12, సెప్టెంబర్ 2022, సోమవారం

ఈశ్వరార్పణం చేసి,

 భగవంతుని కి నివేదింపక,పర ప్రొణికి పెట్టక పంచభక్ష్య పరమాన్నములను ఆరగించిననూ విషము తినినట్లేయగుననియు,ఈశ్వరార్పణం చేసి,భూతకోట్ల కింత త్యాగం చేసి,గంజి త్రాగిననూ,అది అమ్రుతమేయగు ననియూ భగవద్గీత లో వెల్లడిఃపబడినది.

మరియూ మానవుడు తన నిత్య జీవితంలో ఏదైనా కోయునప్పుడు,నూరునప్పుడు,విసరుచున్నప్పుడు,వండునప్పుడు,ఊడ్చునప్పుడు, తెలియకుండా కొంత ప్రాణిహింస జరుగుతుంది.

దానినే పంచ సూనములందురు.

ఆ పాపమును పరిహరించుటకు

పంచమహాయజ్ణములు ఏర్పడు చున్నవి.అవి ఏవన 1.దేవయజ్ణం

(హోమం)2.పిత్రు యజ్ఞం (తర్పణం)3.న్రుయజ్ణం(అతిధి పూజ)4.బ్రహ్మయజ్ణం(వేదాధ్యయనం)5.భూతయజ్ణం(ప్రొణులకు

అన్నివైపులా). కావున ఇవి అన్నియూ భగవదారాధన రూపములై,పరోపకార సంబంధములైనట్టి ఇతరములునునగు యజ్ఞం లు నాచరోంచుచు, యజ్ఞశేషమును

మాత్రము భుజించుచు నుండు వారు పొపరహితులై, క్రమముగా పరమశ్రేయము నొందగలరని భగవానుడు తెల్పుచంన్నాడు.

కామెంట్‌లు లేవు: