27, ఏప్రిల్ 2024, శనివారం

సరస్వతీదేవి స్తుతి

 *🌸సరస్వతీదేవి స్తుతి🙏*

        ***************

                   

              హైదరాబాదు.

 సీ౹౹వాణీ!లలితకళావాహిని! భారతీ!

                నీకువందనములు నీలవేణి!   

   ఆశ్రిత సురభూజ! హంసవాహిని! దేవి!

             నిలచి నా రసనపై పలుకునిమ్ము!

   నలువరాణివి తల్లి!నాదస్వరూపిణి!

             సకలశాస్త్రవినుత!శరణు శరణు!

   విశ్వసంరక్షణి!వేదస్వరూపిణి!

                     సత్కళాశోభిత సంప్రతీత!

తే౹౹భారతి!మహాసరస్వతి! భవ్యనేత్రి! 

     నాద బిందు కళాధరి! నాదరూప!

     భగవతీ! సత్య రూపిణి! నిగమవేద్య!

     నన్ను నిరతము కాపాడు నలువ రాణి!


సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల

పాప ప్రక్షాళన

 🕉పాప ప్రక్షాళన🕉


🕉ఒకసారి శివపార్వతులు ఆకాశమార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగానదిలో అనేకమంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం కనిపించింది. అది చూసి పార్వతీదేవి ఇలా అన్నది.. ‘‘నాథా! ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి, వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగాస్నానం చేసి పోగొట్టుకుంటారు కదా’’ అని సందేహం వెలిబుచ్చింది. ఈశ్వరుడు చిరునవ్వుతో ‘‘దేవీ! ఇప్పుడు నేను ఒకటి చెబుతాను. నీవు ఆ విధంగా చేయి. అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’’ అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం పార్వతి, పండు ముతైదువ రూపం ధరించి, గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, ‘‘దయచేసి నా భర్తను కాపాడండి’’ అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది గంగలో దూకి, ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు ‘‘అయ్యా! నా భర్తకొక శాపం* *ఉంది. పాపాత్ములెవరయినా ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి’’ అని హెచ్చరించింది.*


*ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్లిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి, కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకుని, తన వీపు మీద ఆయనను మోస్తూ, ఒడ్డుకు తీసుకు వచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే, నాయనా! నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగల్యం దక్కించావు. నీవు పాపరహితుడవా’’ అని అడిగింది. ఆ వ్యక్తి ‘‘అమ్మా! నేను ఇంతకుముందే గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను. అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను’’ అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి, అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వినువీధులలో విహరించసాగారు. ‘‘ చూశావా దేవీ! విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది’’ అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైందన్నట్లుగా పార్వతి చిరునవ్వుతో తల పంకించింది. పని చేస్తుందా లేదా అని అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పని చేయదు.*


🕉దృఢవిశ్వాసంతో చేసే పని తప్పక ఫలితాలనిస్తుందన్నది నీతి..


🕉ఓమ్ నమశ్శివాయ🕉

Joke












 

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*27-04-2024 / శనివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


సమాజంలో సేవ కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు సాధిస్తారు.

---------------------------------------

వృషభం


కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దీర్ఘకాలిక వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు.

---------------------------------------

మిధునం


ఋణ పరమైన ఒత్తిడిలు మానసిక సమస్యలు కలిగిస్తాయి. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు చాలాకష్టం మీద పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలలో నష్ట సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి అవుతారు.

---------------------------------------

కర్కాటకం


సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారాలు పురోగతిలో సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

---------------------------------------

సింహం


చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం లాభిస్తుంది. చేపట్టిన వ్యవహారములలో అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

---------------------------------------

కన్య


ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆర్ధిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. 

---------------------------------------

తుల


ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది.

---------------------------------------

వృశ్చికం


సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.

---------------------------------------

ధనస్సు


ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి.

---------------------------------------

మకరం


సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం కలుగుతుంది. ఖర్చుకు మించిన ఆదాయం సంతృప్తి కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగమున ఆశించిన అవకాశములు అందుతాయి. 

---------------------------------------

కుంభం


ప్రయాణాలు వాయిదాపడతాయి. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తివ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

మీనం


ఆర్థిక పరిస్థితి కొంత మెరుగు పడుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు అనుకూలత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు పొందుతారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

వేద ఆశీర్వచనం


 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5125* *శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం  -‌ తృతీయ - జేష్ఠ -‌‌ స్థిర వాసరే* *27.04.2024.* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.



🙏🙏

26, ఏప్రిల్ 2024, శుక్రవారం

దేవుడు ప్రత్యక్షమై

 ఉన్నట్టుండి దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే.. చాలామంది చప్పున అడిగేది ధనం లేదా హోదా. నిజానికి మనందరికీ కావలసింది ఆరోగ్యం. అంతకంటే ముఖ్యంగా అవసరమైంది మనశ్శాంతి. కానీ అది కొనుక్కుంటే లభ్యమయ్యేది కాదు. మరెక్కడ దొరుకుతుంది.. ఎలా దక్కించుకోవాలి..


ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెదికిందట ఓ అమ్మ. అనేక సందర్భాల్లో మన తీరు అలాగే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ ప్రపంచంలో అతి అరుదైందీ, అమూల్యమైందీ, అందరికీ అత్యంత అవసరమైందీ మనశ్శాంతి. అయితే ఆ మనశ్శాంతిని ఎలా పొందాలనే వెతుకులాట ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. ధనంతో ఈ ధరణిలో దేన్నైనా సాధించవచ్చునన్న మాట మనశ్శాంతి విషయంలో చెల్లదు. అవసరమైన వన్నీ అమరినప్పుడూ, కోరిన కోర్కెలన్నీ తీరినప్పుడూ ప్రశాంతంగా ఉండొచ్చు అనుకోవడం సహజం. కానీ ఆ ఆలోచనలోనే తేడా ఉంది. కావలసినవన్నీ పొందడం కన్నా అవసరం లేనివాటిని వదలడం వల్ల మనశ్శాంతి కలుగుతుందన్న విషయాన్ని అందరూ మర్చిపోతుంటారు. దాంతో అనవసరమైన వాటి సేకరణతో సంచి బరువై సంచితం పెరిగి ఆయాసం మిగులుతుంటుంది. ఇలా పరిణమించకూడదు అంటే పరిసరాలూ, పరిస్థితులకు అనుగుణంగా మానసిక దృక్పథాన్ని మార్చుకోవాలి. అందుకోసం కోరికలను విడిచిపెట్టాలని వేదోపనిషత్తులూ, పురాణేతిహాసాలూ, బుద్ధుడు, జినుడు తదితర మహనీయులు ఎందరు ఎన్ని విధాల చెప్పినా, స్వీయ అనుభవాలతో అర్థమైనా.. దాన్నెవరూ పట్టించుకోరు. ఆశ, కోరిక, తృష్ణ- ఇలా ఏ పేరైనా కావొచ్చు.. అది మదిలో రొదపెడుతున్నంత కాలం మనశ్శాంతి అనేది ఉయ్యాల్లో బిడ్డలాగా కళ్లెదుటే ఉన్నా కనిపించదు. దానికోసం ఎక్కడెక్కడో అన్వేషిస్తుంటాం. వెతుకులాట నిరంతరం సాగుతూనే ఉంటుంది.

ఆశ అంతరిస్తేనే..


జీవితంలో ఎంత సంపాదించినా, ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా ఆశ గనుక అంతరించకపోతే అశాంతే కలుగుతుంది. మనశ్శాంతి దూరమౌతుంది. ఈ విషయాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తే వామన అవతారంలో మనకు విశదపరిచాడు. కానీ దేవుడే దిగి వచ్చి చెప్పినా చెవికెక్కించుకోకపోవటం మనుషుల బలహీనత.


వ్యాప్తిం బొందక వగవక

ప్రాప్తంబగు లేశమైనఁ బదివేలనుచుం

దృప్తిం జెందని మనుజుఁడు

సప్తద్వీపముల నయినఁ జక్కంబడునే


అని ఎంత అరటిపండు ఒలిచి నోటికందించినట్లు వామనుడి మాటలను పోతన ఏనాడో చెప్పాడు. వచ్చిన చిక్కేమిటంటే.. దేవుణ్ణి ఆరాధిస్తామే కానీ ఆ తత్త్వాన్ని పట్టించుకోం. దొరికిన దాంతో సంతృప్తి చెందమన్న స్వామి బోధ వింటే మనశ్శాంతి మనల్ని వదిలి పొమ్మన్నా పోదు. కానీ ఏది ఉన్నా, ఎంత ఉన్నా తృప్తి చెందక.. ఇంకా ఇంకా కావాలంటూ తపన చెందుతుంటే పరిణామం ఎలా ఉంటుందో కూడా ఆ తర్వాతి పద్యంలోనే..


‘ఆశాపాశము దాఁగడున్‌ నిడుపు లేదంతంబు.. వా రాశిప్రావృత మేదినీ వలయ సామ్రాజ్యం..’ అంటూ చెప్పాడు. సర్వం చేజిక్కినా ఆశ అణగారదు. అంతులేని ఆశ అనే తాడు చివరికి అసంతృప్తి అనే ఉరితాడుగా మారుతుంది- అన్నది భావం. ఈ విషయాన్ని అర్థంచేసుకుంటే అశాంతి, నిరాశలు దూరమై మనశ్శాంతి మన కళ్ల ముందే కదలాడటం నిక్కం.


తృష్ణ ఎలాంటి వారినైనా పరాజయం పాలుచేసి అశాంతచిత్తుల్ని చేస్తుందని శ్రీరాముడు యోగ వాశిష్ఠంలో ‘..మేరు సమం ప్రాజ్ఞమపి శూరమపి స్థిరమ్‌ తృణీ కరోతి తృష్టికా నిమేషేణ నరోత్తమమ్‌...’ అన్నాడు. మేరుసమానుడైనా, మహాప్రాజ్ఞుడైనా, నరోత్తముడైనా.. కోరికల చేతిలో క్షణంలో ఓడిపోతాడు. ఓటమి మనశ్శాంతిని దూరం చేస్తుందని ఎవరూ వివరించనవసరం లేదు. కనుక కోరికలను జయించి, తృప్తితో జీవించడం నేర్చు కోవాలి. ‘తృప్తికి మించిన సంపద లేదు. సాటిలేని ఆ సంపదే మనశ్శాంతి’- అంటూ ప్రవచించారు శారదామాత కూడా.

జారుడు మెట్లు..


మనశ్శాంతి దూరమైందంటే ఈర్ష్యాద్వేషాలే ప్రధాన కారణాలు. అవి జారుడుమెట్ల లాంటివి. పైకి ఎక్కటానికి ఉపకరిస్తాయని భ్రమ కలిగిస్తాయి. కానీ ఏ ఒక్క మెట్టూ అందుకు పనికిరాదు. పైగా జారి కిందపడితే అథోగతే. ఎవరి మనసులో ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయో వారికి మనశ్శాంతి దుర్లభం. ఎదుటివారి ఆనందాన్నీ, అభివృద్ధినీ చూసి ఓర్వ లేనివారికి మనశ్శాంతి దక్కకపోగా అశాంతే మిగులుతుంది. ఇతరుల సుఖసంతోషాలకు ఆటంకం కలిగిస్తూ, ఎదుటివారికి హాని తలపెట్టాలనే స్వభావం వదలనంత వరకూ మనశ్శాంతి మన దరిదాపుల్లోకి రాదన్నది అక్షర సత్యం. దుర్యోధనుడి ద్వేషభావం వల్లనే పాండవులు అరణ్యాల పాలై అష్టకష్టాలూ అనుభవించారు. అయితే దుర్యోధనుడు అంతఃపురంలో స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తూ కూడా ఆనందాన్ని అనుభవించలేక దుఃఖసముద్రంలోనే కొట్టుమిట్టాడాడు. ఘోషయాత్ర సమయంలో అంతటి మానధనుడు ఘోర అవమానానికి గురై అశాంతితో రగిలిపోతూ కుమిలిపోయాడు.

అది తాడు.. ఇది దీపం

జయ శ్రీ రామ్ 

కంచర్ల వెంకట రమణ

యోగవాసిష్ఠ

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.                   *హరి ఓం*

 *ఓం శ్రీ మహాగణాధిపతయే నమః* 

*ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః* 

*ఓం నమో వసిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి శుకాదిభ్యః*

 

.    *🌹యోగవాసిష్ఠ రత్నాకరము🌹* 

*వైరాగ్య ప్రకరణము - 1వ అధ్యాయము* 

.    *🌹రాఘవ వైరాగ్య వర్ణనము🌹*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.              *శ్రీ వాల్మీకి రువాచ :-*

0043


*1-128*

*ఘటస్య పటతా దృష్టా పటస్యాసి ఘటస్థితిః* 

*న తదస్తి న యద్దృష్టం విపర్యస్యతి సంసృతౌ* 


కుండ పగిలి మట్టి కాగా, అది ప్రత్తిచేనులో వేయబడి క్రమముగ ప్రత్తిగాను, దారముగాను, వస్త్రముగాను పరిణతి జెందుట గాంచబడుచున్నది. ఈ ప్రకారముగ కుండ వస్త్ర మగుచున్నది. అట్లే వస్త్ర మున్ను కుండగా మారుచున్నది; వెయ్యేల ఈ ప్రపంచమున పరిణామము నొందని వస్తువే లేదు. 


*1-129*

*తనోత్యుత్పాదయత్యత్తి నిహంత్యాసృజతి క్రమాత్‌* 

*సతతం రాత్ర్యహనీవ నివర్తన్తే నరం ప్రతి*


వృద్ధి, విపరిణామ అపక్షయ, వినాశ, పునర్జన్మములను ఈ ఐదు వికారములున్ను క్రమముగ రాత్రింబగళ్ళవలె మనుజుని వద్దకు నిరంతరము వచ్చుచు పోవుచున్నవి.


*1-130*

*బాల్యమల్పదినైరేవ యౌవనశ్రీస్తతో జరా* 

*దేహేఽప పి నైకరూపత్వం కాస్థా బాహ్యేషు వస్తుషు*


కొలది దినములలో బాల్యము గడచిపోవుచున్నది; ఆ పిదప యౌవనము, ఆ పిమ్మట వార్ధక్యము ఏతెంచి గడచిపోవుచున్నవి. ఈ ప్రకారముగ దేహమందే ఏకరూపత్వము లేకయుండ, ఇక బాహ్య వస్తువులందు ఏకరూపత్వ, స్థిరత్వములగూర్చి విశ్వాసమేమి?!


                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

ఈశావాస్యోపనిషత్తు

 ఈశావాస్యోపనిషత్తు ఈక్రింది శాంతి మంత్రంతో ప్రారంభం అవుతుంది.


*ఓం పూర్ణమదః పూర్ణమిదం*

*పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే*

*పూర్ణస్య పూర్ణ మాదాయ*

*పూర్ణ మేవావ శిష్యతే II*


దీని అర్థం.

పూర్ణమ్ అంటే నిండుగా

అదః అంటే అది అంటే పరమాత్మ

పూర్ణమదః అంటే పరమాత్మ నిండుగా వున్నాడు అని అర్థం.

పూర్ణమ్ అంటే నిండుగా

ఇదం అంటే ఇది అంటే జీవాత్మ 

పూర్ణమిదం అంటే జీవాత్మ నిండుగా వున్నాడు.

పూర్ణాత్ అంటే ఒక నిండైన దాని నుంచి పూర్ణ అంటే ఇంకో నిండైనది

ఉదచ్యతే అంటే పుడుతున్నది. 

      పరమాత్మ నిండైనది. జీవాత్మ నిండైనది. పరమాత్మ లోనుంచి జీవాత్మ పుడుతున్నది.

పూర్ణస్య అంటే ఆ నిండైన దాని లోనుంచి పూర్ణమ్ అంటే నిండైన

ఆదాయ అంటే తీసి వేస్తే

పూర్ణమేవ అంటే ఆనిండైన వస్తువే

అవశిష్యతే అంటే మిగులుతుంది.


తాII నిండైన పరమాత్మ లోనుంచి ఎన్ని జీవాత్మల్ని తీసివేసినా పరమాత్మ తరిగిపోడు. అలాగే పరమాత్మలో ఎన్ని జీవాత్మలు కలిసినా పరమాత్మ పెరిగిపోడు. పరమాత్మ ఎప్పుడూ ఎప్పుడూ ఒకేలా నిండుగా వుంటాడు.


         తేలికగా అర్థం అయ్యేలా చెప్పుకోవాలంటే పరమాత్మ సున్నా అనుకుంటే సున్నాలోనుంచి ఎన్ని సున్నాలు తీసివేసినా సున్ననే మిగులుతుంది. అలాగే సున్నాకు ఎన్ని సున్నాలు కలిపినా సున్నానే మిగులుతుంది. అలాగే సున్నాను సున్నా బెట్టి హెచ్చవేసినా, భాగారించినా సున్నానే మిగులుతుంది. పరమాత్మ పూర్ణ స్వరూపుడు. ఆయనకు తరగడం, పెరగడం ఆంటూ ఏమి వుండవన్నది దీని అర్థం.

Joke


 

Panchaang


 

25, ఏప్రిల్ 2024, గురువారం

గురువు అష్టకం

 *🙏💐 గురువు అష్టకం💐🙏*

తెలియనంతవరకు దూరమే! తెలిస్తే దగ్గరే!

🪴🍀🪴🍀🪴🍀🪴🍀

భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే అని చెప్తారు కదా! 


"దూరాత్‌ దూరే అంతికే చ!'' అంటుంది వేదం. అవగాహన కానంతసేపూ దూరంగా ఉంటుంది. అర్థమయితే దగ్గరే (లోపలే) ఉంటుందని అర్థం. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది.


పెళ్లీడుకొచ్చిన పిల్లకి తల్లిదండ్రులు సంప్రదాయాననుసరించి సన్నిహిత బంధువుల పిల్లవాడిని పెళ్ళికి ఎంపిక చేస్తారు. కాని ఆ పిల్ల ఒప్పుకోక అందరి కన్నా శ్రేష్ఠుడినే వరిస్తానంటుంది. తల్లిదండ్రులు ప్రక్కకి తప్పుకొంటారు.


అందరి కన్నా ఉన్నతుడు రాజే కాబట్టి తాను రాజుని తప్ప ఇంకెవరినీ పెళ్లాడనంది ఆ పిల్ల. అప్పట్నుంచి రాజుని వెంబడింపసాగింది. ఒకనాడు పల్లకిలో పోతున్న రాజుకి దారిలో సన్న్యాసి కనబడితే, దిగి ఆయనకి ప్రణామాలు చెప్పి తన ప్రయాణం కొనసాగించాడు. దీనినంతా గమనించిన ఆ పిల్ల ''అందరి కంటే రాజే గొప్పవాడను కొన్నాను, పొరబడ్డాను. ఆయన కంటే సన్న్యాసి ఎంతో గొప్పవాడు. కాబట్టి నేను సన్న్యాసినే పెళ్లాడుతాను'' అనుకొని సన్న్యాసి వెంటపడింది.


ఒకనాడు సన్న్యాసి ఒక రావిచెట్టు క్రింద ఉన్న వినాయకుని విగ్రహానికి నమస్కారం పెట్టటం చూచింది. ఆ పిల్ల, తన అభిప్రాయాన్ని మళ్లీ మార్చుకొంది. సన్న్యాసి కంటె ఉత్తముడు వినాయకుడని ఆయననే వివాహమాడటానికి నిశ్చయించుకొంది. సన్న్యాసిని విడిచి, వినాయకుని ఎదుట కూర్చొంది.


చెట్టుక్రింద ఉన్న విగ్రహం కావటం వల్ల అక్కడ గుడి లేదు. ఎవ్వరూ వచ్చేవారు కారు. ఒకనాడు అటుపోతున్న ఒక కుక్క ఆ విగ్రహం పై కాలెత్తి అది చేసే పని అది చేసింది. ఆ విగ్రహం కంటె గొప్పదనుకొని ఆ పిల్ల కుక్క వెంటబడింది. ఆదారిన పోతున్న ఒక పిల్లవాడు ఆ కుక్కపై రాయిని విసిరి గాయపరచాడు. ఆ బాధకి అది ఇంకా వేగంగా పరుగెత్తటం మొదలు పెట్టింది. దీనినంతా గమనిస్తున్న ఒక యువకుడు ఆ మూగజీవిని ఊరికే కొట్టిన పిల్లవాడిని చివాట్లు వేశాడు. ఆ పిల్లవాడిని మందలించిన యువకుడే అందరికంటె గొప్పవాడనుకొంది ఆ పిల్ల. అతనినే వివాహమాడుతానంది. ఇంతకూ, ఆ యువకుడు ఎవరో కాదు - తల్లిదండ్రులు ఎంపిక చేసిన వాడే! ఎక్కడో ఉన్నాడనుకొన్నవాడు సమీపానే ఉన్నాడు. అదీ కథ.


''ఈశ్వరుడెక్కడో ఉన్నాడని దేశమంతా వెతుకుతున్నావు. ఎరుగనంత వరకు నీకు ఆయన దూరస్థుడే. ఎంత వెతికినా కనబడడు. నీకు దగ్గరే ఉంటాడు. అన్నిటి కంటే దూరంగా, అన్నిటి కంటే దగ్గరగా ఉంటాడు'' అంటుంది వేదం.🙏


🙏💐🌹🌴🌹💐🙏

ఒకప్పుడు

 ❤️*మన బాల్యం*❤️


ఒకప్పుడు...పరీక్ష రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలు..!

ముందు రోజు రాత్రి నిద్ర వుండేది కాదు. 

నిద్రలోనూ భగవంతునికి మొక్కులే! 


ఫస్టు క్లాసు అక్కర్లేదు కానీ పేపర్లో నెంబరు వుండేలా చూడమని దేవుడికి పదే పదే అర్జీలు.


ఉదయాన్నే లేచి.. పేపరు కోసం సెంటర్లోకి పరుగు 

అప్పటికే కిల్లీ బడ్డీ దగ్గర అన్ సోల్డ్ పేపర్లు అన్నీ సోల్డ్ అయిపోతే.. వీధిలో ఎవరు పేపరు వేయించుకుంటారా అని వెదుకులాట.


ఎలాగోలా ఒక పేపరు సంపాధిస్తే.. పది మంది మిత్రులు పోటీ..!కంగార్లో నెంబరు సరిగ్గా కనిపించకపోవడం..!


రెగ్యులర్ నెంబర్లు ఒకవైపు, కంపార్ట్ మెంట్ నెంబర్లు మరో వైపు. వాటిలో మళ్లీ, ఫస్టు, సెకండు, థర్డ్ క్లాస్ లు. 

ఫస్టు క్లాసులు అయితే..రెండుమూడు వరసలే! సెకండ్ మరికొంచెం..థర్డ్ క్లాసయితే... సగం పేజీ.. మొదట అపనమ్మకంతో థర్డ్ క్లాస్ కాలమ్ లో వెదుకులాట.-ఆశ ..!


నెంబర్ లేకపోయే సరికి , సెకండ్ క్లాస్ ఆపై మనకు అంత సీను లేదులే అనుకుని ఫస్ట్ క్లాస్ కాలమ్స్ లో నెంబరు వెదుకులాట..


హమ్మయ్య నెంబరు వుంది అనుకోగానే వేయి ఏనుగుల బలం.. కొండంత ఆనందం.. పాస్ అయిన హాల్ టిక్కెట్ నెంబరు వున్న పేపరు భద్రంగా దాచుకోవడం.


ఆ తర్వాత, నా ముందు నెంబరు, తర్వాత నెంబరు వుందో లేదో చూడటం.. అదో ఆనందం..


ఇక అక్కడ నుంచి ఎవరెవరు పాసయ్యారు.. ఏ క్లాసులో పాసయ్యారు..గోల గోల.. రిజల్ట్ చూడటానికి రానివాళ్ల ఇంటికి అంతా గుంపుగా వెళ్లి ఆనందం పంచుకోవడం.


ఫెయిల్ అయిన వాళ్ల ఇళ్లకు ఓదార్పు యాత్ర.


ఇక అక్కడ నుంచి మాస్టార్ల ఇళ్లకు వెళ్లి రిజల్ట్స్ చెప్పుకోవడం.. వాళ్లతో ఆనందం పంచుకోవడం..


ఈలోగా ఇంటి దగ్గర అమ్మ నాన్న, అన్న తమ్ముడు అంతా వీధిలో మీటింగు మావోడు పాసయ్యాడు అంటే పాసయ్యాడని..


స్వీట్లు..అదే అమ్మచేసిన లడ్డూల పంపకం..

ఇక ఆ రోజంతా .. ఇంట్లో .. వీధిలో మనమే హీరో..!


కట్ చేస్తే..!


ఇప్పుడు..! ఆ ఆనందం.. గర్వం.. సంతృప్తి.. ఏవీ..?? 


ఇప్పడు ....పరీక్ష పాసైన పిల్లల్లో అవేవీ కనిపించడం లేదు.. ప్రతి ఇంట్లోనూ పాసయినా... ఏడుపే!


అంతా నిర్లిప్తత..పాసయ్యామా అని కాదు.. ఎన్ని మార్క్లులొచ్చాయ్.. ఇదీ ప్రశ్న


ఎన్ని మార్కులొచ్చినా.. ఇంకా వస్తే బావుండేది.. సంతృప్తి ఎక్కడా..?


ప్చ్..!


చిన్న చిన్న ఆనందాలకు పిల్లలు దూరం అవుతున్నారు..కాదు మనం కూడా దూరం చేస్తున్నాం.


చదివే యంత్రాలవుతున్నారు..ర్యాంకులను ఇచ్చే ప్రింటర్లు అవుతున్నారు..


విద్యార్థులు మాయం అవుతున్నారు..


మిషన్లులా మిగులుతున్నారు..  


ఈనాటి పరిస్థితులు తప్పక మారాలి..!


ఒకసారి కాలం వెనక్కి వెళిపోతే ఎంత బాగుణ్ణు . చిన్న అత్యాశ 😍😍😍

నలుగురు పతివ్రతా మూర్తుల గురించి

 అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరి తథా

పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్‌.


అహల్య, ద్రౌపదీ, సీత, తార, మండోదరి ఈ ఐదుగురు పుణ్య మాత మూర్తులను రోజూ స్మరించినట్లయితే మహాపాతకాలు కూడా నాశనమవుతాయని ఈ శ్లోక భావం.


. ఈ నలుగురు పతివ్రతా మూర్తుల గురించి తెలుసుకుందాం.


అహల్య గౌతమ మహర్షి భార్య..!

ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది. 

ద్రౌపదీ..పూర్వ జన్మలలో ఆమె వేదవతి, ఆ తరువాత మౌద్గల్య

 ముని భార్య ఇంద్రసేన. ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతికోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలికింది ఆమె. ఐదుగురు పతులను అనుగ్రహించాడు శివుడు. నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరూ భావించరు అని, ఆమె కోరుకొన్న విధంగా ఐదుగురితో సుఖించటానికి తగ్గ యవ్వనం, కామభోగేఛ్ఛ, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యాత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడు.


 మరుజన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది. 


సీతాదేవి!


వాల్మీకి మహర్షే శ్రీ రామాయణాన్ని ''సీతాయాశ్చరితం మహత్‌''

అని వెల్లడిచేశారు.

క్షమ..దయ...ధైర్యం...వివేకం...ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర 'సీత'. ఆమె లేనిదే రామాయణం లేదు.

ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలుపంచుకొని ఆదర్శ గ హిణిగా మెలిగిన మహాసాధ్వి 'సీతాదేవీ'. రాముడు అరణ్యవాసానికి వెళ్లినప్పడు భర్త అడుగుజాడల్లో తనూ నడిచి, అతని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్దమైన ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది. రావణ చరలో బందీ అయినప్పటికీ కూడా తన భర్తపై కల వాత్సల్యాన్ని ప్రేమను వదులుకోలేదు. రావణ వినాశనానికి, ధర్మ స్థాపనకు కారణం అయింది. దయాశాలి, అభిమానవతి, క్షమాగుణి, ధైర్యశాలి అయిన సీతామాత గుణగణాలను రామాయణంలో అడుగడుగునా వాల్మీకి మహర్షి ఎన్నో సందరాÄలేలో చెప్పారు.


తారాదేవి!


వాలి భార్య తారాదేవి. సుగ్రీవుడి భార్యను వాలి చెరబట్టి, అతన్ని రాజ్యబహిష్క్రుతున్ని చేసినప్పుడు అది తప్పని వాలికి చెప్పింది. అన్నదమ్ములు కలహించుకుంటే రాజ్యానికి చేటని హితవు చెప్పింది. కానీ వాలి వినలేదు. దాంతో రామబాణానికి నేలకొరిగాడు. మరణించిన పతిదేవుని చూసి తాను కూడా చనిపోతానని తన పతిభక్తిని చాటుకుంది. ధర్మం ప్రకారం సుగ్రీవున్ని రాజ్యానికి రాజును చేసింది. కిష్కింధ రాజ్య పాలనకు మహారాణిగా తన సలహాలను చెప్పింది. రామకార్యానికి సుగ్రీవున్ని సమాయిత్తం చేసింది. మాటలు ఆచితూచి ఎలా మాట్లాడాలో రామాయణం చెప్తుంది అంటారు. కొన్ని ఘట్టాలు ఉదాహరణలు గా చూసి చాలా నేర్చుకోవాలి అని అనిపించక మానదు. ముఖ్యం గా సుందరకాండలో హను మంతుల వారు మాట్లాడిన తీరు, వాలి భార్య తార మాట్లాడే తీరు చదివితే తెలుస్తుంది. సుగ్రీవుడు అప్పుడే దెబ్బలుతిని పోయినవాడు మరల తిరిగి వచ్చి, సింహనాదం చేస్తూ వుంటే వాలిని వెళ్ళవద్దని, బలమైన కారణం వున్నది కనకే సుగ్రీవుడు తిరిగి వచ్చాడని నిశిత పరిశీలనతో చెబుతుంది. హెచ్చ రిస్తుంది. వాలి వినడు చని పోతాడు. ఆతర్వాత కూడా రామకార్యం మరిచి పోయాడని సుగ్రీవుడిపై కోపగించిన లక్ష్మణుడిని తన సంభాషణా చాతు ర్యంతో చల్లపరుస్తుంది. ఆమె ఆ సమ యంలో చెప్పిన మాటలు చూడండి. చాలా కాలం కష్టాలు పడ్డాడు. ఇప్పుడే ఆయన రాజు అయ్యాడు. రాముని దయ వల్ల రాజ్యం, రుమా, నేనూ దక్కాము. భోగాలనుభవిస్తున్నా, రాముని పని మానలేదు సుమా' అంటూ మాటాడగల్గిన చతుర తార . ఇలా తారాదేవి ప్రస్తావన రామాయణంలోని సుందరకాండలో అదుÄతేంగా వివరించబడి ఉంది.


మండోదరి దేవి!!


రామాయణం జరగడానికి కీలకమైన వ్యక్తులలో ఒకరు రావణాసురుడు. అతడు ఎంతటి శివభక్తుడైనా సరే పరస్త్రీని వాంఛించడం అనే ఒకే ఒక్క దుర్గుణం వల్ల నాశనమైనాడు. అతడి భార్యే మండోదరి దేవి. రావణాసురుడు ఎంతటి అసురుడో ఈమె అంతటి మహాపతివ్రత. మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఈమెకు పుట్టిన కొడుకు పేరు ఇంద్రజిత్తు. మండోదరి దేవి మిక్కిలి సౌందర్య రాశి. కేవలం బాహ్య సౌందర్యరాశి మాత్రమేగాదు అంతస్సౌందర్యం కూడా కలిగింది. అందుకే సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వచ్చిన హనుమంతుడు రావణుడితో కూడి ఉన్న ఈ స్త్రీరత్నాన్ని చూసి ఆమే సీతాదేవి అనుకున్నాడు కూడా. రావణాసురుడు సీతమ్మని అపహరించి తెచ్చినప్పుడు పరస్త్రీ వ్యామోహం వద్దని, నీతిని, ధర్మాన్ని కర్తవ్యాన్ని రావణాసురునికి బోధించింది. రావణాసుర వధానంతరం భర్తతో పాటు ప్రాణత్యాగం చేయ డానికి సాహసించింది

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు 

ఇతర పూజాకార్యక్రమాల

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.25.04.2024

బృహస్పతివాసరే( గురువారము)

 *********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ చైత్ర మాసే కృష్ణ పక్షే 

ద్వితీయాయాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

బృహస్పతివాసరే( గురువారము)

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

చైత్ర మాసే కృష్ణ పక్షే ద్వితీయాయాం

గురు వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.42

సూ.అ.6.13

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

చైత్ర మాసం 

కృష్ణ (బహుళ)పక్షం విదియ పూర్తి. 

 బృహస్పతివాసరే( గురువారము)

నక్షత్రం విశాఖ

రా.1.22 వరకు. 

అమృతం సా.4.03 ల 5.45 వరకు. 

దుర్ముహూర్తం ఉ. 9.52 ల 10.42 వరకు.

దుర్ముహూర్తం మ. 2.53 ల 3.43 వరకు. 

వర్జ్యం ఉ. 5.49 ల 7.31 వరకు. 

వర్జ్యం రా. తె. 5.33 ల మరునాడు ఉ. 7.12 వరకు. 

యోగం వ్యతీపాత రా.తె.4.06 వరకు. 

కరణం తైతుల మ. 6.02 వరకు.   

కరణం గరజి మరునాడు ఉ. 6.22 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ. 1.30 ల 3.00 వరకు. 

గుళిక కాలం ఉ. 9.00 ల 10.30 వరకు. 

యమగండ కాలం ఉ.6.00 ల 7.30 వరకు.  

*********** 

పుణ్యతిధి క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ విదియ. 

 **************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

మలబద్ధకం

 మలబద్ధకం గురించి వివరణ  - నివారణా యోగాలు . 


   మలబద్దకం అనేది సమస్తరోగాలకు మొదటి మెట్టు . మలం గాని ఆమం ( సరిగ్గా జీర్ణం కాని పదార్ధం ) వాతం వలన శుష్కించి ఉండలుగా గట్టి మలమార్గము నుండి సునాయాసంగా బైటకు వెడలకున్న యెడల ఆ వ్యాధిని మలబద్దకం అంటారు. ఆయుర్వేదం నందు ఈ వ్యాదికి            "ఆనాహము" అని పిలుస్తారు . 


           మలబద్దకం సమస్య వలన నడుము , వీపు నందు పట్టుకొని ఉండటం , కడుపునొప్పి , ఆయాసము , వాంతి వంటి లక్షణాలు వస్తాయి. దప్పిక , జలుబు , శిరస్సు నందు మంట , రొమ్ము పట్టినట్లు ఉండటం , తేన్పులు పైకి రాకుండా ఉండటం వంటి లక్షణాలు కొందరిలో కనపడతాయి. మలబద్దకం సమస్య పెరుగుతున్న కొలది మనిషి వాతరోగాలు వస్తాయి. 


         ఇప్పుడు మీకు మలబద్దకం నివారణాయోగాలు వివరిస్తాను . 


  నివారణాయోగాలు  - 


 * రాచ ఉశిరికాయ తినుచున్న సుఖవిరేచనం అగును. 


 *  కాకరకాయ కూరను తరచుగా తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. 


 *  ఎండిన ఎర్రరేగుపళ్ళు తినుచుండవలెను . 


 *  చింతపండు చారు అద్బుతముగా పనిచేయును . అతిగా తీసుకున్న విరేచనాలు కలుగచేయును . 


 *  బాగా పండిన అరటిపండు తినుచుండవలెను . 


 *  నాగజెముడు , బొంతజెముడు , ఆకుజెముడు రసము 10 చుక్కలు తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. శరీర బలమును అనుసరించి 5 నుంచి 10 చుక్కలు తీసికొనవలెను . 


 *  విరేచనం ఇబ్బందిగా ఉన్నప్పుడు 4 చెంచాల ఆముదం కొంచం వేడిచేసి లోపలికి తీసికొనవలెను . ఆముదం తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నచో ఒక కప్పు గొరువెచ్చని పాలలో ఆముదం కలిపి తీసికొనవలెను . 


 *  రోజూ నిద్రపోయే ముందు రాత్రి సమయములో రెండు గ్లాసుల నీరు తాగుచున్న ఉదయం సుఖవిరేచనం అగును. ఇలా తాగడం మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే అవ్వొచ్చు లేదా రోజూ తాగుచున్న 4 రోజుల తరవాతి నుంచి వరస క్రమంలోకి వచ్చి సాఫీగా జరుగుతుంది. 


 *  సునాముఖి చూర్ణం చెంచాడు తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. 


       మలబద్దకం సమస్య అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది.  ప్రస్తుత కాలంలో జంక్ పుడ్ తీసుకోవడం ఎక్కువ అయ్యింది . ఇది అత్యంత ప్రమాదకరమైన ఆహారం . వీలైనంత వరకు అటువంటి వాటి దూరంగా ఉండవలెను . ఋతువు మారినప్పుడల్లా కడుపును శుభ్రం చేసుకొనుటకు విరేచనం కలిగించే ఔషధాలు తీసుకొనుట అత్యంత ప్రధానం అయింది. 


           చాలా మంది ఉదయాన్నే విరేచనముకు వెళ్ళి తమకు సుఖవిరేచనం అవుతుంది . అనే అపోహలో ఉంటారు. రోజుకి రెండుసార్లు విరేచనమునకు వెళ్ళినప్పుడే ఆరోగ్యకరమైన మనిషిగా భావించవలెను .  మనం తీసుకునే ఆహారం కూడా మలబద్దకం సమస్య రాకుండా ప్రధానపాత్ర పోషిస్తుంది.  ముఖ్యముగా నీరుని తీసుకోవడం , లేత ముల్లంగి , మునగ ఆకులు , మునగకాయ  , కాకరకాయ , పొన్నగంటి కూర , ద్రాక్ష , వెల్లుల్లి , ఆవుపాలు , ఆముదము , ఉలవకట్టు , పాతబియ్యం , నెయ్యి , వెన్న తరచుగా ఆహారం నందు తీసుకోవాలి. పీచుపదార్ధాలు అధికముగా తీసికొనవలెను . పళ్లరసాలు కంటే పళ్లు తినటం మంచిది .  


        శరీరము నుండి వ్యర్థపదార్థాలు ఎప్పటికప్పుడు బయటకి వెళ్లినప్పుడే శరీరం నందు టాక్సిన్స్ పోగుపడవు . శరీరం ఆరోగ్యకరంగా ఉండును.  


        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034