5, అక్టోబర్ 2024, శనివారం

హైందవం వర్ధిల్లాలి 21*

 *హైందవం వర్ధిల్లాలి 21*




*ధర్మ ప్రచారకులు, ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, హిందు నాయకులు హైందవ జాగృతికై ప్రజలలోకి రావాలి*:- 

ii) సుభాషితము

*శ్లో! దేశ రక్షా సమం పుణ్యం, దేశ రక్షా సమం వ్రతం, దేశ రక్షా సమం యోగో, దృష్ట్యా నైవచ నైవచ*. 

అర్థం:- దేశ రక్షణతో సమానమైన పుణ్యం, వ్రతం, యోగము గాని లేదు గాక లేదు. *ఇది పెద్దలు చెప్పిన మంచి మాట*.


మనం  హైందవ ధర్మం, సంస్కృతి ననుసరించి ఏమిచేస్తూలేమా అంటే చేస్తున్నాము. జీవిత పర్యంతం దైనందిన భక్తి నివేదనలతో  బాటు ధర్మ బోధనలు వింటూ, నీతి శాస్త్రాలు చదువుతూ, పెద్దల ప్రవచనాలు ఆలకిస్తూ, శబ్ద, దృశ్య మాధ్యమాలలో భక్తి కార్యక్రమాలు తిలకిస్తూ, పండిత గోష్టులలో పాల్గొంటూ, సత్సంఘ మాధుర్యాలు గ్రోలుతూ, వీలు చిక్కినప్పుడు దేవాలయ సందర్శనలు, తీర్థ యాత్రలు చేస్తూ *చర్మచక్షువులు, కర్ణేంద్రియాల ద్వారా  బాహ్యానందం మరియు ఆత్మానందానికి మాత్రమే పరిమితమవుతున్నాము*. కాని ఏది ఆచరణలోకి తెచ్చుకోము. *అంటే*  సదరు చర్మచక్షువులు మరియు  కర్ణేంద్రియాల ద్వారానే దేశంలో ,  పొరుగు దేశాలలో,  కాశ్మీర్ లో  మరియు మనదేశంలోనే  ఇంకొన్ని  ప్రాంతాల్లో హైందవానికి, హైందవ అనుయాయులకు,  సంస్కృతికి జరుగుచున్న  హాని, కీడు గురించి చూస్తూ , వింటూ గూడా స్పందనారహితులుగా, చైతన్య హీనులుగా మరియు క్రియా శూన్యులుగా అధిక భారతీయులు ఉండడం ఎంత మటుకు  సమంజసం.  *పైద్ధలు చెప్పిన పై సుభాషితం ప్రకారం దేశ హితము, రక్షణ కంటే  అధికమైనది ఏది లేదు కదా*. ఆచరణ  శూన్యులైన వారు ఏమి చదివినా, ఏమి విన్నా, ఏమి చూసినా సార్థకత ఏమిటి. 


మహా భారతంలో చర్మచక్షువుల దృష్టి లేని (అంధత్వము) కురురాజు ధృతరాష్ట్రుడు "ప్రజ్ఞాచక్షువుల" ద్వారా కురుక్షేత్ర యుద్దాన్ని గమనించగలిగాడు, సంజయుడి వివరణతో బాటు. *అన్ని ఉన్న "అధిక భారతీయులు" ప్రస్తుత దేశ పరిస్థితిని ఎందుకు అవలోకించడం లేదు*. హైందవ ధర్మరక్షణ మరియు సంస్కృతి రక్షణ ప్రోత్సాహానికై ఎందుకు అగ్రగాములు కావడం లేదు.


మన దేశంలో ఎన్ని వర్గాల ప్రజలు ఉన్నా అందరిలో నిహితమై ఉన్న , ఏకత్వాన్ని, సమన్వయాన్ని, ఐకమత్యాన్ని  ఆసేతు హిమాచలం మళ్ళీ ఒకసారి పునరుద్ధరించడానికి  ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, ధర్మ ప్రచారకులు, హిందూ నాయకులు ప్రజల మధ్యకు రావాలి. ఈ సత్సంకల్పానికి రచయితలు, కవులు, గాయకులు, సామాజిక వైతాళికులు తోడు నిలవాలి. *కావున మన హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*. 


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: