు..లీలలు..ఈ గ్రూప్ లో కూడా పోస్ట్ చేయండి..నా పేరు నందకిశోర్..నేను ఆ గ్రూప్ అడ్మిన్ గా వున్నాను..మీకు లింక్ పంపుతాను.." అన్నారు..సరేనండీ అన్నాను..అదేవిధంగా ఆ గ్రూప్ లో చేరాను..ఆ తరువాత శ్రీ నందకిశోర్ గారు మళ్లీ నాతో మాట్లాడుతూ.."ఈ గ్రూప్ లో ఎక్కువ మందిమి అంధత్వం కారణంగా చదవలేని వాళ్ళము..మీకు వీలుంటే ఆడియో రూపం లో పెట్టగలరా..?" అన్నారు..ఒకింత ఆశ్చర్యం వేసింది..ఖమ్మం లో నివాసం ఉంటున్న శ్రీమతి జీవని గారు..మొగిలిచెర్ల స్వామివారి జీవితచరిత్రను ఆడియో రూపం లో యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు..వారిని సంప్రదించి..వారిని ఈ గ్రూప్ లో చేరమని అడిగాను..వారూ ఈ గ్రూప్ లో చేరి..ఆడియో రూపం లో శ్రీ స్వామివారి చరిత్రను పోస్ట్ చేశారు..అంతే కాకుండా..మా తల్లిగారు వ్రాసిన శ్రీ శిరిడీ సాయినాథ భాగవతాన్ని కూడా ఆడియో రూపం లో జీవని గారు పోస్ట్ చేశారు..అలా గురుచరణ్ అనే సమూహములో సభ్యుడిగా మారి..మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను, లీలలను ఆ గ్రూప్ సభ్యులకు చేరవేయడం ఇన్నాళ్లూ జరుగుతున్నది..
ఇలా ఉండగా ఒక నాలుగైదు నెలల క్రితం.."అంకుల్..నేను నందకిశోర్ ను మాట్లాడుతున్నాను..వచ్చే శనివారం నేనూ..మా స్నేహితుడూ ఇద్దరం కలిసి..మొగిలిచెర్ల వచ్చి..స్వామివారిని దర్శించుకుందాము అనుకుంటున్నాము..మీతో ముందుగా తెలియచేస్తున్నాను.." అన్నారు..నందకిశోర్ గారు తనకు సరిగా కళ్ళు కనబడవు అని చెప్పి వున్నారు కదా..మరి ఎలా వస్తున్నారో..అనే సందేహం కలిగింది..వస్తానని చెప్పారు కదా..వేచి చూద్దాం..అనుకున్నాను..
ఆ ప్రక్క శనివారం ఉదయం తొమ్మిదిన్నరకు స్వామివారి మందిరం వద్దకు వచ్చే బస్సు లో నందకిశోర్ గారు..వారి స్నేహితుడు..వీళ్ళిద్దరికీ తోడుగా మరో పదిహేనేళ్ల కుర్రవాడు దిగారు..నందకిశోర్ గారు, వారి స్నేహితుడు పూర్తిగా అంధులు..స్వామివారి మందిరం లోపలికి వచ్చి..నేను ఎక్కడ వుంటానో విచారించి..ఆ పిల్లవాడి సహాయంతో నా వద్దకు నడచి వచ్చారు..నేను నందకిశోర్ గారిని..వారి స్నేహితుడిని చూసి..పూర్తి ఆశ్చర్యం లో మునిగిపోయి వున్నాను.."ప్రయాణం బాగా జరిగిందా.." అని మాత్రం అడిగాను.."నిన్నరాత్రి నేను హైదరాబాద్ లో బస్సు ఎక్కాను అంకుల్..ఒంగోలు లో నా స్నేహితుడు..మా ఇద్దరికీ తోడుగా ఈ పిల్లవాడు కలిశారు..ముగ్గురం కలిసి వచ్చాము..మీ పోస్టుల ద్వారా ఈ స్వామివారి లీలలు తెలుసుకుంటున్నాము..ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్లాలని బలంగా అనిపించింది..ఈరోజు వస్తే..స్వామివారి పల్లకీసేవ కూడా వుంటుంది అని విన్నాను..అందులో కూడా పాల్గొని..రేపు ఉదయం స్వామివారి సమాధి వద్దకు వెళ్లి వస్తాము.." అన్నారు..
స్వామివారి పల్లకీసేవ..స్వామివారి సమాధి..ఈ రెండూ కళ్ళతో చూసి అనుభూతి చెందడం అందరికీ సాధ్యమయ్యే పని..మరి నందకిశోర్ గారు..వారి స్నేహితుడూ ఎలా దర్శించుకుందామని అనుకుంటున్నారో..అని అనిపించింది..ఆరోజు సాయంత్రం స్వామివారి పల్లకీసేవ వద్ద ఆ ఇద్దరూ భక్తి శ్రద్ధలతో కూర్చున్నారు...వాళ్ళిద్దరినీ బాగా గమనిస్తూనే వున్నాను..బాహ్య దృష్టి లేకపోయినా..మనో నేత్రం తో తనను దర్శించే భాగ్యాన్ని వారికి కల్పించాడమో ఆ స్వామివారు అని మా దంపతులము అనుకున్నాము..పల్లకీసేవ తరువాత..నా వద్దకు వచ్చి.."చాలా బాగా జరిగింది అంకుల్.." అని చెప్పారు..
ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం ఐదు గంటలకే ఆ ఇద్దరూ తయారయ్యి మందిరం లోకి వచ్చారు..స్వామివారి ప్రభాతసేవ లో జరిగే విశేష హారతుల అనంతరం..తమ సహాయకుడిని తీసుకొని..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..దర్శించుకొని వచ్చారు..నిజమే..వాళ్లిద్దరూ స్వామివారి సమాధిని ముట్టుకొని...నమస్కారం చేసుకొని..తమ అంతర్దృష్టి తో దర్శించి..తృప్తిగా ఇవతలకు వచ్చారు...వారి అంధత్వం వారికి అడ్డురాలేదు..మాకు ఆశ్చర్యం తో నోట మాట కూడా రావడం ఆగిపోయింది..
ఈ మొత్తం తతంగం చూస్తూ ఉన్న మా దంపతులకు..మా సిబ్బందికి ఒక విషయం బాగా అర్ధమయింది..స్వామివారి మీద ఎనలేని భక్తి ఉంటే..వారికి చూపు లేకపోయినా..ఆయన వారికి తన దర్శనభాగ్యాన్ని కలిగిస్తారు..చూపు చక్కగా ఉండికూడా..కొందరు దైవాన్ని చూడలేరు..కానీ దైవం తలుచుకుంటే..అంధులు సైతం దైవాన్ని దర్శించే అదృష్టానికి నోచుకుంటారు..అనే విషయాన్ని మా కళ్ళకు కట్టినట్లుగా స్వామివారు సోదాహరణంగా చూపించారు..
మరి కొద్దిసేపటి తరువాత..నందకిశోర్ గారు నావద్దకు వచ్చి.."అంకుల్..మళ్లీ అతి త్వరలో స్వామివారి దర్శనానికి వస్తాము..మీ సహకారం మరువలేనిది.." అని చెపుతుంటే..ఆ భక్తిపరుడి వినయపు మాటలకు కళ్ళకు నీళ్లు వచ్చాయి.."అలాగే తప్పకుండా రండి..మీరు వచ్చేముందు తెలియచేయండి.." అని మాత్రం అనగలిగాను..
శ్రీ నందకిశోర్ గారికి మరలా స్వామివారు ఎప్పుడు తన దర్శనాన్ని కలిగిస్తారో అని నేను కూడా ఎదురుచూస్తూ వున్నాను..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..99089 73699 & 94402 66380).
*జైశ్రీరామ్*
25-5-2020
అభ్యాసం-18
*సుభాషితం*
"యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతాః |
యత్రైతాస్తు నపూజ్యంతే
సర్వాస్తత్రా ఫలాక్రియః"||
(మనువు)
*భావం*
ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నివసిస్తారు.
ఎక్కడ స్త్రీలు పూజింపబడరో అక్కడ చేసిన కార్యాలన్నీ,పుణ్యకార్యాలతో సహా నిష్ఫలమౌతాయి.
*అమృతవచనం*
*శ్రీమాత* ఇలా అన్నారు:
ప్రపంచపు మేలుకోరి *భారతదేశాన్ని* రక్ఛించుకోవాలి.ఎందుకంటే ప్రపంచానికి శాంతిని,ఒక నూతన వ్యవస్థను ఒక్క భారతదేశం మాత్రమే అందించ గలుగుతుంది.భారతదేశ భవిష్యత్తు చాలా స్పష్టంగా ఉంది.భారతదేశం జగద్గురువు.ప్రపంచ భవిష్యత్ వ్యవస్థ కూడా భారతదేశం మీదనే ఆధారపడి ఉంది.ఆథ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచంలో నిలబెట్టే ప్రయత్నం కేవలం భారతదేశమే చేస్తున్నది.
శ్రీవేంకటేశ్వర్లు వబిలిశెట్టి
.
---౦--- ఆలోచనాలోచనాలు---౦---"" అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక "" "" ఉద్,యానమ్ తేపురుష న,అవయానమ్""--- అథర్వణ వేదం. --- ఓ మనిషీ! నీ గమనం పైకి, పైపైకి; క్రిందివైపుకు కాదు. ( సంస్కృత సూక్తి సుధ) 1* మత్స్యన్యాయేనభక్షేరన్,యది దండో నపాలయేత్. ----రాజు గనుక దండాన్ని(కఠినమైన శిక్షలను) అమలుపరచకపోతే, పెద్ద చేప చిన్న చేపలను మ్రింగేవిధంగా బలవంతులు, బలహీనులను నమిలి మింగేస్తారు సుమా! 2* మనః పూతం సమాచరేత్.--- పవిత్రమైన మనస్సుతో కార్యాచరణను ప్రారంభించాలి. 3* మనస్యన్యత్, వచస్యన్యత్,కర్మణ్యన్యత్ దురాత్మానామ్--- దుర్మార్గుల మనస్సు, మాట, చేష్టలు వేర్వేరుగా ఉంటాయి. 4* ఉపకారోహి నీచానాం, అపకారోహి జాయతే!--- వాల్మీకి రామాయణం. నీచులకు చేసే ఉపకారం, అపకారాన్నే కలిగిస్తుంది సుమా! 5* ఋషిః సయో మమర్హిత--- మానవజాతికి మేలుచేసేవాడే నిజమైన ఋషి. --- ఋగ్వేదం. 6* నికటస్థం గరీయాం సమపితోకో నమన్యతే! పవిత్రామపి యన్మర్త్యా ననమస్యంతి జాహ్నవీం!! తనకు దగ్గరగా ఉన్నవారి గొప్పతనం తనకు తెలియదు. గుర్తించలేరు కూడా! బాగా దగ్గరవున్నా గంగానదికి ప్రజలు నమస్కరించరు కదా! 7* వరం సఖే సత్పురుషాఏ మానితో! న నీచ సంసర్గ గుణైరలంకృతః!! నీచులతో పొగిడించుకొనేకంటే సజ్జనుల నుండి అవమానం పొందడమే మేలు! 8* విద్యా వివాదాయ, ధనం మదాయ,-- శక్తిః పరేషాం పరపీడనాయ! ఖలస్య సాధోర్విపరీతమేతత్, జ్ఞానాయ,దానాయచ రక్షణాయ!! దుర్జనుని విద్య వివాదానికి, ధనం మదానికి, శక్తి పరపీడనకు ఉపకరిస్తుంది. సజ్జనుని విద్య జ్ఞానాభివృద్ధికి, ధనం దానానికి, శక్తి పరుల రక్షణకు ఉపయోగపడుతుంది. 9* అకారణం రూపమకారణం కులం! మహత్సు నీచేషుచ కర్మ శోభతే!! అందంకానీ, కులంగానీ గౌరవానికి హేతువు కాదు. ఇవేవీలేకపోయినా ఎవరు చేసిన పనులే వాళ్ళగౌరవానికి అర్హతను సంపాదించిపెడతాయి. 10* అంధః తమః ప్రవిశంతియే అవిద్యాముపాసతే! --- ఈశావాస్యోపనిషత్. అవిద్య(అజ్ఞానాన్ని) ఆరాధించేవారు కారుచీకటిలోకి ప్రవేశిస్తారు. 11* అంభసః ప్రస్వతీరష్టారనావ మదితేపిబేడ్. ---చరక సంహిత. ప్రొద్దు పొడవకముందే (మనుషులు) ఎనిమిది పుడిసెళ్ళ నీరు త్రాగాలి.( పుడిసె అనగా నోటినిండా పట్టే నీరు అని అర్థం) 12* అకారణం విద్విషంతో లజ్జంతేన కథం భువి? --- ఈ లోకంలో అకారణంగా ద్వేషించేవారు తమను చూసి తామే సిగ్గు పడాలి. తేది 3--12--2023, ఆదివారం, శుభోదయం.
"పంచారామాలు" అనగా ఏమిటి ?
ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధమైన "శైవక్షేత్రాలను", "పంచారామాలు' అని పిలుస్తారు. 'పంచారామాలు' ఏర్పడుటకు, స్కందపురాణంలో ఇలా వివరించబడి యున్నది..
పూర్వం.. తారకాసురుడు అను రాక్షసుడు, 'శివుని' గురించి ఘోర తపస్సు చేసి 'శివుని' ఆత్మలింగము సంపాదిస్తాడు. దీనితో వీర గర్వముతో, దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా, ఇందుకు దేవతలు, విష్ణుమూర్తిని ప్రార్ధించగా, 'శివపార్వతుల' వల్ల కలిగిన కుమారుడు "కుమారస్వామి" వల్లనే తారకాసురుని వధించుట సాధ్యపడుతుందని తెలిపి "కుమారస్వామిని" యుద్ధానికి పంపుతారు. యుద్ధమునందు "కుమారస్వామి", తారకాసురుని కంఠంలో గల 'ఆత్మలింగమును' చేధిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ 'లింగమును' చేధిస్తాడు. దీనితో తారకాసురుడు మరణిస్తాడు.
చేధిoచే సమయంల్లో, ఆ.. 'ఆత్మలింగము' వేరై, ఐదు ప్రదేశములలో పడుతాయి. తరువాత వాటిని ఆ...యా...ప్రదేశాలలో, దేవతలు లింగ ప్రతిష్ఠ కావిస్తారు.. కనుక ఈ అయిదు 'క్షేత్రాలను', 'పంచారామాలు' అని పిలుస్తారు..
1. దాక్షారామము :
పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని "భీమేశ్వరుడు" అని పిలుస్తారు.
స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు మరిఇయు సగభాగం నలుపుతో ఉంటుంది.
ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన, భీముడు నిర్మించాడని పురాణాలలో చెప్పబడి యున్నది. అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతో మంది దేవతలు, రాజులు స్వామి వారిని దర్శించుకొని, తరించారని తన 'భీమేశ్వర పురాణంలో' చెప్పబడి యున్నది. ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ "మహాశివరాత్రి" పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
2. అమరారామము :
పంచారామల్లో రెండవదైన 'అమరారామము', గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీతీరమునందు వెలసినది. ఇక్కడ స్వామిని "అమరేశ్వరుడు" అని పిలుస్తారు. గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో, తెల్లగా మెరుస్తూ ఉంటుంది.
ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.
అమరేశ్వరుడైన 'ఇంద్రుడు' చేత ప్రతిష్టించి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాలలో చెప్పబడి యున్నది.
3. క్షీరారామము :
క్షీరారామము, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ 'శివుని' మూర్తిని "శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి" అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని త్రేతాయుగ కాలంలో 'సీతారాములు' కలిసి ప్రతిష్ఠించారట. ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది.
'శివుడు' తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమి నుండి పాలధార వచ్చిందట. క్షీరం అనగా పాలు, దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది.
క్రమంగా 'క్షీరపురి' కాస్తా 'పాలకొల్లుగా' మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆలయం 125 అడుగుల ఎత్తులో '9' గోపురాలుతో కట్టబడింది.
4. సోమారామము :
పంచరామాల్లో నాల్గవదైన "సోమారామము". పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని "సోమేశ్వరుడు" అని పిలుస్తారు. ఇచ్చట 'శివలింగానికి' ఒక ప్రత్యేకత ఉంది. మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే 'శివలింగం', అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.
ఇక్కడ స్వామిని 'చంద్రుడు' ప్రతిష్టించాడు. చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి 'సోమారామము' అని పేరు వచ్చింది.
5. కుమారభీమారామము :
పంచారామాల్లో చివరిది, 5వది అయిన 'కుమారభీమారామము', తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు. ఇక్కడ స్వామిని "కాల బైరవుడు" అని పిలుస్తారు.
ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన, చాళుక్య రాజయిన భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి 'శివలింగం' సున్నపురాయితో చేసినదిలాగా ఉంటుంది. ఈ ఆలయంలో "మహశివరాత్రి" ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ -
ఈ రెండు సమస్యలు నేడు సర్వసాధారణం అయినవి . దీనికి ప్రధానకారణం మన ఆహారపు అలవాట్లు మరియు మనం చేయు ఒత్తిడితో కూడుకొనిన పనులు కూడా కారణమే . ఇవి శరీరము నందు పెరుగు వాతదోషము వలన కలుగును.
ఈ స్పాండిలైటిస్ లో మెడ వెనుక భాగములో గల C 2 , C 3 , C 4 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడటం వలన నరం ఒత్తుకుపోయి ఈ సమస్య ప్రారంభం అగును. కొందరు తల పైకి ఎత్తలేరు . కొందరు తలను పక్కలకు సరిగా తిప్పలేరు . దీనికి కారణం వారి మెడ నరాలు , కండరాలు బిగుసుకొని పోతాయి . ఇంతకు ముందు చెప్పిన విధముగా నరము నొక్కుకొని పోయినప్పుడు నొప్పి మెడ నుంచి భుజాలకు మరియు చేతులకు కూడా పాకును .
సయాటిక నందు వెన్నుపాము చివర నొప్పి మొదలయ్యి కుడికాలు నందు గాని ఎడమకాలి చివర వరకు గాని నొప్పి ఉండును. ఈ నొప్పి తీవ్రత చాలా అధికంగా ఉండును. కదిలినప్పుడల్లా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. వెన్నపాము నందలి L4 , L5 , S1 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడి ఆ ఖాళి నందు నరం పడి నలగడం వలన ఈ సమస్య ఏర్పడును .
నేను ఈ రెండు సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు గమనించిన విషయాలు ఏమిటంటే స్పాండిలైటిస్ వచ్చిన వారికి చిన్నగా కొంతకాలానికి సయాటిక కూడా వస్తుంది. సయాటిక వచ్చిన వారికి కొంతకాలానికి స్పాండిలైటిస్ వస్తుంది. సమస్య మొదలైనప్పుడు సరైన చికిత్స తీసుకోకున్న రెండు సమస్యలు చుట్టుముట్టును . మరొక్క ముఖ్యవిషయం ఈ రెండు సమస్యలు మొదలు ఒకవైపు మాత్రమే మొదలై చివరికి రెండోవైపు కూడా సమస్య మొదలగును . ఉదాహరణకు సయాటిక వెన్నుపాము చివర నుంచి మొదలు అయ్యి కుడికాలుకు వచ్చింది అనుకుందాం మనం మన శరీర బరువును ఎడమకాలి మీద వేసి నడవటం కాని నిలబడటం కాని చేస్తాము . ఇలా కొంతకాలానికి ఎడమ కాలికి కూడా నొప్పి ప్రారంభం అగును. ఇది అత్యంత తీవ్రమైన సమస్య .
అల్లోపతి వైద్యము నందు వైద్యులు దీనికి సర్జరి పరిష్కారంగా చెప్తారు. కాని కొంతకాలానికి మరలా సమస్య తిరగబెట్టడం నేను గమనించాను . ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి అత్యంత అద్బుతమైన చికిత్సలు కలవు.
ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నవారు నన్ను సంప్రదించగలరు. ముఖ్యముగా ఆయుర్వేద చికిత్స యందు పథ్యం ప్రధానపాత్ర పోషిస్తుంది . ఇక్కడ పాటించవలసిన ఆహార పథ్యాలు మీకు వచ్చిన ఆనారోగ్య సమస్యకు మాత్రమే తప్ప ఔషధాలుకు కావు . నేను తయారుచేసి ఇచ్చు ఔషధాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034








