21, సెప్టెంబర్ 2021, మంగళవారం

హుహు ? ఎక్కడి వాడు ?

 ఎవరీ హుహు ? ఎక్కడి వాడు ?

________________________________


(1) 

(అ) ద్రోణి > దొన > కొండమీది నీటిగుంట.

(ఆ) ద్రోణి > దోసె > చిన్నపడవ

(ఇ) ద్రోణి > దోని > అమ్ములపొది.


(2) వాడికి కాస్తా మకరు, చెప్పిన మాట వినడు.

(అ) మకురు > మూర్ఖుడు

(ఆ) మకురు > మొండి


(3) అప్పటి స్నానాలు ఐదురకాలు

(అ) ఆగ్నేయము > వళ్ళంతా విభూది పూసుకోవడం. అప్పటి విభూది రోగక్రిమినాశిని, అందుకే పూసుకొనేవారు.

(ఆ) వారుణం > నీటిలో మునిగి స్నానంచేయుట.

(ఇ) బ్రాహ్మ్యము > మంత్రపఠనం చేస్తూ దర్భలతో నీటిని వదలుట.

(ఈ) వాయువ్యం > సాయంత్రం గోవులు ఇంటికి వచ్చే సమయంలో రేగిన గోదూళిని తలపై పడునట్లుగా చేసుకొనుట.

( ఉ) దివ్యం > ప్రొద్దున సాయంత్ర సమయంలో ఎండలో నిలబడుట.


(4) హుహు > గజేంద్రమోక్షఘట్టంలో కొలనులో మొసలిగావుండి ఏనుగుకాలును పట్టుకొని పీడించినది హుహు అనే గంధర్వుడే. ఇతను పూర్వం దేవమునుల శాపం వలన మొసలిగా భూలోకంలో పడివుంటాడు. అగస్త్యమహముని శాపవశాన ఇంద్రజ్ఞమునుడు అనే రాజు ఏనుగుగా జన్మిస్తాడు. ఈ ఇద్దరిని రక్షించి ఆ శ్రీ మహావిష్ణువు ముక్తిని ప్రసాదించాడు. అదే గజేంద్రమోక్షం.


(5) హస్తినాపురం > పూర్వం ధ్రితరాష్ట్ర అనే రాజుండేవాడు. దుర్యోధనుడి తండ్రి ధృతరాష్ట్రునకు చాలా పూర్వీకుడీ ధ్రితరాష్ట్ర.ఇతనికి కుండికా, హస్తి, వితార్కా, క్రాత, హవిహ్రవస్, ఇంద్రభా, సుహోత్రుడు,భూమన్యు అనే ఏనిమిదిమంది సంతానం.

వీరిలో హస్తి అనేవాడే హస్తినాపుర నిర్మాత, ఇతనికి ఇది రాజధాని కూడా.

గంగానది ఒడ్డున వుంది.

దుర్యోధనుడు తన కుమార్తె లక్ష్మణకు స్వయంవరం ప్రకటించినపుడు శ్రీకృష్ణుని కొడుకు సాంబుడు ఆమెను ఎత్తుకుపోతాడు.

కౌరవులు సాంబుడిని బంధించి చెరశాలలో వుంచుతారు.

కోపించిన బలరాముడు హస్తినకు వచ్చి హస్తినాపురాన్ని గంగలో కలపటానికి నాగలి ద్వారా నదిని లాగటానికి ప్రయత్నిస్తాడు.

దుర్యోధనుడి శాంతింపచేసి లక్ష్మణను సాంబుడికిచ్చి పెండ్లిచేస్తాడు.

హస్తిన కౌరవుల రాజధాని. పూర్వపు హస్తిన గంగలో మునిగిపోయింది.


(6) పూజలు పుణ్యహవాచనముతో మొదలుపెట్టడం అనవాయితి.పుణ్యహము అంటే పుణ్యం, పుణ్యదినం. పుణ్యహవాచనమంటే పుణ్యహ అనే మాటను ముమ్మారు (మూడు సార్లు) ఉచ్ఛరించడం.


(7) తలకొరివి పెట్టడం > చితిపై ప్రేతంయొక్క తలకు కొరివి పెట్టడం.


(8) ఎదురుకోలు > వివాహానికి తరలి వచ్చిన వరున్ని అతని బంధువులను వధువు తరపువారు ఎదురెళ్ళి అహ్వానించడం.


(9) ఇనుమడించడం > ఇనుమారు > ఇను > రెండు. ఇనుమడించడమంటే రెండు రెట్లుగా పెరగడం. ఇమ్మడి నరసింహరాయలు > ఇమ్మడి > రెండు > రెండో నరసింహరాయలు.


(10) ఇనుమారు ముమ్మారు > ఇనుమారంటే రెండు రెట్లనిపైన చెప్పుకొన్నాం. ముమ్మారంటే మూడురెట్లు.ఇనుమారు ముమ్మారుగా అభివృద్ధి చెందడమంటే 2 రెట్లు 3 రెట్లుగా పెరగడం.

ముమ్మడి నరసింహరాయలు > ముమ్మడి > మూడు > మూడో నరసింహరాయలు.


॥సేకరణ॥

__________________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కామెంట్‌లు లేవు: