5, మార్చి 2024, మంగళవారం

Panchaag


 

Kaaki


 

సోదరప్రేమ

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సోదరప్రేమ..*


"నా పేరు సురేష్..నెల్లూరు నుంచి వచ్చాను..దాదాపు సంవత్సరం నుంచీ ఇక్కడకు రావాలని అనుకుంటున్నాను..ఇప్పటికి కుదిరింది..ఒక వారం రోజుల పాటు ఇక్కడ వుండవచ్చా?..కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి..ఈ స్వామి వారి వద్ద మ్రొక్కుకుంటే అన్నీ తీరిపోతాయని విన్నాను..స్వామివారు దయ చూపిస్తే నా మనోవేదన తగ్గుతుందని ఆశ!." అన్నారు..ఆయన సుమారు నలభై ఐదేళ్ల వయసు కలిగి ఉంటారు..చూడటానికి నెమ్మదస్తుడిలా కనబడ్డారు..మా సిబ్బందికి చెప్పి, వారికొక రూమును కేటాయించాను..


వచ్చిన రోజు సాయంత్రం శుభ్రంగా స్నానం చేసి, మందిరం లోకి వచ్చి, ఓ గంట సేపు ధ్యానం చేసుకున్నారు..ఆ తరువాత లేచి వెళ్లి..మందిరం వద్ద ఉన్న దుకాణాల లో కొన్ని బిస్కెట్ పొట్లాలు కొని..మందిరం వద్ద ఉన్న కుక్కల కు ఆహారంగా పెట్టారు..రాత్రికి తన రూముకు వెళ్లిపోయారు..రోజూ ఇదే విధంగా ఉదయం, సాయంత్రం ధ్యానం చేసుకోవడమూ..కుక్కలకు ఆహారాన్ని అందివ్వడమూ తన ప్రధాన దినచర్యగా మార్చుకున్నారు..మధ్యాహ్నం మందిరం తరఫున ఉన్న అన్నప్రసాదాన్ని స్వీకరించేవారు..ఐదురోజులు గడిచిపోయాయి..మందిరం వద్ద ఉన్న ఇతర భక్తులూ..మా సిబ్బంది కూడా ఆయనను అమాయకుడి గా భావించసాగారు..కానీ ఆయన ఇవేవీ పట్టించుకోకుండా..అందరితో కలివిడిగా..వుండేవారు..ఏదీ మనసులో దాచుకోకుండా ప్రవర్తించేవారు..శని, ఆదివారాల్లో అన్నదానం వద్ద నిలబడి..అక్కడికి వచ్చి ఆహారం తీసుకునే వాళ్ళను ఆసక్తిగా గమనించేవారు..తానే అన్నదానం చేస్తున్నట్లు గా భావించి..అందరికీ కొసరి కొసరి అన్నం పెట్టేవారు..ఒక తన్మయత్వం ఆయన కళ్ళలో కనబడేది..శనివారం నాటి పల్లకీ సేవలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు..


మరోరెండురోజుల తర్వాత ఒకరోజు ఉదయాన్నే.."ప్రసాద్ గారూ ఈరోజు మందిరం వద్ద ఎన్ని గంటలకు వుంటారు?.." అని నాకు ఫోన్ చేశారు..చెప్పాను..ఉదయం ఎనిమిది గంటల కల్లా మందిరం వద్దకు వెళ్ళాను..నాకోసమే ఎదురు చూస్తున్నట్లుగా మందిరం వెలుపలే వేచి ఉన్నారు..ఆయనను పలకరించి..మందిరం లోపలికి వెళ్లి, శ్రీ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని వచ్చి కూర్చున్నాను..నేరుగా నా వద్దకు వచ్చేసారు..


"కొన్ని వివరాలు అడుగుతాను..చెపుతారా?.." అన్నారు..చెపుతాను అన్నట్లు తల ఊపాను.."అలా కాదు..నోటితో చెప్పండి.." అన్నారు..పసిపిల్లాడు అడిగినట్లు గా అడిగారు..వారిని చూస్తుంటే..ఏదీ దాచుకోకుండా చెప్పాలని అనిపించింది..


"ఒక వారం పాటు ఇక్కడ అన్నదానానికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత?.." అన్నారు..చెప్పాను..

"ఓహో..అలాగా.."అన్నారు..కొద్దిసేపు మౌనంగా వుండి.."ప్రసాద్ గారూ నేను ఇక్కడికి వచ్చిన రోజు మీతో..కొన్ని సమస్యలున్నాయని చెప్పాను..గుర్తుందా?..నాకున్న పెద్ద సమస్య మా తమ్ముడే.. వాడు నాతో విబేధించి..నాతో మాట్లాడటం మానేశాడు..ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతోంది..నిన్న రాత్రి వాడు నాకు ఫోన్ చేశాడండీ..అరగంట సేపు మాట్లాడాడు..ఉన్నఫళంగా నన్ను బయలుదేరి రమ్మన్నాడు..నన్ను చూడాలని అనుకుంటున్నాడట.. తన పొరపాట్లు మన్నించమని అడిగాడు..నేను ఇక్కడికి వచ్చి శ్రీ స్వామివారి వద్ద ధ్యానం చేసుకున్న ఫలితం ఇది.. నేను శ్రీ స్వామివారిని నా తమ్ముడికి నాకూ మధ్య ఉన్న అంతరాలను తొలగించమనే కోరుకున్నాను.. శ్రీ స్వామివారు అది తీర్చారు.." 

ఆ మాట చెపుతూ..ఉద్వేగం ఆపుకోలేక..కన్నీళ్లు పెట్టుకున్నారు..


"నేను నాలుగు రోజులపాటు వుందామని అనుకున్నాను..కానీ పదిరోజుల పైనే ఇక్కడ వున్నాను..శ్రీ స్వామివారి కృపతో తమ్ముడి దగ్గరకు వెళుతున్నాను..త్వరలో మా తమ్ముడితో సహా ఇక్కడికి వస్తాను..నాకు చాలా తృప్తిగా వుందండీ..ఇంత చిన్న పల్లెటూరు ప్రక్కన ఉన్న ఈ గుడివద్ద..మీకు ఉన్న పరిమిత వనరులతోనే..మీరు చేస్తున్న అన్నదానం బాగుందండీ.." అన్నారు..


ఆరోజు సురేష్ గారు వాళ్ళ ఊరు వెళ్లేముందు..ఒక వారం రోజుల పాటు అన్నదానానికి సరిపడా సరుకులను మందిరం వద్దకు చేర్పించి మరీ వెళ్లారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

అమ్మకు అందలం!

 అమ్మకు అందలం!

                   --------------------------

కౌసల్యా..రామా..అనే కాలం ట్యూన్ తో సెల్ ఫోన్ మోగింది.


కొద్ది సేపటికి జానకమ్మ ఫోన్ ఆన్ చేసి "హలో!"అని అంది.


"అమ్మ!నేను సంధ్యని !''అని అవతలి వైపునుండి వినిపించింది.ఆగకుండా తనే "అదేమిటి అంత సేపు పట్టిందేమిటి ఫోన్ తీయడానికి!?"అని ప్రశ్నించింది.


"నువ్వా తల్లి!ఏమి లేదమ్మా !నిద్రపోతున్నాను!"అని అంది జానకమ్మ.


"ఈ టైం లో పడుకోవటమేమిటి!మీ దగ్గర టైం ఎంతయిందేమిటి!?ఆ..సాయంత్రం 5 గంటలై ఉంటుంది.అసుర సంధ్యవేళ పడుకోవద్దని  నువ్వే చెబుతావుగా!వొంట్లో బాగో లేదా!" అని అడిగింది సంధ్య.

"బాగానే ఉందమ్మా!..ఎదో అలిసిపోయినట్టయి కన్ను మూత  పడింది..(అని దగ్గింది..)!"అంది జానకమ్మ.


"నువ్వు అబద్ధం చెబుతున్నావు!ఆ దగ్గేమిటి!మాట మాట్లాడటానికి కూడా ఆయాస పడుతున్నావు!నాన్న ఇంట్లో లేడా!?"అని ఆందోళనగా అడిగింది సంధ్య.


"అంత సీరియస్ గా ఏమి లేదే !సీసన్ మారుతోందిగా (మల్లి దగ్గు..)అందుకే కాస్త జలుబు చేసింది.విక్స్  రాసుకున్నాను.తగ్గిపోయిందిలే!"అంది జానకమ్మ.


"నాన్న ఎడి!ఇంట్లో లేడా! ముందు  ఆ విషయం చెప్పు!నిన్నొకదాన్ని ఇంట్లో వదిలేసి సీరియల్స్ ,షార్ట్ ఫిలిం లంటూ షూటింగులకు వెళ్లాడా!"అని సీరియస్ గా అంది సంధ్య.


"ఎదో ఆయన పనులు ఆయనకుంటాయే.!నాలాగా ఇంట్లో కూర్చుని వంటలు చేసుకొనే మనిషా!వరంగల్ లో ఎదో సీరియల్ షూటింగ్ ఉందని మొన్న వెళ్లారు.రెండు రోజుల్లో వచేస్తారులే!"అని సర్ది చెబుతున్నట్టు అంది జానకమ్మ.


"అదేంటమ్మా!ఉద్యోగం చేసినంత కాలం అటు ఉద్యోగం,ఇటు నాటకాలు,సీరియల్స్ షూటింగ్ లంటూ ఒక్క పూట ఇంట్లో లేకుండా తిరిగాడు.ఆదివారాలైతే అసలే కనబడేవాడు కాదు.నన్ను చెల్లిని కనిబెట్టుకుని రాత్రియంబవళ్ళు నువ్వే కాసావు.అటు వంట పని,ఇంట్లో పని,ఆయనకు సేవలు చేస్తూ నీ జీవితమంతా గడిచిపోయింది.ఒక్క రోజు సుఖపడింది లేదు.యంత్రంలా పనిచేసావు.ఈ రోజు మేము చదువుకొని పెద్ద  పెరిగి అమెరికా లో సెటిల్ అయ్యామంటే అంతా నీ చాకిరివల్లే  గదమ్మ!..రిటైర్ అయ్యాకన్నా ఇంటిపట్టున వుండి  నిన్ను చూసుకుంటాడంటే అదీనూ లేదు!ఇంకా బిజీ అయిపోయాడు!..నీకు వొంట్లో బాలేదని ఆయనకు తెలుసా!"అని ఆవేదనగా అంది సంధ్య.


"అదేంటే నాన్నగారిని అంత మాటంటావు!ఆయన బయట తిరిగి సంపాదించకపోతే మనమందరం బతికే వాళ్లమా!ఇంత బాగుపడేవాళ్ళమా!మా తరం ఆడ వాళ్ళ జీవితమే ఇంతేనమ్మా!మాకు వేరే వ్యాపకమేముంటుంది!సంసారం చేయడం పిల్లలను కనడం,వాళ్ళను కనిపెట్టుకుని వుండి పెంచి పెద్దవాళ్ళను చేయడం!మా అమ్మా అదే చేసింది.నేను అదే చేసాను!అదేదో విడ్డురంలాకా,నేనొక్కదాన్నే కష్టపడిపోయినట్టు మాట్లాడుతావ్!"అని దీర్గాలు తీస్తూ అంది జానకమ్మ!


"నువ్వెప్పుడూ అనేమాటే ఇదిగాని!..నాన్నకు నీ జ్వరం గురించి తెలుసా లేదా!ఆ మాట చెప్పు!"అని విసుగ్గా అంది సంధ్య.


"ఆయన బయలుదేరేటప్పుడే కొద్దిగా మొదలయిందమ్మా!కానీ ఆయన షూటింగ్ అప్పటికే ఫిక్స్ అయింది.అది మానకూడదని చెప్పాడు.నేనే వెళ్ళమని చెప్పానులే!దానిదేముంది అవసరమైతే పక్కింటి ఆంటీని తోడుగా తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్ళమని చెప్పారు!ఒకటి రెండు రోజుల్లో తగ్గక పోతే ఆ పనే చేస్తాలే!"అని మళ్ళి దగ్గ సాగింది జానకమ్మ.


"పీకలమీదకొచ్చే దాకా ఇంట్లో అలాగే పడుకో!..ఆయనకు బుద్ధి లేదు..నీకు లేదు!నాన్న కనీసం ఫోన్ చేసి తెలుసుకుంటున్నాడా!"అని సంధ్య కోపంగా అంది.


"ఆయన షూటింగ్ చేసే ప్లేసులో ఫోన్ సిగ్నల్స్ వుండవుట!ఆయనేం చేస్తాడు.ఎందుకె ఊరికే అంత ఖంగారు పడి ఇంతెత్తున ఎగురుతున్నావు!నేను ఈ రోజే డాక్టర్ దగ్గరకు వెళ్ళొస్తాలే!"అని అంది జానకమ్మ.


"ఇవాళ మొదటిసారి కాదు గదమ్మ!ఇలా ఎంతకాలం ఒంటరిగా గడుపుతావు.షూటింగులు,నాటకాలంటూ నాన్న ఊరిమీద తిరుగుతుంటాడు.నువ్వేమో పిచ్చిదానిలా ఆ వెధవ టి వి పెట్టుకొని ఆయన ఎప్పుడొస్తాడా ,పాద సేవ చేద్దామని ఎదురు చూస్తుంటావు.అమ్మమ్మంటే చదువుకో లేదు.వాళ్ళ తరం అలా  గడిచి పోయింది.నువ్వు చదువుకున్నా వుద్యోగం లేకుండా మాకోసమే ఇన్నాళ్లు గడిపావు .నీక్కూడా అరవై ఏళ్ళు దాటాయి గదా!ఇప్పటికైనా నిన్ను సుఖంగా చూడాల్సిన బాధ్యత ఆయన మీద లేదా!మేమేమైనా మాట్లాడితే ఆయనకు కోపం.ఇంతెత్తున లేస్తాడు!నువ్వుకూడా మీ అమ్మలాగానే ఇంట్లో మగ్గిపోవాలని అనుకోకు.నీ వెనక మేమున్నాం....ఇది ఇలా కాదుగాని నేను చెల్లి కలిసి ఎదో ఒకటి ఆలోచిస్తాం!..ముందు నువ్వు డాక్టర్ దగ్గరకు వెళ్లిరా!ఏమన్నాడు నాకు మెసేజ్ పెట్టు!ఉంటా!" అని ఫోన్ పెట్టేసింది సంధ్య.ఏమిటో ఈ కాలం పిల్లలు అని అనుకుంటూ వుసూరుమంది జానకమ్మ!

                                                         ++++++++

    వారం రోజులవుతుందనుకున్న షూటింగ్ పదిహేను రోజులవడంతో ప్రముఖ నటుడు

 సుబ్రమణ్యం  ఆలస్యంగా ఇంటికి చేరాడు.షూటింగు తాలూకు జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆ నెలలో చేయాల్సిన ఇతర కార్యక్రమాలను సరి చూసుకుంటూ ,తోటి కళాకారులతో మాటలు చెప్పుకుంటూ రిటర్న్  జర్నీ హుషారుగా గడిచి పోయింది.ఇంటిముందు కార్  ఆగే వరకు సమయమే తెలీలేదు.


 చేతిలో సూట్ కేసు తో దిగిన ఆయనకు తన శ్రీమతి ఎదురొస్తుందనుకుంటే గేట్ కు తాళం వెక్కిరిస్తున్నట్టు కనబడింది.దానితో ఈ ప్రపంచంలోకి వచ్చిపడ్డాడు.ఎక్కడకు పోయింది ఈవిడ!అని విసుక్కుంటూ వచ్చి డూప్లికేట్ కీస్ తో తాళం తీసి ఇంట్లోకి ప్రవేశించాడు.ఎప్పుడు తల తళలాడుతూ కనబడే పోర్టికో,వరండా  దుమ్ము ధూళితో ఉండడం చూసి ఆశ్చర్యం కలిగింది.

     "జానకి కి ఏమైంది!ఇల్లంతా దుమ్ముకొట్టుకు పోయుంది.ఎప్పుడు ఇలా వుంచదే!"అని అనుకుంటుంటే ,తాను వెళ్ళేటప్పుడు ఆమెకు జ్వరంతో ఉండడం గుర్తొచ్చింది."కొంపదీసి ఏమి కాలేదుగా?!"గుండె ఒక్కసారిగా ఆందోళనతో వణికింది."ఛీ ఛీ నేనే తప్పు చేసాను!మధ్యలో ఒక్కసారి ఫోన్ కూడా చేయలేదు!"అని తిట్టుకున్నాడాయన.


  "సరే ఇప్పుడేమనుకుని ఏమి లాభం! ఇగనుంచైనా జాగ్రత్తగా ఉండాలి.ఇలా ఎప్పుడు కాలేదు" అని అనుకుంటూనే ఇంటి తలుపును తీసి ఇంట్లోకి ప్రవేశించాడు.హాల్ లో  పరిస్థితి అలాగే వుంది  కనీసం వారం రోజులనుండి ఇంట్లో ఎవరు లేని ఆనవాళ్లు కనబడుతున్నాయి.చేతిలోని సూట్ కేసు ను టీపాయ్ మీద పడేసి జేబులోనుండి ఫోన్ తీసి జానకి నెంబర్ కు డయల్ చేసాడు సుబ్రహ్మణ్యం.భార్యకు ఏమైందో అనే ఆందోళన ఆయన మోహంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది.అవతల రింగవుతోంది కానీ ఎత్తడం లేదు.ఆయనలో ఖంగారు మరింత పెరిగి పోయింది.మరో సారి చేసాడు ఈ సారికూడా నో రిప్లై.కాసేపటికి ఆ ఫోన్ ఇంట్లో బెడ్ రూమ్ లోనుండి రింగ్ అవుతోందని గ్రహించాడు."ఇదేంటి ఫోన్ కూడా ఇంట్లో పడేసి పోయింది!దీనికేమైంది అసలు!"అని అనుకుంటూ బెడ్ రూమ్ లోకి పరిగెత్తాడు.

 అక్కడ బెడ్ పక్కనే వున్నా టీపాయ్ మీద జానకి ఫోన్ వుండి.దాని కిందనే ఒక కాగితం వుంది .

దానిపై...

   "ఏమండి!..మీరు వెళ్ళిపోయాక నాకు జ్వరం పెరిగి పోయింది.పెద్దమ్మాయి ఫోన్ చేసి దాని ఫ్రెండ్ సుజిని పంపి హాస్పిటల్ లో జాయిన్ చేయించింది.దేవుడి దయ వల్ల రెండు రోజుల్లోనే కోలుకున్నాను.ఆ రెండు రోజులు సుజి,వాళ్ళ ఆయన నాతోనే వున్నారు.మీకు ఫోన్ చేస్తే కలవ లేదు.పిల్లలిద్దరూ కలిసి మాట్లాడుకొని నాకు అమెరికాకు టికెట్ బుక్ చేశారు.నేను వద్దని ఎంత చెప్పినా వినలేదు.మీరు రాగానే మిమ్మలనుకూడా అమెరికాకు రప్పిస్తామని అనడంతో నేను .మొన్న గురువారంనాడు అమెరికాకు  బయలుదేరాను.సుజి వాళ్ళు విమానం ఎక్కే వరకు నాతోటె వున్నారు.మీరు ఇంటికి వచ్చే సరికి నేను లేకపోవడం మీకు ఇబ్బంది కలిగినందుకు నన్ను క్షమించడండి.పిల్లలు పట్టుబట్టేసారు.నేను రాకపోతే వాళ్ళ మీద వొట్టే అని బలవంత పెట్టేసారు.మీరు రాగానే పిల్లలకు ఫోన్ చేయండి.నేను మాట్లాడుతాను.---ఇట్లు /జానకి.


కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది సుభ్రమన్యానికి!ఇదేమిటి చెప్పా పెట్టకుండా ఎదో అనకాపల్లి కెళ్లినట్టు అమెరికాకు వెళ్లిపోవడమేమిటి! నేను వచ్చే  వరకు ఆగొచ్చుగా!ఈ పిల్లలకు మరీ బుద్ధి లేకుండా పోయింది!అని కోపం నషాళానికెక్కింది.అదే ఆవేశంలో అమెరికాకు ఫోన్ కలిపాడు .కాసేపటికి అవతల సంధ్య ఫోన్ ఎత్తిన్ది!


"ఇదేంటి నాన్న ఇంత రాత్రి ఫోన్ చేసావు.టైం చూసుకోవద్దా!"అని చిరాకు పడింది.


"సారీరా..!నేనిప్పుడే వచ్చాను అమ్మ లేకపోవడంతో ఖంగారులో టైం చూసుకో లేదు.రేపు పొద్దున్న చేస్తాలే!"అని అన్నాడు.."పర్వాలే నాన్న!లేచేసాముగా!మాట్లాడు!"అని అంది సంధ్య.


"అదేరా!అమ్మకు ఎలా ఉందిరా!నేనొచ్చే వరకైనా ఆగక పోయారా!హఠాత్తుగా తీసుకెళ్లి పోయారు!"అని నిష్టురంగా నాడు.


"అమ్మ ఇప్పుడు బాగానే వుంది.ఇక్కడకు వచ్చాక ఒక్క రోజులోనే కోలుకుంది.ఆవిడకు మా మీద మనవళ్ల  మీద బెంగ!నన్ను చెల్లిని చూసి ఎంతో సంతోషించింది.నీకు చెప్పాలంటే నీ ఫోన్ పని చేయలేదు.ఎప్పుడొస్తావో తెలీదు.అమ్మ హాస్పిటలనుండి ఇంటికొచ్చాక ఇంట్లో ఎవరు చూస్తారు.ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సుజి చూడలేదుగా!దాని సంసారం దానికుంటుంది.అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం!"అని కూల్ గా చెప్పింది సంధ్య.


"బాగున్నాయే మీ ప్రేమలు.నన్నొక్కడిని వదిలి పెట్టి పోతే నేనేమైపోతానో అనే ఆలోచన మీకు లేదా!"అని ఆక్రోశంగా అన్నాడు సుభ్రమణ్యం.


"నీకేంటి నాన్న! నెలకు ఇరవై రోజులు పైగా బయటనే తిరుగుతుంటావు.తినడానికి హోటల్ లు ఉండనే వున్నాయి.ఇంట్లో వున్నప్పుడు ఎవరైనా పనివాళ్లను పిలిచి శుభ్రం చేయించుకో!మన కాలనీ లో టిఫిను,భోజనాలు సప్లై చేసే క్యాటరర్లు ఉండనే వున్నారు.అమ్మతో నీకేం పని!.మాదగ్గర మాకు అమ్మతో పనులుంటాయి!అమ్మకూడా సంతోషంగా ఉంటోంది.వీడియో కాల్స్ ఉండనే  వున్నాయి.నీకు వీలైనప్పుడల్లా మాట్లాడు.నాదగ్గర కొన్ని రోజులు,చెల్లిదగ్గర కొన్ని రోజులు ఉంటుంది."అని యధాలాపంగా అంది సంధ్య.


"నీకు తెలివితేటలు పెరిగి పోయాయే!నాకు చెప్పా పెట్టకుండా అమ్మను తీసుకు పోయి వెధవ ఖబుర్లు చెబుతున్నావా!వెంటనే అమ్మను పంపించు."అని ఆగ్రహం తో ఊగి పోయాడు సుభ్రమణ్యం.


"కూల్ నాన్న!కూల్!ఎందుకట్లా అరుస్తావు!అమ్మ నీకెంత స్వంతమో ఆమె కడుపునా పుట్టిన మాకు అంతే స్వంతం!నువ్వు ఉద్యోగం చేసినంతకాలం ఒక్క రోజు ఇంట్లో వున్నా పాపాన పోలేదు.మా చిన్నప్పుడంతా అమ్మే ప్రపంచంగా గడిపాము!ఇప్పుడు అమెరికాలో మేమింత 

పొ జిషన్ లో సెటిల్ అయ్యామంటే అది అమ్మ పెంపకమే!మమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని పెంచింది.అలాంటి అమ్మ ఈ వయస్సులో కూడా దిక్కు లేనిదానిలా ఇంట్లో ఒక్కతి జ్వరమొచ్చినా చూసే వాడు లేక పడుంటే చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నాం!నీకు బాధ కలుగుతుందని తెలిసినా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు!..సరే మాకెందుకు..అమ్మకు ఫోన్ ఇస్తా అమ్మతోనే మాట్లాడు.!"అని అంది సంధ్య.


కాసేపటికి జానకి లైన్ లోకి వచ్చింది.


"ఏమండి ఎలా వున్నారు!ఇంటికెప్పుడు వచ్చారు!"అని ఆతృతగా అడిగింది జానకి.


"ఇప్పుడే తగలడ్డాకాని,నువ్వు చేసిన పనేమన్నా బాగుందా!నేను ఇంట్లోలేనప్పుడు ఆ పిల్లల మాట పట్టుకుని చెప్పా పెట్టకుండా అమెరికా చెక్కేస్తావా!నా బాగోగులు ఎవరు చూస్తారే!నీకు నీ సంసారం అక్కర లేదా! నోరుమూసుకుని    వెంటనే బయలు డేరిరా!"అని ఉగ్రంగా అరిచాడు .


"అయ్యయ్యో!అదేంటండి.అలా అంటారు.నా ఆరోగ్యం బాగా లేదని పిల్లలు అలా చేశారు.దీనిలో తప్పేముందండి.మీరెలాను ఇంట్లో వుండరు.ఒక్కదాన్ని ఆ ఇంట్లో పడుండడమెందుకని నేను అనుకున్నాను!ఇక్కడ మన బుజ్జి మనవళ్లను  నేనే చూసుకుంటున్నాను.నా ఆరోగ్యంకూడా కుదుటపడింది.ఇంటికి వస్తానులెండి రాకెక్కడ పోతాను.అయినా మీరు ఇంటికి రాగానే మిమ్మలను కూడా ఇక్కడికి తెప్పిస్తామని పిల్లలు చెప్పారుగా!ఊరికే కోప్పడి పోతున్నారు!"అని జానకి అంది.


అంతలోనే సంధ్య కాల్ లోకి వచ్చింది.."అవును నాన్నా!అమ్మకు మేము అలానే చెప్పాము!నీవు అమ్మతో పూర్తి సమయం  ఎప్పుడుంటావో చెప్పు అప్పుడే నీకు కూడా ఫ్లైట్ టికెట్ లు బుక్ చేస్తాము.అప్పటి దాకా అమ్మను ఇక్కడే ఉండని.మాకు ఆవిడకు మనశాంతిగా ఉంటుంది!"అని అంది సంధ్య.


ఆ మాటకు సుభ్రమణ్యం గొంతులో వెలక్కాయ పడినట్లయింది.

ఆయనకు మరో రెండు రోజుల్లోనే టూర్ వుంది.ఈసారి ఇంకా  బిజి! నెల్లాళ్ళ పాటు అవుట్ స్టేషన్ వెళ్ళాలి.ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ తో లేక లేక అవకాశం దొరికింది.ఏమి సమాధానం చెప్పాలి!


  "అలాగే అమ్మ !నేను ఫ్రీ కాగానే మీకు కాల్ చేస్తాను.అమ్మను జాగ్రత్తగా చూసుకోండి!"అని కాల్ డిస్ కనెక్ట్  చేసి నీరసంగా మంచం మీద వాలి పోయాడు!తాను అల్లుకున్న సాలెగూడులో తానే చిక్కుకున్నట్లుగా అనిపించింది సుబ్రమణ్యానికి!


                                            **********************

              - సత్య భాస్కర్ ఆత్కురు ,9848391638        


  

  


"

4, మార్చి 2024, సోమవారం

మహాభారతం

 శ్రీమదాంధ్ర మహాభారతం లోని కొన్ని అద్భుతవిషయాలు -  118      .            .    

అరణ్యపర్వం -  పంచమాశ్వాసం. 


‘ మానవశరీరంలో ధాతువుల వలన అగ్ని యెలా ప్రజ్వరిల్లుతుందో దయచేసి చెప్పగలవా ? '  అని అడిగిన కౌశికునికి  ధర్మవ్యాధుడు చెబుతున్నాడు : 


" ఓ మునీశ్వరా !  ధాతువులు అనగా మనిషి జీవించడానికి ఆధారమైన పదార్ధాలు.   అవి ఏడువిధాలు.   వస, అసృక్కు, మాంసము, ఆస్థి, స్నాయువు,  మజ్జ, శుక్రము. 


పంచప్రాణాలు అనగా ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన,  సమాన వాయువులు.  ఇవి  వాయురూపంలో ఉంటాయి.   ఆత్మాగ్ని మనిషి నాభినుండి శిరస్సు వరకూ వ్యాపించి వుంటుంది.  అన్నిప్రాణులకూ జీవత్వాన్ని  ప్రసాదించేది ఆ అగ్నియే.  అపానవాయువు ప్రాణికి తోడుగా  పొత్తికడుపు- మలద్వారం మధ్య అగ్నిని ప్రజ్వరిల్లిస్తూ వుంటాడు.    ఇక ఉదానవాయువు కంఠం వద్దవుండి పదార్ధాలు తేలికగా శరీరం లోనికి  ప్రవేశించడానికి దోహద పడుతుంది.  వ్యానవాయువు కండరాల మధ్యలోవుండి వాటి కదలికకు సహకరిస్తుంది. 


సమానవాయువు నాభిప్రదేశంలో వుండి ఆహార పదార్ధాలు జీర్ణమయ్యేటట్లు చేసి, ధాతువులను వృద్ధిపరుస్తూ ఉంటుంది.   సమానవాయువు పాత్ర ఆత్మాగ్నికి  ప్రాణ అపాన వాయువులకు సహకరించడం లో అతి ముఖ్యమైనది.   ఈ ప్రాణాగ్నియే జీవాత్మ.   జీవాత్మ తామరాకుమీద నీటిబొట్టులాగా దేహంలో నిర్లిప్తమై వుంటుంది. .అచేతనమైన దేహానికి చైతన్యాన్ని యిచ్చే  ఈ జీవాత్మయే అద్వైత సిద్ధాంతంలో పరమాత్మ.  


అందువలననే జ్ఞానాన్ని సంపాదించిన మహానుభావులు అన్ని విషయాలలో నిర్లిప్తులుగా వుంటారు.  అలాంటి మహానుభావులు యోగసాధన చేస్తూ మితాహారులై  ఇంద్రియాలను నిగ్రహించి ఆత్మలో పరమాత్మను దర్శించి నిశ్చలమైన జ్యోతిలాగా ప్రకాశిస్తూ వుంటారు. 


కాబట్టి మునీంద్రా !  అలాంటి దశకి చేరుకోవాలంటే, కామక్రోధాలను పూర్తిగా విడిచిపెట్టాలి.   మానవుడు  కర్మలను చేస్తూ కర్మఫలాన్ని కోరుకోకుండా భగవదర్పణ చేస్తూ  వేదాంతివలే జీవించాలి.   


అని చెబుతూ ధర్మవ్యాధుడు తనకు తెలిసినంతవరకూ చెప్పాననీ, ఇంకాఏమైనా తెలుసుకోవాలని ఉన్నదా ! అని అడిగాడు.  దానికి కౌశికుడు  తాను విన్న విషయాలతో తృప్తి చెందానని చెబుతూ, ధర్మవ్యాధుని సర్వజ్ఞత్వాన్ని ప్రశంశించాడు.


ధర్మవ్యాధుడు కౌశికుడు చెప్పిన దానికి పొంగిపోకుండా,  ' మహర్షీ !  నేను ఏకొంచెము తెలుసుకున్నా దానికి కారణం ఒకటి వున్నది.  అదేదో మీరే కళ్లారా చూద్దురుగాని రండి. ' అని కౌశికుని తన గృహం అంతర్భాగం లోని  తల్లిదండ్రుల  గదిలోకి తీసుకువెళ్ళాడు. 


ఆ గదిలో గాలీ వెలుతురూ పుష్కలంగా వస్తున్నది.  అతని తల్లిదండ్రులు ఆ సమయంలో తృప్తిగా భోజనం చేసి భుక్తాయాసంతో విశ్రమిస్తూ వున్నారు.  ధర్మవ్యాధుడు వారికి నమస్కరించి వాళ్ళ యోగక్షేమాలను విచారించాడు.   అతని తల్లిదండ్రులు, '  నాయనా ! నీలాంటి కుమారుడు వుండగా మాకేమిలోటు ?  నువ్వు ధర్మమూర్తి అవతారం లాగా మమ్మల్ని  రక్షిస్తున్నావు.  నీకు ఆ ధర్మమే రక్షణ యిస్తుంది.   మాతాపితరుల సేవలో నువ్వు పరశురాముడినే మి౦చిపోయావు.  '  అని వాత్సల్యంగా ధర్మవ్యాధుని దగ్గరకు తీసుకున్నారు. 


ఆ తరువాత ధర్మవ్యాధుడు కౌశికునికి తన తల్లిదండ్రులను పరిచయం చేస్తూ,  ' ఓ కౌశికమునీంద్రా ! నేను నా తల్లిదండ్రులకు సేవలు చెయ్యడం వలననే నాకీ జ్ఞానం అబ్బింది.  అందరూ కోరికలు తీర్చమని దేవతలను పూజిస్తే, నేను మాత్రం నా తల్లిదండ్రులని పూజిస్తాను. వారే నాకు ప్రత్యక్ష దైవాలు.  నా భార్యాపిల్లలూ, అందరమూ మా తల్లిదండ్రులకు ప్రీతితో సేవలుచేస్తూ వుంటాము.  అదే మాకు యజ్ఞం. అదే మాకు వేదసూక్తి.   పుణ్యం ఆర్జించడానికి ప్రతి గృహస్థూ, తల్లిదండ్రులను, గురువును, అగ్నిని, ఆత్మ అనే అయిదుగురిని సంతోషపెట్టాలి.  


' మునీంద్రా !  ఆ పతివ్రత పంపగా నువ్వు నా దగ్గరకు జిజ్ఞాసువుగా వచ్చావు.  నాకు తెలిసిన విషయాలు చెప్పాను. అయినా నీలో ఏదో అసంతృప్తి కనబడుతున్నది.  దానికి కారణం యేమిటో కూడా నేను తెలుసుకోగలిగాను.  నువ్వు నీ తల్లిదండ్రులకు ఒక్కడివే కుమారుడవు.  వారు ఇప్పుడు మిక్కిలి వృద్ధులై వున్నారు.  వారి అనుమతి తీసుకోకుండా నువ్వు  వేదాధ్యయనం చేసి తరించాలని అనుకున్నావు.   వారు నీకోసం ఏడ్చి ఏడ్చి అంధులైనారు.   వారి వద్దకువెళ్లి వారి సేవలుచేసి తరించు.  తల్లిదండ్రులను దుఃఖపెట్టి నువ్వు ఎన్నిచదువులు చదివినా అవి వ్యర్థం . '  అని నిర్ద్వందంగా చెప్పాడు ధర్మవ్యాధుడు కౌశికునికి . 


కౌశికుడు ఆ మాటలకు ఏమాత్రం నొచ్చుకోకుండా, అహంకార వర్జితుడై, '  ధర్మవ్యాధా !  నీవు చెప్పినవన్నీ యదార్ధాలు.  నా కళ్ళు తెరిపించావు. నా శేషజీవితాన్ని తల్లిదండ్రుల సేవలో గడిపి నా జన్మధన్యం చేసుకుంటాను.  ఇప్పుడు నా మనసెంతో సంతోషంగా వున్నది.  అయితే, నీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యం వేస్తున్నది.  ఇంతటిజ్ఞానివి నువ్వు యే కారణం చేత ఈ బోయకులములో జన్మించావు ?  తెలుసుకోవాలని వున్నది. దయచేసి వివరించు. '   అని ధర్మవ్యాధుడు అడిగాడు. 


ధర్మవ్యాధుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పసాగాడు.


స్వస్తి  .  

కవిత్రయం  అనుగ్రహంతో, మరికొంత రేపు. 

ప్రేమతో,

గండవరపు  ప్రభాకర్.

బ్రాహ్మణుల ఇళ్లకు

 *బ్రాహ్మణుల ఇళ్లకు ఉచితంగా భోజనము ఏర్పాటు*  



గమనిక : ఉదయం 7 లోపు మీరు మెసేజి పెట్టాలి .. . ఉదయం 11 నుండి అన్నదానం మొదలు అవుతుంది. 



 మా సంస్థ నుండి మీ ఇంటికి టూ వీలర్ బుక్ చేసుకోవాలి , లేదా వచ్చి తీసుకు వెళ్ళవచ్చు. 


పేరు గోత్రము, చిరునామా, వృత్తి మరియు ఏ కారణం చేత మీరు భోజనం అడుగుతున్నారు అనేది తెలియ చెయ్యాలి. 


*మా వాట్సాప్ నంబర్ : 9701609689*



చట్నీ, చారు, పప్పు, కూర , అన్నం పంపబడును ... ఇంట్లో చేసుకునే వసతి లేనపుడు, ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నపుడు దయచేసి మాకు తెలియ చెయ్యండి .. పెరుగు మీరు అక్కడే తీసుకుంటే సరిపోతుంది. 


*గ్లోబల్ బ్రాహ్మిణ్స్ వెల్ఫేర్ అసోసియేషన్* 

బర్కత్ పురా, హైదరాబాద్...

మహాశివరాత్రి పూజలు*

 *మహాశివరాత్రి పూజలు*


ఇంకొక వారమే ఉన్నది మహాశివరాత్రి పర్వదినాన్న ఈశ్వరుని పూజించడానికి. అంటే శోభకృత్ సంవత్సర మాఘ మాసంలో అనగా ఈ నెల మార్చి 8 న మహాశివరాత్రి వ్రతపూజను జరుపుకోబోతున్నాం. అసలు మహాశివరాత్రి ఎందుకు ఎలా ఏ సమయంలో ఆచరించాలన్నదాన్ని క్షుణ్ణంగా తెలుసుకొందాం. 


మీ అందరికి నేను చెప్పబోయే పురాణ కథ తెలిసేయుండగలదు. పూర్వము బ్రహ్మ విష్ణువుల మధ్యలో దేవతల్లో ఎవరు గొప్ప అని ఓ పెద్ద వాగ్వివాదం జరిగింది, నువ్వు నేను అని ఎడతెగక సాగింది. ఆ సమయాన్న భూమి నుండి దేద్దీప్యమానమైన ఓ వెలుగు పైకి విరజిమ్మింది. అది ఒక కోటి సూర్యకాంతులను మించి తన కిరణాలను ప్రసరింపజేసింది. తన ఆద్యంతమును వీక్షించినవారే సర్వశ్రేష్ఠమైన భగవంతుడిగా పరిగణింపబడతారు అన్న ఓ సవాలును విసిరింది. 


బ్రహ్మదేవుడు శిఖరాగ్రమును దర్శించుటకు ఉపక్రమించగా విష్ణువు అతల పాతాళమునకు చొచ్చుకొంటూ వెళ్ళి ఆ వెలుగు యొక్క అంతాన్ని చేధించడానికి బయలుదేరారు. కాని ఎంత ప్రయత్నించినా వాళ్ళిద్దరికీ అంతు చిక్కని అయోమయ పరిస్థితి, ఇక చేసేదిలేక వెనుదిరిగారు. నా ఆద్యంతాల్ని కనుక్కున్నారా అని ఆ కాంతి కిరణం ప్రశ్నించడంతో విష్ణువు తన అసమర్థ్యాన్ని బహిరంగంగా అంగీకరించారు. కాని బ్రహ్మదేవుడు తన అశక్తతతను వెలిబుచ్చడానికి అహం అడ్డురావడంతో తను శిఖరాగ్రం దాకా వెళ్ళి కనుక్కోగలిగానని ప్రగల్భాలు పలికారు. 


వెనువెంటనే ఆ ప్రజ్వలించే వెలుగు నుండి ఈశ్వరుడు ఓ పెద్ద విస్ఫోటనంతో అండపిండ బ్రహ్మాండాలన్నీ దద్దరిల్లే విధంగా అర్ధరాత్రి సమయాన్న బయటకు విచ్చేసి (ఇదే మొట్టమొదటి లింగోద్భవం) తను అబద్ధాలు పలకడంతో పంచముఖ బ్రహ్మదేవుడి ఒక శిరస్సును ఖండించి చతుర్ముఖోన్నుడిగా గావించారు. విష్ణువు నిజాయితీకి సన్మానించారు. బ్రహ్మ విష్ణువులు ఈశ్వరుడికి ప్రణమిల్లి తానొక్కడే జగమంతటికి పరమాత్మయని అంగీకరించారు. 


ఇలాంటి లింగోద్భవం మాఘ మాస కృష్ణ చతుర్దశి నాడు అవిర్బవించడంతో ఆ మహా పర్వదినాన్ని జగత్తంతా మహాశివరాత్రిగా జరుపుకొను ఆనవాయితీ. ఈ మహాశివరాత్రి రోజునే ఈశ్వరుడు ఓ కోట్ల సూర్యుల కాంతులతో వెలుగుచిమ్మి అందరికీ తన దర్శన భాగ్యం కలిగించారు. అందువల్ల శివరాత్రి నాడు ఈశ్వరుడు మొట్టమొదటి సారిగా లింగాకారం నుండి ఆవిర్భవించి తన అసలు రూపాన్ని లోకానికి తెలియజేసారు. అదియును కాకుండా ఎవరైతే తనను ఇలాంటి పర్వదిన నడిరేయిన అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారినందరిని తప్పక అనుగ్రహించి వారి కోర్కెలెల్ల తీరుస్తానని దీవించారు. ఇప్పుడు మనం మహాశివరాత్రి పర్వదినాన్ని ఏ విధంగా ఆచరించి ఈశ్వరుడికి ప్రీతిపాత్రులగుదుమో తెలుసుకొందాం. 


ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8 న అంటే రాబోవు శుక్రవారమున రానున్నది. ఆ రోజు ఒక్క పూటనే అంటే మధ్యాహ్నం వేళ మాత్రమే భోజనం గావించి ఉపవాసానికి ఉపక్రమించాలి. ఆ నాటి సూర్యాస్తమన సమయాన్న స్నానమాచరించి పట్టు వస్త్రాలు ధరించి శివపూజకు కావలసిన సరంజామాను క్రోడీకరించుకొని అంటే శివలింగం లేదా ఈశ్వరుడి చిత్రపటము, పుష్పాలు, దీపాలు, పండ్లు, అగరబత్తులు, చందనకుంకుమ అక్షింతలు, కర్పూరాలను సమకూర్చుకొని పూజను మొదలుపెట్టవలెను. శివలింగం ఉన్నట్లయితే ఓ పీఠంపై ఉంచి అభిషేకానికి సన్నద్ధం కావలె. చిత్రపటము మాత్రమే ఉన్నట్లయితే అభిషేకం చేయలేము. కనుక తగురీతిన పుష్పాలతో అలంకరించవలె. 


మార్చి 8 న సూర్యాస్తమన కాలం నుండి మార్చి 9 ఉదయాన్న సూర్యుడు ఉదయించే సమయం దాకా ఈ శివరాత్రి పూజలు 4 మార్లు కొనసాగవలెను. దీనినే ప్రహర పూజ మరియు యమ పూజ అని అందురు. అది ఏంటో చూద్దాం. మార్చి 8 న సూర్యుడు 6.30 కు అస్తమించి మార్చి 9 న పెందరాళే 6.30 కు ఉదయించిన యెడల ఈ పండ్రెండు గంటల సమయం శివ పూజ చేయవలయును. ఈ 12 గంటలను 4 ప్రహరాలుగా విభజించినచో ఒక్కొక్క ప్రహరానికి 3 గంటల సమయం కేటాయించినట్టే కదా. ఒక్కొక్క ప్రహరంలో శివ పూజ కావించి తదుపరి ప్రహరంలో మరల పునఃప్రారంభించవలెను. అంటే మార్చి 8 న సాయంత్రం 6.30 నుండి 9.30 దాకా మొదటి ప్రహర పూజ గావించి రెండవ ప్రహర పూజ రాత్రి 9.30 నుండి 12.30 దాకా చేయవలెను. అలాగే 12.30 నుండి 3.30 దాకా మరియు 3.30 నుండి ఉదయం 6.30 దాకా. ఒక్కొక్క ప్రహరంలో పూజాభిషేకాదులు పూర్తిచేసి తదుపరి ప్రహర పూజను అలాగే కొనసాగించడానికి పూనుకోవలెను. అలా వేకువజామున 6.30 దాకా 4 సార్లు. గంధపు తైలం, పంచగవ్యం (అనగా పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, ఆవుపేడలతో తయారయినది), పంచామృతం, నెయ్యి, పాలు, పెరుగు, చెరకు రసాలు, పళ్ళరసాలు (అంటే ఆరెంజు, మౌసాంబి, నిమ్మకాయలతో తయారయినది), కొబ్బరి నీళ్ళు, చందనపూత, విభూతి మరియు స్వచ్ఛమైన జలాలతో అభిషేకాన్ని కొనసాగించవలెను. ఇవన్నియు సమకూరని పక్షంలో లభ్యమైన సామగ్రీలతో అభిషేకం చేయవలెను. 


ఒకవేళ శివలింగం కాకుండ ఈశ్వర చిత్రపటమే ఉన్నట్లయితే అభిషేకం చేయలేము కదా. అలాంటి సమయంలో ఈ సామగ్రీలనంతటిని చిత్రపటము ముందుంచి ఒక్కొక్క పుష్పముతో ఆయా సామాగ్రిన ముంచి దేవుని పటము ముందు ఉంచవలెను. పూజాభిషేకములు చేస్తున్నప్పుడు రుద్రచమకాలను పటించడం కాని లేదా ఏదైనా ఈశ్వర తత్త్వాలను బోధించే మంత్రాలు గాని పటించవచ్చు. ఇవన్నియు వీలుకాని యెడల కేవలం ఈశ్వర పంచాక్షరి అయినటువంటి ఓం నమశ్శివాయతో 108 సార్లు పూజచేయొచ్చు. లేదా ఇతరత్రా శివ అష్టోత్తరం శతనామావళి గాని సహస్ర నామావళిని గూడా పటించగలం. ప్రతి నామానికి బిల్వ దళాలతో గాని ఇతర పుష్పాలతో గాని పూజలు చేయగలం. ఆ తరువాత ధూపదీపనైవేద్యాలతో కొబ్బరి ఫలాలను సమర్పించి పూజను ముగించి ప్రసాదాన్ని అక్షింతలను సమర్పించగలం. ఇది మొత్తం ఒక్క సారి ఒక్క ప్రహర పూజ గురించి. ఇలా 4 సార్లు పొద్దున దాకా.


ఒక వేళ ఇలా నాలుగు ప్రహరాలలో పూజలు వీలుకాని యెడల కనీసం ఒక సారి అంటే లింగోద్భవ కాలంలో చేయగలం. లింగోద్భవ కాలం యన్నది ఈశ్వరుడు ఆ ప్రజ్వల కాంతి నుండి దర్శనం ఒసంగిన కాలమన్నట్టు. శివరాత్రి పర్వదినాన్న లింగోద్భవ కాలమన్నది అర్ధరాత్రము, ఆ సమయం ఆయా ఊర్లలో ఆసన్నమయ్యే సమయాన్ని గూగుల్ సౌజన్యంతో గాని దృక్పంచాంగం ద్వారా గాని తెలుసుకోగలం. ఈ సమయాన్నే ఈశ్వరుడు పృథ్వీన ప్రతి శివలింగం నందు ప్రతి చిత్రపటము నందు రూపందుకలడని ప్రతీతి. 

   

ఇది కూడా వీలుకాని పరిస్థితుల్లో ఆ సమయంలో ఈశ్వర దేవాలయాన్ని సందర్శించి వారి పూజల్లో పాలుపంచుకొని రాత్రంతయు జాగారం చేసి ప్రొద్దునే తమతమ స్వగృహాలకు వెనుదిరగగలం.


ఇలా కూడా వీలు కాని యెడల ఇంట్లోనే జాగారం చేసి రాత్రంతయు ఈశ్వర నామాలను గాని లింగాష్టక బిల్వాష్టకాలను గాని పటించవలెను. లేదా ఓం నమశ్శివాయ మంత్రం ఒక్కటే చాలన్నట్టు, శివరాత్రి వ్రత పూజను పూర్తిగా చేసి ఫలితాలను పొందినట్టే. 


మార్చి 9 న ఉదయాన్నే సూర్యోదయమైన తర్వాత ఉపవాసాన్ని విరమించగలం. రాత్రంతయు జాగారం చేయడం మాత్రం అత్యవసరం. మరుసటి రోజు అంటే మార్చి 9 న రాత్రి దాకా మరల కునుకు తీయరాదు. ఒకవేళ ఆరోజు కార్యాలయాలకు వెళ్ళవలసినట్లయితే మీరు సొంత వాహనాన్ని నడుపకుండా ప్రభుత్వ వాహనాలలో పయనించి తగు జాగ్రత్తలు తీసుకోవలెను. 

 

ఇవన్నియు పాటించి మహాశివరాత్రి పర్వదినాన్ని ఈశ్వర పూజలతోను జాగారంతోను గడిపి ఈశ్వరానుగ్రహం పొందగలరని ఆకాంక్షిస్తున్నాను.

Panchaag


 

అలమటించేవాడు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝.      

*పూర్ణే తటాకే తృషితః సదైవ*

*భూతేపి గేహే క్షుధితః స మూఢః౹*

*కల్పద్రుమే సత్యపి వై దరిద్రః*

*గుర్వాదియోగేేఽపి హి యః ప్రమాదీ॥*


భావము - 


*సద్గురువును కలుసుకున్నప్పటికీ తిరిగి తప్పులు చేసే మూఢుడు* ఎలాంటి వాడంటే, నిండు చెరువు దగ్గర ఉన్నా దాహంతో ఉండేవాడు, సొంత ఇల్లు ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఆకలితో అలమటించేవాడు, మరియు కల్పవృక్షం తన వద్ద ఉన్నప్పటికీ పేదవాడు.....

పాఠకులకు

 

మనబ్లాగు అనేక దేశాల తెలుగు వారు చూస్తున్నారని తెలుపుటకు సంతోషితున్నాను. ఒక్కొక్క రోజు భారత దేశంలో వీక్షకులకన్నా ఎక్కువగా అమెరికా, కెనడా, ఫ్రాన్సు దేశంల నుండి ఉండటం ముదావహం. కాగా నిత్యం అనేక విషయాలను గురించి నేను పోస్టులు పెడుతున్న సంగతి పాఠకులకు విదితమే బ్లాగు మనమందరిదిమీరు కూడా బ్లాగులో చక్కటి విషయాలను పంపి భాగస్వాములు కావచ్చుమీరు చేయవలసినది ఏమంటే మీరు తెలుపదలచుకున్న విషయాన్నీ తెలుగులో కానీ, ఇంగ్లీషులో లేక హిందీలో పంపండిఎలా అంటే రోజునుంచి నేను కొత్త కవులు పేజీ అని ఒక పేజీ వున్నది .  మీరు పేజీ లో కామెంటు రూపంలో మీ పోస్టులను పంపండిఅందరకు ఆమోదకరం, ఉపయుక్తకరం అని తలచినవి నేను కామెంట్ల రూపంలో పబ్లిష్ చేస్తాను

పంచాంగం గురించి 

మన బ్లాగులో నిత్యం పంచాంగం రెండు మూడు రకాలుగా పెడుతున్నాముకానీ పంచాంగం విషయంలో ఇతరదేశాలలో వుంటున్నవారు గమనించాల్సినది ఏమిటంటే పంచాంగం ఒక ప్రాంతంలోని సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాలను గణనలోకి తీసుకొని లెక్కిస్తారు.కాబట్టి ఇక్కడి (హైదరాబాదు) తిథి వార నక్షత్రాదులు మీరు ఉండే ప్రాంతానికి సమన్వయము కావటం జరగదుఅటువంటప్పుడు ఏమి చేయాలి

పంచాంగ సవరణ: మీరు హైదరాబాదు సూర్యోదయకాలం మీ ప్రాంతపు సూర్యోదయకాలంకు వున్నా వేత్యాసాన్ని కలిపి లేక తీసివేస్తే మీకు మీ ప్రాంత పంచాంగం వస్తుంది. అదే సమయం ఇతరత్రా విషయాలకు సమన్వయము చేసుకోవాలిఅంటే ఉదాహరణకు మీరు హైదరాబాదు నుంచి వున్నా ప్రదేశం హైదరాబాదు సూర్యోదయానికన్నా 5 నిముషాలు ముందుగా వున్నారనుకోండి అప్పుడు హైదరావాడు సమయానికి 5 నిముషాలు కలుపుకుంటే మీ రోజు పంచాంగం వస్తుంది

 ప్రకటనల గురించి 

మనబ్లాగులో అమెరికా వారు కెనడా వారు విశేషంగా చూస్తున్నారుదీనిని ఎందుకు ఇతరులకు అంటే అక్కడ  వుంటూ అక్కడి  మన తెలుగువారితో వ్యాపారం చేసుకోవాలనుకునేవారికి దోహదకారిగా ఉండకూడదు అని తలంచి   ఒక వ్యాపార ప్రకటన విభాగాన్ని మన బ్లాగులో తెరువ తలచాముఅది ఎలావుంటే బాగుండునది అనే విషయాన్ని పాఠకులు కామెంటులో పెట్టి  తెలుపగలరు. అదే విషంగా ఎంత రుసుము తీసుకుంటే బాగుంటుంది తెలుపగలరు

ఇట్లు 

మీ భార్గవ శర్మ