30, ఆగస్టు 2020, ఆదివారం

"సంధ్య" అంటే సంధికాలం

"సంధ్య" అంటే సంధికాలం అని అర్థం. రాత్రికి సూర్యోదయానికి మధ్య ఉన్న సంధికాలాన్ని "ప్రాంతహ్ సంధ్య" అంటారు. ఉదయానికి మధ్యాహ్నం కాలానికి కల సంధికాలాన్ని "మధ్యాహ్నిక సంధ్య" అంటారు. అలాగే సాయం కాలానికి, రాత్రికి మధ్య గల సంధికాలాన్ని "సాయం సంధ్య" అంటారు. ఈ మూడు సంధికాలాలను కలిపి "త్రికాల సంధ్యలు" అంటారు పెద్దలు. ప్రతీ రోజూ ఈ మూడు సంధికాలాలను మనం చూస్తూనే ఉంటాము. ప్రకృతి లో మార్పులు కూడా ఈ సంధికాలాల్లోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటికి విశిష్టత ఏర్పడింది. ఈ మార్పులు శుభములు కావచ్చును, కాకపోవచ్చును. సాధారణంగా అందరూ శుభములే కోరుకుంటారు. కాలగతి మాత్రం పంచభూతములు, అష్ట దిక్పాలకులు, నవగ్రహలు వారి వారి అధి దేవతలు మొదలగు వారి ఆధీనంలో ఉంటుంది. ఈ ప్రక్రుతి శక్తులు అన్ని బాహ్యేంద్రియాలకు గోచారం గాని ఒక పరబ్రహ్మ తత్వం ఆధీనంలో ఉంటాయి. వీరందరూ శుభులు అయినప్పుడు మనకు తప్పకుండా శుభమే జరుగుతుంది. మనకూ, మన వారందరికీ శుభం చేకూరాలని ప్రార్ధించటాన్నే "సంధ్యావందనం" అంటాము.
        ఈ సంధ్యావందనం స్త్రీ లు, పురుషులు అందరూ చేయవచ్చును అని పెద్దలు అంటారు. కేవలము బ్రాహ్మణులే చేయాలని పూర్వం కొందరు చెప్పేవారు. అందరూ బ్రాహ్మణులు కావడానికి ఎట్టి అభ్యంతరమూ ఎవరూ చెప్పలేరు కాబట్టి ఈ సంధ్యావందనం నిత్యమూ చేసేవారిని బ్రాహ్మణులు అనవచ్చును. ఇచట"బ్రాహ్మణుడు" అంటే ఒక కులం కాదు. అది గుణ ప్రధాన మైన ఒక జాతి. అటువంటి బ్రాహ్మణులు ను సమాజం గౌరవిస్తుంది. సమస్త వేదాలను అవుపోసన పట్టిన వారే బ్రాహ్మణులు. కేవలం జన్మతః ఎవరూ అసలయిన బ్రాహ్మణుడు కావడం లేదు. బ్రహ్మ ఙ్ఞానం సంపాదనకై తహతహలాడే ప్రతి మానవుడు బ్రాహ్మణుడే." ఉపనయనం "అనే ఒక ప్రక్రియ ఉన్నది. బ్రహ్మ ఙ్ఞానం ను సంపాదించుకోవడానికి మన భౌతిక (బాహ్య) నేత్రాలు సరిపోవు. ఙ్ఞాన(అంతరంగ) నేత్రాలు కావాలి. అట్టి ఙ్ఞాన నేత్రాలు ప్రసాదించేదే ఉపనయన ప్రక్రియ. జన్మ కారకుడు, వీర్య ప్రదాత అయిన తండ్రి తో గాయత్రీ ఉపదేశం ఇప్పిస్తారు పండితులు. ఈ విధంగా ఙ్ఞాన నేత్రాలు పొందిన వానిని "ద్విజుడు" అంటారు. అంటే రెండు జన్మ లు ఎత్తిన వాడని అర్థం. ప్రతీ మానవుడు జన్యుపరంగా ఒకేసారి జన్మిస్తాడు. ఙ్ఞాన సముపార్జన కొరకు రెండో జన్మ ఎత్తి ద్విజుడు అవుతాడు.
         మానవ జన్మ చాలా దుర్లభమైనది. అందు వలన గాయత్రీ ఉపదేశము పొందిన ప్రతీ ద్విజుడూ కూడా జన్మ వ్యర్ధం చేసుకోకుండా నిత్యం త్రిసంధ్యలు గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి. అలాగే మిగిలిన మానవులు కూడా తమ జన్మ వ్యర్ధం కాకుండా నిత్యం భగవదారాధన చేయాలి. సేకరణ
*********************

కామెంట్‌లు లేవు: