7, ఫిబ్రవరి 2023, మంగళవారం

ఉరు తున్న విద్య కావలి

పిల్లలు కు ఉరు తున్న విద్య కావలి, (బావి లో నీరు తోడుతున్న నీరు  ఊరుతుంది )అలాంటి విద్య  కావలి. భగవద్గీత శ్లోకాలు, Morls (విలువ లు )కావాలి అప్పుడు సంస్కారం ఏర్పడి తుంది. కాని"" మనం కేవలం  డబ్బు తో  కొనుక్కునే విద్య నేర్పిస్తున్నాము "". భవిష్యత్ లో ప్రమాదం జరుగుతుంది. (కేవలం ""లాభం, నష్టం తో కూడు కొన్న విద్య నెరుపు తున్నాం )అది దాని వల్ల పెద్ద అయినా తరువాత "తల్లి తండ్రి ని చూడాలి అంటే లాభం నష్టం లు చూస్తారు ". తరువాత దేవుడు,ని మతం ని మార్చుతారు ". అది మనకు  అవసరం మా?(ప్రతి మనిషి పుట్టినది భగవద్గీత రహస్యం ములు తెలుసుకోవాడానికే అని మీకు తెలుసా? ఇది గమనించగలరు )అందుకే శరీరం సంపాదన  మాత్రమే కాకూడదు.

: శ్లోకం:☝️

*యథా రాత్రిః సమయః*

 *కథయతే న కథితమ్ ।*

*తథా మనః సమయే*

 *సతి న సతి కర్తవ్యమ్ ॥*


భావం: అసలు ఏమీ మాట్లాడకుండానే, మనస్సు ఏమీ ఆలోచించకుండానే, ఏ పనీ చెయ్యకుండానే రాత్రి గడిచిపోతుంది.

   సమయం నిరంతరం సాగిపోతూ వుంటుంది కనుక మన జీవితాలను మెరుగుపరచని విషయాలపై సమయాన్ని వృథా చేయకుండా, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిపెట్టాలని భావం.

[: *నేను 3 దోషములు/పాపములను చేశాను. నన్ను క్షమించు” అని ప్రాధేయ పడ్డారు శ్రీ ఆది శంకరాచార్యులు వారు.*

        

శ్రీ ఆది శంకరాచార్యుల వారు , శిష్యులతో కాశి విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు.


గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట


“నేను 3 దోషములు/పాపములను చేశాను. నన్ను క్షమించు” అని ప్రాధేయ పడ్డారు.


ఇది విన్న శిష్యులు “ఆచార్యులవారు, ఏమి పాపము లు చేశారని ప్రాయశ్చిత్త పడుతున్నారు ?” అని అనుకున్నారు.


ఒక శిష్యుడు, ఏమిటి ఆ పాపము నేను తెలుసుకోవాలి అని ఆచార్యుల వారిని అడిగాడు. దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు.


1. “నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను. సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుడిని చూడడానికి మటుకు కాశి నగరానికి వచ్చాను. అంటే మనసా వాచా కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను.


అది నేను చేసిన మొదటి దోషం. 


2. తైత్త్రియ ఉపనిషద్ లో “యతో వాచో నివర్తన్తే , అప్రాప్య మనసా సః ” భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు” ఇది తెలిసి కూడా శ్రీ కాశి విశ్వనాధ అష్టకం వ్రాశాను. ఇది నేను చేసిన రెండవ తప్పు. 


3. నిర్వాణ శతకం లో

“న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఃఖం. న మంత్రో న తీర్తం, న వేదా న యజ్ఞః

అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త. చిదానందరూపం శివోహం శివోహం“ అని వ్రాశాను. 


అర్థము :

నాకు పాప పుణ్యములు, సుఖ దుఃఖములు లేవు. మంత్ర జపములు తీర్థసేవలు , వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము, భోజనము, భోక్త (భుజించేవాడు) నేను కాదు!నేను చిదానంద స్వరూపుడను, శివుడను, శివుడను!


ఇంత వ్రాసికుడా నేను తీర్థయాత్రలు చేస్తున్నాను అంటే నేను వ్రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు. అందుకనే నేను చేసిన ఈ మూడు తప్పులని మన్నించమని ,ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను.


నీతి :


మన ఆలోచన, తీరు, మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి కథ మనకి తెలియజేస్తోంది.


*బయట ప్రపంచం మన పని తీరుని మట్టుకే చూస్తుంది. భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని , ఉద్దేశాన్ని కూడా చూస్తాడు.*


*“మనస్ ఏకం , వచస్ ఏకం , కర్మణ్యేకం!”*


ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధితో, ఆచరించి మనకు చూపించిన యధార్ధమైన మార్గము🙏

: శ్లోకం:☝️కవి ప్రశంస

*ఉదయంతు శతాదిత్యాః*

 *ఉదయంత్విందవః శతం l*

*న వినా కవివాక్యేన*

 *నశ్యత్యాభ్యంతరం తమః ll*


భావం: వంద సూర్యబింబాలు ఉదయించవచ్చు, నురు పూర్ణ చంద్రోదయాలు కావచ్చు. కానీ మానవ హృదయాల్లోనున్న అజ్ఞానాన్ని కవివాక్కు మాత్రమే పోగొట్టగలదు.ఏక కాలికమైన అంశాన్ని సార్వకాలికం చేసేవాడు కవి. వ్యక్తిగతమైన అంశాన్ని సమాజగతం చేసేవాడు కవి. క్షణికమైన దానిని శాశ్వతం చేసే వాడు కూడ కవే. బ్రహ్మానందంతో ఇంచుమించు సమానమైన ఆనందాన్ని తన కావ్యం ద్వారా పాఠకునికందిచే వాడు కూడా కవే!🙏

: 🙏 *శుభోదయం* 🙏 


ఎప్పుడైనా నలుగురికి పెట్టే చెయ్యి కావాలి మనది అనీ,...

మన చెయ్యి ఎప్పుడూ ఇచ్చే చేయిగా పైన ఉండాలి కానీ, తీసుకునేది గా కింద ఉండకూడదు అని....  

మన పెద్ద వాళ్ళు మనతో చెప్పడం మనకు తెలుసు...  

దీని యొక్క అంతరార్థం ఏమిటి అనేది నాకు ఇప్పుడు బోధ పడింది... 


*ఇచ్చేది ఎప్పుడూ శక్తిమంతమే .. తీసుకునేది ఎప్పుడూ బలహీనమే...* 


మనము అంటే జీవులం.... శరీర ధారులం... ఈ

జీవము లేదా ప్రాణము ఒక ఉపాధిని ధరించింది కాబట్టి జీవధారులం... 

అది ఒక ఉపాధిలో ఉంది కాబట్టి జీవాత్మ .. నిజానికి ఆ ప్రాణానికి, ఆ జీవానికి ఆకారం లేదు .అదే పరమాత్మ...

 

పరమాత్మ నిరాకారుడు... అశరీరి.. సర్వ శక్తిమంతుడు... సర్వవ్యాపకుడు... అవ్యక్తుడు..


జీవి శరీరి... వ్యక్తమై, ఒక రూపంతో ఉంటాడు ఒక దేహంతో ఉంటాడు కాబట్టి వ్యక్తి అంటున్నాము... 


*ఇక్కడే కొంచం జాగ్రత్తగా గమనిస్తే ..*. 


ఈ రూపానికి ఒక లక్షణం ఉంది... దేన్నైనా ఆకర్షించే లక్షణం.. అంటే తీసుకునే లక్షణం.. 


*దేహము అంటే శరీరం అని కదా అర్థం... మరి దేహి అంటే??* 


*దేహి అంటే యాచకుడు .. తీసుకునే వాడు, పుచ్చుకునే వాడు..* 


*దాత ఇచ్చేవాడు..*


 మామూలుగా అయితే *మనమంతా యాచకులమే... దాత పరమాత్మ మాత్రమే*... 


ఇక్కడే మన పెద్దలు దాతగా ఎందుకు ఉండాలన్నారు అనే దాంట్లో అంతరార్థాన్ని గ్రహిస్తే... 



*నేను - అహం.* ను .ఈ శరీరముగా భావిస్తే ఆకారం దాల్చుతుంది... అది అహంకారం... 

అప్పుడు అది యాచకత్వ లక్షణం కలిగి ఉంటుంది... 


*నేను - అహం* ను ఈ శరీరం కాదని భావిస్తే నిరాకారంగా మారుతుంది.. అప్పుడే శక్తిగా చైతన్యంగా నన్ను నేను తెలుసుకోగలను.. అప్పుడు అది దాతృత్వ లక్షణంతో ఉంటుంది ..


*శక్తి అంటే బలం అని అర్థం*

*ఆర్థికంగా బలంగా ఉంటే నలుగురికీ సహాయం చేయగలం...* 

*కండ బలం ఉంటే, ఆపదలో కాపాడ గలం..* *మానసిక బలం ఉంటే, ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వగలం...* 


*ఇక్కడ ఏం అర్థం అయ్యింది?* 


*ఇక్కడ ఇవ్వడం మాత్రమే ఉంది .. తీసుకోవడం లేదు...అంటే అది దాత లక్షణం .*


*మనము శక్తి మంతులం కావాలి.. నిరహంకారిగా ఉండాలి.. దాతగా మారాలి* 


*అహం* కు ఈ శరీరం జోడించి, అహంకారిగా ఉండ కూడదు.. 


*అహం* ను ఆత్మగా గుర్తించి శక్తి మంతులం కావాలి...  

అప్పుడు యాచకత్వ లక్షణం ఉండదు కాబట్టి నేను దాతను అవుతాను.. దాతృత్వం పరమాత్మ లక్షణం...... 


*అహంకారంతో జీవాత్మగా ఉండొద్దు .. "అహం" గా పరమాత్మగా ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలోని అంతరార్థం..*.


*ఇది కదా ఈ జీవి యొక్క పరమార్థం...*


అందరి చేయి పైనే ఉండాలని కోరుకుందాం ..


*తథాస్తు...తథాస్తు... తథాస్తు..*.

🙏🙏🙏🙏🙏🙏🙏

: 🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏


*గ్రంథం:* సర్వసమర్థుడు , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*పిలిచిన పలికే దైవం*


కనగర్ల ధర్మ లక్ష్మి గారు, భీమడోలు, ప||గో॥ జిల్లా, శ్రీ స్వామివారి మహిమను ఇలా వివరిస్తున్నారు.


మా ఇంటి పక్క నివసించే చెల్లాయమ్మగారు ఒకరోజు చాలా విచారంగా కూర్చోనున్నారు. నేను కారణమడిగితే తన బర్రెకు రొమ్ము దగ్గర కురుపు లేచి చాలా బాధ పడుతుందని, పడుకోలేక లేవలేక కష్టపడుతుందని, తన కుమారుడు రోజూ వేయించే 350/ ఇంజెక్షన్ ఈ రోజతడు లేని కారణంగా వేయించలేకున్నానని ఎంతో దీనంగా చెప్పింది. వెంటనే నేను ఆ బర్రెకు శ్రీ వెంకయ్యస్వామి వారి దారం కట్టి, విభూతి పెట్టి ఏమీ బాధపడవద్దు తప్పక తగ్గుతుందని ధైర్యం చెప్పి వచ్చాను.


ఆ రాత్రి నన్నెవరో తరుముకుంటునట్లు స్వప్నమొచ్చింది. నిద్ర లేచి ఆలోచించాను... శ్రీ స్వామివారు ఆ బర్రె జబ్బును తరుముతున్నారని తోచి శ్రీ స్వామి వారిని ఇలా ప్రార్ధించాను. "స్వామి నాకు కాదు మీరు కనిపించవలసినది, ఆ బర్రెగల చెల్లాయమ్మగారికి కనపడండి" అని చెప్పుకున్నాను. అదే రాత్రి నేను పూల చీర కట్టుకొని చెల్లాయమ్మ గారింట్లోకి వెళ్ళినట్లు ఆమెకు స్వప్నమొచ్చిందట. ఆమె నిద్రలేచి తలుపులన్నీ వేసి ఉంటే ధర్మలక్ష్మి ఇంట్లోకెట్లా వచ్చిందబ్బా అని ఆలోచించి పడుకున్నది. తెల్లవారికి ఆ బర్రెకు కురుపు కాదు గదా కురుపున్నచోట మచ్చ కూడా లేకుండాపోయింది.


ఆ కరుణామయుడు బర్రెకు నయం చేయడమే గాక, స్వామి తమరు చెల్లాయమ్మ గారికి కనిపించండి అని నేను చెప్పుకోగానే నా రూపంలో ఆమెకు స్వప్న దర్శనమిచ్చారు. పిలువగానే పలికే సద్గురుమూర్తిని తగినట్లు సేవించే భాగ్యమెమ్మని ప్రార్ధిస్తున్నాను..


🙏 *ఓం నారాయణ - ఆది నారాయణ*🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*ఆపద వచ్చాక ...వారిని ప్రార్థించడం... ఆపద తొలగించుకోవడం.. చాలా హీనమైన మార్గము*


         *అసలు వారి చరిత్ర పారాయణ , పూజ, ధ్యానం చేసుకుంటుంటే ....మనకు ఆపద రాకముందే ....దాని నుండి ఎలా తప్పుకోవాలో వారు ఆదేశిస్తారు.*


           *ఒక్కొక్కసారి అలాంటి ఆదేశం లేకుండా మనమే ఆ ఆపద తప్పుకునేటట్లు ప్రవర్తించేలా చేస్తారు.*


             *ప్రారబ్ధం బలీయంగా ఉంటే... ఆ ప్రారబ్దాన్ని స్వప్నాలలో అనుభవింప చేయడం కూడా కలదు*


        *కనుక వారిని ఆశ్రయించడంలో ఉన్నంత మేలు , ఇతరత్రా ఏ విధంగానూ లేదని నా స్వానుభవం తెలుపుతుంది.*


*అన్నదానం గొప్పదే అయిన అది ఆకలి తీర్చగలదు... కానీ హృదయ పరివర్తన కలిగించలేదు*


          *రాగద్వేష అసూయాది భావాల్లో గాని, సాటి వ్యక్తుల పట్ల, సంఘటనల పట్ల... మన యోచనా రీతిని గాని కించిత్ కూడా అన్నదానం మార్పును తేలేదు*


            *కానీ సత్సంగము ...మనుషులలో పరివర్తన తెచ్చి , ధర్మ ప్రవృత్తి కలిగించి ...జన్మ పరంపరలనే మారుస్తుంది . అందుకనే అట్టి విద్యాదానం ముల్లోకాలు దానమిచ్చినంతటి గొప్పదని భారతంలో వ్యాసుడు రాశాడు*


     *సాయిని ప్రచారం చేయి ....నీకు కలిగిన అనుభవాలు ఇతరులతో చెప్పు.... సాయి లీలామృతం ఇతరులకు ఇవ్వు ....దాని ఫలితం చాలా గొప్పది. ఎన్నో యాగాలు చేసిన ఫలితం వస్తుంది. నీవు చేయవలసిన ప్రచారం ఇదే.*


*మట్టి మట్టిలో,శ్వాస వాయువులో కలిసిపోతాయి....ఈ అవకాశం మరలా రాదు*

  

                  *ఈ వచ్చిన సదవకాశాన్ని... ఆస్తిపాస్తులు వెనకేసుకొనే - పిడకలేరుకునే పనికి స్వస్తి చెప్పి.... సద్గురువుని తెలుసుకునే కృషి చెయ్యి*


                  వారిని గురించి తెలుసుకున్నాక వారిని త్రికరణ శుద్ధిగా సేవించు* *ధనం అశాశ్వతం...భగవంతుడు ఇచ్చింది తరగదు...మానవులిచ్చింది నిలువదు.*


*సాయి మందిరం చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేశామన్నది లెక్కవేసుకోవడం కాదు... ఆ ప్రదక్షిణలలో.. ఎన్ని ప్రదక్షిణలు చేసినంతసేపు మన మనస్సు వారి దివ్య పాదారవిందములపై నిలిచిందో చూసుకో..*


             *ప్రదక్షిణల సంఖ్య కాకుండా, టైం పెట్టుకుని... నీ మనసు శ్రీ స్వామివారి చుట్టూ ఏ మారకుండా తిరిగేటట్టు చూడు*


*దత్త స్వరూపులు .. పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


🙏🌹🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: