4, మార్చి 2024, సోమవారం

పాఠకులకు

 

మనబ్లాగు అనేక దేశాల తెలుగు వారు చూస్తున్నారని తెలుపుటకు సంతోషితున్నాను. ఒక్కొక్క రోజు భారత దేశంలో వీక్షకులకన్నా ఎక్కువగా అమెరికా, కెనడా, ఫ్రాన్సు దేశంల నుండి ఉండటం ముదావహం. కాగా నిత్యం అనేక విషయాలను గురించి నేను పోస్టులు పెడుతున్న సంగతి పాఠకులకు విదితమే బ్లాగు మనమందరిదిమీరు కూడా బ్లాగులో చక్కటి విషయాలను పంపి భాగస్వాములు కావచ్చుమీరు చేయవలసినది ఏమంటే మీరు తెలుపదలచుకున్న విషయాన్నీ తెలుగులో కానీ, ఇంగ్లీషులో లేక హిందీలో పంపండిఎలా అంటే రోజునుంచి నేను కొత్త కవులు పేజీ అని ఒక పేజీ వున్నది .  మీరు పేజీ లో కామెంటు రూపంలో మీ పోస్టులను పంపండిఅందరకు ఆమోదకరం, ఉపయుక్తకరం అని తలచినవి నేను కామెంట్ల రూపంలో పబ్లిష్ చేస్తాను

పంచాంగం గురించి 

మన బ్లాగులో నిత్యం పంచాంగం రెండు మూడు రకాలుగా పెడుతున్నాముకానీ పంచాంగం విషయంలో ఇతరదేశాలలో వుంటున్నవారు గమనించాల్సినది ఏమిటంటే పంచాంగం ఒక ప్రాంతంలోని సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాలను గణనలోకి తీసుకొని లెక్కిస్తారు.కాబట్టి ఇక్కడి (హైదరాబాదు) తిథి వార నక్షత్రాదులు మీరు ఉండే ప్రాంతానికి సమన్వయము కావటం జరగదుఅటువంటప్పుడు ఏమి చేయాలి

పంచాంగ సవరణ: మీరు హైదరాబాదు సూర్యోదయకాలం మీ ప్రాంతపు సూర్యోదయకాలంకు వున్నా వేత్యాసాన్ని కలిపి లేక తీసివేస్తే మీకు మీ ప్రాంత పంచాంగం వస్తుంది. అదే సమయం ఇతరత్రా విషయాలకు సమన్వయము చేసుకోవాలిఅంటే ఉదాహరణకు మీరు హైదరాబాదు నుంచి వున్నా ప్రదేశం హైదరాబాదు సూర్యోదయానికన్నా 5 నిముషాలు ముందుగా వున్నారనుకోండి అప్పుడు హైదరావాడు సమయానికి 5 నిముషాలు కలుపుకుంటే మీ రోజు పంచాంగం వస్తుంది

 ప్రకటనల గురించి 

మనబ్లాగులో అమెరికా వారు కెనడా వారు విశేషంగా చూస్తున్నారుదీనిని ఎందుకు ఇతరులకు అంటే అక్కడ  వుంటూ అక్కడి  మన తెలుగువారితో వ్యాపారం చేసుకోవాలనుకునేవారికి దోహదకారిగా ఉండకూడదు అని తలంచి   ఒక వ్యాపార ప్రకటన విభాగాన్ని మన బ్లాగులో తెరువ తలచాముఅది ఎలావుంటే బాగుండునది అనే విషయాన్ని పాఠకులు కామెంటులో పెట్టి  తెలుపగలరు. అదే విషంగా ఎంత రుసుము తీసుకుంటే బాగుంటుంది తెలుపగలరు

ఇట్లు 

మీ భార్గవ శర్మ 

శివుడుని దర్శించిన సీతమ్మతల్లి*

 #హనుమలో శివుడుని దర్శించిన సీతమ్మతల్లి*


... #హనుమ రోజూ సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో .... ఈ రోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను .... నేనే స్వయంగా వంటచేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను అంది సీతమ్మ .... పిలు పిలు .... నీకే అర్థం అవుతుంది అన్నాడు రాముడు నవ్వుతూ .... అన్నట్టుగానే సీతమ్మ స్వయంగా వంటచేసి .... హనుమని భోజనానికి పిలిచింది .... తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ .... కడుపునిండా తిను నాయనా .... మొహమాటపడకు అని చెప్పింది ...


#సరేనమ్మా అని చెప్పి హనుమ తలవంచుకుని భోజనం చేయసాగాడు .... సీతమ్మ కోసరి కోసరి వడ్డిస్తోంది .... హనుమ వద్దు అనకుండా .... వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతా తింటున్నాడు .... కాసేపట్లో సీతమ్మ స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది .... సీతమ్మ కంగారు పడి అంఃతపురవాసుల కోసం వండిన వంట తెప్పించింది .... అదీ అయిపోయింది .... తలవంచుకునే ఆహరం కోసం నిరీక్షీస్తూన్నాడు .... హనుమ ఆవురావురమంటూ .... సీతమ్మకి కంగారు పుట్టి .... రోజూ ఏం తింటున్నావు నాయనా .... అని అడిగింది వినయంగా ...


... రామ నామం తల్లీ .... వంచిన తలెత్తకుండా జవాబిచ్చాడు హనుమ .... సీతమ్మ త్రుళ్లిపడింది .... నిరంతరం రామనామం భుజించేవాడు .... భజించేవాడు .... శివుడోక్కడే గదా .... సీతమ్మతల్లి తేరిపార జూసింది .... అపుడు కనిపించాడు సీతమ్మకి .... హనుమలో శంకరుడు .... శంకరుడే హనుమ .... నిత్యం రామనామం ఆహారంగా స్వీకరించేవాడికి .... తాను మరే ఆహరం పెట్టగలదు .... 


 .#సీతమ్మ ఓక అన్నపు ముద్దను పట్టుకుని .... రామార్పణం అని ప్రార్థించి వడ్డించింది .... ఆ ముద్దని భక్తితో కళ్లకు అద్దుకోని స్వీకరించి .... అన్మదాత సుఖీభవా అన్నాడు హనుమ త్రుప్తిగా .... హనుమలోని పరమేశ్వరుడుకి భక్తితో నమస్కరించింది సీతమ్మతల్లి


#సర్వోజనా సుఖినోభావంత్🙏

3, మార్చి 2024, ఆదివారం

రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*03-03-2024 / ఆదివారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

మేషం


చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

---------------------------------------

వృషభం


వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు ముందుకు సాగుతారు. బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

---------------------------------------

మిధునం


ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాల నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. మిత్రులతో ఆర్థిక విషయంలో విబేధాలు కలుగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి.

---------------------------------------

కర్కాటకం


భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారమున నష్టాలు భర్తీ అవుతాయి.

---------------------------------------

సింహం


సోదరులతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. బందు మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. స్థిరస్తి వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్య సిద్ది కలుగుతుంది.

---------------------------------------

కన్య


ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించటం మంచిది. చిన్ననాటి మిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి.


---------------------------------------

తుల


వృత్తి వ్యాపారాలు స్థిరంగా రాణించవు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు అధికమౌతాయి.

---------------------------------------

వృశ్చికం


వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు హోదాలు పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘ కాలిక వివాదాల నుండి బయట పడతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

ధనస్సు


కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

మకరం


ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు కలసివస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి అవుతాయి. ఉద్యోగమున ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

కుంభం


నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అతి కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు.

---------------------------------------

మీనం


విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ సేవకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

🍀 *శుభం భూయాత్* 🍁

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝.      


*నచ విద్యా సమో బంధుః*

*నచ వ్యాధి సమో రిపుః౹*

*నచాஉపత్య సమస్స్నేహః*

*నచ దైవాత్ పరం బలమ్॥*


(సుభాషిత రత్నావళి)


తాత్పర్యం:-

విద్యతో సమానమైన బంధువు లేఁడు. రోగముతో సమానమైన శత్రువు లేఁడు. పుత్రునితో సమానమైన స్నేహితుఁడు లేఁడు. దైవముతో సమానమైన బలము వేరే లేదు.

గ్రేట్ ఫిలాసఫీ

 గ్రేట్ ఫిలాసఫీ...


చచ్చిపోయేమనుకో.!. అప్పుడు ఏమవుతుందంటావ్.?'


'ఆ చావులో నన్నెందుకూ కలపడం? నాకింకా బతకాలనే ఉంది.'


'సరే.. పోనీ.. నేనే చచ్చిపోయేననుకో.. అప్పుడు ఏమవుతుందంటావు?'


'ఏమీ అవ్వదు.. నిన్ను ఇష్టపడేవాళ్ళు ఓ రెండ్రోజులేడుస్తారు.. స్విగ్గీ వాడూ, డొమినోస్ వాడూ 'అయ్యో.!. మంచి బేరం పోయిందే.!. సారు మంచిగా టిప్పులిచ్చేవాడు' అని బాధపడతారు.'


'అలాక్కాదు.. అంటే.. పుణ్యం గట్రా బాగానే చేసాను కదా.!. స్వర్గానికి పోతానంటావా.?'


'స్వర్గం అంటే ఏమిటో.?'


'అదే.. ఇంద్రుడు, మునులూ కూచునుంటే రంభా, ఊర్వశి, మేనకా డాన్సాడుతూంటారూ.!.'


'నీకసలే డాన్సులంటే బోరు కదా.. మరి నువ్వెళ్ళి ఏం చేస్తావు.?'


'పుణ్యం చేస్తే అక్కడ మనకోసం రంభా, ఊర్వశి, మేనకా వెయిటింగన్నారు.?'


'రంభా, ఊర్వశి, మేనకా ఏవైనా కామపిశాచులేవిటీ.? పైకొచ్చే మగ వెధవలందరి కోసం కాసుక్కూచోడానికి.? అయినా నువ్వు పుణ్యం చెయ్యడానికి కారణం, ఎవరో తెలీని ఆడదానితో సరసాలాడటానికా.?'


'మరి పుణ్యం చేసి ప్రయోజనమేంటీ అని.?'


'సరే.. మీ ఆవిడ పుణ్యం చేసిందనుకో.. ఆవిడ కోసం ఇంద్రుడూ, వరుణ దేవుడూ కాసుక్కూచునుంటారా.? '


'ఛఛ... మా ఆవిడ పతివ్రత.!.'


'అంటే.. నువ్వు వెధవ్వన్నమాట.?'


'సర్లే.. నువ్వు మరీ పచ్చిగా మాటాడేస్తున్నావు.. స్వర్గం సంగతి పక్కనెడదాం.. పోనీ పాపం చేసి పోయేననుకో.. యమధర్మరాజు నన్ను నూన్లో వేయిస్తాడా.?'


'నువ్వేమైనా పకోడీవా బజ్జీవా నూన్లో వేయించడానికి.? పోనీ.. వేయించేడే అనుకో.. వేయించి ఏం చేస్తాడూ.? ఇదిగో తినండర్రా అంటూ నిన్ను తలో పీసూ కింకరులకివ్వడానికి నువ్వేమీ మేక మటనూ కాదు.. కోడి చికినూ కాదు కదా..'


'అంటే వేయించడంటావా.?'


'ఆ యముడు గారేమైనా వంటల మేస్టరా.? చచ్చి ఒచ్చినాళ్ళందరినీ వేయించడానికి.? అయినా పాపులందర్నీ వేయించడానికి సరిపడా నూనె సప్లై చెయ్యడానికి.. పైనేమైనా నూనె సముద్రముందా.?'


'అంటే.. స్వర్గం, నరకం లేవంటావు.?'


'ఎందుకు లేవూ.?. స్వర్గం, నరకం చస్తే ఉండవు. బతికుండగానే ఉంటాయి.


ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా, నీ పని నువ్వు చేసుకున్నావనుకో.. ఆ రాత్రి హాయిగా నిద్దరడుతుంది.. అది స్వర్గం.. 


అలాక్కాకుండా ఎవర్నో ఏదో ఇబ్బందెట్టాలనే ఎదవాలోచన చేసేవనుకో.!. అదే ఆలోచన నిన్ను నిద్దర్లో కూడా తినేస్తుంది.. అది నరకం.

దైవాన్ని కోరిక ఎలా కోరాలి

 🙏🙏🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః... ఆచార్య దేవో భవ..

*దైవాన్ని కోరిక ఎలా కోరాలి*!!?...అంటే....ఇలా కోరుకోవాలి.!!..శుభమ్ భూయాత్...


*1.నువ్వు బతికి* *ఉన్నంత కాలం* *ధార్మిక* *కార్యాలు నీ సంపదతో చేయాలి అని* *కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది.*


2. *నా ఇంట్లో దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి ...అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది.*


3. *నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి ....అంటే నీ ఆరోగ్యం బాగుంటే, నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే, నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు..*


4. *నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి ....అంటే నీకు అనుకూలవతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది./అవుతాడు..*


5. *నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి ....అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..*


6. *భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి.... అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం...*


7. *కుటుంబం అంతా సంతోషంగా క్షేత్ర దర్శనం కి రావాలి అని కోరాలి... అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ..ఇంక ఏమి కావాలి జీవితానికి..*!!?


*8 *చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి ..అంటే భర్తకు సంపూర్ణ ఆయువు, ఆరోగ్యం కోరుకోవడం..*

*మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాక ఎవరిని అడుగుతాము కానీ... ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది.*


        శుభోదయం అందరికి 💕


            ,సర్వోజనా సుఖినోభవంతు🌹

ఆనందమునిస్తాయి

 *1999*

*కం*

ఎంతటి సౌఖ్యంబులు నవి

యంతము నొందెడి వరకునె యానందమిడున్.

చింతలు సైతము నటులనె

సాంతము నీ చెంతనుండ జాలవు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఎంతటి సౌఖ్యములైనా అవి పూర్తి అయ్యేవరకూ మాత్రమే మనకు ఆనందమునిస్తాయి,అంటే ఎంత గొప్ప సౌకర్యములైనా అవి అనుభవించే అంతవరకూ మాత్రమే సంతోషాన్నిస్తాయి. అలాగే బాధలు కూడా ఎల్లకాలం నీ వద్ద ఉండిపోవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

2, మార్చి 2024, శనివారం

ఆభరణం

 🙏🙏🙏

********

              **శుభోదయం**

                        ***

**మానవుని యొక్క ఆభరణం రూపం. రూపం యొక్క ఆభరణం గుణం. గుణం యొక్క ఆభరణం జ్ఞానం, జ్ఞానం యొక్క ఆభరణం క్షమ. ఇది కల్గిన వారు సర్వత్రా శ్రేష్టులుగా చెప్పవచ్చును.**

                     ***

 ""సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా

శాంతి:పత్నీ క్షమా పుర: షడేతే మమ బాంధవా""

                      ***

**ఆత్మ బంధువులు ఆరుగురున్నారు మనకు. అవి సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, క్షమాగుణం. తల్లిని ఎంతగా ప్రేమిస్తామో సత్యాన్ని అంతగా ప్రేమించాలి. తండ్రిని ఆరాధించినట్లే జ్ఞానాన్ని సంపాదించాలన్న తృష్ణను కలిగి ఉండాలి. ధర్మాన్ని సోదరునిగా ఎంచాలి. దయను ప్రియనేస్తంగా భావించాలి. శాంతిని భార్యలా, క్షమను పుత్రునిలా భావిస్తూ ఆ గుణాలతో మమేకం కావాలి. పరిపక్వమైన వ్యక్తిత్వం అంటే అదే! ఆప్తులవల్ల కూడ ఒక్కోసారి మన మనసుకు బాధకలుగుతుంటుంది. అంత మాత్రావ వారిని మనం ప్రేమించకుండా ఉండలేం! అలాగే పై గుణాలవల్ల అప్పుడప్పుడు కొంత నష్టమో, కష్టమో కలిగినా సంతోషంతో స్వీకరించాలి తప్ప వాటిని వదులుకోవాలని భావించకూడదు.* 

*సన్మార్గాలు అనేవి ఎప్పుడూ మనలను పరీక్షించేవి, రక్షించేవీను. ఆ పరీక్షలకు తట్టుకుని నిలబడగలిగే మానసిక ధృడత్వాన్ని మనలో పెంపొందించుకోవాలి. చెక్కుచెదరని ధృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. అప్పుడు ఎవరైనా మన తీరుతెన్నుల్ని విమర్శించినా, ఎగతాళి చేసి మాట్లాడినా వాటి ప్రభావం మనపై పడదు. ఇతరుల విమర్శల వెనుక ఒక్కోసారి వారి అజ్ఞానమో, స్వార్ధపూరిత మనస్తత్వమో ఉంటుంది.**

*కనుక ఇతరుల విమర్శలకు కాకుండా ఆత్మవిమర్శకే అధిక* *ప్రాధాన్యతను ఇవ్వాలి.**

                        ***

             **ఇదం న మమ**

          **శుభప్రదమైన రోజు**

                        ***

**యం.వి.శర్మ**

🙏🙏🙏

ఉన్నప్పటికీ పేదవాడు.

💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

శ్లో𝕝𝕝.      
*పూర్ణే తటాకే తృషితః సదైవ*
*భూతేపి గేహే క్షుధితః స మూఢః౹*
*కల్పద్రుమే సత్యపి వై దరిద్రః*
*గుర్వాదియోగేేఽపి హి యః ప్రమాదీ॥*

భావము - 

*సద్గురువును కలుసుకున్నప్పటికీ తిరిగి తప్పులు చేసే మూఢుడు* ఎలాంటి వాడంటే, నిండు చెరువు దగ్గర ఉన్నా దాహంతో ఉండేవాడు, సొంత ఇల్లు ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఆకలితో అలమటించేవాడు, మరియు కల్పవృక్షం తన వద్ద ఉన్నప్పటికీ పేదవాడు.....

విటమిన్లు

 విటమిన్లు అవి లభించు ఆహారపదార్థాలు  - తగ్గుట వలన కలుగు సమస్యలు  : -


        మానవశరీరానికి రసాయనికంగా మరికొన్ని ద్రవ్యాలు అవసరం. వీటికే విటమిన్ అని పేరు పెట్టారు. ఇవన్నియు జీవకణములే . ఇప్పటివరకు శరీరశాస్త్రముకు సంభందించినంత వరకు ఆరు రకాల విటమిన్స్ కనిపెట్టారు.   అవి 


    A , B , C , D , E , K .


*  " A "  విటమిన్ - 


             "A " విటమిన్ ముఖ్యంగా కంటిచూపుకు సంభందించినది. శరీరంలో A విటమిన్ తగ్గిన కంటిదృష్టి తగ్గును. ఆవుపాలు ఇంకా వెన్న , నెయ్యి, ఆకుకూరలు ముఖ్యంగా మునగ , బచ్చలి, తొటకూర వర్గానికి  చెందిన ముల్లంగి, పుదినా ఆకు, కొత్తిమీర వీటి యందు "A " విటమిన్ ఉంటుంది. మామిడి పండు, బొప్పాయి, మంచిగుమ్మడి , క్యాబేజిల యందు కూడా "A " విటమిన్ ఉంటుంది.


*  " B " విటమిన్  - 


             " B "  దీనిలో కొన్ని ఉప విటమిన్లు కలిపి ఒక సమూహంగా ఉన్నవి.  ఈ విటమిన్ సక్రమంగా ఉండటం వలన రక్తం మంచి స్థితిలో ఉండును. ఈ విటమిన్ లోపించడం వలన రక్తంలో బలం తగ్గి " మేహనంజు " అను వ్యాధి సంప్రాప్తినిచ్చును . దీనిని ఆంగ్లమున బెరిబెరి వ్యాధి అని పిలుస్తారు . ఆకలి ఉండదు. కాళ్లల్లో చేతుల్లో తిమ్మిర్లు  , రక్తప్రవాహం మందగించి ఉండటం , గుండె బలహీనం అవ్వడం , ఎగశ్వాస వంటివి సంప్రాప్తి అగును.ఇది ఎక్కువుగా బియ్యపు తవుడు, , గోధుమలు , కాయధాన్యాలలో ఉంటుంది.


                ఈ " B " విటమిన్ సమూహంలో చేరిన మిగతా విటమిన్లు వరసగా రిబోఫ్లోవిన్ థయామిన్, కోటినిక్ ఆసిడ్ , ఫాంటో తెనిక్ ఆసిడ్ , ఫాలిక్ ఆసిడ్, బోరిన్ వంటివి ఉన్నాయి. శరీర అభివృద్ధికి ఇవి కొద్ది మోతాదులో అవసరం. ఇవి పాల వర్గంలో , మెట్ట ధాన్యాల యందు శించి ధాన్యాల యందు బాదం , అక్రోటు, కొబ్బరి, వెలగ , జీడిపప్పుల్లో ఉంటుంది. 


              మన ఆహారంలో ఇవి లోపించిన విషయం కంటిరెప్పలు , పెదవులు , చర్మం పగుళ్లు రావటం వంటి లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చును. ఆహారంలో కోటిన్ ఆసిడ్ చాలక పోయినచో నొటిపూత వంటివి కలుగును. ఫాలిక్ ఆసిడ్ శరీరంలో ఉండు జీవకణములను పోషించి బలపరుస్తుంది. ఈ జీవకణములు నిరంతరం కొన్ని నశించిపోతూ కొన్ని ఉత్పత్తి అగుచుండును. ఫాలిక్ ఆసిడ్ ఈ జీవకణముల బలపరుస్తూ జీర్ణకోశంలో ఆహారమునకు జరుగుచుండు పరిణామాలు కు సహాయపడును . దీనిలోపం వలన రక్తం క్షీణించి పాండురోగం వచ్చును.


 *   " C "  విటమిన్  - 


              ఈ " C " విటమిన్ ఆకుకూరల యందు పప్పు దినుసుల యందు ఉంటున్నది.  C విటమిన్ చేయు ముఖ్యమైన పని నోటి యందలి దంతాలు , శరీరం నందలి ఎముకలు మన ఆహారం లో వీటిపోషణకు , అభివృద్దికి అవసరం అయిన సున్నం , ఇనుము వంటి వాటిని విడదీసి వాటిని దంతములకు , ఎముకలకు అనువుగా మార్చి  వాటికి సరఫరా చేయును . ఈ కార్యక్రమం సరిగ్గా జరగనిచో మనుష్యులు మరుగుజ్జులు కావడం , కాళ్ల యందలి చేతుల యందలి ఎముకలు క్రమం దప్పి వంకరగాను , వికారంగాను అంగవైకల్యం ఏర్పడును . ఉశిరికాయలో ఈ C విటమిన్ విశేషంగా ఉండును. ఈ ఉశిరికలో మరొక్క విశేషం ఉంది . అది ఏమనగా మిగతా ద్రవ్యములలో ఎండినచో ఈ విటమిన్ నశించినట్లు ఉశిరకాయలో నశించిపోదు.


 *  


" D " విటమిన్  - 


          ఈ D విటమిన్ విశేషంగా మనము సేవించు పాలు , వెన్న , నెయ్యి వీటిలో ఉంటుంది. దీని పనికూడా C విటమిన్ విధంగానే ఉంటుంది. మన పేగుల్లో ఉండు ఆహారపదార్థాల్లోని క్షారమును వేరుపరిచి దానిని ఎముకల యందు చేర్చుట. ఈ విటమిన్ ఎముకలకు చాలా ముఖ్యమయినది. ఈ D విటమిన్ ఆహారపదార్థాల్లోనే కాకుండా సూర్యరశ్మిలోను దొరుకుతుంది . 


                 మనుష్యుడికి ఉదయపు ఎండలో తిరగడం వలన శరీరానికి కావలసిన D విటమిన్ పుష్కలంగా దొరకును.  వ్యవసాయ పనులు చేసేవారికి ఈ విటమిన్ పుష్కలంగా దొరకును. 


 *  " K " విటమిన్  - 


            మనం భుజించు ఆహారములలో అనగా ఆకుకూరలు , క్యాబేజి , క్యారెట్లు ఇత్యాదుల యందు K విటమిన్ ఆకారం అయిన కెరోటిన్ ఉంటుంది. ఈ కెరొటిన్ మనశరీరంలో ఉత్పత్తి అగుచున్న ప్రాణవాయువు వలన భస్మీపటలం అగుచున్నది. అట్లు జరిగిన పక్షంలో దానివల్ల శరీరానికి ఎటువంటి ఉపకారం ఉండదు.  అలాంటి సమస్యని నివారించుటకు   e విటమిన్ కు కలదు.


               ఈ K విటమిన్ కు రక్తం గడ్డకట్టే గుణం కలదు. ఈ విటమిన్ శరీరంలొ సరైన మోతాదులో ఉన్నంతవరకు దేహంకు ఎట్టి గాయాలు అయినను రక్తస్రావం శీఘ్రంగా నిలిచిపోవును . కాయకూరలు , ఆకుకూరలు వీటియందు ఈ విటమిన్ ఎక్కువుగా ఉండును.


                  కావున మనం తీసుకునే ఆహారములో అన్ని రకాల పదార్థాలు సమపాళ్లలో తీసుకున్నప్పుడే మనశరీరం మంచి ఆరోగ్యంతో ఉంటుంది. 


 

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

🪐శ్రీ కృష్ణావతారం

 🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *పురాణ పఠనం*

. *🪐శ్రీ కృష్ణావతారం🪐*

. *107వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శ్రీకృష్ణ నిర్యాణంబు* 


ఇలా అడిగిన రాజుతో శుకుడు ఇలా చెప్పాడు. “అలా శ్రీకృష్ణుడు అన్యాయమార్గంలో నడిచే దుర్మార్గులను చంపి, న్యాయమార్గంలో నడిచే సజ్జనులను కాపాడి బలరాముడు తాను ద్వారకనుండి వెళ్ళిపోయారు. పిమ్మట యాదవులు తమలో తాము మద్యపానంచేసి మత్తిల్లి, ఈర్ష్యతో పరిహాసంగా పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది నిజమైన పోట్లాటగా మారింది. ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు, కాల్బలములు తోకూడి అడ్డు ఆపు లేకుండా వారిలో వారే యుద్ధాలు మొదలుపెట్టారు. మునిశాపం కారణంగా ఎత్తుగా పెరిగిన తుంగ బెత్తాలతో అలసిపోయేలా కొట్టుకుంటూ బాదుకుంటూ యుద్ధాలు చేయసాగారు. ఆ తుంగబెత్తాలు వజ్రాయుధంతో సమానమైన ఆయుధాలవలె తాక సాగాయి. అలా ఒకరినొకరు పొడుచుకుంటూ భయంకరంగా యుద్ధం చేశారు. రణరంగమంతా ముక్కలు ముక్కలై చెదరిన మొండెములతో, వికలమైన దేహాలతో, విరిగిన రథాలతో, కూలిన గుఱ్ఱాలతో, వాలిన ఏనుగులతో నిండిపోయింది. యాదవులు అందరూ ఆ సమరంలో చచ్చిపోయారు. ఇదంతా చూసి నవ్వుకుంటూ శ్రీకృష్ణుడు బలరాముడు ఎటో వెళ్ళిపోయారు. కొంతదూరం వెళ్ళిన తరువాత బలరాముడు ఒక్కడు వేరు మార్గాన పోయి యోగమార్గంతో అనంతునిలో కలిశాడు. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు మరో మార్గంలో వెళ్ళి ఒక గుబురు పొద చాటున విశ్రాంతిగా పడుకుని ఒక కాలు మీద మరొక కాలు పెట్టి వినోదంగా ఆడిస్తున్నాడు. ఆ సమయంలో, ఒక బోయవాడు వేటకు వచ్చి అన్ని ప్రక్కలకు నిక్కి చూస్తూ ఉంటే, ఆ చెట్టుచాటున ఆ పరమపురుషుని కదలుతున్న కాలు లేడి చెవిలాగా కనిపించింది. అది చూసి, అంబులపొది నుంచి బాణం తీసి విల్లెక్కుపెట్టి గురిచూసి కొట్టాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు హాహాకారం చేయసాగాడు. వాడు దగ్గరకు వచ్చి చూసి జగదీశ్వరుడైన కృష్ణుడని తెలుసుకుని భయంతో, “అపరాధం చేసాను పాపాత్ముడిని వక్రబుద్ధిని.” అని రకరకాలుగా దీనంగా ఏడుస్తూ కన్నీరు కార్చసాగాడు. వానిని చూసి కృష్ణుడు దయతో ఇలా అన్నాడు. “నీవు దుఃఖిచనక్కర లేదు. పూర్వజన్మల కర్మలు అనుభవించక ఎంతటి వారికి అయినా తప్పవు. వాటి ఫలితాల ఊరకే పోవు. నీవు నిమిత్రమాతృడివి మాత్రమే.” ఇలా వాడికి నచ్చ చెప్పినా వాడు, “ఇంత పెద్ద తప్పు చేసాక ఊరకే పోదు. దైవానికి, గురువులకు, వైష్ణవులకు, ద్రోహం చేసినవాడు ధరణిపై నిలువరాదు.” అని పలికి, పవిత్రమైన మనస్సుతో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలి వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో రథసారథి అయిన దారుకుడు వచ్చి సర్వజ్ఞుడు, మేరుపర్వతధీరుడు, దనుజ సంహారుడు అయిన శ్రీకృష్ణుడు ఒంటరిగా ఉండటం చూసాడు. “నిన్ను చూడని కన్నులు నిష్ఫల మైనవి; నిన్ను వర్ణించని నాలుక నీరసమైనది; నిన్ను కనుగొనని దినాలు నిందింపదగినవి; స్వామీ! నీ కనులెత్తి మమ్ము దయతో చూడు.” అంటూ దారుకుడు మిక్కిలి దుఃఖంతో ఇలా విన్నవించాడు. “సముద్రమంత యాదవ సమూహం నశించింది. బంధువులు, గురువులు, మిత్రులు అందరు అటు ఇటూ చెల్లాచెదురైపోయారు. ద్వారకకు పోయి మిత్రులతో ఏమని చెప్పాలి.” అని అంటూండగానే, శ్రీకృష్ణుని దివ్యమైన ఆయుధాలు, గుఱ్ఱాలూ మాయమైపోయాయి. శ్రీకృష్ణుడు దారుకుడితో, “అక్రూరునికీ విదురునికీ జరిగిందంతా చెప్పు. స్త్రీలను, పిల్లలను, పెద్దవారిని హస్తినాపురానికి తీసుకుని వెళ్ళమని అర్జునుడితో చెప్పు. వెళ్ళు.” అన్నాడు. దారుకుడు తిరిగివెళ్ళి కృష్ణుడి మాటలు వివరంగా అందరికీ చెప్పాడు. ఆయన చెప్పినట్లు చేసేటంతలో ద్వారకానగరం పూర్తిగా జలాలలో మునిగిపోయింది. ఎవరికీ ప్రవేశించటానికి వీలులేని స్థితికి వెళ్ళిపోయింది.

అప్పుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు నూరుకోట్ల సూర్యుల దివ్యతేజస్సుతో వెడలి నారదుడు మున్నగు మునులు, బ్రహ్మదేవుడు, రుద్రుడు, మొదలయిన దేవతలు జయజయ నినాదాలతో వెంట రాగా తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ నారాయణుని విగ్రహము సముద్ర ప్రాంతంలో జగన్నాథుడి రూపంతో ఉంది.” అని శుకబ్రహ్మ పరీక్షిన్మహారాజుకి చెప్పాడు. ఈ కథను విన్నవారు, వ్రాసినవారు సిరిసంపదలు కీర్తి అదృష్టము కలిగి దీర్ఘాయువుతో లోకులు మెచ్చే గొప్పవారై ప్రకాశిస్తారు. నవ్వు ముఖము; చక్కని నడుము; నల్లని దేహము; లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థలము; పెద్ద బాహువులు; అందమైన కుండలాలు కల చెవులు; గజగమనము; నల్లనిజుట్టు; దయారసం చిందే చూపు కలిగిన విష్ణుమూర్తి నేను కనులు మూసినపుడు తెరచినపుడు పొడచూపు గాక.


 


సశేషం🙏


*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐