23, అక్టోబర్ 2021, శనివారం

నైవేద్యము

 🌿🌿🌿🌿🌿🌿🌿


ఒక దేవాలయంలో బ్రాహ్మణుడు ప్రతిరోజు బిక్షాటన చేసుకొని వచ్చి, వచ్చిన ద్రవ్యముతో భగవంతునికి నైవేద్యము పెట్టేవాడు..


🌸🌿🌸🌿🌸


ఆ నైవేద్యాన్ని భక్తులకు పంచేవాడు .అలా కాలము గడుచుతున్న సమయంలో ఒక రోజు ఒక కోటీశ్వరుడు దేవాలయమునకు వచ్చాడు. ఆ కోటీశ్వరుడిని చూడగానే బ్రాహ్మణుడి మనసులో ఒక ఆలోచన వచ్చింది .కోటీశ్వరుడు దేవాలయమునకు వచ్చాడు కదా.. ఈరోజు ఈయన వేసే ధనముతో రేపు స్వామి వారికి మంచి భోజనం పెడదాము అని మనసులో అనుకున్నాడు బ్రాహ్మణుడు. 


 కోటీశ్వరుడు లోపలికి రాగానే యోగ సమాచారాలను కనుక్కుని ఆయన పేరుమీద అర్చన చేసి మంగళహారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆయన వేసే దక్షణ కోసము ఎదురు చూస్తున్నాడు బ్రాహ్మణుడు.


 అప్పుడు ఆ కోటీశ్వరుడు జేబులో చేయిపెట్టి 2000 రూపాయల నోటు తీసాడు బయటకి.మళ్ళీ జేబులో చేయి పెట్టి 500,100,50,20,10,5 నోట్లు తీసాడు వరుసగా బయటకి. అప్పుడు బ్రాహ్మణుడు మనసులో అనుకుంటాడు 2685 రూపాయలు ఇస్తున్నాడు ఈయన. కాబట్టి స్వామివారికి 4 రోజులు మంచిమంచి నైవేద్యము చేసి పెట్టవొచ్చు అనుకుంటాడు.మళ్ళీ కోటీశ్వరుడు జేబులో చేయిపెట్టి రెండు రూపాయల బిళ్ళ బయటకు తీసి మిగతా ధనాన్ని అంతా జేబులో పెట్టుకొని రెండు రూపాయలు బ్రాహ్మణుడి చేతికి ఇచ్చి కాళ్ళు మొక్కి పోతాడు.


 ఆ రెండు రూపాయల బిళ్ల ను చూడగానే బ్రాహ్మణుడికి మూర్చ వచ్చి కిందపడతాడు.


  ఈ విషయాన్ని గమనించిన భగవంతుడు మారు 

వేషము లో వచ్చి బ్రాహ్మణుడి ముఖం పై నీళ్ళు చిలకరించి లేపి ఏమైంది స్వామి అని అడుగుతాడు బ్రాహ్మణుడిని.( మారువేషంలో వున్న భగవంతుడు)


 అప్పుడు ఆ బ్రాహ్మణుడు జరిగిందంతా పూర్తిగా వివరిస్తాడు .


 అప్పుడు మారు వేషం లో వున్న భగవంతుడు ఇలా చెబుతాడు..


 భగవంతుని దృష్టిలో అందరూ సమానమే కాని ధనము ఉండి కూడా దాన ధర్మములు చేయనివాడు మళ్లీ జన్మలో కాకిగా పుడతాడు. ధాన ధర్మాలు చేస్తూ కాలము గడిపేవాడు దేవాలయాలలో గోమాతగా పుడుతాడు.అంతే కాని వాళ్ళు ఇంత ఇస్తారు.. వీళ్ళు ఇంత ఇస్తారు అనే ఆలోచన పెట్టుకోకు స్వామి అని వెళ్లి పోతాడు.


ఈ కథలో సారాంశం ఏమిటంటే ఎవరిమీద ఆశ పెట్టుకోకు ఇచ్చేవాడు ఇస్తాడు ఇవ్వనివాడు ఇవ్వడు అంతేకాని ఎవరినీ నిందించకు అని అర్థము .


అన్నింటినీ ఆ భగవంతునికే వదిలేయి. ఆయనే చూసుకుంటాడు.

కామెంట్‌లు లేవు: