12, సెప్టెంబర్ 2022, సోమవారం

అస్త్రాలన్నీ మిస్సైల్సే

 Intersting Article. Forwarding as received.


*మహాభారత యుద్ధం లో అస్త్రాలన్నీ మిస్సైల్సే!*


18 రోజులు జరిగిన మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొంది.


అసలు అక్షౌహిణి అంటే ఎంత? ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురితో కాల్బలం (పదాతి దళం) కలిసిన సైన్యానికి ‘పత్తి' అని పేరు. అనగా 1:1:3:5 నిష్పత్తిలో ఉంటుంది సేన. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖము' అంటారు. మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు. సేనాముఖానికి మూడు రెట్లను ‘గుల్మము' అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణము' ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహిని'. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 2432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు. వాహినికి మూడు రెట్లు ‘పృతన' అంటే 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లు. పృతనకు మూడు రెట్లు ‘చమువు' ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు.చమువుకు మూడు రెట్లు ‘అనీకిని'. ఇందులో 2187 రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10925 మంది కాలిబంట్లు వుంటారు. అనీకినికి పది రెట్లయితే ‘అక్షౌహిణి' అవుతుంది. అంటే అక్షౌహిణిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది కాల్బలము వుంటారు. 


ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,890 గుర్రాలు, 19,88,330 కాల్బలము అన్నమాట. 


ఇక్కడ మరో విషయాన్ని తెలియజేయాలి. ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధవీరునితోపాటు ఒక సారథి కూడా వుంటాడు. కాబట్టి సారథులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రథబలం 7,87,320 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క ఏనుగు మీద యుద్ధవీరునితోపాటు ఒక మావటీవాడు కూడా వుంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నింటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణుల్లో పాండవ బలం మాత్రం 7 అక్షౌహిణులు, కౌరవ బలం 11 అక్షౌహిణులు.


మహాభారత యుద్ధంలో అస్త్రాలు మహాభీకర యుద్ధానికి దారితీశాయి. దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావించారు. ధనుస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలేమై వుండవచ్చు?

దాదాపు 7 వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయానకమైన రసాయనిక అస్త్రాలు వినియోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి వుంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి వుండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం 7 వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి వుండవచ్చు? 


అత్యంత ఆసక్తికరమైన ఈ అంశాలపై ప్రత్యేక కథనమిది...


హరివంశం చరిత్రాత్మక గ్రంథం. చరిత్రాత్మకంగా ఏ సంఘటన ఎప్పుడు జరిగిందో ఇదమిత్థంగా తెలియచెప్పేదే చరిత్ర. చరిత్రాత్మక సంఘటనలకు రుజువులు లభ్యమవుతాయి. కుణాలుడు రాసిన మాగధ (మగధ రాజ్య) చరిత్ర, కల్హణుడు రాసిన రాజతరంగిణి ఆయా రాజుల జనన మరణాల గురించి తేదీలతో సహా విశదంగా వివరించబడ్డాయి. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీ కృష్ణద్వైపాయనుడు రాసిన హరివంశం కూడా. రాజతరంగిణి రచనలో ఆయా రాజుల జనన మరణాల గురించి తేదీలతో సహా విశదంగా వివరించబడింది. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీ కృష్ణద్వైపాయనుడు రాసిన హరివంశం కూడా రాజతరంగిణి లాంటి చరిత్రాత్మక గ్రంథమే. 16,374 శ్లోకాలు వున్న ఈ గ్రంథంలో సూర్యవంశపు రాజుల చరిత్ర, చంద్రవంశపు రాజుల చరిత్ర వున్నాయి.


క్రీ.పూ. 7536 సంవత్సరంలో శ్రీ కృష్ణద్వైపాయనుడు హరివంశం రాసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. హరప్పా మొహంజదారో నాగరికతలకన్నా దాదాపు మూడువేల సంవత్సరాల క్రితం హరివంశం రాసినట్లు తెలుస్తోంది. వ్యాసపీఠానికి ఆద్యుడు శ్రీ కృష్ణద్వైపాయనుడని అంటారు. హరివంశ చరిత్రలో సరస్వతీ నదిని గురించిన ప్రస్తావన వుంది. ఎటొచ్చీ హరివంశం ఒక చరిత్రాత్మక గ్రంథం. క్రీ.పూ. 22 డిసెంబర్‌ 5561న ఉత్తరాయణంలో భీష్ముడు ప్రాణత్యాగం చేసినట్లు వ్యాసుడు రాశాడు. హరివంశం శ్రీ కృష్ణద్వైపాయనుడు రాయటం ప్రారంభించిన తర్వాత ఆ హరివంశ చరిత్రలో వ్యాసపీఠాధిపతులు చారిత్రాత్మక సంఘటనలను నమోదు చేస్తూ వచ్చారు.


*మహాభారత యుద్ధ కాలం*


దీని ప్రకారం భీష్ముడు 58 రాత్రులు అంపశయ్యపై శయనించి జీవించాడని తెలుస్తుంది. భీష్ముడు సైన్యాధిపతిగా పది రోజులు యుద్ధం చేశాడు. పదో రోజు సాయంత్రం శిఖండితో యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో అస్త్రసన్యాసం చేశాడు. అంటే 68 రోజుల పూర్వం మహాభారత యుద్ధం ప్రారంభమైందన్నమాట. 22 డిసెంబర్‌ 5561లో భీష్ముడు ప్రాణత్యాగం చేశాడు గనక మహాభారత యుద్ధం సరిగ్గా క్రీ.పూ. 16.09.5561న ప్రారంభమైంది. 18 రోజులు జరిగిన ఈ అత్యంత భీకరమైన యుద్ధంలో 92 లక్షల మంది మరణించినట్లు హరివంశంలో వుంది. మహాభారత యుద్ధ చరిత్రలో సైతం దాదాపు ఈ సంఖ్యనే (89 వేలు) అని నమోదు చేశారు.


దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చాలామంది చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావిస్తారు. బ్రహ్మశ్రీ కోట వేంకటాచలం గారు వ్రాసిన   మహాభారత యుద్ధకాలం అనే గ్రంథంలో ఈ యుద్ధం అత్యంత భీకరంగా జరిగినట్లు వర్ణించారు. ధనుస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలేమై వుండవచ్చు?


దాదాపు 7వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయానకమైన రసాయనిక అస్త్రాలు వినియోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి వుంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి వుండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం 7 వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి వుండవచ్చు?


భారతదేశంలో అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కాలం వరకూ నారదుడు భూలోకంలో సంచరించినట్లు భాగవతంలో వుంది. ఈ నారదుడు 372 కాంతి సంవత్సరాల దూరంలో "ఎబ్సులా"అనే నక్షత్ర మండలంలోని "బర్హోస్‌" అనే గ్రహానికి చెందినవాడుగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కాంతికన్నా వేగంగా ప్రయాణించే సాంకేతిక పరిజ్ఞానం వుండేదనీ "సిరియా"లోని పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలింది.

అస్త్ర శస్త్ర తయారీలో వీరు నిపుణులు. వివిధరకాలైన అస్త్రాలు (మిస్సైల్స్‌) వైవిధ్యమైన ధనుస్సులు (లాంచర్స్‌) పరిజ్ఞానం శ్రీకృష్ణుని సహకారంతో పాండవులకు లభించినట్లుగా తెలుస్తోంది. ఖాండవ దహనం సందర్భంలో అగ్నిదేవుడు శ్రీకృష్ణునికి అర్జునునికి ఇచ్చిన సుదర్శనచక్రం, గాండీవం (లాంచర్‌), అక్షయ బాణ తూణీరాలు (మిస్సైల్స్‌) రసాయనికి ఆయుధాలుగానే పరిగణిస్తున్నారు. ఖాండవ దహనం సందర్భంగా అర్జునునికి ఇంద్రునికీ జరిగిన యుద్ధం ఒకరకంగా స్టార్‌వార్‌ గానే భావించవచ్చు. దాదాపు 3 వేల ఎకరాల్లోని ఖాండవ వనం యావత్తూ ఈ రసాయనిక అస్త్రాల వినియోగం వల్ల కాలి బూడిదైపోయింది.


ఈ అస్త్రాలను వినియోగించేందుకు పాస్‌వర్డ్‌లాంటి  అక్షరాలను (మంత్రాలను) ఉచ్ఛరించేవారని కొందరు పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. రసాయనిక అస్త్రాలను ట్రిగ్గర్‌ లాంటి ఒక పరికరాన్ని వొత్తిడికి గురిచేసి భయానక విస్ఫోటం కలిగించేవారని మరికొందరు విశ్లేషిస్తున్నారు.


మహాభారత యుద్ధంలో రిమోట్‌ కంట్రోల్‌తో పాస్‌వర్డ్‌ను గ్రహించి విస్ఫోటనం కలిగించేవారని కూడా కొందరు శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు.


రిమోట్‌ ద్వారా అస్త్రాల ప్రయోగం:


మహాభారత యుద్ధంలో అస్త్రాలు మహా భీకర యుద్ధానికి దారితీశాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం శ్రీకృష్ణునికీ భీష్ముడికీ అర్జునునికి కర్ణుడికీ అభిమన్యుడులాంటి 36 మంది మహారథులకు మాత్రమే వుండేదని భావిస్తున్నారు. 


జిపిఎస్‌ పరిజ్ఞానం మహాభారత యుద్ధంలో వారికి వుంది అనడంలో ఆశ్చర్యంలేదు. 


7 వేల సంవత్సరాల క్రితమే రసాయన ఆయుధాలను తయారుచేయగల సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారికి జిపిఎస్‌ అడ్వాన్స్‌డ్‌ జ్ఞానసంపత్తి తెలిసి వుండడంలో ఆశ్చర్యంలేదు. .

ప్రతి అస్త్రాన్ని ఉపయోగించ దలచుకొన్నా ఆ అస్త్రం కోడ్‌ నెంబరూ తనకు కేటాయించిన పాస్‌వర్డ్‌ (మంత్రం) ఉచ్చరించినంత మాత్రముననే టెలీపతీ తరంగాల ద్వారా, గ్రహాంతర సాంకేతిక యుద్ధ నిపుణునికి క్షణాల్లో చేరటంతో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆ అస్త్రం (మిస్సైల్‌) శత్రువులను నాశనం చేయగలిగేదని ఊహిస్తున్నారు.


ఇలాంటి ఊహ నిజం అనుకోవడానికి గల మౌలిక కారణం ఈ మహాభారత యుద్ధంలో లక్షలాదిమంది మూకుమ్మడిగా హతం కావడమే!


అయితే కొన్ని సాధారణ అస్త్రాలు (మిస్సైల్స్‌) వినియోగించే నైపుణ్యం యుద్ధం చేసేవాడికే వుండేది. కొన్ని అస్త్రాలకు "ఐపీ" అడ్రసులు సైతం వుండి వుండవచ్చని జర్మనీకి చెందిన కొల్విన్‌ హెచ్చర్‌ అంటున్నారు. మహాభారత యుద్ధం జరిగిన విధానంపై హెచ్చర్‌ 22 సంవత్సరాల క్రితమే పరిశోధన చేసి పి.హెచ్‌.డి. పట్టా పొందాడు. 


అయితే ఈ అస్త్రాలన్నీ (మిస్సైల్స్‌) ప్రస్తుతం ఉపయోగిస్తున్న శాస్త్ర పరిజ్ఞానానికన్నా భిన్నంగా వుండే అవకాశాలు వున్నాయి.


మహాభారత యుద్ధంలో ఉపయోగించిన శస్త్రాల్లోనుంచి భయానకం గామా కిరణాలు సైతం వెలువడి వుండవచ్చు. ఈ గామా కిరణాలకు శత్రువు శరీరాన్ని తుత్తునియలు చేసే అవకాశం వుంది. ధృతరాష్ట్రునికి సంజయుడు మహాభారత యుద్ధం గురించి ప్రత్యక్షంగా వివరిస్తూ కౌరవుల తరఫున, పాండవుల తరఫున చాలామంది యోధులు తుత్తునియలై పడిపోతున్నారని చెపుతాడు. మహాభారత యుద్ధంలో అస్త్రాలను ఎదుటివాడిపై ప్రయోగించడానికి మాత్రమేకాక స్వీయరక్షణకు సైతం వినియోగించినట్లు వ్యాస మహాభారతంలో వుంది.


ఆధునిక సాంకేతిక యుద్ధ అస్త్రాల్లో "టెస్లాషీల్డ్‌" అనే అస్త్రం (మిస్సైల్‌) వుంది. శత్రువు ప్రయోగించిన వందలాది అస్త్రాలను ఈ "టెస్లాషీల్డ్‌" అనే అస్త్రం నిర్వీర్యం చేస్తుంది. అంటే ఈ అస్త్రం స్వీయ రక్షణకన్నమాట. 


ఇలాంటి అస్త్రాలు సైతం మహాభారతంలో వినియోగించబడ్డాయి. అర్జునుడు మహాభారత యుద్ధం జరిగిన తొలి రెండు రోజులూ శత్రువు ప్రయోగిం చిన అస్త్రాలనన్నింటినీ నిర్వీర్యం చేశాడని వ్యాసుడు రాశాడు. 


నిర్వీర్యం అంటే ఈ అస్త్రం నుంచి వెలువడే అత్యంత శక్తి శత్రువు ఉపయోగించిన అస్త్రాన్ని తాకి వెంటనే ఆవిరి చేస్తుంది.


మహాభారత యుద్ధంలో కోటికి పైగా యోధులు మరణించారంటే ఈ యుద్ధం మహాభీకరమైన అస్త్ర శస్త్రాలతో కొనసాగిందనే చెప్పాలి.

18 రోజుల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం సామాన్య యుద్ధంలో జరిగే పనికాదు. 


సామ్రాట్‌ అశోకుడు చేసిన కళింగయుద్ధంలో 16 వేల మందే మరణించారని చరిత్రకారులు రాశారు. మహాభారత యుద్ధంలో చాలా భయానకమైన న్యూక్లియర్‌ ఆయుధాలను వినియోగించి వుండాలని శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు.

ప్రతిరోజూ మూకుమ్మడి మరణాలు సంభవించి వుండాలి. మొహంజొదారో నాగరికత ఒకే ఒక్క రోజులో నాశనం అయి వుండవచ్చని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటం లాంటిదే "మొహంజొదారో" నగరంలో జరిగి వుండవచ్చన్నది శాస్త్రజ్ఞుల అనుమానం.


క్రీస్తుకు పూర్వం భూమిపైని మానవుల్లో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం వున్నట్లు ఇటలీకి చెందిన మిలన్‌ అనే పరిశోధకుడు 1979లో తను రాసిన "అటామిక్‌ డిష్ట్రక్షన్ ఇన్  3000 బి.సి"అనే పుస్తకంలో పేర్కొన్నాడు. కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో ఎపి సెంటర్‌ (భూకంపన కేంద్రం) వున్నట్టు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై కనపడ్డాయి. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు 3000 బి.సి. కాలం నాటివని తేలింది. రోమ్‌కు చెందిన ప్రొఫెసర్‌ అంటోనియో క్యాస్టెల్లానీ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోయినవారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించారు.


అస్త్రాల వివరాలు:


మహాభారతంలోని మౌసల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరాలు వున్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబులు వున్నాయని రాశారు. పది సూర్యులు ప్రసరించగల వేడిని పుట్టించే అస్త్రాలు వున్నాయని వుంది. ఒకేసారి వేయిమందిని భస్మం చేసే అస్త్రాలను వినియోగించారని పేర్కొన్నారు. వెంట్రు కలు, గోళ్ళు లాంటి వాటితోసహా దగ్ధం చేయగల మారణాస్త్రాలు వుండేవి.


మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. యుద్ధ గుడారాల్లోని భోజన పదార్థాలు సైతం సూక్ష్మక్రిములకు నిలయంగా మారాయి. వేలాదిమంది సైనికులు పారిపోయి నదీనదాల్లో మునిగి తేలుతూ ప్రాణాలు కాపాడుకొన్నారు.


మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని ఎవరూ ప్రయోగించలేదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల భూమి యావత్తూ నాశనం కావడమేకాక సముద్రాలు సైతం ఎడారులుగా మారతాయి. మహాభారత యుద్ధం ఒక చారిత్రక సత్యం. 


శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా వ్యూహాత్మకంగా యుద్ధం నడిపించగలిగాడు.


శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడు. అంతటి భీకర యుద్ధంలో తాను ఎలాంటి అస్త్ర్రాన్ని ప్రయోగించకుండా పాండవులకు విజయం సాధించి పెట్టి కౌరవులను భూమిపై లేకుండా చేయగలిగాడు....

కామెంట్‌లు లేవు: