30, ఆగస్టు 2020, ఆదివారం

దుఃఖపుటాలోచనలు

దుఃఖపుటాలోచనలు మన ఆరోగ్యానికి,
 ఆనందానికి చాలా హాని చేస్తాయి.

 జయాపజయాలు,
సుఖ దుఃఖాలు అనేవి వస్తాయి, పోతాయి.

అవి శాశ్వతంగా ఉండవు.

అటువంటప్పుడు వాటిని ఎందుకు తీవ్రంగా పట్టించుకొని మనల్ని మనం విచార గ్రస్తులుగా చేసుకోవాలి?
సూర్యుడు దేనికి చిహ్నం?
 కాంతికి, ఆనందానికి చిహ్నం.

జీవితాన్ని ఆనందమయం చేసే ఆ ప్రకాశాన్ని మనలోనే కనుగొనాలని సూర్య తేజం మనకు బోధిస్తున్నది.

అయితే సర్వదా మనల్ని పరిరక్షించే భగవంతుణ్ణి ప్రార్థించడం ద్వారా మనలోని ఈ చిరుదివ్వెను ఉజ్జ్వలంగా ప్రకాశించేలా చేయగలం.

అందుకై మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి.

*శ్రీమన్నారాయణా!*
మాలో ఉన్న దైవం నూతన అవగాహన మాలో కలిగించుగాక, మాలో శాశ్వతానందమును కలిగించుగాక,
ఆ ఆనందజ్యోతి సకల అంధకారాన్ని,
 విచారాన్ని పారద్రోలుగాక,
మా జీవితం ఇతరులకు ఆనందాన్ని పంచుతూ, దైవకృప,
దైవ ఆశీస్సుల యొక్క విలువను మరీ మరీ నిరూపించుగాక.


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు*
***********************

కామెంట్‌లు లేవు: