15, జులై 2023, శనివారం

ఆచరణ వల్ల మాత్రమే

 శ్లోకం:☝️

*అంతస్తిమిరనాశాయ*

 *శబ్దబోధో నిరర్థకః ।*

*న నశ్యతి తమో నామ*

 *కృతయ దీపవార్తయా॥*


అన్వయం: _మనసి యః తమః పూరితః వర్తతే తస్య శమనం నీతివాక్యైః ఏవ న భవితుం శక్నోతి యథా రాత్రికాలస్య అంధకారః దీపవిషయే చర్చాం కృత్వా న నశ్యతి ।_


భావం: కేవలం "దీప" శబ్దానికి అర్థం తెలుసుకోవడం ద్వారా లేక ఉచ్ఛరించడం ద్వారానో చీకట్లు తొలగింపబడవు. అటులనే నీతి వాక్యలు చదివినంత మాత్రాన లేక వల్లె వేసినంత మాత్రాన మానసిక చీకట్లు పోవు. అంటే ఆచరణ వల్ల మాత్రమే మానసిక పరివర్తన సాధ్యమవుతుందని భావం.🙏

Pujalu analysis


 

ఈ రోజు పంచాంగం

 ఈ రోజు పంచాంగం 15.07.2023 Saturday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస కృష్ణ పక్ష: త్రయోదశి తిధి స్థిర వాసర: మృగశిర నక్షత్రం వృద్ధి యోగ: గరజి తదుపరి వణిజ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


త్రయోదశి రాత్రి 08:34 వరకు.

మృగశిర రాత్రి 12:24 వరకు.

సూర్యోదయం : 05:53

సూర్యాస్తమయం : 06:50

వర్జ్యం : తెల్లవారుఝామున 04:31 నుండి ఉదయం 06:14 వరకు.

దుర్ముహూర్తం: ఉదయం 05:53 నుండి 07:37వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు. 



శుభోదయ:, నమస్కార:

శని త్రయోదశి

 _*🚩(15.07.23) శని త్రయోదశి ,  శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వరదేవుడు సంతృప్తి చెందుతాడు ?🚩*_


శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపి స్తాడు. శని భగవానుడు అంటే నీతి , న్యాయం , ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.


*శని త్రయోదశి అంటే*


శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో, నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. 


*అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి ,  ఎలా చేయాలి ?*


శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.

కుటుంబ, ఉద్యోగ, వ్యాపార , ఆరోగ్య, కోర్టు కేసులు, శత్రువులు , రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు, పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని , వస్త్ర ,ధన, వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తేమంచి ఫలితాలు దక్కుతాయి.పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తరువాత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించు కునేలా ఉండాలి అని అర్ధం . దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితంరాదు. కేవలం నిరుపేదలకు, పశు పక్షాదులకు చేస్తేనే పుణ్య ఫలం దక్కుతుంది ఇది గమనించాలి.


*త్రయోదశి వ్రతం :-*


శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం. సోదరుడు యమధర్మరాజు , సోదరి యమున , స్నేహితులు హనుమాన్ , కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త , పింగళ , కృషాణు , శౌరి , బభ్రు , మంద , పిప్పలా , రౌద్రాంతక , సూర్యపుత్ర అని పిలవబడుతాడు.నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి. ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి.


*శని త్రయోదశి రోజున పాటించవలసిన నియమాలు*


1️⃣ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి.


2️⃣ఆ రోజు మద్య , మాంసాలు ముట్టరాదు.వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.


3️⃣శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు

*నీలాంజన సమభాసం*

*రవిపుత్రం యమాగ్రజం*

*ఛాయా మార్తాండ సంభూతం*

*తం నమామి శనైశ్చరం.*


అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది.


4️⃣వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి.


5️⃣అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి.


6️⃣ఎవరితోను వాదనలకు దిగరాదు.


7️⃣ఆరోజు ఆకలితో ఉన్న వారికి , పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది.


8️⃣ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.


9️⃣మూగ జీవులకు ఆహార గ్రాసలను , నీటిని ఏర్పాటు చేయాలి.


🔟కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి.


1️⃣1️⃣అనాధలకు , అవిటి వారికి , పేద వితంతువులకు , పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి.


1️⃣2️⃣జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి.


1️⃣3️⃣ప్రతి రోజు తల్లి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి.


1️⃣4️⃣అత్త మామలను , వంట చేసి వడ్డించిన వారిని , మన మేలు కోరేవారిని , ఉద్యోగం ఇప్పించిన వారిని , ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు.


1️⃣5️⃣ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను , భవ బంధాలను మరువరాదు.


ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడని పురాణ వచనం.


దశరథుని రాజ్యానికి శనైశ్చర గ్రహబలం లేనందున కష్టాలు వస్తే , శనైశ్చరుని స్తుతించి దశరథుడు ఈ స్తోత్రాన్ని చేస్తాడు. ఈ స్తోత్రం పారాయణము చేసినవారికి శీఘ్రముగా నవగ్రహ అనుగ్రహం కలిగి ఏలినాటి శని , అర్ధాష్టమ శని దోషాలు తొలగి సంపదలు , ఐశ్వర్యాన్ని ఇస్తారని ఫలశ్రుతి. నిత్యం లేదా తప్పక శని వారం శనిత్రయోదశి వంటి పర్వదినాలలో పారాయణము చేయడం మంచిదని గురువుగారు పద్మపురాణ ప్రవచనంలో చెప్పారు. 


_*దశరథకృత శ్రీ శని స్తోత్రం*_


*ఓం నమః కృష్ణాయ నీలాయ - శితికంఠనిభాయ చ*

*నమః కాలాగ్ని రూపాయ - కృతాంతాయ చ వై నమః*


*నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్మశ్రుజటాయచ*

*నమో విశాల నేత్రాయ - స్థూలరోమ్ణే చ వై పునః*


*నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే*

*నమోస్తు కోటరాక్షాయ - దుర్నిరీక్షాయ వై నమః*


*నమో నీలమధూకాయ - నీలోత్పలనియభాయ చ*

*నమో ఘోరాయ రౌద్రాయ - భీషణాయ కరాళినే*


*నమస్తే సర్వభక్షాయ - బలీముఖ నమోస్తుతే*

*సూర్యపుత్ర నమస్తేస్తు భాస్కరాభయదాయ చ*


*అథో దృష్టే నమస్తేస్తు - సంవర్తక నమోస్తుతే*

*నమో మందగతే తుభ్యం నిస్త్రింశాయ నమోస్తుతే*


*తపసా దగ్ధదేహాయ- నిత్యం యోగరతాయ చ*

*నమో నిత్యం క్షుధార్తాయ - అతృప్తాయ చ వై నమః*


*జ్ఞాన చక్షు ర్నమస్తేస్తు- కశ్యపాత్మజసూనవే*

*తుష్ఠోదదాసి నై రాజ్యం - రుష్ఠో హరసి తత్తణాత్*


*దేవాసురమనుష్యా శ్చ సిద్ధ విద్యాధరోరగాః*

*త్వయా విలోకితా స్సర్వే - నాశం యాంతి సమూలతః*


*ఓం నమస్తే కోణసంస్థాయ - పింగళాయ నమోస్తుతే*

*నమస్తే బభ్రురూపాయ - కృష్ణాయ చ నమోస్తుతే*


*నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ*

*నమస్తే యమసంజ్ఞాయ- నమస్తే సౌరయే విభో*


*నమస్తే మందరూపాయ శనైశ్చర నమోస్తుతే*

*ప్రసాదం కుర మే దేవ వరార్థో హ ముపాగతః*


*ప్రసాదం కురు దేవేశ - దీనస్య ప్రణతస్య చ*


*ఇతి శనిస్తోత్రమ్*

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

14, జులై 2023, శుక్రవారం

_జగమెల్ల తనికెళ్ళ.

 *_జగమెల్ల తనికెళ్ళ..!_*


***********************


ఇంటర్ వరకు 

కలం పట్టనివాడు..

అటు తర్వాత 

కలకలం రేపాడు..!


రైల్వే కళాశాలలో

ఇతర వ్యాసంగాల 

'అద్దె కొంప'లో 

కాలం వెళ్ళబుచ్చినోడు 

'అగ్గిపుల్ల ఆత్మహత్య' తో

సాహిత్య నిత్య జైత్రయాత్రకు

శ్రీకారం చుట్టి..

రచనలతో ప్రపంచాన్ని చుట్టబెట్టి..

రాస్తూ రాస్తూ బాలగ్రహణం అధిగమించి..

ప్రాణం పెట్టి రాసిన 

'గోగ్రహణం' తో 

సాహితీ ఉన్నత శిఖరం

అకాడమీ అవార్డును 

చేపట్టి..పట్టుబట్టి 

వెండితెరను మెట్టి

ఆ తెరపై 

జిలుగుల తారగా

వెలుగులు పంచుతున్న

భరణి..అక్షరాల ఆమని..

ఆ అక్షరాలనే 

లక్షణంగా మెచ్చింది అవని..!


భరణి..

వీధినాటకాలకు పేరని..

అందుకు 

బాదల్ సర్కార్ ప్రేరణని..

ఆ ఏకలవ్య శిక్షణే

'పెద్దబాలశిక్ష'ని..

ఆ పరంపరలో 

కొక్కొరోకో..గొయ్యి..

విలన్ పాత్రల్లో

అందె వేసిన చెయ్యి..!


రాళ్ళపల్లితో చెలిమి

ఇచ్చింది నాటకాల కలిమి..

వంశీకి నేస్తమై 

లేడీస్ టైలర్ పోలీసై..

శివలో పైలాపచ్చీసై..

జనం మెచ్చిన భాసై..

తెలంగాణ యాసై..

ప్రతి సినిమా సెభాసై..!


నేపాలీ మాంత్రికుడి తంత్రాన్నే తిప్పికొట్టిన 

నాటి తోటరాముడు..

యముడు తిప్పితిప్పి కొట్టిన

నిన్నటి తోటరాముడు..

చెల్లికి జరగాలి పెళ్లి 

మళ్లీ మళ్లీ..

కవిత ప్రచురణ కాగానే

అంతటి రచయితా 

మురిసిపోలేదా తుళ్లీతుళ్ళీ..!

హైదరాబాద్ నీకు..

సికిందరాబాద్ నాకు..

ఇలా మురిసిపోతే

ఎలా డిసైడ్ అయిపోయిందో

తనికెళ్ళ కెరీరు..

పెద్ద పెద్దోళ్ళే తకరారు..

జాతకమే తారుమారు..

వెలిగిపోతూ మారుమారు..!


నాలోన శివుడు కలడు..

నీలోన శివుడు కలడు..

సర్వేశ్వరుడే సర్వస్వమై..

తాదాత్మ్యతే త్వమేవాహమై

భక్తి నిలువెల్లా ఆవాహమై..

పాటలు ప్రవాహమై..

మురిసిపోతూ భరణి..

మెరిసిపోతూ ధరణి..!

***********************

తోటరాముడు 

తనికెళ్ళ భరణికి

జన్మదిన శుభాకాంక్షలతో..


    *_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

        విజయనగరం

       9948546286

https://drive.google.com/file/d/1xg_RrsaCk6uCCS0DR05mKsBJOeJJGd5S/view?usp=gmail 


 

425 Hindi movies

 *This is a link for 425 Hindi movies, watch one picture every day.. It will take more than a year...*

*Each film is a Hindi hit.  Beautiful collection for old Hindi movie lovers.*


*https://youtube.com/playlist?list=PLafSq5UblCNWcweoEqCDqZ76FmADCuGSf*


*1940 to 1975*


Very beautiful prints are seen without a single minute cut.


*Truly this link is a treasure - can be used liberally.*

నిత్యజీవితం సాఫీగా కొనసాగాలంటే

 *మన నిత్యజీవితం సాఫీగా కొనసాగాలంటే ఏమి చేయాలి???*


"కోపం, అసూయ, ద్వేషం, అసహనం, చికాకు, మోహం వంటి గుణాలకు మనసులో కొనసాగే ఆలోచనలు కారణం అవుతున్నాయి"...

అందుకే అవి మనను బాధిస్తున్నాయి. 

మన ప్రతి ఆలోచన మనలో కలిగే కోరికకు అనుగుణంగా మన జ్ఞాపకాల పరిధిలోనే ఉంటుంది. 

కేవలం మనకు వచ్చే ఆలోచనలనే,  మనం మనసని అనుకుంటున్నాం. 

ఆ ఆలోచనలకు కారణమైన జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలకు కారణమైన కోరికలు, ఆలోచనలకు ఫలంగా లభించే సుఖ -దుఃఖాలు అన్నీ కలిపితేనే మన మనసు...


సాధారణంగా సాగే ఆలోచనలు మనను ఇబ్బంది పెట్టటంలేదు, చేస్తున్న పనికి అంతరాయం కలిగించే ఆలోచనలే మనల్ని బాధపెడుతున్నాయి. 


మనం ఆలోచనల నుండి బయటపడాలని ప్రయత్నం చేస్తుంటాం. 

ఆలోచన స్వరూపాన్ని అర్ధం చేసుకునేందుకు కారణాలు విశ్లేషించుకుంటే తప్ప వాటి నుండి పూర్తిగా బయటపడలేం.


మనకు నిజానికి ఆలోచనలవల్ల బాధ రావటం లేదు. 

ఆ ఆలోచనతో పాటు మనలో కలిగే గుణాల వలనే బాధ కలుగుతుంది. 

ఆ గుణాలే.. కోపం, అసూయ, ద్వేషం, అసహనం, చికాకు, మోహం. 

"ముందుగా వీటి నుండి బయటపడాలి !" అప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది...


                *_🪷శుభమస్తు🪷_*

  *🙏 లోకా:సమస్త సుఖినోభవంతు.🙏*

మనసు బుద్ధి

 🌺మనసు బుద్ధి🌺


🍁మనసు బుద్ధి నియంత్రణలో ఉంటే అది మంచి సేవకురాలు, మనసే బుద్ధిని నియంత్రిస్తే అది ఒక నియంత. అది పాదరసం లాగా చురుకైనది. చేతికి దొరికినట్లే ఉంటుంది, కానీ తేలికగా జారిపోతుంది. భవబంధాలకు మోక్షానికి, రాగానికిద్వేషానికి, భయానికి ధైర్యానికి, సంకల్ప వికల్పాలకు, శాంతికి అశాంతికి.... అన్నింటికీ మూలం మనసు. మనసును నియంత్రిస్తే ప్రశాంతత, శాంతిసౌఖ్యాలు లభిస్తాయి. నిజానికి అది అంత తేలిక కాదు. గట్టిగా ప్రయత్నిస్తే కష్టమూ కాదు.


🍁మచ్చికైన జవనాశ్వం రౌతు అధీనంలో ఉన్నట్లు బుద్ది అదుపులో మనసు ఉండాలి. రౌతు కోరిన చోటుకు గుర్రం వెళ్ళాలి కాని, అది తీసుకుపోయిన చోటికి రౌతు వెళ్ళడం కాదు. మాలిమి చేసుకున్న మనసు మాత్రమే బుద్ధి అధీనంలో నడుచుకుంటుంది. మనసు మాయాజాలం మాటలకు అందనిది. మయుడి సభను మరపించే భ్రమల సౌధాన్ని కల్పిస్తుంది. తనది కానిదాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైనదాన్ని శాశ్వతమన్నట్లుగా భ్రమిం పజేస్తుంది, మరులు గొల్పుతుంది, మురిపిస్తుంది, మరిపిస్తుంది. బుద్ధి ఉపయోగించి గాని ఆ మాయ నుంచి బయటపడలేము.


🍁 రాగద్వేషాలతో నిండిన మనసు ఉన్నది ఉన్నట్లుగా చూడనివ్వదు. అది ప్రసరింపజేసే రంగు రంగుల కాంతిలో గాజుముక్క కూడా వజ్రంలాగా కనిపిస్తుంది. బుద్ధి అనే సూర్యకాంతిలో గాని వజ్రానికి గాజుముక్కకు తేడా తెలియదు. మనసు నిజ జీవితానికి భిన్నమైన గొప్ప ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అది విశ్వామిత్రుడి త్రిశంకు స్వర్గం కన్న మిన్నయైనది. ఆ కాల్పనిక జగత్తులో మునిగితేలేవారు నిజ జీవితాన్ని దుర్భ చేసుకుంటారు.


🍁 కొంతమంది పలాయన వాదాన్ని చిత్తగిస్తారు. కొందరు మద్యపానాన్ని ఆశ్రయిస్తారు. కొందరు తమ బాధ్యతను కర్తవ్యాన్ని భగవంతుడిపై నెట్టేస్తారు. అటువంటి వారికి | మద్యపానమైనా భగవంతుడి ప్రార్థనలైనా పెద్ద భేదం ఉండదు. ఎన్ని చూసినా, ఉపనిషత్తులు చదివినా, భగవద్గీతను కంఠస్థం చేసినా వాటి సారాన్ని నిజ జీవితంలో అన్వయించుకొనిఆచరించగలగాలి. అప్పుడే వాటికి సార్ధకత.


🍁మనిషి బలం, బలహీనత... రెండూ మనసే. మనిషిని దైవత్వానికి చేరువ చేసేది మనసే. రాక్షసుడిగా దిగజార్చేది మనసే. బలహీనమైన మనసు ప్రతి అల్ప విషయానికీ ఉద్విగ్న భరితమవుతుంది. ప్రశంసిస్తే ఆకాశంలో విహరిస్తుంది. విమర్శిస్తే పాతాళానికి కుంగిపోతుంది. తాళం చెవి ఎడమవైపు తిప్పితే గడియ పడుతుంది, కుడిపక్కకు తిప్పితే గడియ తెరుచుకుంటుంది. మనసూ ఎటు తిప్పితే అటు తిరుగుతుంది.


🍁 భౌతిక సుఖాలకు వ్యతిరేకంగా తిప్పితే ఆధ్యాత్మికత వైపు తిరుగుతుంది. మనసులోని వ్యతిరేక భావనలను తొలగించి సానుకూలమైన ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే శారీరక రుగ్మతలూ దగ్గరకు రావు. నేటి శాస్త్రవేత్తలు కూడా చాలా రోగాలకు కారణం మనసే అని, మనసు హాయిగా ఉంచుకున్నవారికి రోగాలు దరిచేరవని ధ్రువీకరిస్తున్నారు.


🍁ధర్మబద్ధమైన కర్మలను నిష్కామంగా ఆచరిస్తూ బుద్ధికి మనసును అప్పజెప్పి జీవనయానాన్ని కొనసాగించాలి. 🍁ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటూ మనసులో చెలరేగే ఆలోచనలు ప్రలోభాలు సంఘటనలను అవగాహన చేసుకుని, విచక్షణతో వాటి ప్రభావాన్ని కొద్దికొద్దిగా తగ్గించు కోవాలి. 

🍁అప్పుడు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దారి తప్పకుండా ఉంటాయి.🙏



Shri ram jay ram jay jay ram

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయరామ జయ జయరామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

శ్రీ రామ జయ రామ జయ జయ రామ

,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏




https://kutumbapp.page.link/MfyskXWkTZSU9h8S8?ref=F4LTY

సుభాషితమ్

 .

                     _*సుభాషితమ్*_


॥శ్లోకం॥


*దేవద్విజ గురుప్రాజ్ఞ*

*పూజనం శౌచమార్జనమ్।*

*బ్రహ్మచర్య మహింసా చ*

*శారీరకం తప ఉచ్యతే॥*


తా𝕝𝕝 

దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించుట, శరీరశుద్ధి కలిగియుండుట మరియు ఋజుత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శరీరముచే చేయదగిన తపస్సులని చెప్పబడుచున్నవి.



--------------------------------------------


శ్లోకం


పరాధీనం వృథా జన్మ!

పరస్త్రీషు వృథా సుఖం!

పరగేహే వృథా లక్ష్మీః!

విద్యా యా పుస్తకే వృథా!!


(సుభాషితరత్నావళిః)


*తాత్పర్యం*


పరాధీనమైనట్టి బ్రతుకు,పరస్త్రీలవలని సుఖము,పరుల యింటనున్న ధనము, పుస్తకములయందలి జ్ఞానము - సమయమునకు అక్కరకు వచ్చునవి గావు.

_చాగంటి గుడిగంట_

 *_చాగంటి గుడిగంట_*

_______________________


_ప్రవచనకర్త పుట్టినరోజు_


************************

_*చాగంటిపై కవితా..*_

_ప్రవచనానికి నిర్వచనమైన_

_శారదా పుత్రునిపై_ 

_వచన కవనమా.._

_వచనానికే బహువచనమైన_

_ప్రవచనచక్రవర్తిపై_

_నాలుగు మాటలు రాయాలని ఆర్తి.._

_మాటకే స్ఫూర్తి..._

_ఎల్లలేని కీర్తి.._

_ఎనలేని సమయస్ఫూర్తి_

_ఆ పరిపూర్ణ మానవతామూర్తి.._

_ఎంత రాస్తే..ఏమని వర్ణిస్తే_

_తృప్తి..నా దీప్తి.._

_చంద్రునికో నూలుపోగు.._

_పుంభావ సరస్వతికి_

_అక్షరాల హారతి.._

_ఈ రీతి..నా నిరతి!_


*_చాగంటి గళం_* 

_పోతన పద్యాల గంగాళమా.._

_ఆ రసన_ 

_వాల్మీకి  తన రామాయణాన్ని_ 

_లిఖించిన తాళపత్రమా.._

_శ్లోకం ఆయన నోట_

_పంచదార పాకం.._

_పద్యం దేవదేవునికే నైవేద్యం!_


*_చాగంటి మాటలు_* 

_చద్ది మూటలు.._

_ధారణ అసాధారణమై.._

_అజ్ఞానాంధకారంలో_ 

_నిను నడిపించే_ _వెలుగుకిరణమై.._

_ఆధ్యాత్మిక తోరణమై.._

_ముక్తి వైపు నీ చేయి పట్టి_

_నడిపే ఆపన్నహస్తమై.._

_నీ విజ్ఞాన సమస్తమై..!_


*_ఇలాంటి ఓ మనిషిని_*

_ప్రజ్ఞాన సర్వస్వమనాలో.._

_ఆధ్యాత్మిక భాండాగారమని_

_పిలవాలో.._

_పురుషరూపం దాల్చిన_

_వాగ్దేవి అని కొలవాలో.._

_కారణజన్ముడని స్తుతించాలో.._

_దేవుడే అని ప్రస్తుతించాలో..!_


*_ప్రవచనం ఆయనకు దైనందినం.._*

_ఎన్నిసార్లు చేసినా ఆనందమే_

_దినం దినం.._

_ఆయన అసీనమైన వేదిక_

_భక్తి సుమాల నందనం.._

_ఆ సన్నిధానమే_

_సకల క్షేత్ర సందర్శనం.._

_అక్కడ దేవతలే సంచరిస్తున్న_ 

_అనుభూతి దైవత్వ ఉనికికే_

_ప్రత్యక్ష నిదర్శనం..!_


_*చాగంటి ప్రవచన శ్రవణం*_

_దివ్యలోక విహారం.._

_పక్కనే వాగ్దేవి ఉన్నట్టు.._

_అచ్చోట శ్రీరాముడే సీతాసమేతుడై_

_కొలువుదీరినట్టు.._

_సభాస్థలిని అంజనాపుత్రుడే_

_పర్యవేక్షిస్తున్నట్టు.._

_ముక్కంటి ఆ వాగ్ధాటిని_

_గని..విని.._

_శిరసుపై ఉన్న గంగతో_

_నీ వేగాన్ని మించిన_ 

_ఆ వాక్ప్రవాహాన్ని చూసావా.._

_అని మేలమాడినట్టు.._

_వేణుగోపాలుడు_

_ఇతడు సాందీపుడా అని_

_దీపం వెలుగులో మరింత_ _నిశితంగా చూసినట్టు.._

_వ్యాసుడు తనను తానే_ 

_చూసుకుంటున్నట్టు.._

_ముక్కోటి దేవతలే_ 

_మారువేషాల్లో బెరుకుగా_

_ఇరుకున వరసల్లో_

_కూర్చున్నట్టు.._

_సభ దేవసభే అన్నట్టు.._

_కలియుగమే_ _భక్తిరసరమ్యయోగమైనట్టు..!_


*_చాగంటి పలుకు.._*

_వేదానికి అనువాదం.._

_ఆధ్యాత్మిక నినాదం.._

_కలియుగంలో భక్తినాదం.._

_వాగ్దేవికి ముదం.._

_సకల దేవతలకు ఆమోదం..!_


*_ధర్మ స్థాపనకు  దేవుని అవతారం.._*

*_ధర్మరక్షణకు రుషి.._*

*_ధర్మబోధనకు గురువు.._*

*_ధర్మవ్యాప్తికి ప్రయోక్త.._*

*_ఈ అందరి సమ్మేళనమే_*

*_చాగంటి అనే వక్త.._*

*_పంచె..లాల్చీ కట్టి.._*

*_నుదుటిన విభూతి పెట్టి..._*

*_ధోవతి ధరించి.._*

*_వేదికను అలంకరించే.._*

_*ధర్మ ప్రచార ప్రవక్త..!*_


*కృష్ణం వందే జగద్గురుం..*

*చాగంటి యందే* 

*మన సద్గురం..*

*కోటేశ్వరా..కోటి దండాలు..!*


🙏🙏🙏🙏🙏🙏🙏


*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

       9948546286

శ్రీరామస్సకలేశ్వరో

 శ్రీరామస్సకలేశ్వరో మమ పితా 

           మాతా చ సీతా మమ

భ్రాతా బ్రహ్మసఖా ప్రభంజనసుతః

              పత్నీవిరక్తిః ప్రియా

విశ్వామిత్రవిభీషణాదివశగాః

           మిత్రాణి,బోధస్సుతో

భక్తిశ్శీహరిసంగతారతిసుఖం

              వైకుణ్ఠమస్మత్పదమ్.


ఓయీ ఎవరవయ్యా నీవు?

     శ్రీరాముడు మాతండ్రి,ఆయనెవరు?సకలేశ్వరుడు,మరి సీతమ్మ?మా అమ్మే.అన్న ఎవరేం?బ్రహ్మనుండి వరాలపొందిన వాయునందనుడు.

పెళ్ళయందా?నీపెళ్ళెమెవరూ?  విరక్తి (ధర్మ)పత్నీఆమేప్రియురాలుకూడ.

మిత్రులెవరైనా ఉన్నారా?లేకేమి విశ్వామిత్ర,విభీషణవశగులందరూ మిత్రులే

కొడుకున్నాడా? బోధః సుతః.,ఇకసుఖానికేమికొరత

శ్రీహరిసంగతులకలయికే సుఖం. ఇంతకీ ఉండేదెక్కడేంటి?

వైకుంఠమే మాచోటు.

సమయపాలన

 సమయపాలన...

పరమాచార్య వారు ఆకలికి, నిద్రకు సమయం కేటాయించరు. కానీ వారిని సేవించే శిష్యులకు అలా వీలుపడదు.ఒక్కోసారి సాయంత్రం నాలుగు గంటలు దాటినా భిక్ష స్వీకరించరు. భక్తులకు దర్శనం ఇస్తూనే ఉంటారు. కానీ శిష్యుల పరిస్థితి వేరు. వారికి ఆకలి దంచేస్తున్నా ఆ విషయం వారి దృష్టికి తీసుకొని వెళ్ళలేరు.

ఒక చురుకైన శిష్యుడు ఈ సమస్యకు ఒక పరిష్కారం కనిపెట్టాడు. స్వామి వారి గదిలో ఒక గడియారం ఉండేది. వారు అవసరమైనప్పుడు ఆ గడియారం లో టైమ్ చూసేవారు.ఈ చురుకైన శిష్యుడు రహస్యం గా గడియారం ముల్లును 3.30ని. ల నుంచి 4.30 ని. మార్చి ఏమి తెలియనట్లు మరల సేవలో నిమగ్నమైనాడు.

ఇంతలో ఒకరోజు స్వామి వారి భక్తుడు దర్శనానికి వచ్చి స్వామి ని అపర పరమేశ్వరునిగా స్తుతించాడు. స్వామి

"అలాంటిదేమి లేదు.మీరన్నట్లు నాకెలాంటి శక్తులు లేవు.ఆ శక్తులే ఉంటే నా గదిలో గడియారం గంట ముందు పోతుంటే ఆపగలిగే వాణ్ణి గదా."అన్నారు.

స్వామి వారి నిజమైన శక్తి తెలుసు కున్న ఆ శిష్యుడు వారి పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నాడు.

స్వామి "అయ్యో లే. మీకు ఆకలవుతున్న దన్న విషయం తెలియకుండా పోయింది."అని నొచ్చుకున్నారు.

***పరమాచార్య వారిని ఎవరు ఏమార్చలేరు. వారి ధర్మం నుండి ఎవరు మరల్చలేరు.

 🕉 మన గుడి : 


⚜ అస్సాం : గౌహతి


⚜ శ్రీ శుక్రేశ్వర ఆలయం


💠 గౌహతిలోని ప్రసిద్ధ శివాలయాలలో ఇది ఒకటి, సుక్రేశ్వర్ ఆలయం గౌహతిలోని సుక్రేశ్వర్ కొండ లేదా ఇటాఖులి కొండపై ఉంది.


💠 ఇక్కడ శుక్రేశ్వర శివలింగము కలదు. 

ఇది బ్రహ్మపుత్ర నదీ తీరములో కలదు. 

ఇక్కడ రాక్షస గురువైన శుక్రాచార్యుల వారిచే ప్రతిష్టింపబడిన శివలింగము కలదు


💠 ఇక్కడ వెలసిన స్వామివారు చిన్న పానమట్టముపై వెలసి లింగాకారములో

ఉంటుంది. 

ఇది ఎర్రటి లింగము.


💠 ఇక్కడ శివుడిని  శుక్రేశ్వరుడు లేదా శుకనాథ రూపంలో పూజిస్తారు. 

ఈ ఆలయం బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది.

ఈ ఆలయం నది యొక్క దక్షిణ ఒడ్డున ఉన్నందున ఇది సందర్శకులకు బ్రహ్మపుత్ర నది యొక్క అందమైన దృశ్యాన్ని అందిస్తుంది. 

నది యొక్క సుందరమైన దృశ్యం నిజంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది, ఇది సందర్శకులకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది.

 

⚜ చరిత్ర ⚜


💠 పురాణాల ప్రకారం ఈ ఆలయ చరిత్ర శుక్రాచార్యుడితో  ముడిపడి ఉంది.

అతను శుక్రేశ్వర్ కొండ వద్ద తప్పసు  చేసాడు, అక్కడ అతను క్రమం తప్పకుండా శివుడిని ధ్యానం మరియు పూజించేవాడు. 

కాళికా పురాణం ప్రకారం ఆయన ధ్యానం చేసిన ప్రదేశం ఏనుగు మూపురం ఆకారంలో ఉన్నందున హస్తగిరి అని పిలుస్తారు.


💠 పురాణాల ప్రకారం, శివుడు స్వయంగా భక్తుల బృందానికి కనిపించిన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడింది. 

భక్తులు బ్రహ్మపుత్ర నది ఒడ్డున యజ్ఞం (హిందూ ఆచారం) చేస్తూ ఉండగా, శివుడు అకస్మాత్తుగా వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. 

అతను తన అనేక రూపాలలో ఒకటైన శుక్రేశ్వరుడు లేదా శుకనాథగా భక్తులను అనుగ్రహించాడు.


💠 ఈ ఆలయం 18వ శతాబ్దంలో అహోం రాజుల కాలంలో నిర్మించబడింది. 

అహోం రాజవంశం 13వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు 600 సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతాన్ని పరిపాలించింది

ఈ ఆలయాన్ని 1744 సంవత్సరంలో అహోం రాజు ప్రమత్త సింగ్ నిర్మించాడు.

అతను తన పాలనలో అనేక మతపరమైన ప్రదేశాలను నిర్మించాడని భావిస్తున్నారు. 


💠 శుక్రేశ్వర్ ఆలయం సాంప్రదాయ అస్సామీ వాస్తుశిల్పానికి ఒక అందమైన ఉదాహరణ. 

ఈ ఆలయం శిఖర శైలిలో నిర్మించబడింది, ఇది ఉత్తర భారతదేశంలో కనిపించే ఒక రకమైన ఆలయ నిర్మాణ శైలి. 


💠 శుక్రేశ్వర దేవాలయం యొక్క శిఖరం ఇటుకలతో తయారు చేయబడింది మరియు దాదాపు 35 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది.

ఈ ఆలయం క్లిష్టమైన శిల్పాలతో, పనిచేసిన కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం. 


💠 ఈ శిల్పాలు హిందూ పురాణాల నుండి వివిధ దృశ్యాలను వర్ణిస్తాయి.

ఇందులో శివుడు మరియు పార్వతి కథ, అలాగే విష్ణువు యొక్క అనేక రూపాలు ఉన్నాయి.


💠 ఆలయ ప్రధాన గర్భగుడిలో శివలింగం ఉంది.

శుక్రేశ్వర దేవాలయంలోని లింగం నల్లరాతితో తయారు చేయబడింది మరియు ఈ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైనదిగా చెబుతారు.


💠 గువాహటి రైల్వే స్టేషన్ ఆలయం నుండి 7 కిమీ దూరంలో ఉంది. 

రైల్వే స్టేషన్ నుండి, ఆలయానికి చేరుకోవడానికి టాక్సీ లేదా బస్సులో అద్దెకు తీసుకోవచ్చు.