18, ఫిబ్రవరి 2021, గురువారం

అమ్మా శారదా

 హఠాత్తుగా డ్రైవరు చెప్పాడు “సార్ సార్ నేను బ్రేకు పైన కాలు తీసేసాను అయినా బస్సు వెనక్కు పడిపోవడం లేదు. ఒక వంద మంది వెనక నిలబడి బస్సును పట్టుకున్నట్టుగా బస్సు ఆగిపోయింది. ఏమి భయపడకండి. నేను మెల్లిగా బస్సును తిప్పుతాను” అని తన ప్రయత్నం మొదలు పెట్టాడు. కాని మేము నామఘోష ఆపలేదు.


హమ్మయ్య చివరగా డ్రైవరు బస్సును తిప్పాడు. అందిరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలు. సరిగ్గా ఒకటిన్నరకు శృంగేరి సంస్థానం ప్రవేశ ద్వారం చేరుకున్నాము. మాకోసం ఎదురు చూస్తున్న నాగేశ్వర గణపదిగళ్ మమ్మల్ని చూడగానే నవ్వుతూ, “రండి రండి మీరందరూ మద్రాసు నుండి వస్తున్నారు కదూ? ముందు కాళ్ళు చేతులు కడుక్కుని కొద్దిగా తినండి. చలా ఆకలిగా ఉన్నారు. మీ కోసమని అన్నం ఉప్మా, వంకాయ గొజ్జు సిద్ధం చేసాము” అని అన్నారు. 


”శాస్త్రిగారు మేము వస్తున్నామని మీకు ఎలా తెలుసు? మేము మీకు జాబుకూడా రాయలేదు” అని అడిగాను. అతను నవ్వుతూ, “అవును నిజం. మీరు వస్తున్నారని మావంటివారికి తెలియకపోవచ్చు. కాని లోపల ఉన్న త్రికాలవేదులు శ్రీ మహాసన్నిధానం వారికి అంతా తెలుసు. మీకు తెలుసా, దాదాపు పదకొండు గంతలప్పుడు స్వామి వారు నన్ను పిలిచి, ‘శారదాంబ దర్శనం కోసం 54 మంది భక్తులు వస్తున్నారు. వారు చాలా ఆకలిగొని ఉంటారు. మీ వాళ్ళకి చెప్పి అన్నం ఉప్మా వంకాయ గొజ్జు తయారుచేఏయించి సిద్ధంగా ఉంచు. అలాగే వారు కోసం ఒక పెద్ద హలును సమకూర్చు’. అన్నీ ముగించుకొని మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను ఇక్కడ నిలబడ్డాను” అని మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసారు. 


శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దూరదృష్టి, వారి అవ్యాజమైన కరుణని తలచుకొని నేను ఆశ్చర్యపోయాను. నా కళ్ళ వేంట నీరు వచ్చింది. అది శాస్త్రి గారు “దీనికే మీరు ఆశర్యపోతున్నారు. రేపు ఉదయం మీకు మరొక విషయం కూడా చెప్తాను. మీరు అది విని ఇంకా ఆశ్చర్యపోతారు” అని అన్నారు. అరిటాకులపై వేడి వేడిగా అన్నం ఉప్మా, వంకాయ గొజ్జు వడ్డించారు. మా కడుపులు నిండుగా తిని ఆ రాత్రికి విశ్రమించాము. 


మరుసటి రోజు ఉదయం తుంగా నదిలో మా స్నానాలు ముగించుకొని దక్షిణామ్నాయ శృంగేరి పీఠాధీశ్వరులు మహాసన్నిధానం శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దర్శనానికి బయలుదేరాము. రాత్రి మేము కలిసిన శాస్త్రి గారు కూడా మాతోనే ఉన్నారు. 


నేను వారికి రెండుచేతులు జోడీంచి నమస్కరించి “నిన్న మీరు మాకు ఇంకొక విషయం చెబుతాను అన్నారు. దయచేసి చెప్పవలసిందిగా వేడుకుంటున్నాను” అని వారిని ప్రార్థించాను. 


వారు చెప్పడం ప్రారంభించారు “రాత్రి దాదాపు 12:00 గంటల సమయంలో మహాసన్నిధానం వారు వారి ఏకాంత మందిరంలో కూర్చుని శాస్త్ర సంబధమైన పుస్తకాలు చూస్తున్నారు. నేను బయటి గదిలో కూర్చున్నాను. హఠాత్తుగా బయటకు వచ్చి స్వామి వారు తమ రెండు చేతులని గోడకి ఆనించి గట్టిగా అదుముతూ, ఏదో మంత్రం చదవనారంభించారు. నేను లేచి నిలబడ్డాను. వారిని చూస్తే ఆ గోడ పడకుండా ఆపుతున్నట్టు ఉంది. నాకు ఏమి అర్థం కాలేదు. 


ఒక ఐదు నిముషాల తరువాత గోడపైనుండి చేతులు తీసి, మహాసన్నిధానం వారు నా దగ్గరకు వచ్చి ‘నేను ఇలా గోడకు చేతులు అడ్డుపెట్టి జపం చెయ్యడం చూసిన నీకు వింతగా అగుపిస్తోది కదూ. ఏమి లేదు! మద్రాసు నుండి శారదాదేవి దస్ఱనానికి వస్తున్న బస్సు దారి తప్పింది. వారు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నామని తెలుసుకుని బస్సును వెనక్కు తిప్పుతుండగా, బ్రేకులు పడక లోయలోకి పడిపోతోంది.


అందులో ఉన్న భక్తులు గట్టిగా "అమ్మా శారదా! కాపాడు కాపాడు" అని అరిచారు. అందుకనే గోడకి నా చేతులను అడ్డుపెట్టి ఆ బస్సు పడకుండా ఆపాను. ఇప్పుడు అంతా సవ్యంగా ఉంది. బస్సు శృంగేరి వైపు వస్తోంది. నీవు వెళ్ళి నేను ఆనతిచ్చినట్టుగా వారికి అన్నీ సిద్ధం చెయ్యి’ అని చెప్పి వారు గదిలోకి వెళ్ళిపోయారు. నేను ఇదంతా విని స్థాణువైపోయాను.” ఇది విని మేమందరమూ ఉండబట్టలేక కన్నీరు కారుస్తూ, ఆ నడయాడే శారదా దేవిని చూడటానికి బయలుదేరాము. 


శ్రీవారికి సాష్టాంగం చేసి నిలుచున్న నావైపు చూసి, శ్రీ శ్రీ శ్రీ మహాసన్నిధానం వారు నవ్వుతూ, మాకు హెచ్చరిక చేస్తున్నట్టు “మహాత్ములు చెప్పినదాన్ని ఎప్పుడూ వినాలి. దాన్ని తప్పకుండా పాటించాలి. అలాకాకుండా ప్రవర్తిస్తే జరగవలసినవి ఏవి సరిగ్గా జరగవు. ఏమిటి అర్థమైందా?” అని అన్నారు. మహాసన్నిధానం వారు చెప్తున్నది కంచి పరమాచార్యులు వారు మాకు ఆజ్ఞాపించినదాని గురించే అని నాకు అర్థమైంది.


--- శ్రీ రమణి అన్న, శక్తి వికటన్ ప్రచురణ


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


https://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: