ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
27, మార్చి 2024, బుధవారం
తుమ్ము శుభ సూచకం
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 “ఆసనే శయనే దానే భోజనే వస్త్రసంగ్రహే । వివాదే చ వివాహే చ క్షుతం సప్తసు శోభనమ్” ।
తా𝕝𝕝 కూర్చునే సమయంలో..
పడుకునే సమయంలో..
దాన సమయంలో..
భోజన సమయంలో..
వస్త్ర సంగ్రహ సమయంలో..
వివాద సమయంలో..
వివాహ సమయంలో..
ఈ ఏడు సందర్భాల్లో తుమ్ము శుభ సూచకం.
జ్ణాపకశక్తి
కాలానికి,కర్మకు జ్ణాపకశక్తి ఎక్కువ...ఎంత కాలం తర్వాత అయినా మనం చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు...నిన్ను నువ్వు మెచ్చుకోవడానికి ఎప్పుడూ సందేహించకు...ఎందుకంటే అది నీ ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేస్తుంది...మేలు చేసిన వారికి కీడుచేసేవారు,భోజనం పెట్టిన వారిని దూషించేవారు,విద్య నేర్పినవారిని హేళన చేసేవారు,ఉపకారం తలపెట్టినవారికి అపకారం తలపెట్టేవారు,నాకు అన్నీ తెలుసు ఇక నేను నేర్చుకోవలసినది ఏమీలేదు అని అనుకునేవారు..."పరమ మూర్ఖులు"...దీపం నిశ్శబ్దంగా ఉంటుంది.కానీ ఇల్లంతా వెలుగునిస్తుంది.గొప్ప వ్యక్తిత్వం గల వారు మౌనంగానే ఉంటారు.వారి పనులు చుట్టూ ఉన్న వారి జీవితాల్లో వెలుగు నింపుతాయి...సాయంచేసే గుణంలోని పరమార్ధాన్ని గ్రహించి ఇతరులకు సహాయపడితే అంతులేని ఆత్మ సంతృప్తి మిగులుతుంది...
అంతర్ముఖులం
*అంతర్ముఖులం కావాలి!*
➖➖➖✍️
*ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.*
*ప్రతి రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.*
*ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది......*
*బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది. తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు.*
*తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు.*
*ఆ భక్తుడు సరేనన్నాడు.*
*ఆ ఘడియ రానే వచ్చింది. బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు.*
*ఆశ్చర్యం ......! దాని నుండి నిధి ఒక బయటపడింది.*
*వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి.*
*అవన్నీ అతడి సొంతమయ్యాయి.*
*మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు.*
*అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు.*
*కానీ, ఒక సందేహం అతడిని పీడించింది.*
*నిధి మీదే కూచున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడి గానే ఉండిపోయాను.*
*దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు. ఏమిటయ్యా ఇది! అని దేవుణ్ణి ప్రశ్నించాడు.*
*అతడికి దేవుడు సమాధానం చెబుతూ... “నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూచుని, భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది.”*
*”అతడు రోజూ భగవత్సేవ చేస్తూ, నీకు యదా శక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు. నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అందుకే అతనికి సిరిసంపదలు లభించాయి!” అన్నాడు దేవుడు.*
*వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి, గుడ్డి వాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి. తప్పక అంతర్ముఖుడు కావాలి!*✍️
26, మార్చి 2024, మంగళవారం
గణపతి మనకు ప్రసాదించుగాక.
౭శ్లోకం:☝️
*ప్రారంభే లఘుశిఖరం*
*జ్ఞానం మోదకసదృశం |*
*విస్తీర్ణం తు ప్రజానాయ*
*ప్రజ్ఞాం దేహి గజానన ||*
భావం: జ్ఞానం మోదకం లాంటిది, మొదట్లో చిన్న శిఖరం (చివర) మాత్రమే కనిపిస్తుంది, నేర్చుకునే కొద్దీ అది విశాలమవుతుంది. అంటే జ్ఞానాన్ని సంపాదించుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాల్సినది ఎంతో ఉందనిపిస్తుంది. అలాంటి అపారమైన జ్ఞానాన్ని పొందే ప్రజ్ఞని గజవదనుడైన గణపతి మనకు ప్రసాదించుగాక.🙏
అలాగే కర్మ
ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా,
భర్తగా,....
సంతానంగా,....
తల్లిదండ్రులుగా,....
మిత్రులుగా,....
నౌకర్లుగా,....
ఆవులు,.... గేదెలు,.....కుక్కలు.....
ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు.
ఆ ఇచ్చిపుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో,.....
మరణించడమో జరుగుతుంది.
ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే.....
మన జీవితకాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు.
ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...
-- మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా,.....
లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో.....
మన సంపాదనతో పోషించబడే భార్యగా,.....
సంతానంగా,......
మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.
-- ద్వేషం కూడా బంధమే....
పూర్వజన్మలోని మన మీదగల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా.....
లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.
-- మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి.....
ఈ జన్మలో శత్రువులుగానో,.....
దాయాదులుగానో,......
ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.
-- మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి......
ఈ జన్మలో మిత్రులుగానో,......
సహాయకులుగానో ఎదురవుతారు. వి. ఎస్. మూర్తి
ఉదాహరణకు ఒక జరిగినకథ:-
కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర....
అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు.
ఈ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు.
కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ,
రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు. తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు. ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు...
పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు . అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. VSM
అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ:
ఒకసారి సత్యసాయిబాబా బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, “స్వామీ ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి?” అని. ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు స్వామి.
ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే,.....
ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడిగితే,
పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు.
అప్పుడు మలయాళ స్వామి వారు *...
”నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తె.....
వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది!” అన్నారు.
ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం.
మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో,
మర్యాదకో, కృతజ్ఞత గానో,
గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో....
ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలయి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి.
కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం,
పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం,....
ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.
అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలో చిక్కుకుపోతుంటాము.
ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో,...
అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం.
అలాగే కర్మ ఎంత పెద్దదైనా,....
చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు.
కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం ఈ కర్మబంధాల నుంచి ఎన్ని జన్మలెత్తినా మనం తప్పించుకో గలమా......
అరుణాచలశివ 🌹
వేద ఆశీర్వచనం.
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5124*
*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం - ప్రతిపత్ - హస్త - భౌమ వాసరే* (26.03.2024)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
-----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
మానవ శరీరం మాత్రం
*శరీరం కర్మలు చేసే ఒక పరికరం*
*పునర్విత్తం పునర్మిత్రం*
*పునర్భార్య పునర్మహి*
*ఏతత్సర్వంపునర్లభ్యం*
*న శరీరం పునఃపునః।।*
🌷పోయిన *ధనం* మళ్లీ చేరుతుంది.
🌷*దూరమైన మిత్రుడు* మళ్లీ చేరువఅవుతాడు.
🌷*భార్య* గతిస్తే మరొక భార్య లభిస్తుంది.
🌷*భూసంపద* మళ్లీ ప్రాప్తిస్తుంది.
పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు!
కాని *మానవ శరీరం మాత్రం మళ్లీ మళ్లీ తిరిగి రాదు.*
అందుకే *శరీరం ఖలు ధర్మసాధనం* అన్నారు.
కేవలం *శరీరం* ఉంటేనే ధార్మిక పనులు చేయవచ్చు.
*శరీరం* ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది.
*శరీరం* ఉంటేనే హితవాక్యాలు చెప్పవచ్చు.
ఏ పని చేయడానికైనా *శరీరం* కావాలి.
కనుక *శరీరము* ను రక్షించుకోవాల్సింది మానవ జన్మ ఎత్తినవాళ్లే.
జంతువులకు *శరీరం* ఉంటుంది కాని వాటికి ఆలోచన ఉండదు.
పైగా కొద్దోగొప్పో ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి *శరీరం* సహకరించదు.
*బుద్ధి, ఆలోచన, మాట్లాడే శక్తి, కావలసినది సంపాదించుకొనే జ్ఞానం *తగిన అవయవ నిర్మాణం*
ఉండేది ఒక్క *మనుష్యులకే.*
వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది.
కనుక మనమందరం శరీరాన్ని కాపాడుకోవాలి.
*అతిగా తిన్నా,*
*అతిగా ఆలోచించినా,*
*అతిగా సుఖించినా,*
*అతిగా దుఃఖించినా,*
*ఏదైనా అతిగా చేస్తే ఈ "శరీరం" కాస్తా పుటుక్కుమంటుంది*.
ఇక *శరీరం* చేజారిపోయాక చేసేది ఏమీ ఉండదు.
కనుక ముందు *శరీరము* ను జాగ్రత్తగా చూసుకోవాలి.
*దీనికి*
*సత్యం,*
*ధర్మం*,
*శాంతి*,
*ప్రేమ,*
*అహింసలను*
*పాటించడమే "మహా ఔషధంగా" భావించాలి.*
*విస్తరాకు*
విస్తరి ఆకుని ఎంతో శుబ్రoగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటారు.
బోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము,
తినిన మరుక్షణం ఆ విస్తరాకును మడిచి, దూరంగా *మురికి పెంటపై పడేసి వస్తాము.* తర్వాత ఆ ఎంగిలి ఆకును ముట్టుకోము కూడా.
*మనిషి జీవితం కూడ అంతే*
*'ఊపిరి" పోగానే ఊరిబయట పారేసి వస్తారు*,
విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోష పడుతుంది, ఎందుకంటే పొయే ముందు *ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగ పడినాను అన్న తృప్తి ఆకుకు ఉంటుంది*,
*విస్తరాకుకు ఉన్న ముందు ఆలోచన, తృప్తి భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ !*
*"" సేవ చేసే అవకాశము* *వచ్చినపుడు సేవ చేయండి""* *జారవిడుచుకోకూడదూ*
మల్లీ ,
ఇంకొకసారి,
ఎప్పుడో చేయవచ్చు
అనుకొని వాయిదా వేయకండి,
ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే, *కుండ ఎప్పుడైనా పగలవచ్చు అప్పుడు విస్తరికి ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు.*
*ఎంత సంపాదించి ఏమి లాభం ?*
*ఒక్క పైసా కూడా తీసుక పోగలమా?*
*మన చేత* *ప్రత్యక్షంగా,పరోక్షంగా ఓ 10 మందికి*
*మంచి జరిగితే,*
*మన మానవ జన్మ సార్థకమయినట్లే ........*.👏🙏సర్వేజనా సుఖినోభవంతు🙏
25, మార్చి 2024, సోమవారం
శరీరంలో ధాతువులు
శరీరంలో ధాతువులు విపరీత పరిమాణంలో వృద్ది చెందుట వలన కలుగు దుష్పరిమాణాలు -
మనిషి శరీరంలో అన్ని రకాల ధాతువులు సమానముగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మనిషి సంపూర్ణంగా ఆరోగ్యవంతుడు అయ్యి ఉంటాడు. ఆయా ధాతువులు హెచ్చుతగ్గులు సంభవించినపుడు కొన్ని విపరీత పరిణామాలు సంభవించి శరీరం రోగగ్రస్తం అవుతుంది. ఇప్పుడు మీకు ధాతువులు విపరీత పరిమాణంలో పెరుగుట వలన శరీరంలో కలుగు మార్పుల గురించి వివరిస్తాను.
* రసధాతు వృద్ది లక్షణాలు -
గుండె యందు ఒకరకమయిన వికారం కలిగి వాంతి కలుగును. నోట నీరు కారుతుంది .
* రక్తధాతు వృద్ది లక్షణాలు -
శరీరం ఎర్రబారుతుంది. నేత్రాలు ఎరుపెక్కుతాయి. రక్త సిరలు వంగినట్టుగా ఉంటాయి.
* మాంసధాతు వృద్ది లక్షణాలు -
పిరుదులు , తొడలు, పెదవులు , గుహ్యభాగం , దౌడలు , చేతులు , పిక్కలు బాగా లావెక్కుతాయి. శరీరం బరువెక్కును.
* మేధోదాతు వృద్ది లక్షణాలు -
శరీరం చమురు పూసినట్టు అవుతుంది . పొట్ట పక్క బాగాలు పెరిగిపోతాయి. దగ్గు వచ్చును. చిన్న పనిచేసినను అలసట వచ్చును. శరీరం నుండి చెడువాసన వచ్చును.
* అస్థిధాతు వృద్ది లక్షణాలు -
కొత్త ఎముకలు పుడతాయి. మాములుగా ఉండవలసిన దంతాల కంటే ఎక్కువ దంతాలు జనిస్తాయి. వెంట్రుకలు , గోర్లు విపరీతంగా పెరుగుతాయి.
* మజ్జాధాతు వృద్ది లక్షణాలు -
సర్వ శరీర అవయవాలు , నేత్రాలు బరువెక్కుతాయి. వ్రేళ్ల సందుల యందు తీవ్రంగా కురుపులు లేస్తాయి .
* శుక్రధాతు వృద్ది లక్షణాలు -
శుక్రం అధికంగా వెలువడును. శుక్రశ్మరీ అనురోగం వచ్చును. శుక్రశ్మరీ అనగా విపరీతంగా పెరిగిన శుక్రం రాయి వలే మార్పుచెంది శుక్రనాళాలలో అడ్డుపడి నొప్పి వచ్చును.
* పురీషధాతు వృద్ది లక్షణాలు -
ఉదరం నందు వాయవు బందించబడి ఉబ్బరం కలుగును. శబ్దములు వెలువడును. ఉదరం నందు పోట్లు పుట్టును . ఉదరం బరువుగా ఉండును.
* మూత్రవృద్ధి లక్షణాలు -
మూత్రస్రావం అధికం అగును. తరచుగా మూత్రవిసర్జన కు వెళ్లవలసి వస్తుంది. మూత్రాశయంలో పోటు మరియు మూత్రాశయం ఉబ్బినట్టు అగును.
* స్వేదవృద్ధి లక్షణాలు -
అతిగా చెమట పట్టుట, చర్మం దుర్గంధం వచ్చును. చర్మం నందు జిల పుట్టును .
* ఆర్తవవృద్ధి లక్షణాలు -
ఋతురక్తం అధికం అయ్యినచొ ఒక విధమైన బాధ కలుగును. రక్తం వృద్ది అవ్వడం చేత శరీరంలో వాతం సంచరించుటకు అవరోధం కలిగి శరీరాంగాలలో బాధ , పోటు జనించును. అలా విపరీతంగా స్రవించిన రక్తం దుర్గంధపూరితంగా ఉండును.
* స్తనవృద్ధి లక్షణాలు -
స్థనములు విపరీతంగా లావు పెరుగుతాయి . పాలు అధికంగా స్రవించును . స్థనముల యందు తీపి మరియు పోటు కలుగును.
పైన ధాతువులతోపాటు శరీర భాగాలలో అతివృద్ధి సంభవించినపుడు కలుగు సమస్యల గురించి వివరించాను.
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
బంధవిముక్తి మోక్షమార్గం*
*బంధవిముక్తి మోక్షమార్గం*
➖➖➖✍️
```
అన్ని బంధాల నుంచీ మనిషిని విముక్తం చేసేదే ముక్తి. దీన్నే‘మోక్షం’ అంటాం. అది ఎలా లభిస్తుందనే చర్చ అనాదిగా సాగుతోంది. ఎవరి వాదం వారికి వేదం. ఎవరి మతం వారికి సమ్మతం. వ్యక్తిగత వాదాలే మతాలుగా పరిణమించి, అనేకంగా ఆవిర్భవించాయి. ఇవన్నీ ముక్తిని సాధించడానికి తోడ్పడేవే.
ఒక గమ్యస్థానానికి వెళ్లాలనుకొన్నప్పుడు మనిషి బయలుదేరే చోటు నుంచి ఒకే దారి ఉండదు. అన్ని దిక్కుల నుంచీ దారులెన్నో ఉంటాయి. ఎటు నుంచి వెళ్లినా చేరాల్సిన చోటు ఒకటే.
ఏ దారిలో వెళ్లినా గమ్యం చేరేవరకు విశ్రమించడు. జీవన స్వభావం ఇదే.
ఇదే విషయాన్ని మోక్షానికీ అన్వయిస్తూ ‘శివ మహిమ్న స్తోత్రం’ ఇలా ప్రబోధించింది:```
*“పరమేశ్వరా! నిన్ను చేరడానికి మనుషులు ఎన్నో మార్గాలను ఏర్పరచుకొన్నారు. కొందరు వేదమార్గంలో నిన్ను చేరుకుంటూ ఉండగా మరికొందరు సాంఖ్య మార్గంలో, ఇంకొందరు శైవ మార్గంలో, కొందరు యోగ మార్గంలో, కొందరు వైష్ణవ మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎవరికి వారు తాము నమ్మిన మార్గాలే గొప్పవని వాదిస్తారు. ‘లోకో భిన్న రుచిః’ అన్నారు కదా…!*```
లౌకిక బంధాలనన్నింటినీ పరిత్యజించి పరమేశ్వరుడిలో లీనం కావడమే మోక్షం. అది నాలుగు విధాలని ‘శివానంద లహరి’లో శంకర భగవత్పాదులు స్పష్టం చేశారు.```
*మొదటిది సారూప్య ముక్తి.*```
భక్తుడు శివుణ్ని అర్చిస్తున్నప్పుడు తానూ శివుడిలా రూపం ధరించాలని కోరుకోవడమే ఈ ప్రక్రియలోని పరమార్థం. స్తోత్ర పఠనంలో శివుడి రూపాన్ని స్మరించడం, ఆ రూపాన్నే ఆరాధించడం అంటే శివుడితో సమానమైన రూపాన్ని కోరుకోవడమే! అందువల్ల దీన్ని ‘సారూప్య ముక్తి’గా భావిస్తాం.```
*రెండోది సామీప్య ముక్తి.*```
శివుడి కథలు ప్రవచించేవారికి ఎప్పుడూ దగ్గరగా ఉండటం, వారు చేసే ఆరాధనల్లో పాలుపంచుకోవడం, వారితోనే స్నేహం చేస్తూ కలిసి మెలిసి తిరగడం వంటివి ఇందులో ఉంటాయి. ఇవన్నీ ఆనందదాయకాలైన అంశాలే. కనుక దీన్ని ‘సామీప్య ముక్తి’ అని వ్యవహరిస్తాం.```
*మూడవది సాలోక్య ముక్తి.*```
అంటే శివుడు ఉండే లోకంలోనే ఉండాలనుకోవడం! శివుడు లేని చోటు ఏదైనా ఉందా అంటే ‘లేనే లేదు’ అని బదులిస్తుంది ప్రాచీన సాహిత్యం. చరాచరాలతో కూడిన మానవ లోకంలో ప్రతీ అణువులో శివుడున్నాడంటారు. మానవ లోకంలోని మనిషి శివుడున్నచోటే ఉన్నాడని దీని అర్థం. ఈ ప్రపంచం అంతా శివుడి శరీరమే అని వేదాలు చెబుతున్నాయి. ‘శివుడి తనువే ఈ జగత్తు’ అనే భావన ఇందులో కనిపిస్తుంది. శివుడున్న లోకంలోనే తానూ ఉన్నాననే భావనను భక్తుడికి కలిగించడమే “సాలోక్య ముక్తి”.```
*ఇక నాల్గవది “సాయుజ్య ముక్తి”.* ```‘సాయుజ్యం’ అంటే “కలిసి ఉండటం”. చరాచరాలన్నీ శివమయాలే అన్నప్పుడు అందులో చరాలు (చైతన్యం కలిగిన ప్రాణులు)గా మనుషులూ ఉన్నట్లే. అందరూ శివస్వరూపాలే ఐనప్పుడు ఆయనతో వారు నిరంతరం కలిసి ఉన్నట్లే అవుతుంది. దీన్నే ‘మనిషికి శివుడితో సాయుజ్య ముక్తి లభించడం’ అంటాము.
ఇలా ప్రతి మనిషికీ నాలుగు విధాలైన మోక్షాలు అందుబాటులో ఉంటాయి.
’ముక్తి’ఎవరికైనా సాధ్యమే! శివుడి కరుణకు ఎలాంటి తారతమ్యాలూ ఉండవు. అందుకే ఆయన తనను అర్చించిన సాలీడు,పాము,ఏనుగును తనలో లీనం చేసుకొన్నాడు.
శ్రీ(సాలీడు), కాళ(పాము), హస్తి (ఏనుగు) నామాలతో ‘శ్రీకాళహస్తీశ్వరుడు’ అయ్యాడని మనకు తెలుసు.
కాలు కదపనివాడికి ఏదీ లభించదు. కదిలి ముందుకు సాగేవాడికి ప్రపంచమంతా ఓ కుగ్రామంలా కనపడుతుంది. “మోక్షం” విషయంలోనూ ఇదే సూత్రాన్ని అన్వయించుకోవాలి.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
కళ్యాణ ఘడియలు
*కళ్యాణ ఘడియలు తెలుసుకోవడం ఎలా..?*
మనిషి జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన సందర్భం. పెళ్లి ఎప్పుడు జరుగుతుందని వయసు వచ్చిన ప్రతి వ్యక్తిలో ఆలోచన మొదలవుతుంది. కొందరిలో అనుకున్న సమయంలో వివాహం కాక.. అది ఒక సమస్యగా మారుతుంది. జాతకం ప్రకారమే వివాహ సమయం నిర్థేశించబడుతుందని గమనించాలి. అయితే 22 సంవత్సరాల్లోపు జరిగే వివాహాలను తొందరగా(శీఘ్రం) జరిగే వివాహాలుగా చెప్పుకోవచ్చు. 28 సంవత్సరాలు, ఆ పై వయస్సులో జరిగేవి ఆలస్య వివాహం.
*తొందరగా(శీఘ్రం) జరిగే వివాహాలకు కారణం*
లగ్నం, సప్తమభావముల యందు శుభ గ్రహాలు ఉండి సప్తమాధిపతి పాప గ్రహాలతో కలవకుండా శుభ గ్రహాల దృష్టి పొందడం వల్ల, లేదా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు. అనగా మిథున రాశిలో గాని, తుల, వృషభ రాశులలోగాని, రవికి 150 లకుపైగా దూరంగా ఉన్నప్పుడు. లేదా
శుక్రుడు, శని గ్రహాలపైన చంద్రుని దృష్టి పడకుండా ఉన్నప్పుడు. లేదా శుభ గ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు. లేదా ద్వితీయ అష్టమ స్థానమలలో శుభ గ్రహాలు ఉన్నప్పుడు. లేదా శుభ గ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు లేదా జలతత్వ రాశులలో శుభగ్రాహాలు ఉన్నప్పుడు వివాహం తొందరగా జరుగుతుంది.
*ఆలస్య వివాహానికి గల కారణాలు*
లగ్నమందు, సప్తమ స్థానమందు పాపగ్రహాలు అనగా.. శని, రాహు, కేతువు, రవి, కుజ గ్రహాలు ఉన్నప్పుడు, సప్తమ స్థానమందు 2 గాని అంతకన్నా ఎక్కువ పాపగ్రహాలు ఉన్నప్పుడు. లేదా ద్వితీయ అష్టమ భావములలో పాపగ్రహా లు గాని, వక్రములు గాని ఉన్నప్పుడు. లేదా శుక్రుడు రాహువుతో గాని, శనితో గాని కలిసివున్నప్పుడు. లేదా శుక్రుడు రవి గ్రహానికి ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు. లేదా జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచంలో గాని వక్రించి గాని ఉన్నప్పుడు. లేదా సప్తమ భావముపై, సప్తమాధిపై పాప గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్య వివాహం జరుగును.
ఇలా జాతకంలో శ్రీఘ్ర వివాహమా? ఆలస్య వివాహమా అని నిర్ణయించిన తర్వాత జరుగుతున్న దశ అంతర్దశలను బట్టి గోచారంలో గురువు, శుక్ర గ్రహాలను బట్టి వివాహ కాలం నిర్ణయించుకోవచ్చు.
వివాహకాలం నిర్ణయించుటకు జాతకునికి 21 సంవత్సరాలు దాటిన తరువాత వచ్చు దశ అంతర్దశలను పరిశీలించాలి. సప్తమాది యెక్క లేదా సప్తమ భావాన్ని చూస్తున్న లేదా సప్తమాధిపతితో యతి వీక్షణలు పొందుతున్న గ్రహాల యొక్క దశ, అంతర్దశలలో వివాహం జరుగుతుంది. అలాగే నవాంశ లగ్నాధిపతి యొక్క, లేదా సప్తమాదిపతి నవాంశమందున్న రాశి నాథుని యొక్క దశ, అంతర్దశలలో పెళ్లి జరుగుతుంది. ఈ విధంగా పెళ్లి జరిగే సమయం నిర్ణయించిన తర్వాత గురు గ్రహం గోచార గమనాన్ని బట్టి వివాహం జరుగే సంవత్సరం నిర్ణయించాలి. వరుడి జాతకంలో శుక్రుడు, వధువు జాతకంలో కుజుడు ఉన్న రాశులపై గోచార గురువు యొక్క దృష్టి లేదా కలయిక వచ్చిన సంవత్సరంలో వివాహం జరుగుతుంది.
ఉత్తరాయణ కాలంలో జన్మించిన వారికి నవాంశలో గురువు ఉన్న రాశిలోనికి గాని, గురువుకు 5, 9 స్థానాల్లోగాని రవి గోచార రీత్యా వచ్చిన నెలలో వివాహం జరుగుతుంది. దక్షిణాయణంలో జన్మించిన వారికి నవాంశలో శుక్రుడున్న రాశిలోగాని, శుక్రునికి 5, 9 స్థానాలల్లోనికి గాని గోచార రవి వచ్చిన మాసంలో పెళ్లి జరుగుతుంది. ఈ విధంగా గురువు యొక్క సంచారాన్ని బట్టి పెళ్లి జరుగు సంవత్సరం, రవి యొక్క సంచారాన్ని బట్టి వివాహం జరుగు మాసం నిర్ణయించాలి. తర్వాత చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి పెళ్లి జరిగే రోజు నిర్ణయించాలి.
జాతక చక్రం పరిశీలించేటప్పుడు ఆలస్య వివాహానికి కారణం తెలుసుకొని తత్సంబంధమైన గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయాలు చేయాలి. అప్పుడే దోషాలు తొలగి శ్రీఘ్ర వివాహం జరుగుతుంది. సప్తమస్థానంపై రాహు, కేతువుల ప్రభావం ఉన్నప్పుడు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఫలితం ఉండదు. కొన్ని సందర్భాల్లో నిశ్చితార్ధం జరిగిన తరువాత కూడా పెళ్లి ముందు రోజు కూడా ఏవో కారణాల వల్ల వాయిదా పడుతుంటాయి. ఇటువంటి వారు కనక దుర్గమ్మ వారికి 8 శుక్రవారాలు కుంకుమార్చన జరిపించడం వల్ల దోషాలు తొలగిపోతాయి.
వివాహం తొందరగా కావాలని కోరుకునే వారు 8 మంగళవారాలు హనుమాన్ ఆలయంలో స్వామివారికి 108 తమల పాకులతో అర్చన జరిపించడం వల్ల పెళ్లి కుదుదరుతుంది. శని గ్రహ దోషం వల్ల వివాహం ఆలస్యమవుతుంటే తమల పాకులలో తేనె పోసి నల్ల చీమలకు ఆహారంగా ఉంచడం వల్ల ఆ దోషం నశించిపోతుంది.
ఏదో ఒక కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంటే ఈ క్రింది మంత్రమును ప్రతి రోజూ 108 సార్లు పారాయణం చేయాలి.
దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్యదాయ
*మీ మిత్రుడు యస్.నాగేశ్వరశర్మ(ప్రకాష్)*
చక్కటి ఆంధ్ర భోజనము
దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న రైల్వే ప్రయాణికులకు చక్కటి ఆంధ్ర భోజనము అందజేస్తాము. మీరు చేయవలసినదల్లా ఒక్కరోజు ముందు గా మాకు తెలియ చేయవలెను. మీ భోగి వద్దకు మీరు కోరిన విధంగా టిఫి న్స్, భోజనం, పులిహార, దద్దోజనం, జ్యూస్, వాటర్ అందజేస్తాము.
విజయవాడ: మోహన్ గారు 7396881404
విజయవాడ: మధువని గారు 9182554800
బెంగళూరు ద్రాక్షాయిని గారు: 9738979748
బెంగళూరు శర్మగారు: 8892447050
సికింద్రాబాద్: ప్రసన్న గారు: 090329 10106
సికింద్రాబాద్: లంచ్ హోమ్: 9885785556
వైజాగ్ : మల్లికార్జున శర్మ గారు: 6281023114
వైజాగ్ : సాయిశర్మ గారు: 70323 24851
కాకినాడ హరి గారు: 081427 29222
తిరుపతి :లక్ష్మి గారు: 99598 59227
న్యూఢిల్లీ ఫణి కుమార్ గారు: 9650873730
చెన్నై తాంబరం స్టేషన్: 73959 32954
రాజమండ్రి :ప్రసన్న గారు: 63040 49434
నెల్లూరు :రాధాగారు: 93469 43145
వారణాసి : శైలజ గారు: 6387 716 431
షిర్డీ : అనిల్ గారు: 95111 11585
ఒరిస్సా :లహరి గారు: 70081 79751
గుంటూరు సాయి గారు: 7989585295
అరుణాచలం రవి గారు: 88702 18670
ఏలూరు: 86885 25350
ఒంగోలు సునీత గారు: 92907 77270
నలుగురికి ఉపయోగపడే పోస్ట్ అండి.. దయచేసి మీ వాళ్ళందర
శ్రీ బసవన్న గుడి
🕉 మన గుడి : నెం 766
⚜ కర్నాటక : బెంగళూరు
⚜ శ్రీ బసవన్న గుడి
💠 నంది ..హిందూ మతంలో పవిత్రమైన ఎద్దు. (కన్నడలో బసవ) ఇది శివుని వాహనం . సంస్కృతంలో "నంది" అనే పదానికి "ఆనందకరమైనది" అని అర్థం .
💠 భారతదేశంలో ఉన్న నందీశ్వరుడు ఆలయాల్లో కెల్లా అతి పెద్ద నంది ఆలయం ఇది. 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉండే నంది విగ్రహాన్ని గ్రానైట్ రాతితో మలచారు. ఈ ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిలో ఉంటుంది. ఏడాదికొకసారి, డిసెంబర్ మాసంలో నిర్వహించే శనక్కాయల సంత (వేరుశెనగ పండగ) ప్రధాన ఆకర్షణ.
💠 బెంగళూరులోని బసవనగుడి నంది దేవాలయాన్ని బిగ్ బుల్ టెంపుల్ అని కూడా అంటారు. ఇది అతిపెద్ద నంది ఏకశిలాను కలిగి ఉంది.
💠 బెంగుళూరులో గౌరవనీయమైన మైలురాయి అయిన బుల్ టెంపుల్, మతపరమైన ప్రాముఖ్యత మరియు నిర్మాణ వైభవం రెండింటిలోనూ పవిత్రమైన ఉనికిని కలిగి ఉంది
💠 ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ దేవాలయం యొక్క ప్రధాన భాగం ఒకే గ్రానైట్ శిల నుండి చెక్కబడిన నంది యొక్క అద్భుతమైన ఏకశిలా విగ్రహం.
15 అడుగుల ఎత్తు మరియు 20 అడుగుల పొడవుతో విస్మయం కలిగించే నంది, గంభీరత మరియు ఆధ్యాత్మికత యొక్క సౌరభాన్ని వెదజల్లుతుంది.
💠 నంది విగ్రహం నలుపు రంగులో కనిపించినప్పటికీ, దానిని నిర్మించినప్పుడు ఈ రంగు లేదు.
విగ్రహం మొదట బూడిద రంగులో ఉంది. అయితే భక్తులు నిరంతరంగా బొగ్గు, నూనెతో విగ్రహానికి పూయడంతో కొన్నేళ్లుగా అది నల్లబడింది.
💠 ఒక పురాణం ప్రకారం, విగ్రహం పెరగకుండా నిరోధించడానికి ఎద్దు తలపై ఉన్న ఇనుప పలకను శివుడు అక్కడ ఉంచాడు. బెంగుళూరు పశ్చిమ భాగం గుండా ప్రవహించే వృషభావతి నది నంది విగ్రహం క్రింద ఉన్న నీటి బుగ్గ నుండి ఉద్భవించిందని ఆలయం వద్ద ఉన్న శాసనం తెలుపుతుంది.
💠 ఈ ఆలయాన్ని 1537లో విజయనగర సామ్రాజ్యం క్రింద విజయనగర నిర్మాణ శైలిలో కెంపె గౌడ నిర్మించారు , అతను బెంగళూరు నగరాన్ని కూడా స్థాపించాడు.
💠 శతాబ్దాలుగా ఆలయంలో చాలా వరకు మార్పులేకుండా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న 'విమానం' 20వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడింది.
1500 సం.లో ప్రబలంగా ఉన్న విజయనగర శైలి ద్వారా ఆలయ వాస్తుశిల్పం ఎక్కువగా ప్రభావితమైంది.
నంది విగ్రహం ఒకే గ్రానైట్ రాయితో చెక్కబడింది మరియు దాని వెనుక శివలింగం ఉంటుంది.
💠 బుల్ టెంపుల్ నిర్మాణంలో ఒక ఆసక్తికరమైన పురాణం ఉంది.
స్థానిక పురాణాల ప్రకారం, ఈ ప్రాంతం వేరుశెనగ సాగుకు ప్రసిద్ధి చెందింది.
అయితే ఆ ప్రాంతంలో ఓ ఎద్దు పంటను పాడుచేసేది. నష్టం పెరిగి పెద్దదవడంతో రైతులు ఆందోళన చెంది చివరకు ఎద్దును శాంతింపజేయాలనే ఆశతో ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు.
💠 అద్భుతం ఏమిటంటే, ఆలయ నిర్మాణం తర్వాత ఎద్దు పంటలను నాశనం చేయడం మానేసింది.
ఎద్దు శాంతించిందని సంతోషించిన రైతులు ఆలయం పక్కన వేరుశెనగ జాతరను నిర్వహించడం ప్రారంభించారు.
మాతృభాషలో ‘కడలెకై పరసె’ అని పిలువబడే ఈ పండుగ ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొనసాగుతోంది మరియు స్థానికులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది సాంప్రదాయకంగా నవంబర్ లేదా డిసెంబరు నెలల్లో జరుగుతుంది, ఇందులో పంటల మొదటి పంటను రైతులు నంది ఆలయానికి అందజేస్తారు.
💠 బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్ నుండి 5 కి.మీ దూరంలో, బసవనగుడి అనే ప్రాంతంలో ఉంది.
© Santosh Kumar

