22, జులై 2020, బుధవారం

21-07-2020. నుండి శ్రావణమాసం ప్రారంభం.



31-07-2020.
శ్రీవరలక్ష్మి వ్రతమ్

03-08-2020.
శ్రావణ పౌర్ణమి - (రాఖీ)

11-08-2020.
శ్రీకృష్ణాష్టమి

19-08-2020.
పోలాల అమావాస్య.

శ్రావణ మంగళవారములు
21-07-2020. శుద్ధ పాడ్యమి.

28-07-2020. శుద్ద అష్టమి/నవమి.

04-08-2020. బహుళ పాడ్యమి.

11-08-2020. బహుళ అష్టమి.

18-08-2020. బహుళ చతుర్దశి / అమావాస్య.

శ్రావణ శుక్రవారములు:--
24-07-2020. శుద్ధ చవితి.
31-07-2020. శుద్ధ ద్వాదశి.
07-08-2020. బహుళ చవితి.
14-08-2020. బహుళ దశమి/ఏకాదశి.

ముఖ్య అభ్యర్ధన:--
కరోనా వైరస్ కారణం వల్ల - ఈ సంవత్సరం దయచేసి ఎవరూ - ఎవ్వరినీ నోములకి, పేరంటానికి, ఉద్యాపనలకి, ముత్తైదువకి, ముత్తైదువ భోజనాలకి ఇలా వగైరా... వగైరా లకి ఒకరినొకరు పిలుచుకోవద్దని సర్వజన శ్రేయస్సు కోసం **

ఎందుకంటే...
👉వచ్చినవారి కాళ్ళకి పసుపు రాయాలి.
👉కంఠానికి గంధం రాయాలి.
👉నుదుట బొట్టు పెట్టాలి.
👉తాంబూలం వగైరా... ఇవ్వాలి.

👉ఇవి లేకుండా శ్రావణమాసం నోములు వగైరా సాధ్యమా?

👉  ఈ పనులు ఈ కరోనా రోజుల్లో శ్రేయస్కరమా?

పేరంటం అయినా, ముత్తైదువ అయినా... ఇలా ఎవరైనా ఈ సంవత్సరానికి అన్నీ మీకు అమ్మవారు మాత్రమే.

దయచేసి - సంప్రదాయం అనే అక్కర తో అమాయకంగా - ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కరోనా వైరస్ వ్యాప్తి కి కారణం అవ్వద్దు.

👉పుణ్యం కోసం పోయి కరోనా (బహుశా) తెచ్చుకోవద్దు.

🙏అన్నీ తానే అయ్యి - ముత్తైదువ గా ఈ సంవత్సరం అమ్మవారు స్వయంగా మిమ్మల్ని కటాక్షిస్తోంది. దానికి సంతోషించండి
ఇరుగు-పొరుగు, చుట్టూ-పక్క, బంధువులు అంటూ ప్రతీ సంవత్సరం మనం చేసుకుంటున్న హడావుడి వల్ల - నిజానికి పూజ పై శ్రద్ధ తగ్గుతోంది అనేది వాస్తవం. కాబట్టి ... ఈ సంవత్సరం అటువంటి హడావుడి-అయోమయం లేకుండా అమ్మవారు కరుణిస్తోంది అనే సంతోషం తో పూజలు చేసుకోండి.
నైవేద్యాలు మీకు వీలైనట్టే చేసుకోండి.
ఒకవేళ ఏమీ చేసుకోలేకపోయినా - పళ్ళు, కొబ్బరికాయ తో సరిపెట్టుకోండి. తప్పేమీ లేదు.

హెచ్చరిక:--
పూజా సామగ్రి ఏమి తెచ్చుకున్నా.... (పువ్వులతో సహా....) సర్ఫ్ నీళ్లు లో కడిగి, మళ్లీ ఉప్పు కలిపిన మాములు నీళ్లలో కడుక్కుని- జాగ్రత్త పెట్టుకోండి.

కొసమెరుపు:- ఇంతలా ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే.... వర్ష ఋతువు కాబట్టి - శ్రావణమాసం లో ఈగలు ఎక్కువగా ఉండచ్చు. మార్కెట్స్ లో మరీ ఎక్కువగా ఉంటాయి. అవి అనేకమంది ఉమ్మిన  కఫము-ఉమ్మి పై వాలి- ఆ తర్వాత పువ్వులతో సహా అన్నిటిపై వాలచ్చు కదా!!
అర్థమై ఉంటుంది. అనుకుంటున్నాము.
పైగా శ్రావణ, భాద్రపదాల్లో సాధారణ జలుబు, దగ్గులు అందరికీ వస్తాయి. అందరూ మార్కెట్స్ కి కూడా వస్తారు మరి!!

ఈ శ్రావణమాసం లో
ముందుజాగ్రత్త పడడం -
కుటుంబానికి శ్రేయస్కరం.

OPEN LETTER TO Hon. PM

OPEN LETTER  TO Hon. PM SHRI NARINDER DAMODDAR DASS MODI JI....
👉🏻
💥I am a senior citizen and on 01.08.2012, I put Rs 40 lakhs in a nationalized Bank for 5 years.
👉🏻I was being paid an amount of Rs. 35,352/- every month (of course subject to income tax) enabling me to lead a worry free life financially. Now on maturity I have reinvested the amount in the same Bank and I will be paid Rs. 26,489/-;
shortfall of Rs8863/-*
👉🏻i.e. 25% over the previous return, per month.
👉🏻Can you please advise me from where I should make good the loss or sacrifice consumption of medicines or atta or dals or vegetables or fruit or milk or what?
👉🏻Practically  government after taking over in 2014 has done nothing for senior citizens. No additional facilities extended but withdrawal of what existed in 2014. No commodity or provision item is available at the price of 2014. Yes you have been able to bring down the figures of inflation and indices but not the actual prices. 👉🏻Every off and on the prices of some essential daily use items go rocket high like dals, chana/besan, salt, onion and now the tomatoes. At that time we cannot even dare see those items. .........😨
I know you have political and the theoretical replies for these issues like interest on deposits and advances in banks depend on demand and supply. 👉🏻The prices of daily use items vary with seasons being agricultural products. But the straight upward shoot of prices cannot be justified by these reasons.
👉🏻If the government wants to provide cheaper credits to the trades and industries, it should not be at the cost of depositors.
👉🏻 Banks are sitting over volcanoes of NPAs and all good money is being diverted for bad money.
👉🏻But is it not the duty of the government to enable the senior citizens to lead a respectable life who have spent their golden years in serving various organizations and finally the nation? Government cannot see the other way.
👉🏻 I am at a loss to understand from where this deficit of 25% be met.
👉🏻Is any of the minister/MP/MLA is ready to cut his salary and allowances by this percentage?  😡If not, then why the public especially the senior citizens?
👉🏻Perhaps it is because that, like you - we do not have the power to fix our own salaries, allowances and perqs and getting everything for full year, for sessions of total of 3 months and that too attending sessions at their sweet will. When the matter of increasing your salaries comes, you pass the same just in 2 minutes with no discussion, with all heads together be it from ruling or opposition benches. For this increase,
👉🏻you totally over look the cost to the exchequer, deficit, economics and any other factor.
👉🏻The government had started a scheme for deposits of senior citizens and the rate was 9.20% but In July, 14 it was reduced to 8.3%; which further reduced to 7.4%  in May 2020 . Further the maximum ceiling of deposit has been limited to Rs 15 lakhs only. This is totally unjustified. The rate should be a minimum of 12% and the amount limit should be equal to what a person gets as terminal benefits.
👉🏻 The government should ensure financial respectability to the senior citizens to walk with their heads straight.
👉🏻I am sure you will understand the plight of the people whose good part of expenses comes from the interest of their savings of life time.
👉🏻Sorry if I have offended you in any way.
Thanks and Regards

-All Sr. Citizen members 🤔

శంకా సంకుచితాంతరంగులు కురుక్షేత్రంలో రాణించగలరా?

మూడు శతాబ్దులముందువరకు యావత్ప్రపంచానికి కావలసిన అన్నివస్తువులను తయారుచేసిఇచ్చిన భారతదేశం ఈనాడు తమప్రజలకు అవసరమైన వస్తువులు తయారుచేసుకోలేదా?నిజంగానే భారతజాతి స్థితి ఇంతగా దిగజారిందా?

 నేడు సగటుభారతీయుడు కురుక్షేత్రంలో అడుగుపెట్టిన అర్జునుడులా ఉన్నాడు. తన రక్తంలో, తన సంప్రదాయంలో, తన దేశపు కళలలో, తనదైన సాహిత్యంలో ఏమిఉన్నదో అది స్ఫురించటంలేదు. మనం తీసుకొనే చర్యలకు పాపం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ల వాళ్ళేమైపోతారో అనిబాధపడిపోతున్నాడు. చైనావాళ్ళెక్కడ రెచ్చిపోతారో అని భయపడి పోతున్నాడు.

 మన దగ్గర ముడిసరుకులు వట్టిపోలేదు. పంటలు పండించే చేవ తగ్గిపోలేదు. రకరకాల వస్తువుల ఉత్పాదన చేసే సామర్థ్యం నశించిపోలేదు. అయినా ఎందుకు అయోమయ స్థితి?

  కొన్నిదశాబ్దాలుగా విదేశీవస్తువులు మేలైనవని, దిగుమతిఅయిన వస్తువులు వాడటంద్వారా గొప్పతనం ప్రదర్శించుకోవచ్చునని మనకు నాటి మన పాలకులు మప్పినారు. గాంధీవారసుల మని ప్రకటించటం కోసమే ఖద్దరు, అంతకుమించి ఖద్దరు, చేనేత వస్త్రాలపై ప్రేమలేదు. మనదేశంలోని కోట్లాదిప్రజలకు భుక్తి సమకూర్చేమార్గమన్న స్పృహలేదు. అన్నివస్తువుల విషయంలోనూ వారికి ఏవిధమైన స్పృహా లేదు.  ఉన్నదల్లా ఏమేరకు కమీషన్లు లభించగలవనే లెక్కలే !

దశాబ్దాలుగా సైన్యానికి ఆయుధాలు ఇవ్వలేదు. తూటాలు ఇవ్వలేదు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వలేదు. రోడ్లువేయలేదు, వాహనాలు సమకూర్చలేదు. ప్రజలకునేర్పినది ఒక్కటే.. ఎవడు ఎక్కువ పైసలిస్తాడో, ఎవడు వాగ్దానాల పంచరత్నాలు గుప్పిస్తాడో, ఎవడు త్రాగబోస్తాడో వాడికి వోటువేయటం.

ఆంగ్లమాధ్యమం ఇంజినీరింగ్ చదువులద్వారా గొప్ప సర్టిఫికెట్ లు చేతికివచ్చాయి. కౌశలాలు, నైపుణ్యాలు నేర్పవలసినతీరులో నేర్పలేదు.  నాటకాలు సాగిపోయాయి. కాలేజీ పెట్టటమంటే భవనాలు మాత్రమేనా? రీ ఇంబర్స్ మెంట్ ఉంటే సరిపోయిందా? పాఠాలుచెప్పి నైపుణ్యాల నలవరిచే ఉపాధ్యాయులు, ఆచార్యులూ ఉండనక్కరలేదా? ఇన్ స్పెక్ షన్ వేళకు ఎక్కడినుండో తెచ్చిన వారిని నిలబెడతారు. ఈ తీరున ప్రతిచోటా నాటకాలే నడిచాయి.

 వీటిలోంచి తయారైవచ్చినవారికి మనదేశాన్ని మనం రక్షించుకోగలమని, మన ప్రజలను మనం పోషించుకోగలమని, మనం ఎవరినీ ప్రాధేయపడ నక్కరలేదనీ విశ్వాసంకల్పించగలమా?  ఇదే నేటి సమస్య.

విశ్వాసాన్ని- ఆత్మవిశ్వాసాన్ని మేల్కల్పటం, సంకల్పాన్ని దృఢతరంచేయటం,  మన సామర్థ్యాలను గుర్తుతెచ్చుకొని కర్తవ్యోన్ముఖులం కావటం, విదేశీ ఏజెంట్లు అలవాటు చేసిన తేనెపూసిన విషపదార్థాలను ఏమాత్రం మోమోటమిలేకుండా తిరస్కరించటం - ఇదే ఇప్పుడు చేయవలసినపని , అనుసరించవలసిన నీతి.

  ఈ సందిగ్ధ వాతావరణంలో వందేళ్ళక్రితం గురుదేవ రవీంద్రనాథ్ ఠాకూర్ చెప్పినమాట గుర్తువస్తున్నది. భారతదేశంలో అక్షరాస్యులు ఇరవై శాతమేకాగా నూరుశాతం విద్యావంతులే! అదెలాగా? ఇక్కడి ప్రజలందరికీ తాము మాట్లాడే తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, గుజరాతీ వంటి భాషలేగాక మరో భాషకూడా తెలుసు. అది రామాయణ మహాభారతాల భాష. అది సందేహాలను తీరుస్తుంది విశ్వాసాన్ని అందిస్తుంది, కర్తవ్యం తెలియజేస్తుంది.

ప్రతిభారతీయుడూ వ్యాసమహర్షి రచించిన మహాభారతం నుండి అందులోని ప్రముఖపాత్రలైన శ్రీ కృష్ణార్జునులనుండి ప్రేరణ పొందగల అవకాశం ఉంది.  మహాభారతం ఒక నవల మాత్రమేకాదు. జీవితంలో ఎలా పోరాడుతూ ముందుకు సాగాలో, విజయాన్ని ఎలా కైవసం చేసికోవాలో, తనమార్గంలో ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో తెలియజెప్పే అనుభవాల సమాహారం.

 శ్రీ కృష్ణుని మార్గదర్శనంలో ముందడుగువేసిన విజయునిలా నేడు మనకు లభిస్తున్న సందేశాన్ని గ్రహించుకొని  ధనుర్ధారులమై విజయపథంలో ముందుకు సాగుదాం.

 వీర భారతభూమి నావిర్భవించి
పౌరుషములేని బానిస బ్రతుకు లేల?
 ఈ అయోమయ శృంఖలా లింకనైన
త్రెంచుకొని బయల్పడి విజృంభించరేల?
  (కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి  గారి విజయశ్రీ నుండి)

స్వర్గమా.... భగవత్ అనుగ్రహమైన మోక్షమా

తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే

స్వర్గలోకముల వుండే సుఖభోగములు తాత్కాలికమైనవని, అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అక్కడికి పంపించబడిన జీవులకు, స్వర్గ లోక భోగములు అనుభవించిన తరువాత వారి పుణ్యం అంతా ఖర్చయిపోతుంది, అప్పుడు వారు, తిరిగి భూలోకానికి పంపించబడుతారు. ఈ విధంగా స్వర్గాది లోకములు పొందినా కూడా, దాని వల్ల ఆత్మ యొక్క సనాతన అన్వేషణ నెరవేరదు. మనందరమూ అనంతమైన పూర్వ జన్మలలో ఎన్నో సార్లు అక్కడికి వెళ్లి వచ్చాము, కానీ అనంతమైన ఆనందము కోసము ఆత్మ కున్న కోరిక తీరలేదు. అన్ని వైదిక శాస్త్రాలు ఈ విశ్వాసాన్ని బలపరుస్తున్నాయి.

తావత్ ప్రమోదతే స్వర్గే యావత్ పుణ్యం సమాప్యతే
క్షీణ పుణ్యః పతత్యర్వాగనిచ్ఛన్ కాల-చలితః (భాగవతం 11.20.26)

"స్వర్గ లోకాల్లో నివసించేవారు తమ పుణ్యఫలము అయిపోయేంత వరకు దేవతా భోగాలను అనుభవిస్తారు. ఆ తరువాత వారు కాలక్రమంలో తమకు ఇష్టం లేకపోయినా క్రింది లోకాలకు నెట్టివేయ బడుతారు."

స్వర్గహు స్వల్ప అంత దుఖదాఈ (రామాయణం)

"స్వర్గ ప్రాప్తి అనేది తాత్కాలికమైనది మరియు తర్వాత దుఖాలను తెచ్చేది."

ఎలాగైతే ఫుట్బాల్ బంతి, మైదానం అంతటా ఒక చోటి నుండి ఇంకో చోటికి తన్నబడుతుందో, మాయ అనేది, జీవాత్మను, భగవత్ విముఖం అవటం చేత అలాగే తన్నుతున్నది. కొన్ని సార్లు నిమ్న లోకాలకు వెళుతోంది, కొన్నిసార్లు ఉన్నత లోకాలకు వెళుతుంది. ఈ క్రింది మరియు పై లోకాల్లో తనకు లభించిన ఈ బహు విధములైన రూపములలో కేవలం మానవ రూపం మాత్రమే భగవత్ప్రాప్తికి అవకాశం కల్పిస్తుంది. అందుకే దేవతలు కూడా మానవ జన్మ కోసమే పరితపిస్తుంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. దీనితో వారు స్వర్గ లోకానికి వెళ్ళిన తప్పుని సరిదిద్దుకుని, ఈ సారి భగవత్ ప్రాప్తికై ప్రయత్నిద్దామనుకుంటారు.

దుర్లభం మానుషం జన్మ ప్రార్థయతే త్రిదశైరపి (నారద పురాణం)

"మనుష్య రూపంలో జన్మ చాలా చాలా అరుదు (దుర్లభము). దేవతలు కూడా దీన్ని కాంక్షిస్తారు." అందుకే శ్రీ రామ చంద్రుడు కూడా అయోధ్యావాసులకి ఇలా ఉపదేశం ఇచ్చాడు.

బడే భాగ మానుష తను పావా, సుర దుర్లభ సబ గ్రంథంహి గావా (రామాయణం)

"ఓ అయోధ్యావాసులారా, మీరందరూ మానవ జన్మ లభించినందుకు ఏంతో ఏంతో అదృష్ట వంతులు, ఇది చాలా చాలా దుర్లభమైనది మరియు స్వర్గ లోకవాసులు కూడా కోరుకునేది." 

దేవతలే ఈ మానవ జన్మను ఇంతగా కోరుకుంటున్నప్పుడు మరి ఇక మనం మాత్రం ఆ స్వర్గ లోకాలని కోరుకోవటం ఏమి ప్రయోజనం? అందుకే, మనం పరమేశ్వరుడి పై భక్తి ద్వారా భగవత్ ప్రాప్తి కై నిమగ్నమవ్వాలి.

షాదీ కరోనా

పెళ్లి తప్పేట్టు లేదు పెదబాబుకి.  ‘కరోనా వెళ్ళేదాకా కాస్త ఆగరా’  అంటే “ఇది జీవితాంతం ఉండే వైరసు! అంటే లైఫులో నాకు పెళ్లి చెయ్యరా?”  తిక్క రేగింది వాడికి. “సరే తగలడు.  ఎవరెవర్ని పిలవాలో లిస్టు తయారు చెయ్యండి.  ఇరవై మందికే పర్మిషనట!” అన్నాడు పెద్దాయన.  “ఇదిగో చెల్లి పెళ్ళప్పటి  లిస్టు. ఇందులో ఏడువందల ఎనభై రెండు పేర్లున్నాయి  మరి!” 

“చచ్చేం! పేర్లన్నీ కొట్టెయ్యండి. దయాదాక్షిణ్యాలు లేవు, బంధుత్వాబంధుత్వాలు లేవు, ప్రతిష్టాఅప్రదిష్ఠలు లేవు!” అన్నాడు పెద్దాయన ఆవేశంగా.   అలాగే  కొట్టేసుకుంటూ పోతే పంతొమ్మిది  మంది తేలేరు. “ఇంతకుమించి  చచ్చినా  తగ్గరు!”  
“గుడ్. పెళ్లి కూతురు ఒక్కత్తినీ పంపించమని వియ్యంకుడికి ఫోన్ కొడదాం. దాంతో ఇరవై మంది అవుతారు.” 

“బావుంది సంబడం! పెళ్ళికూతురొక్కత్తినీ పంపిస్తే మరి ఎవరి బాబొచ్చి చేస్తాడండీ కన్యాదానం?” వియ్యంకుడు ఎగిరి పడ్డాడు.  
“అవును కదా, సరే మీ మొగుడూ పెళ్లాలిద్దరూ కూడా రండి, ఆవార మేం ఇద్దరిని తగ్గించుకుంటాం మా లిస్టులో! ఇంతకీ  పురోహితుణ్ణి మీరు తెస్తున్నారుగా?”    
“లేదు లేదు మీరే తేవాలి.”  “అయినా  ‘మాంగల్యం తంతునా నేనా’ మనకందరికీ నోటి కొచ్చిందే కదా. అది చదివేసి  పుస్తి కట్టించేస్తే పోలా? సుమతీ శతకం చదివేసి  మావాడొకడు పెళ్లిళ్లు చేయించేస్తున్నాడు. వాళ్ళంతా  పిల్లాపాపలతో సుఖంగా కాపరాలు చేసుకుంటున్నారు!”

“ఓకే. మరి భజంత్రీలో?”
“భజంత్రీలు? బహువచనం కూడానా?  ‘భజంత్రీ’.. అనండి. ఒకాయనే వస్తాడు.  ఆయనే నోటితో తూతూబాకా వాయిస్తూ  రెండు చేతుల్తో డోలు వాయిస్తాడు!”

 “అన్నట్టు  వీడియో వాళ్ళు నలుగురొస్తారట.” గుర్తు చేసాడు పెదబాబు.  “చాల్చాలు. వొడిలిపోయి, వాడిపోయిన మన మొహాలకు వీడియోలు కూడానా?  చినబాబు  వాడి కెమెరాతో ఫుటోలు తీస్తాడు చాలు..”   

“మరిచిపోయా బావగారూ. వాళ్ళక్క పెళ్ళిలో జడ తనే పైకెత్తి పట్టుకోవాలని మా చంటిది   ఎప్పట్నుంచో రిహార్సల్సు వేసుకుంటోంది. దాన్ని రావద్దంటే చంపేస్తుంది. ఇంకో విషయం.  పెళ్ళికూతురికి  చీర కట్టుకోడం రాదు. దానివన్నీ  చుడీదార్లే కదా. చీర కట్టడానికి, పీటల మీద  అది జారిపోకుండా చూసుకోడానికీ   మా మరదలు దగ్గరుండాల్సిందే. అలాగే పెట్టి దగ్గర కూర్చుని సామాను అందించడానికి, పిల్లని బుట్టలో తేవడానికి ముగ్గురు బావమరుదులు   తప్పదు!” అన్నాడు వియ్యంకుడు. 
“బుట్ట సిస్టం కాన్సిలండీ. పిల్లని నడిచి రమ్మనండి. పెళ్లి మండపం దూరవేం  కాదు.”

 “అంటే మరో తొమ్మిది  మందిని కొట్టెయ్యాలి మా లిస్టులో!  బావుంది. ఇలా మీరు  పదహారు అక్షౌణీల సైన్యాన్ని యుద్ధానికి తెచ్చినట్టు తెస్తే మేం ఏమైపోవాలి?  మా వాళ్ళని ఎంతమందిని తెగ్గోయాలి? మా కొంపలోనే పదిమంది ఉన్నామాయె!”  “ఎందుకుండరూ? కుటుంబ నియంత్రణాపరేషను చేయించుకోమని అప్పట్లో ఎన్నిసార్లు బతిమాలేరు మా వాళ్ళు! వినిపించుకున్నారా?” వంటింట్లోంచి పలికిందో  స్త్రీ స్వరం.     

“నాన్నా! మరి  భోజనాలు?”  
“ఔన్రోయ్ మరిచిపోయాం.  కేటరింగ్ వాళ్ళు నలుగురొస్తారట. వాళ్ళని తగ్గిస్తే తిండుండదు ఎవరికీ.  ఓర్నాయనో! అవతల ఆడ పెళ్ళివాళ్ళు, ఇవతల వీళ్ళు!  ఎవరి పేర్లు కొట్టెయ్యాలిరా?  ఈ పెళ్లి  నా వల్ల కాదు!  గంగలో దూకండి అంతా!” 

పోనీ, ఇరవై కంటే ఎక్కువమందిని తెచ్చుకోడానికి మనిషికి ఇంత చొప్పున పెనాల్టీ కట్టేద్దామా గవర్నమెంటుకి? సగం సగం భరిద్దాం మీరూ మేమూ.”   
“చాల్చాలు. ఇప్పటికే మాస్కులూ, సబ్బులూ, తువ్వాళ్ళూ  అంటూ చాలా పెనాల్టీలు వేశారు మా మీద. ఇక మా వల్ల కాదు.” వియ్యంకుడి జవాబు. 

“నాన్నా,  అరమొహం మాస్కులతో,  వైరస్ భయాలతో, రాని చుట్టాలతో ఈ పెళ్లి ఏం కళ కడుతుంది?  వాయిదా వెయ్యండి. ఈలోగా ఆ పిల్లని పంపించమనండి. అందాకా సహజీవనం చేస్తాం!” 

“డొక్క చీరేస్తా వెధవా!   రిజిస్టర్ మ్యారేజ్  చేసుకు తగలడండి! పోండి!”

శివుడికి రూపం తలక్రిందులుగా ఉన్న దేవాలయం

ఈ భూ ప్రపంచంలోనే శివుడికి రూపం ఉండి, తలక్రిందులుగా ఉన్న ఏకైక దేవాలయం.

ఈ ప్రపంచంలో ఎక్కడైనా శివుడిని పూజించేది ఒక్క శివలింగ రూపంలోనే !. శివలింగ రూపంలో కాకుండా శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఒక క్షేత్రం ఉందని ఎవరికైనా తెలుసా! అంతే కాకుండా ఆ గుడిలో శివుడు తలకిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిచ్చి భక్తులచే పూజింపబడతాడు. ఆ పుణ్యక్షేత్రం ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయం పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంకు కేవలం 5 కి.మీ దూరంలో ఉండటం విశేషం.ఈ ప్రపంచంలో ఎక్కడైనా శివుడిని పూజించేది ఒక్క శివలింగ రూపంలోనే !. శివలింగ రూపంలో కాకుండా శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఒక క్షేత్రం ఉందని ఎవరికైనా తెలుసా! అంతే కాకుండా ఆ గుడిలో శివుడు తలకిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిచ్చి భక్తులచే పూజింపబడతాడు. ఆ పుణ్యక్షేత్రం ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయం పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంకు కేవలం 5 కి.మీ దూరంలో ఉండటం విశేషం.
 ఈ ప్రపంచంలో ఎక్కడైనా శివుడిని పూజించేది ఒక్క శివలింగ రూపంలోనే !. శివలింగ రూపంలో కాకుండా శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఒక క్షేత్రం ఉందని ఎవరికైనా తెలుసా! అంతే కాకుండా ఆ గుడిలో శివుడు తలకిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిచ్చి భక్తులచే పూజింపబడతాడు. ఆ పుణ్యక్షేత్రం ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయం పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంకు కేవలం 5 కి.మీ దూరంలో ఉండటం విశేషం. ప్రపంచంలో ఎక్కడైనా శివుడిని పూజించేది ఒక్క శివలింగ రూపంలోనే !. శివలింగ రూపంలో కాకుండా శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఒక క్షేత్రం ఉందని ఎవరికైనా తెలుసా! అంతే కాకుండా ఆ గుడిలో శివుడు తలకిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిచ్చి భక్తులచే పూజింపబడతాడు. ఆ పుణ్యక్షేత్రం ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయం పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంకు కేవలం 5 కి.మీ దూరంలో ఉండటం విశేషం.

ఈ ఆలయం యొక్క విశిష్టత :
ఈ గ్రామంలో వెలసిన శక్తీశ్వరాలయం చాలా విశిష్టమైనది. ఇక్కడ శివుడు శీర్షాసన భంగిమలో విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. శక్తి పీఠంలో శివుడు, పార్వతిదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ముగ్గురు కలసి ఏకపీఠం మీద ఉండటం ఇక్కడి విశిష్టత. అలాగే పార్వతి దేవి మూడు నెలల పసికందు అయిన బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామినీ ఒడిలో లాలిస్తూ కొలువై ఉండటం మరో ప్రత్యేకత….

శివుడు తలక్రిందులుగా కొలువై ఉండటానికి గల కారణం:
యముడు పాలిస్తున్న రాజ్యంలో శంబురా అనే రాక్షసుడు ప్రజలను, మునులను చాలా ఇబ్బంది పెడుతుంటాడు. ఈ ఇబ్బందులు పడలేక ప్రజలు, మునులు ఈ రాక్షసుడిని ఒక్క యముడు మాత్రమే చంపగలడు అని యముడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్నీ చెబుతారు. శంబురా రాక్షసుడితో ఇంతకు ముందే యుద్ధంలో ఓడిపోయిన యముడు మరొక సారి అతనితో పోరాడే శక్తి నివ్వమని శివుడికి తపస్సు చేస్తాడు. ఆ సమయంలో శివుడు లోకకళ్యాణం కోసం తీవ్ర తపస్సులో ఉంటాడు. దానితో యముని తపస్సు చూసి పార్వతి దేవి ప్రత్యక్షం అవుతుంది. యముడు జరిగిన విషయాన్ని పార్వతి దేవికి చెబుతాడు. అప్పుడు పార్వతి యమధర్మరాజుకు ఒక ఆయుధాన్ని ఇవ్వడం తో శంబురా రాక్షసుడిని చంపుతాడు… దానితో ఆ రాక్షసుడి నుండి ప్రజలకు విముక్తి కలుగుతుంది. అప్పటి నుండి ఆ ప్రాంతానికి యమపురి గా పేరు వచ్చింది కాల క్రమేణా అది యనమదుర్రు గా మారిపోయింది.


శంబురా రాక్షసుడు చనిపోయినా యమపురికి భవిష్యత్తులో ఎటువంటి ఆపద రాకుండా అక్కడే ఉండాలని యముడు శివుడిని మరొక సారి ప్రార్దిస్తాడు. అప్పటికి ఇంకా తపస్సులోనే ఉన్న శివుడు అదే రూపంలొ కుటుంబ సమేతముగా యమపురిలో వెలిసాడని ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న కథ. ఈ గుడిలోకి వెళితే దీర్ఘకాలరోగాలు నయం అవుతాయని స్థలపురాణంలో పేర్కొన్నారు.

కరోనా ప్రాణాంతకమైనది కాదు

డా.శివ అయ్యాదొరై lndian American Scientist

కరోనా అనేది అతి సాధారణమైన జలుబు, జ్వరం లాంటి చిన్న జబ్బు. కొందరి స్వార్థం కోసం దీన్ని పెద్ద భూతాన్ని చేసి, భూతద్దంలో చూపిస్తున్నారు. ఇతర జబ్బులు ఏమీ లేకుండా,ఒక ఆరోగ్యవంతుడు కేవలం ఈ వైరస్ సోకి చనిపోయిన కేసు ఒక్కటి కూడా లేదు. జబ్బుకంటే భయంతోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా పాజిటివ్ అని తెలియగానే చాలామంది ఇక చావు తప్పదని వణికిపోతున్నారు. భయం వల్ల స్ట్రెస్ విపరీతంగా పెరిగి శరీరంలో ఇమ్యూన్ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. లక్షలాది మంది చాలా తేలికగా దీని నుంచి బయటపడుతున్నారు. కోవిడ్ పట్ల అవగాహన పెంచుకుని ధైర్యంగా ఉంటే వారిలో మనం కూడా తప్పకుండా ఉంటాం. కేవలం వయసుపైబడిన, రిస్క్ ఉన్నవారి మీద దృష్టి పెట్టి (మన దేశంలో వృద్ధుల సంఖ్య పది శాతానికి మించి లేదు), ప్రభుత్వం వారిని కాపాడడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే రిస్క్ గ్రూప్ లో కూడా మరణాలు చాలా తగ్గించే అవకాశం ఉండేది. కానీ మనవి పెట్టుబడిదారీ ప్రభుత్వాలు కదా వాళ్ళ కోసమే పనిచేస్తాయి. మనకోసం కాదు. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి

అవగాహన, ధైర్యానికి మించిన ఆయుధం లేదు!
          (మిత్రుని వాల్ నుండి) కరోనాకు భయపడకండి...
 బోగస్ ప్రచారాలు నమ్మకండి...

ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షలు తగలెయ్యకండి.. ఇది పూర్తిగా చదవండి కరోనా చికిత్స పై ఒక ప్రాథమిక అవగాహన కోసం ఈ పోస్ట్.
  కరోనాకు భయపడకండి.     
కరోనా వచ్చింది అనగానే వారిని అంటరాని వారిగానో, ఎదో తప్పు చేసినా వారిగా చూడకండి. ఇది ఒక మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని రకాల వారికి వస్తుంది.

కరోనా వచ్చిన వారు first ధైర్యంగా ఉండాలి.
Covid positive వచ్చిన వారికి ఇచ్చే, మెడిసిన్స్
* ప్యారసిటమాల్-500mg టాబ్లెట్స్,
* B-Complex,
* C Vitamin Tablets,
* Citrizen Tab,
* Ambroxel syrup (దగ్గు ఉన్న వారికి మాత్రమే.)

డాక్టర్ల సూచన మేరకు మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత రోజుకు రెండు సార్లు paracetamol ట్యాబ్లేట్లు మూడు రోజులు వాడాలి. పొడి దగ్గు ఉంటే  దగ్గు సిరప్ ను ఉదయం 5ml, రాత్రి 5ml మూడురోజులు పాటు వాడాలి. రోజుకు ఒకటి B- complex tablet, ఒకటి C-Vitamin tablet మధ్యాహ్నం భోజనం తర్వాత వారం రోజుల పాటు ఇస్తారు.
 మెడిసిన్ తో పాటు  పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే. తప్పనిసరిగా వేడి నీళ్లు తాగడం. రోజు ఉదయం, సాయంత్రం వేడి నీళ్లలో జండుబామ్ కానీ, పసుపు కానీ వేసుకొని ఆవిరి పట్టడం. రోజుకు మూడు సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేడి నీళ్లలో నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగడం. రోజుకు నాలుగైదు సార్లు వేడి నీళ్లు గొంతులో పోసుకొని gargling చేయడం (ఉక్కిలించడం). రాత్రి భోజనం అనంతరం పడుకునే ముందు సగం గ్లాసు పాలల్లో కొంచం పసుపు, నాలుగు మిరియాలు దంచి పొడి చేసుకొని పాలల్లో కలిపి తాగడం.
''వీటన్నిటినీ  వారం రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం వలన వారం రోజుల్లోనే  సాధారణ స్ధితికి వచ్చేస్తారు."
వీటికి తోడు మంచి ప్రొటీన్ ఫుడ్, రోజుకు రెండు మధ్యాహ్నం, రాత్రి భోజనంతో ఉడకబెట్టిన కోడిగుడ్డు తినాలి. C-vitamin ఉన్న ఫ్రూట్స్ ఆపిల్, బత్తాయి, Orange వంటి పండ్లు ఎక్కువగా తినాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తింటే కరోనా వచ్చిన వారు వారం రోజుల్లో సాధారణ స్థితికి వచేస్తారు.

కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలో నుంచి మరో వ్యక్తికి వ్యాపించే సమయం 7 రోజులు మాత్రమే నని, 7 రోజుల తర్వాత వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే శక్తి కోల్పోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒక మనిషి శరీరంలోకి చేరిన కరోనా వైరస్ 10 నుంచి 12 రోజులకంటే ఎక్కువగా జీవించి ఉండదని, మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తీసుకుంటే 7 నుంచి 10 రోజుల్లోనే కరోనాను జయించిన వారు ఉన్నారు, తప్పని సరిగా తాగే నీళ్లు వేడి నీళ్లు తాగడం, ఉదయం, సాయంత్రం వాకింగ్ కానీ, యోగ కానీ చేస్తే నాలుగు, ఐదు రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చేస్తారు.

అలాగే ఉదయం, సాయంత్రం "మిరియాలు, దాచిన్ చెక్క, సొంటి, ధనియాలతో " చేసిన powder ను వేడినీళ్లలో వేసి టీ-లాగా మగ్గబెట్టి అందులో కొంచం బెల్లం వేసి ఉదయం ఒక టీ సాయంత్రం ఒక టి చాలు.

కరోనా వచ్చింది అనగానే చుట్టు పక్కల వారు వారిని చూసి ఎదో మాయ రోగం వచ్చింది అన్నట్టుగా చూడడం మానేయండి. కరోనా కూడా ఇతర వ్యాధుల లాంటిదే. మలేరియా, టైఫాడ్ వంటిదే. ఎవరూ వర్రీ కావద్దు. కాక పోతే జాగ్రత్తలు మాత్రం తప్పని సరిగా పాటించండి. ఈ వైరస్ మనిషి శరీరంలో  గరిష్టంగా 14 రోజులకు మించి ఉండదని, ఆ తర్వాత అది నశించిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి 15 రోజుల పాటు హోమ్ క్వరెంటైన్ కానీ, హాస్పిటల్ క్వరెంటైన్ కానీ పాటించాలి. ఈ 14 రోజుల్లో మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ తీసుకుంటే కరోనా ఖతం  మందులు, ఆహారం తీసుకుంటే చాలు అని చెబుతున్నారు.
 కరోనా రాకుండా సామాజిక దూరం పాటిద్దాం మస్కులు దరిద్దాం😷

రామాయణమ్ 7.


...
యజ్ఞము పరిసమాప్తమయ్యింది, సరిగ్గా పన్నెండు మాసాలకు మరల వసంతం వచ్చింది! దశరధమహారాజు జీవితములో ఈ వసంతం ఒక్క కొత్తశోభ తెచ్చింది . మోడువారిన జీవిత ఆశ చిగుర్చింది.
దశరధుడి మనోరధం నెరవేరింది!
 .
చైత్రమాసంలో నవమి తిధి ,పునర్వసు నక్షత్రం , అయిదు గ్రహాలు తమతమ ఉచ్ఛస్థితిలో ఉండగా! .
.
అప్పుడు రవి మేషంలో ఉన్నాడు
కుజుడు మకరంలో ఉన్నాడు
గురుడు కర్కాటకంలో ఉన్నాడు
శుక్రుడు మీనంలో ఉన్నాడు
శని తులా రాశిలో ఉన్నాడు
ఆయా రాశులన్నీ కూడా ఆయా గ్రహాలకు ఉచ్ఛస్థానాలు!.
చంద్రుడు స్వస్థానమైన కర్కాటకంలో ఉన్నాడప్పుడు!
 అంటే పునర్వసు నాల్గవపాదం! అన్నమాట!
గురుచంద్రయోగం సంభవించింది!
లగ్నముకూడా కర్కాటకమే!
ఆ శుభలగ్నమందు కౌసల్య జగత్కల్యాణ కారకుడు,జగన్నాధుడు,ఇక్ష్వాకు వంశ వర్ధనుడు అయిన శ్రీ రామచంద్రుని పుత్రునిగా కన్నది!..
.
శ్రీ రామ జననమయిన పదహారు గంటల తరువాత  భరతుడు మీనలగ్నంలో కైకేయికి జన్మించాడు !ఆయన నక్షత్రం పుష్యమి!
.
ఆ తరువాత మధ్యాహ్న కాలంలో కర్కాటక లగ్నంలో ఆశ్లేషా నక్షత్రంలో లక్ష్మణ,శత్రుఘ్నులకు జన్మనిచ్చింది సుమిత్ర!
.
రాజ్యమంతా కోలాహలం ,ఉత్సవాలు ,సంబరాలు ,రాజు ఇచ్చే భూరిదానాలతో పదకొండురోజులు గడిచినాయి! .
.
పదకొండవరోజున నవజాతశిశువులకు నామకరణం జరిగింది.
.
ఆయన పుట్టి దశరధుడికి మహదానందం కలుగచేశాడు జనులందరికీ సంతోషం కలుగచేశాడు!
ఎవనియందయితే సర్వజనులకు ఆనందం కలుగుతుందో! అతడే రాముడు ,రమింపచేయువాడు అని అర్ధం పెద్ద కుమారుడికి "రాముడు " అని పేరు పెట్టారు వసిష్ఠ మహర్షి!.
.
సంపద,శోభ కలవాడు కావున లక్ష్మణుడు !
.
రాజ్యమును భరించువాడు కావున భరతుడు!
.
శత్రువులకు సింహస్వప్నము ,వారిని చంపువాడు కావున శత్రుఘ్నుడు! .
.
నలుగురు కుమారులను చూసుకొని దశరధుడు మురిసిపోతున్నాడు ఆయన ఆనందానికి అవధులు లేవు.
రాముడంటే మరీ! ఆయన అన్నిప్రాణాలూ రాముడే!
..

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

ధర్మధ్వజం
హిందు చైతన్య వేదిక

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 3 🌹


 📚. ప్రసాద్ భరద్వాజ

ఇప్పుడు మనం చూస్తున్న విపరీత పరిమాణాలు, దుర్ఘటనలు, ఆశ్చర్యకర సంఘటనల గురించి వేల సంవత్సరాల కిందటే వివరించిన మహాజ్ఞాని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయన కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో జన్మిచారు. ఆయన ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు? కాలజ్ఞానాన్ని ఎప్పుడు సామాన్య ప్రజలకు వెల్లడి చేశారు- అనే విషయాలపైన వాదోపవాదాలు వున్నాయి.

ఏదేమయినా క్రీస్తు శకం 1600 – 1610 మధ్యలో ఆయన జన్మించి ఉండవచ్చని కొందరి అంచనా. పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి జీవితంలో ఎన్నో మహిమలు ప్రదర్శించినట్లు చెబుతారు. అయితే ఈ మహిమలు నిజంగా జరిగాయా లేదా అని తర్కించే వారి విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన కాలజ్ఞానం మాత్రం భవిష్య సూచికగా అత్యధికశాతం హిందువులు నమ్ముతారు.

కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు ‘నీవెవరివి?’ అని శ్రీ కృష్ణుడిని ప్రశ్నించినపుడు “సర్వ శక్తిమంతుడైన కాలుడను నేను” అని జవాబిచ్చాడు. కాలుడు సమస్త చరాచర జగత్తును కబళించగలిగిన, సృష్టించగలిగిన శక్తి వున్నవాడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు కాలుని అధీనంలోనే ఉంటాయి!

సృష్టి మొత్తం కాలం అధీనంలోనే వుంటుంది. కేవలం మహాజ్ఞానులకు, యోగులకు మాత్రమే కాల పురుషుని గురించిన జ్ఞానం వుంటుంది. అటువంటి మహాత్ముడు యోగి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి.

అందువల్ల ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికే అత్యధికులకు అనుసరణీయంగా వుంటోంది.

సశేషం...

అన్నపూర్ణే

అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే |
జ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్షాం దేహి చ పార్వతీ ‖

మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః |
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్

సర్వ-మంగల-మాంగల్యే శివే సర్వార్థ-సాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తుతే

సృష్టి క్రమం

ప్రలంబ ముష్టికంచై ఏవ మత్స్యకూర్మో... అని సృష్టి పరిణామం. శక్తి నాలుగు లంబకోణములుగా. దీనినే ప్రేరేయత్  తస్య యత్ భః గ తత్ వహి ఏ తత్ అణీయం ఉపాస్మహే. వకే లంబ కోణం నాలుగు దిక్కులకు శక్తిని సమాంతరంగా విభజించి వ్యాప్తి చెందినది. అది ప్రథమంగా రెండుగా అనగా తూర్పు పడమరగా ఆ తరువాత ఉత్తర దక్షిణంగా అనగా యీ దిక్కులు కూడా భూమియేఆధారముగా. అదే గాయత్రి ఉపాసన శక్తి ఉపాసన గా సమస్త జగత్తును తెలియుటే జ్ఞానము అదియే మెూక్షమని తెలియును. నిజంగా అణు  శక్తి వక సూత్ర ప్రకారము చైతన్యము వలననే ప్రకృతి. అది ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ సృష్టి చేయరాదు. అటుపైన సర్వం వినాశనం. అసలు అది వక పరమార్థం గురించి చేయబడినది. యిది తెలుసుకొనుట యే ఙ్ఞానం మెూక్షం అనితెలియుచున్నది.


మన్వంతరముల వర్ణనము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము

ఓం నమో భగవతే వాసుదేవాయ

రాజోవాచ

1.1 (ప్రథమ శ్లోకము)

స్వాయంభువస్యేహ గురో వంశోఽయం విస్తరాచ్ఛ్రుతః |

యత్ర విశ్వసృజాం సర్గో మనూనన్యాన్ వదస్వ నః॥6326॥

పరీక్షిన్మహారాజు అడిగెను- గురుదేవా! స్వాయంభువ మనువుయొక్క వంశ విస్తృతిని గూర్చి నేను వింటిని. అదే వంశమునందు అతని కుమార్తెల ద్వారా మరీచి మొదలగు ప్రజాపతులను తమవంశ పరంపరను కొనసాగించిరి. ఇప్పుడు ఇతర మనువులను గురుంచి వర్ణింపుడు.

1.2 (రెండవ శ్లోకము)

యత్ర యత్ర హరేర్జన్మ కర్మాణి చ మహీయసః|

గృణంతి కవయో బ్రహ్మంస్తాని నో వద శృణ్వతామ్॥6327॥

మహాత్మా! జ్ఞానులు ఏయే మన్వంతరములలో మహిమాన్వితుడైన భగవంతుని యొక్క అవతారములను, లీలలను వర్ణించిరో, వాటిని నాకు తప్పక వినిపింపుము. నేను శ్రద్ధగా వాటిని వినగోరుచున్నాను.

1.3 (మూడవ శ్లోకము)

యద్యస్మిన్నంతరే బ్రహ్మన్ భగవాన్ విశ్వభావనః|

కృతవాన్ కురుతే కర్తా హ్యతీతేఽనాగతేఽద్య వా॥6328॥

జగత్పతియైన శ్రీహరి గడచిన మన్వంతరములలో చేసిన, వర్తమానమునందు చేయుచున్న, భవిష్యన్మన్వంతరములలో చేయబోవు లీలలను వినిపింపుము.

ఋషిరువాచ

1.4 (నాలుగవ శ్లోకము)

మనవోఽస్మిన్ వ్యతీతాః షట్ కల్పే స్వాయంభువాదయః|

ఆద్యస్తే కథితో యత్ర దేవాదీనాం చ సంభవః॥6329॥

శ్రీశుకుడు వచించెను మహారాజా! ఈ కల్పమునందు స్వాయంభువుడు మున్నగు ఆరుగురు మనువుల యొక్క మన్వంతరములు గడచిపోయెను. వాటిలో మొదటి మన్వంతరమును గూర్చి నేను వర్ణించితిని. అందులో దేవతలు మొదలగు వారి యొక్క ఉత్పత్తి జరిగినది.

1.5 (ఐదవ శ్లోకము)

ఆకూత్యాం దేవహూత్యాం చ దుహిత్రోస్తస్య వై మనోః|

ధర్మజ్ఞానోపదేశార్థం భగవాన్ పుత్రతాం గతః॥6330॥

స్వాయంభువమనువు కుమార్తెయైన ఆకూతియందు యజ్ఞపురుషుని రూపములో భగవానుడు జన్మించి, ధర్మములను  ఉపదేశించెను. అట్లే దేవహూతియందు ఆ ప్రభువు కపిలభగవానునిగా అవతరించి, జ్ఞానోపదేశమును చేసెను.

15.6 (ఆరవ శ్లోకము)

కృతం పురా భగవతః కపిలస్యానువర్ణితమ్|

ఆఖ్యాస్యే భగవాన్ యజ్ఞో యచ్చకార కురూద్వహ॥6331॥

పరీక్షిన్మహారాజా! కఫిల భగవానునిగూర్చి మూడవ స్కంధములో వర్ణింపబడినది. ఇప్పుడు ఆకూతియందు యజ్ఞపురుషుడుగా అవతరించి చేసిన లీలలను వివరించెదను.

15.7 (ఏడవ శ్లోకము)

విరక్తః కామభోగేషు శతరూపాపతిః ప్రభుః|

విసృజ్య రాజ్యం తపసే సభార్యో వనమావిశత్॥6332॥

స్వాయంభువమనువు సకల విషయ భోగముల యెడ విరక్తుడై రాజ్యమును పరిత్యజించెను. పిమ్మట, తన భార్యయైన శతరూపతో గూడి తపమాచరించుటకై వనములకు వెళ్ళెను.

1.8 (ఎనిమిదవ శ్లోకము)

సునందాయాం వర్షశతం పదైకేన భువం స్పృశన్|

తప్యమానస్తపో ఘోరమిదమన్వాహ భారత॥6333॥

అతడు సునందానదీ తీరమున ఒంటి కాలిపై నిలబడి నూరు సంవత్సరములు తీవ్రమైన తపమొనర్చెను. ఆ సమయమున అతడు నిత్యము ఈ విధముగా భగవంతుని స్తుతించెను.

మనురువాచ

1.9 (తొమ్మిదవ శ్లోకము)

యేన చేతయతే విశ్వం విశ్వం చేతయతే న యమ్|

యో జాగర్తి శయానేఽస్మిన్నాయం తం వేద వేద సః॥6334॥

మనువు పలికెను పరమాత్మ చేతనను పొంది విశ్వము చైతన్యవంతమగును. కాని, విశ్వము మాత్రము ఆయనను చైతన్యవంతునిగా చేయజాలదు. ఆ ప్రభువు ప్రళయకాలమున నిద్రించు చున్నను మేల్కొనియే యుండును. ఆ విషయమును ఆయన ఎరుగును. కాని, విశ్వము మాత్రము  తెలియజాలదు. కనుకనే, అతడు పరమాత్ముడు.

1.10 (పదియవ శ్లోకము)

ఆత్మావాస్యమిదం విశ్వం యత్కించిజ్జగత్యాం జగత్|

తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనమ్॥6335॥

ఈ సమస్త విశ్వమునందును, అందలి చరాచరప్రాణుల యందును ఆ పరమాత్మయే వ్యాపించియున్నాడు. కనుక, ఈ జగత్తునందలి యే పదార్థము నందును వ్యామోహమును పొందక ఆ ప్రభువు అనుగ్రహించిన వాటిచేతనే జీవితమును గడపవలెను. ఈ జగత్తునందలి సంపదలు ఏ యొక్కని సొంతము కాదు. కనుక, సర్వదా వాటిపై తృష్ణను విడిచి పెట్టవలెను. సమస్తకర్మలను భగవదర్పణ బుద్ధితో ఆచరింపవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ప్రథమ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

 శ్రీమాత్రేనమః
617వ నామ మంత్రము

ఓం ఐం హ్రీం శ్రీం ఆత్మనే నమః🙏🙏🙏సకలమునకు ప్రాణాధారమైన ఆత్మస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము🌹🌹🌹శివుని అష్టమూర్తుల (పంచభూతములు, సూర్యచంద్రులు, పురుషుడు) లో చంద్రుడు (చంద్రస్వరూపిణి) అయిన జగన్మాతకు నమస్కారము🌻🌻🌻పురుషుడు అనగా యాగము చేయు యజమాని కూడా శివస్వరూపుడు🌺🌺🌺ఆత్మా అనగా ఆత్మస్వరూపిణి🌸🌸🌸ఈ దృశ్యమాన ప్రపంచములోని వస్తువులన్నియు పరిచ్ఛిన్నములైనవే కానీ శ్రీమాత అఖిలాండకోటి బ్రహ్మాండనాయకియై  అంతటా నిండి, నిబిడీకృతమై ఉన్నది.  ప్రమాణ, పరిణామరహితమై, అఖండమై ఉన్నది. కావున ఆత్మ అని భావము. అమ్మవారికి నమస్కరించునపుడు ఓం ఐం హ్రీం శ్రీ ఆత్మాయై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🙏🙏నేడు బుధ (సౌమ్య) వారము🔱🔱🔱బుధ (సౌమ్య) వారమునకు అధిపతి బుధుడు🌻🌻🌻ఈ రోజు గణపతిని, షణ్మఖుని ఆరాధించుదుము🌹🌹🌹ఆధ్యాత్మికంగా శ్రీమహా విష్ణువుకు ఈ రోజు  చాలా ప్రీతికరము🌸🌸🌸ఓం గం గణపతయే నమః🚩🚩🚩ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిప్రచోదయాత్🕉🕉🕉🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
[4:50 am, 22/07/2020] P.Dutga Subramanyam: 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
40వ నామ మంత్రము

ఓం ఐం హ్రీం శ్రీం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః🙏🙏🙏మాణిక్య కిరీటము వంటి మోకాలు చిప్పల జంటతో విరాజిల్లు లలితాంబకు నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు బ్రహ్మజ్ఞాన సంపదలతో ఆత్మానందమునంది తరించును🌻🌻🌻మాణిక్య (మాణిక్య ఖచితమైన), మకుట - ఆకార (అర్ధగోళాకార కిరీటం యొక్క ఆకారం గల్గిన, జాను-ద్వయ (మోకాళ్ళ జంటచే, విరాజితా (శోభిల్లుచున్నది)🌺🌺🌺కేవలం గోపురం వలె ఎత్తుగా కాక, అర్ధగోళాకారంగా నిర్మితమైన మాణిక్య ఖచిత కిరీటాల జంటవలె శ్రీమాత మోకాళ్ళు రెండునూ విరాజిల్లుతున్నాయి🌸🌸🌸39వ నామ మంత్రము మరియు 40వ నామ మంత్రము అతి రహస్య భావమును బోధించు చున్నవి. ఇందలి భావము అవాఙ్మానసగోచరమైనదియు, తత్ప్వసారమును గురు ముఖైక వేద్యమును అయియుండును. ఈ రహస్యము నెరింగినవాడే సర్వజ్ఞుడును జీవన్ముక్తుడును అనబడును. ఈ కీలకమే పరాపర ప్రకృతి రూపమును, చరణద్వయ సమిష్టిరూపమును, శివా - శివశక్తైక్య రూపమును అగును. పరమేశ్వర స్వరూపుడైన సద్గురు సన్నిధిని సాక్షాత్తు దీని నెఱుంగదగును. మహోన్నతమైన మకుటమనే కిరీటము తయారు చేస్తే ఆ కిరీటం యొక్క ఆకారం ఏవిధంగా ఉంటుందో, ఆ విధముగా అమ్మవారి  మోకాళ్ళతో దేవి అందంగా ఉందని తెలియవలెను🌹🌹🌹శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం ఐం హ్రీం శ్రీం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🙏🙏నేడు బుధ (సౌమ్య) వారము🔱🔱🔱బుధ (సౌమ్య) వారమునకు అధిపతి బుధుడు🌻🌻🌻ఈ రోజు గణపతిని, షణ్మఖుని ఆరాధించుదుము🌹🌹🌹ఆధ్యాత్మికంగా శ్రీమహా విష్ణువుకు ఈ రోజు  చాలా ప్రీతికరము🌸🌸🌸ఓం గం గణపతయే నమః🚩🚩🚩ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిప్రచోదయాత్🕉🕉🕉🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమ్ - తాత్పర్యం


పూర్వం వేదవ్యాస మహర్షిని సంకల్పసిద్ధి పొందే ఉపాయం చెప్పమని ఋషులు అడిగిరి. అందుకు వేదవ్యాస మహర్షి, ఒక్కసారి చదివితే చాలు సంకల్పాన్ని సిద్ధింపచేసేది, భోగమోక్షాలను ప్రసాదించేది చెపుతాను, అందరూ వినండి అంటూ ఉపక్రమించాడు.

హిమవత్పర్వత గౌరీశృంగంపై రత్నసింహాసనం మీద ఆసీనుడై ఉన్న పరమేశ్వరునితో ఒకనాడు పార్వతీ దేవి, "ఓ లోక శంకరా! నీవల్ల అనేక మంత్రాలను, యంత్రాలను, తంత్రాలను తెలుసుకున్నాను, ఇప్పుడు మహీతలాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను" అని పలికింది. పార్వతి కోరికను సంతోషంతో అంగీకరించిన పరమేశ్వరుడు వృషభవాహనం పై బయలు దేరి భూలోక వింతలు చూపించసాగాడు. వారు వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక దుర్గమమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ వారికి గొడ్డలి ధరించి సమిధలను సేకరిస్తున్న ఒక కిరాతుడు కనిపించాడు. అతని శరీరం వజ్రము వలె ధృఢముగా ఉన్నది. ఇంతలో ఒక పెద్ద పులి అతని పై దాడి చేయుటకు వేగముగా వచ్చినది. అయితే దానిని చూచిన కిరాతుడు తనను రక్షించుకొనుటకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా సంతోషముతో నిర్భయముగా నిలబడి ఉన్నాడు. అదే సమయములో ఒక లేడి పరిగెత్తుకుంటూ అక్కడకు రాగా దానిని చూచిన పులి బెదిరి పారిపోయింది.

ఈ వింతను చూసిన పార్వతి శంకరునితో "ఏమాశ్చర్యం! ప్రభూ, ఎదురుగా చూడు" అన్నది. దానికి పరమేశ్వరుడు "దేవీ! మేము చూడనిదంటూ లోకంలో ఏ కొంచమూ లేదు. వాక్కులకు, మనస్సుకు అందని అద్భుతం నీకు చెబుతాను, విను" అంటూ చెప్పనారంభించాడు.

ఈ భిల్లుని పేరు దూరశ్రవుడు. పరమ ధార్మికుడు. ప్రతీరోజూ అడవికి వెళ్ళి కష్టపడి సమిధలూ, దర్భలూ, పుష్పాలూ, కందమూల ఫలాలూ తెచ్చి మునీంద్రులకిస్తాడు. ప్రతిఫలంగా తానేమీ కోరడు. ఆ మునులందరూ కూడా అతని పట్ల దయతో ఉంటారు.

అక్కడే దలాదనుడను మహాయోగి ఉన్నాడు. ఒకనాడు దలాదనుడు, "దత్తాత్రేయుడు స్మర్తృగామి (స్మరించిన‌వారి వద్దకు తక్షణమే వెళతాడు)" అని విన్న కథను తలుచుకొని, దత్తుని స్మరించాడు. మరుక్షణంలో దత్త యోగీంద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దలాదన మహర్షి ఆశ్చర్యానందాలు పెల్లుబికగా ఆయనను పూజించి, "ఓ దత్తాత్రేయ మహామునీ! నా ఆహ్వానం విని నీవు విచ్చేశావు. స్మర్తృగామివని విని, కేవలం పరీక్షించడానికే నిన్ను స్మరించాను. నా అపరాధం మన్నించు." అన్నాడు. అందుకు దత్త భగవానుడు ఆ మునితో "నా ప్రకృతి ఇటువంటిది. భక్తితోగాని, భక్తి లేకుండా కాని అనన్యచిత్తంతో నన్ను స్మరించిన వారి వద్దకు వెళ్ళి వారి కోరికలు తీరుస్తాను" అని చెప్పాడు. "నీవు తలచుకున్నందుకు వచ్చాను గదా, నీకు ఏమి కావాలో కోరుకో" అని దత్తుడు అడుగగా, దలాదుడు, "ఓ మునిపుంగవా! నేనేమీ అడగను. నీ మనస్సులో ఉన్నది, నాకు శ్రేయస్కరమైనది నాకు ప్రసాదింపుము" అన్నాడు.

శ్రీ దత్తాత్రేయుడు, "నా వజ్రకవచం ఉన్నది, తీసుకో" అని చెప్పగా, దలాదుడు అంగీకరించాడు. దత్తుడు తన వజ్రకవచమునకు సంబంధించిన ఋషినీ, ఛందస్సునూ చెప్పి, న్యాసం, ధ్యానం, ప్రయోజనము అన్నీ వివరించి చెప్పాడు.

దత్తాత్రేయ ధ్యానమ్ :

జగత్తు అనే మొక్కకు దుంప వంటి వాడు, సచ్చిదానంద మూర్తి, యోగీంద్రచంద్రుడు, పరమాత్మ అయిన దత్తాత్రేయునికి నమస్కారము. ఒకప్పుడు యోగి, ఒకప్పుడు భోగి, ఒకప్పుడు నగ్నంగా పిశాచి వలె ఉండే దత్తాత్రేయుడు ప్రత్యక్ష హరి స్వరూపుడు. భుక్తి ముక్తి ప్రదాయకుడు. ఆయన ప్రతిదినమూ వారణాసిలో స్నానము, కొల్హాపురంలో జపము, మాహురీపురంలో భిక్ష స్వీకరించి, సహ్యాద్రిపై శయనిస్తాడు. ఆయన శరీరం ఇంద్రనీలమణి వలె, కాంతి వెన్నెల వలె, జటలు వైఢూర్యం వలే ఉంటాయి. కన్నులు తెల్లగా మైత్రితో, కనుపాపలు చాలా నీలంగా ఉంటాయి. కనుబొమలూ, గుండెలపై రోమాలూ, గెడ్డమూ, మీసాలూ నల్లగా ఉంటాయి. నవ్వు పొగమంచు కంటే చల్లగా, కంఠం శంఖం కంటే అందంగా ఉంటాయి. భుజాలు పుష్ఠిగా ఉంటాయి. బాహువులు పొడవుగా, చేతులు చిగుళ్ళ కంటే కోమలంగా ఉంటాయి. వక్షస్థలం విశాలంగా బలిసి ఉంటుంది. పలుచటి ఉదరంతో, విశాలమైన పిరుదులతో, అందంగా ఉంటాడు. కటి స్థలం విశాలంగా, తొడలు అరటిబోదెల వలె ఉంటాయి. చక్కటి మోకాళ్ళు, పిక్కలూ కలిగి ఉంటాడు. చీలమండలు గూఢంగా ఉంటాయి. పాదాల పైభాగాలు తాబేటి డిప్పల వలె ఉంటాయి. అరికాళ్ళు ఎర్ర తామర పువ్వుల వలె అందంగా ఉంటాయి.

ఆయన మృగచర్మమును వస్త్రంగా ధరిస్తాడు. ప్రతీక్షణమూ తనను తలచుకున్న వారి వద్దకు వెళుతుంటాడు. జ్ఞానోపదేశం చేయటమంటే ఇష్టం. ఆపదలు తొలగించటం ఆయన దీక్ష. సిద్ధాసనంలో నిటారుగా కూర్చుని ఉంటాడు. నవ్వు ముఖం. ఎడమచేత వరదముద్ర, కుడిచేత అభయ ముద్ర. బాలురు, ఉన్మత్తులు, పిశాచాలతో కలిసి తిరుగుతుంటాడు. త్యాగి. భోగి. మహాయోగి. నిత్యానందుడు. నిరంజనుడు, సర్వరూపి, సర్వదాత, సర్వగామి. సర్వకామదుడు. భస్మోద్ధూళిత శరీరుడు. మహాపాతకాలను నాశనం చేసేవాడు. భోగ మోక్ష ప్రదాయకుడు.

"ఇలా ధ్యానం చేసి అనన్యచిత్తంతో నా వజ్రకవచాన్ని పఠించాలి. సర్వత్రా నన్నే దర్శిస్తూ, నాతో సంచరించాలి" అని దత్తుడు తెలిపాడు.

దత్తుడు దిగంబరుడు, భస్మ సుగంధం పూసుకున్నవాడు. చక్రం, త్రిశూలం, డమ్రువు, గద అనే ఆయుధాలు ధరించినవాడు. పద్మాసనుడు. యోగీంద్రులూ, మునీంద్రులూ నిత్యమూ ఆయనను "దత్తా, దత్తా" అంటూ నమస్కరిస్తూంటారు.

దత్తాత్రేయ వజ్రకవచమ్ :

ఓం, దత్తాత్రేయుడు సహస్రార కమలంలో ఉండి, శిరస్సును రక్షించుగాక. అనసూయేయుడు చంద్రమండల మధ్యభాగంలో ఉండి ఫాలాన్ని కాపాడుగాక. మనోమయుడు హం క్షం ద్విదళ పద్మభవుడై భ్రూమధ్యమును రక్షించుగాక. జ్యోతిరూపుడు రెండు కన్నులను, శబ్ద స్వరూపుడు రెండు చెవులను, గంధ స్వరూపుడు ముక్కును, రస స్వరూపుడు నోటిని, వేద స్వరూపుడు నాలుకను, ధర్మ స్వరూపుడు దంతాలను మరియూ రెండు పెదవులను కాపాడుగాక. అత్రిభవుడు నా చెక్కిళ్ళను, ఆ తత్వవేత్త నా ముఖమంతటినీ కాపాడుగాక. సర్వస్వరూపుడు, నా ఆత్మలో ఉండేవాడు షోడశారకమలంలో ఉండి, నా కంఠాన్ని రక్షించుగాక. చంద్రానుజుడు నా భుజ శిరస్సులను, కృతాదిభవుడు నా భుజాలను, శత్రుజిత్తు కొంకులను, హరి వక్షస్థలాన్ని కాపాడుగాక. కకారాది ఠకారాంతమైన ద్వాదశారకమలంలో ఉన్న వాయు స్వరూపుడు యోగీశ్వరేశ్వరుడు నా హృదయాన్ని రక్షించుగాక. పార్శ్వస్థితుడనే హరి నా పార్శ్వాలను, హఠయోగాది యోగజ్ఞుడు మరియు కృపానిధి నా కుక్షినీ కాపాడుగాక. డకారాది ఫకారాంతం కల దశారకమలంలో ఉండే అగ్ని స్వరూపుడు నా నాభిని, వహ్నితత్వమయుడైన యోగి నా మణిపూరకాన్ని రక్షించుగాక. కటిలోని బ్రహ్మాండ వాసుదేవ స్వరూపుడు నా కటిని కాపాడుగాక. బకారాది లకారాంతమైన షట్పత్రకమలాన్ని వికసింపచేసే జలతత్వమయుడైన యోగి నా స్వాధిష్ఠాన చక్రాన్ని రక్షించుగాక. సిద్ధాసనంలో కూర్చున్న సిద్ధేశ్వరుడు నా ఊరువులను కాపాడుగాక. వకారాది సకారాంతమైన నాలుగు రేకుల కమలాన్ని వికసింపచేసే మహీరూపుడైన వీర్యనిగ్రహశాలి, మోకాళ్ళపై హస్తపద్మాలు పెట్టుకున్నవాడు నా మూలాధార చక్రాన్ని, ఇంకా అన్ని వైపులనుండీ నా పృష్ఠాన్ని రక్షించుగాక. అవధూతేంద్రుడు నా పిక్కలను, తీర్థపావనుడు నా రెండు పాదాలను, సర్వాత్ముడు నా సర్వాంగాలను కాపాడుగాక.

కేశవుడు నా రోమాలను రక్షించుగాక. చర్మాంబరుడు నా చర్మాన్ని, భక్తిప్రియుడు నా రక్తాన్ని, మాంసకరుడు నా మాంసాన్ని, మజ్జాస్వరూపుడు నా మజ్జను, స్థిరబుద్ధి గలవాడు నా అస్థులను, వేధ నా మేధను, సుఖకరుడు నా శుక్రాన్ని కాపాడుగాక. దృఢాకృతి నా చిత్తాన్ని, హృషీకేశాత్మకుడు నా మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని, ఈశుడు నా కర్మేంద్రియాలను, అజుడు నా జ్ఞానేంద్రియాలను రక్షించుగాక. బంధూత్తముడు నా బంధువులను కాపాడుగాక. శత్రుజిత్తు నన్ను శత్రువులనుండి కాపాడుగాక. శంకరుడు నా ఇల్లు, తోట, ధనం, పొలం, పుత్రులు మొదలైనవి రక్షించుగాక. ప్రకృతివిదుడు నా భార్యను కాపాడుగాక. శార్ ఙ్గభృత్తు నా పశువులను రక్షించుగాక. ప్రధానజ్ఞుడు నా ప్రాణాలను, భాస్కరుడు నా భక్ష్యాదులను, చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక. పురాంతకుడు నన్ను దుఃఖం నుండి రక్షించుగాక. పశుపతి నా పశువులను, భూతేశ్వరుడు నా ఐశ్వర్యాన్ని పాలించుగాక.

విషహరుడు తూర్పున, యజ్ఞస్వరూపుడు ఆగ్నేయాన, ధర్మాత్మకుడు దక్షిణాన, సర్వవైరిహృత్ నైరృతి మూల, వరాహుడు పడమటి దిక్కున, ప్రాణదుడు వాయువ్యపు మూల, ధనదుడు ఉత్తరాన, మహాగురుడు ఈశాన్యాన, మహాసిద్ధుడు ఊర్ధ్వదిక్కున, జటాధరుడు అధోదిశన రక్షించాలి. ఆది మునీశ్వరుడు ఏ దిక్కు రక్షణ లేకుండా ఉంటే ఆ దిక్కును కాపాడాలి.

"ఈ నా వజ్రకవచాన్ని ఎవడు చదివినా విన్నా వాడు వజ్రకాయుడు చిరంజీవి కాగలడు. అతడు త్యాగి, భోగి, మహాయోగి, సుఖ దుఃఖ రహితుడు, సర్వత్ర సిద్ధసంకల్పుడు, జీవన్ముక్తుడు అయి వర్తమానంలో ఉంటాడు." అని చెప్పి దత్తాత్రేయ యోగి అంతర్థానం చెందాడు. దలాదుడు కూడా అది జపించి జీవన్ముక్తుడైనాడు. దూరశ్రవుడు అనే భిల్లుడు అప్పుడు దీనిని విన్నాడు. ఒక్కసారి విన్నంతనే వజ్రకాయుడయ్యాడు.

దత్తాత్రేయ కవచమంతా శివుని నోట విన్న పార్వతి, "ఈ కవచం మహత్మ్యమూ, ఉపయోగించే విధానమూ తెలియచేయ"మని అన్నది. వినయంగా అడిగిన పార్వతి ప్రశ్నకు, "ఓ పార్వతీ ఏకాగ్రతతో విను. ధర్మార్థకామ మోక్షాలకు ఇదే ఆధారం"

"ఇది ఏనుగులనూ, గుర్రాలనూ, రథాలనూ, కాలిబంట్లనూ, సర్వైశ్వర్యాన్ని ఇస్తుంది. పుత్ర మిత్ర కళత్రాది సర్వసంతోష సాధనము. వేదశాస్త్రాది విద్యలకు నిధానము. సంగీత, శాస్త్ర సాహిత్య, సత్కవిత్వాలను ప్రసాదిస్తుంది. బుద్ధిని, విద్యను, తలపును, ప్రజ్ఞను, మతిని, నేర్పును ఇస్తుంది. శత్రువులను శీఘ్రమే సంహరిస్తుంది. యశస్సును, కీర్తినీ పెంచుతుంది."

"దీనిని వెయ్యి సార్లు జపిస్తే ఎనిమిది మహారోగాలూ, పదమూడు సన్నిపాతాలూ, తొంభై ఆరు కంటిజబ్బులూ, ఇరవై మేహ రోగాలూ, పద్దెనిమిది కుష్ఠు రోగాలూ, ఎనిమిది విధాల గుల్మాలూ, ఎనభై వాత రోగాలూ, నలభై పైత్య రోగాలూ, ఇరవై శ్లేష్మ రోగాలూ, క్షయ, చాతుర్థికం మొదలైనవీ, మంత్ర యంత్ర, కుత్సిత యోగాదులూ, కల్పతంత్రాదుల వల్ల కలిగించినవీ, బ్రహ్మరాక్షసులూ, భేతాళులూ, కూష్మాండాది గ్రహాలూ, వీటి వల్ల కలిగినవీ, ఆయా దేశకాలాలలో ఉన్నవీ, తాపత్రయం వల్ల కలిగినవీ, నవగ్రహాల వల్ల ఏర్పడినవీ, మహాపాతకాల వల్ల కలిగినవీ, అన్ని రోగాలూ పూర్తిగా నశిస్తాయి. ఇది నిశ్చయం."

"పది వేలసార్లు జపిస్తే గొడ్రాలు పుత్రవతి అవుతుంది. ఇరవై వేలసార్లు జపిస్తే అపమృత్యుజయం లభిస్తుంది. ముప్ఫై వేల సార్లు జపిస్తే ఆకాశ సంచారం అలవడుతుంది. కోటిమార్లు జపిస్తే సర్వకార్యాలు సాధ్యమవుతాయి. లక్ష సార్లకే కార్యసిద్ధి కలుగుతుంది. సంశయం లేదు."

"విషముష్టి చెట్టు మొదట దక్షిణాభిముఖంగా ఒక్క నెల జపిస్తే శత్రువు వికలేంద్రియుడవుతాడు. వృద్ధికి మేడి చెట్టు మొదటా, సిరి కోసం లక్ష్మీ బిల్వం మొదటా, అరిష్టాదుల శాంతికి చింతచెట్టు మొదటా, ఓజస్సు కోసం రావి చెట్టు మొదటా, భార్య కొరకై తీయ మామిడి చెట్టు మొదటా, జ్ఞానార్థం తులసి చెంతా జపించాలి. సంతతి కావాలనుకొనేవారు గర్భగృహంలో, ధనార్థులు మంచి క్షేత్రాలలో, పశువులు కోసం గోశాలలో, ఏ కోరిక గలవరైనా దేవాలయంలోనూ జపించాలి."

"బొడ్డులోతు నీటిలో నిలబడి సూర్యుని చూస్తూ వేయిసార్లు జపించినవాడు యుద్ధంలోగానీ, శాస్త్రవాదంలో గానీ జయిస్తాడు. గొంతులోతు నీటిలో రాత్రిపూట కవచం పఠిస్తే, జ్వరం, అపస్మారం, కుష్ఠు మొదలైన రోగాలూ తాపజ్వరాలూ తొలిగిపోతాయి."

"ఏది ఏది ఎక్కడ స్థిరంగా ఉంటుందో, ఏది ఏది ప్రసన్నమైతే అది నివారణమౌతుందో దాని కొరకు అక్కడ జపిస్తే సిద్ధి కలుగుతుంది. ఇది నిశ్చయం."

అని శివుడు చెప్పాడు. ఈ వజ్రకవచాన్ని పఠించినవాడు దత్తాత్రేయ సమానుడౌతాడు. ఈ విధంగా దత్తాత్రేయుడు దలాదునికి చెప్పినది, శివుడు పార్వతికి తెలియచేశాడు. ఈ కవచమును పఠించినవాడు ఈ లోకంలో దత్తుని వలె యోగి, చిరాయుష్మంతుడు అయి చరిస్తాడు.

ఏడు చేపల కధ అర్ధం పరమార్ధం...

ఏడు చేపల కథ చిన్న పిల్లలకు ఎంతో పరిచయం ఉన్న కథ మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునే కథ.

అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.

ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు.

వేటాడిన చేపలను ఎండబెట్టారు.

అందులో ఒక చేప ఎండలేదు.

చేపా, చేపా ఎందుకు ఎండలేదు అని అడిగారు.

గడ్డిమేటు అడ్డొచ్చింది అంది.

గడ్డిమేటు ?

గడ్డిమేటా ఎందుకు అడ్డొచ్చావ్‌ అని అడిగారు.

ఆవు మేయలేదు అంది.

ఆవా, ఆవా ఎందుకు మేయలేద అని అడిగారు?

గొల్లవాడు నన్ను మేపలేదు అంది.

గొల్లవాడా⁉️

గొల్లవాడా ఆవును ఎందుకు మేపలేదు అని అడిగారు.

అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.

అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదు❓అని అడిగారు.

పిల్లవాడు ఏడ్చాడు అంది.

పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడ్చావ్‌ ❓
అని అడిగారు.

చీమ కుట్టింది అన్నాడు.

చీమా చీమా  ఎందుకు కుట్టావ్‌❓అన్నారు.

నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది.

ఎన్నో అసహజాలు, అసంగతాలు అయిన సన్నివేశాలు ఉన్నా, ...

రీజనింగ్‌ అడగకుండా, ఆలోచించకుండా వినే గొప్ప తెలుగు కథ ఈ ఏడు చేపల కథ.

నిజానికి రాజుగారి కొడుకులకు చేపలు వేటాడాల్సిన కర్మ ఏం పట్టింది.

అడవికిపోయి క్రూర మృగాలను వేటాడవచ్చు కదా!

అయినా ఎవ్వరూ ఈ ప్రశ్న వేయరు.

చెరువుకు పోయి చేపలు తెచ్చారే అనుకుందాం.

వాటిని ఎండబెట్టడానికి, ఎండిన వాటిని ఎత్తిపోసుకోవడానికి వారి దివానుల్లో నౌకర్లే కరువయ్యారా⁉️

నిజానికి ఈ ప్రశ్న ఎంతో వ్యాలిడ్‌ ప్రశ్న. అయినా ఎవ్వరూ ఈ కోణం నుంచి ప్రశ్న వేయరు.

ఎవ్వరూ అడగలేదు కదా అని రీజనింగ్‌ ఇవ్వకపోవడం ఒక మంచి రచయిత లక్షణం కాదు.

అందుకే ఈ కథను జాగ్రత్తగా గమనిస్తే, చదువుకుంటే అనేక అంతరార్థాలు, పైకి కనిపించని విశేషాలు స్ఫురిస్తాయి.

రాజుగారు అంటే మనిషి.

ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు.

కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.

*జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం. *

రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే

మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 )

1.కామ 2.క్రోధ 3.లోభ 4.మోహ  5.మద 6.మాత్సర్యాలు

వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు.
అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.


అందుకే కథలో ఆరు  చేపలను  ఎండగట్టినట్టు చెప్పారు.

రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.

ఏమిటా చేప. అది మనస్సు 

దీన్ని జయించడం చాలా కష్టం.

ఎంత ప్రయత్నించినా అది ఎండదు.

మనస్సు  అంటే ఏమిటి❓

మనస్సు అంటే సంకల్ప వికల్పాలు

ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది.

మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు.

కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.

మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.


ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.

*ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది❓
గడ్డిమేటు.*

గడ్డిమేటు అంటే ఏమిటి❓

కుప్పపోసిన అజ్ఞానం.

గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా❓

మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.

కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼️

ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు.


దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.

మరి అది పోవాలంటే ఏం చేయాలి❓

ఆవు వచ్చి మేయాలి.

ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓

ఆవు అంటే జ్ఞానం.

జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.

లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.

అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు
(జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం)

జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.

 ఈ గోవును ఎవ్వరు మేపాలి.

గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓

సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.

జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా‼️

అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు.

ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.

ఏమిరా నాయనా‼️ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.

ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు❓

అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.

ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.

ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.

ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు❓ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.

ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు❓

వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం.

సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.

ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది.
మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన  తన విధిని నిలిపి వేసాడా? లేదు.
అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.

చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం,

మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.

చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓

మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట.

ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.