10, ఫిబ్రవరి 2025, సోమవారం

భావశాంతి

 త్యాగరాజకృతి ఒక పెనుతుఫానువంటిది.


పల్లవి గానంచేయగానే రసికహృదయంలో భావోదయంతో ఒక అల్పపీడనం ఏర్పడుతుంది.


అనుపల్లవితో భావోద్వేగంపెరిగి ఒక తుఫానుగా మారుతుంది.


చరణంలోని సంగతులతో, నెరవులతో అది ఒక ప్రభంజనంగా మారి భావశబలతతో రసికహృదయతీరాలలో రసవృష్టి కురిపిస్తుంది.


కృతి అంతముకాగానే ఆ తుఫాను తీరందాటి భావప్రభంజనంతో కూడిన రసవృష్టి ఆగిన తరువాత భావశాంతి కలుగుతుంది....


త్యాగరాజకృతిలో  ఈ భావోదయము, భావోద్వేగము, భావశబలత, భావశాంతి కలిగించగలవారే నిజమైన, అత్యుత్తమ కళాకారులు.


అటువంటివారికి రసహృదయులంతా "దాసోహమ్"  అంటారు....


   -- ఆలమూరు విజయభాస్కర్

కామెంట్‌లు లేవు: