27, జులై 2024, శనివారం

గుఱ్ఱపు నడకను

 శ్లో|| అశ్వప్లుతం మాఘవగర్జితం చ స్త్రీణాం చ చిత్తం పురుషస్య భాగ్యమ్।

అవర్షణం చాప్యతివర్షణం చ దేవో న జానాతి కుతో మనుష్యః॥

    సుభాషితరత్నకోశః



|| "గుఱ్ఱపు నడకను, ఇంద్రుని (మేఘ) గర్జితాన్ని, స్త్రీల చిత్తాన్ని, పురుషుల భాగ్యాన్ని, వర్షించకపోవడాన్ని, అతివృష్టినీ దేవుడు కూడా తెలుసుకొనలేడు; మనుష్యుడెట్లు తెలుసుకొనకలుగుతాడు?"

కోరికలను లేకుండటమే

 *కోరికలను లేకుండటమే నిజమైన జీవితం* 


“ఎన్ని సౌకర్యాలు ఉన్నా మాకు  వాటి అవసరం లేదు.   భగవంతుని సాక్షాత్కారం కావాలనేది మన పూర్వీకుల ఆశయం.   అలాగే వారు నిరంతరమూ భగవంతుని  ధ్యానంలోనే గడిపేవారు.  కానీ, ఈరోజుల్లో మనం కూడా ధ్యానం చేస్తాం. దేని మీద? 

 *ద్యాతం  విదామహర్నిజం* 

 రోజులో 24 గంటలు, “డబ్బు సంపాదన ఎలా పెంచాలి?   మీరు  మీ సంపాదనని ఎలా రెట్టింపు చేస్తారు? ”   మేమూ డబ్బు గురించి ధ్యానం చేస్తున్నాము. అనే ధ్యాసతోనే మన భగవద్ధ్యానం ఉంటున్నది.  ఈ కారణాల వల్లనే పూర్వీకులు పొందిన ప్రయోజనాలను మనం పొందకుండా ఉంటున్నాము.

 *దత్తత్కర్మ కృతం యదేవ మునిపిష్ఠైర్పలైర్వఞ్చితః ॥* 

ఇప్పటి మన సాధనలకూ వాటి మార్గాలకూ ఎంత తేడా!?   కాబట్టి మనం పూర్వీకుల మార్గాన్ని అనుసరించాలి.   మనసులోని కోరికల కోసం దేవుడిని పూజించడం సరికాదు.   కోరికలను వదిలించుకోవడం ద్వారా మాత్రమే నిజమైన ఆనందం లభిస్తుంది.   మనకు నిత్యం అంతులేకుండా పుట్టే కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించడంలో మనం విజయం సాధించలేము.   కోరికలు తరగనివి, వాటిని కలగకుండా ఉండటంలో పశ్చాత్తాపం మాత్రమే మిగిలి ఉన్నాయి.   కోరిక ఎవరికీ ఆనందాన్ని కలిగించదు.అవే భగవంతునికి మనకు అగాధాన్ని ఏర్పరుస్తుంది.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

ముఖ్యమైన విషయాలు...

 కొన్ని ముఖ్యమైన విషయాలు...


*పూజ* :-పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణ ఫలాన్నిచ్చేది.


*అర్చన*:- అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయ మైనది, దేవతలను సంతోషపెట్టేది.


*జపం*:- అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం. ఇది జీవుణ్ణి , దేవుణ్ణి చేస్తుంది.


*స్తోత్రం*:- నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.


*ధ్యానం*:- ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది.


*దీక్ష*:- దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది.సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.


*అభిషేకం* :- అభిషేకం చేస్తే , చేయిస్తే సకల శుభాలు కలుగు తాయి. అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరా తత్వాన్ని అందిస్తుంది.


*మంత్రం*:- తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం. అఖండ శక్తి నీ ఇస్తుంది.


*ఆసనం*:- ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.


*తర్పణం*:- పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.


*గంధం*:- గంధంలో  సర్వ దేవత కొలువై ఉన్నారు. మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లీ అని దేవతలంతో అమ్మవారిని కోరారు. 


అప్పుడు అమ్మవారు మీరు గంధంలో కొలువై ఉందురుగాక అని వరం ఇచ్చారు. అప్పటినుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది.


*అక్షతలు*:- కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పసుపు, కుంకుమ,నూకలు (విరిగిన బియ్యం) లేని మంచి బియ్యం కలిపి చేయాలి.


*పుష్పం*:- పుణ్యాన్ని వృద్ధిచేసి, పాపాన్ని పోగొట్టేది. మంచి బుద్ధిని ఇచ్చేది.అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి.

మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది.


(ఈమధ్య పుష్పాలను చించి రేకలను విడదీసి వాడుతున్నారు. అలా చేయవద్దు. కాగాతొడిమలను తప్పకుండా తుంచివేశాకే పుష్పాలను పూజలో వినియోగించాలి.


*ధూపం:*- చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ప్రేత , పిశాచాలు పారిపోతాయి.


*దీపం*:- సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానానికి సంకేతం.

అగ్ని దహించుచున్నది

 💎🌅  *_-|¦¦|శుభమధ్యాహ్నం|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


     శ్లో𝕝𝕝 *న కశ్చిచ్చండ కోపానామ్*

          *ఆత్మీయో నామ భూభుజామ్* | 

          *హోతారమపి జుహ్వానం*

          *స్పృష్టో దహతి పావకః* ||


తా𝕝𝕝 *మితిమీరిన కోపమున్న ప్రభువులకు ఆత్మీయుడైనవాడు ఏ ఒక్కడును ఉండడు*... యజ్ఞగుండం జ్వలించుప్పుడు తనను హోమద్రవ్యాలతో స్పృశించే (సేవించే) వారినిసైతం అగ్ని దహించుచున్నది కదా!

సంస్కృతం లో రక్త సంబంధీకులు

 సంస్కృతం లో రక్త సంబంధీకులు 

👇 .👇

1. పితా (తండ్రి) 

2. పితామహా (తాత)

3. ప్ర పితామహా (ముత్తాత)

4. మాతా (తల్లి)

5. పితామహి (బామ్మ)

6. ప్రపితామహి (బామ్మ అత్తగారు)

7. సాపత్ని మాతా (సవతి తల్లి)

8. మాతామహ (తల్లి తండ్రి)

9. మాతా పితామహ (తల్లి తాత)

10. మాతుః ప్రపితామహ (తల్లి ముత్తాత)

11. మాతామహి (అమ్మమ్మ)

12. మాతుః పితామహి (అమ్మమ్మ అత్త)

13. మాతుః ప్రపితామహి (అమ్మమ్మ అత్తగారి అత్త)

14. ఆత్మపత్ని (తన భార్య)

15. సుతః (కుమారుడు)

16. భ్రాత (సోదరుడు)

17. జ్యేష్ట పితృవ్యః (పెద తండ్రి)

18. కనిష్ట పితృవ్యః (పిన తండ్రి)

19. మాతులః (మేనమామలు)

20. తత్పత్నిః (వారి భార్యలు)

21. దుహిత (కుమార్తె)

22. ఆత్మ భగినీ (తోబుట్టువులు)

23. దౌహిత్రః (కూతురు బిడ్డలు)

24. భాగినేయకః (మేనల్లుళ్లు)

25. పితృష్వసా (తండ్రి తోబుట్టువులు)

26. మాతృష్వసా (తల్లి తోబుట్టువులు)

27. జామాతా (అల్లుళ్లు)

28. భావుకః (తోబుట్టువు భర్త)

29. స్నుష (కోడలు)

30. శ్వశురః (మామగారు) 

31. తత్పత్నీః (వారి భర్యలు)

32. స్యాలకః (బావమరుదులు)

33. గురుః (కుల గురువు)

34. ఆర్ధినః (ఆశ్రితులు)

విష్ణు స్తుతి

 🌸విష్ణు స్తుతి🙏


కేశవా హరిహృషీకేశ నారాయణా

   దామోదర మధుసూదన మహాత్మ

విష్ణు యధోక్షయజిష్ణు త్రివిక్రమ

   పద్మనాభ యుపేంద్ర వాసుదేవ

యచ్యుత గోవింద యనిరుద్ధ మాధవ

  శ్రీధరా శ్రీకృష్ణ శిష్ట పోష

సంకర్షణ నృసింహ శాశ్వతా యనుచును

మునులునిన్ కొలిచిరి ముదముతోడ

తే..వాసుదేవమాధవనీకు వందనములు

 నందగోపాల శ్రీ పతి నాగశయన 

సకల దేవతా పూజిత శరణు శరణు 

విన్నపాలు వినుము దేవ విష్ణుమూర్తి



సాహితీ శ్రీ జయలక్ష్మీ

తిరుమల పైన

 ఇల తిరుమల పైన నలమేలుమంగతో 

నార్తజనుల పిలుపు లాల కించు 

దైవరాయ ! దేవ ! దామోదరా! వేగ 

కరుణతోడ మమ్ము గావుమయ్య



సాహితీ శ్రీ జయలక్ష్మి

మాటగందం

 *మాటగందం*                    *చక్రవర్తి*

ఆవె.

అందరొప్పుకొందురాదర్శమనుదాని

నాచరింపబోవనడ్డు సగము.

అమలుచేయ బెదరి యాగును నలువది

పదరిచేతలందుఁబదియెమిగులు.

దణ్డిన్యై

 ఓం *దణ్డిన్యై* నమః.🙏🏼

శ్రీ లక్ష్మీసహస్ర నామములలో 359వ నామము


నామ వివరణ. 

దోషులను దండించు తల్లి మన అమ్మ.


తే.గీ.  *దణ్డినీ!* దేవి! నీవు నా దణ్డనున్న

దండిగా కవితాసుధల్ తరలివచ్చి

చేరునాకృతులందున నేరుగాను,

దండిగా నాకు నీకృపనుండనిమ్ము.

🙏🏼

రచన .. చింతా రామకృష్ణారావు.

భామ మోము

 1420ఆ.

భామ మోము చూడ బహు రూపవతియైన

ధీమతి యనలేము తెలియకుండ

ప్రేమలోన మునుగు ప్రియులది యెరుగక

క్షేమకరము కాదు చిన్న సూరి

వీరసైనికవందనం

 వీరసైనికవందనం

సీ..

దివ్యపౌరులుగుండ దేశభక్తిగనుండి 

       రండు రండు తెలియరండటోయి

సరిహద్దుభాగాల సతతంబు రిక్కించి

    గమనించి దేశమున్ గనుసిపాయి

సాహసమతులౌచు శౌర్యప్రతాపాల

     చీల్చిచెండాడగా సేనదోయి

తత్తరపడురీతి బిత్తరగనురీతి

    పరసేనపై దాడి పాడిరోయి

తేగీ..

పాతికేండ్లను క్రిందట పరగె రణము

అదియె కార్గిలు యుధ్ధమై మదులనిల్చె

విజయదుందుభిమ్రోగించె వేగపోరి

జై..జవానంచు నినదించి జాతియెల్ల

ధీరసైనిక ఋణమును తీర్చుకొమ్ము..


కార్గిల్ విజయదివస్ సందర్భంగా...అక్షర నివాళులు..

రాయప్రోలు జగదీశచంద్రశర్మ..

ఎప్పుడు కోప్పడాలి?

 *ఓం నమో భగవతే వాసుదేవాయ*


    *🌀 ఎప్పుడు కోప్పడాలి? 🌀*


*కోపం అనేది నిన్ను నిన్నుగా నిలవనీయని ఒక అనిశ్చిత ఉద్విగ్న స్థితి. కోపానికి కారణాలు అనేకం. నష్టాలు కూడా ఎన్నో. కోపం సింహాసనం ఎక్కితే కారణం నిష్క్రమిస్తుంది. ఇంగితం నశిస్తుంది. హృదయం జ్వలిస్తుంది. చెవి మంచిమాటలు వినదు. మాట అదుపు తప్పుతుంది. కంటికి దోషాలు మాత్రమే కనపడతాయి. మనసు యథార్థాన్ని చూడదు, చూసినా అంగీకరించదు. చేతలు అదుపులో ఉండవు. శక్తి వృథా అవుతుంది. మనసు అశాంతికి నెలవవుతుంది. మితిమీరిన కోపం ఆవహిస్తే మనిషి పశువవుతాడు.


*కోపాన్ని వ్యక్తం చేస్తే బంధాలు కోల్పోతారు, అణచుకుంటే మనశ్శాంతి కోల్పోతారు. ఫలితంగా తనకోపమే తనకు శత్రువవుతుంది.


*కోపం అదుపులో ఉన్నంతసేపు దాన్ని ఒక ఆయుధంగా వాడుకోవచ్చు. నయాన చెప్పినా గ్రహించనప్పుడు తల్లిదండ్రులు సంతానం మీద, ఉపాధ్యాయులు విద్యార్థుల మీద, పెద్దలు పిన్నల మీద కోపం ప్రదర్శించాలి. అది వారి నడక, పద్ధతులు, మాటతీరు బాగాలేవని తెలియజెప్పేందుకు, భయభక్తులు కలిగించేందుకు ఒక మార్గం. అంతేగాని, కోపం తెచ్చుకోకూడదు. ఈర్ష్యాద్వేషాలకు తావు లేకుండా ఇతరుల తప్పులు తెలియజెప్పేలా ఉండాలి. ఇతరుల అహాన్ని వ్యక్తిత్వాన్ని గాయపరచకూడదు. అహం దెబ్బతిన్నప్పుడు, తిరస్కృతికి గురైనప్పుడు కోపం అదుపు తప్పుతుంది. విషయం మరుగునపడి విధ్వంసానికి, తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.


*కోపం తెచ్చుకోవడం ఎంత ప్రమాదమో, కోపం తెప్పించడం కూడా అంతే ప్రమాదం. పెద్దలు గురువులు, సాధువుల పట్ల వినయ విధేయతలతో వారి అనుగ్రహం పొందేట్లు అప్రమత్తంగా నడచుకోవాలి. ఆగ్రహం కలిగిస్తే వారి కోపాగ్నికి ఆహుతి కాక తప్పదు. కోపానికి గురైనవారు ఇతరుల ఆగ్రహానికి కారణం అర్థం చేసుకుంటే ఘర్షణ ఉండదు.


*చాలామంది తాము అనుకున్న పద్ధతికి ఎవరైనా భిన్నంగా ప్రవర్తించినా, బాగా ప్రేమించి అభిమానించేవారు తన భావాలను అర్థం చేసుకోక పోయినా, చివరికి నిత్యం వాడే వస్తువులు సరిగ్గా లేకపోయినా పనిచేయకపోయినా కోపమొస్తుంది. అటువంటి చిన్న చిన్న విషయాలకు సహనం కోల్పోయి కోపం తెచ్చుకోవడం తప్పు. అది అవగాహన రాహిత్యాన్ని చాటుతుంది. అసమర్థుడి కోపం ఇంట్లో వస్తువులకు, బయటి బంధాలకు చేటు.


*తలనొప్పి రోగం కాదు, అంతర్గతంగా తలెత్తిన ఏదో ఒక రోగానికి సూచన అంటారు వైద్యులు. కోపం కూడా మనసులో ఉత్పన్నమైన ఏదో ఒక ఉద్విగ్నతకు పర్యవసానం. సద్వివేచన, ఆత్మవిమర్శతో కోపానికి కారణాన్ని తెలుసుకుని దాన్ని పరిష్కరించుకోవాలి. లేకపోతే మూల్యం చెల్లించక తప్పదు.


*వ్యక్తిత్వానికి, తనను నమ్ముకున్నవారికి, దేశానికి, ధర్మానికి హాని కలిగినప్పుడు కోపం రాకపోతే తప్పు.


కోపానికి ఎవరూ అతీతులు కారు. కోపాన్ని సదా నియంత్రణలో ఉంచుకోవాలి. అవసరమైన సందర్భాల్లో మాత్రమే కోపం ప్రదర్శించాలి. ఎప్పుడు ఎంతవరకు కోపం తెచ్చుకోవాలి అనేది కూడా తెలిసి ఉంటేనే అది సాధ్యం. మనిషి నిగ్రహం అప్పుడే తెలుస్తుంది. ఉచితంగా లభిస్తుందని ప్రతిసారి అందరిమీదా కోపాన్ని ప్రదర్శించకూడదు. అది పిచ్చివాడి చేతిలో రాయిలా కాకూడదు. విజ్ఞతతో ఆయుధంగా మలచుకోవాలి.

🪴🌷💠💠💠 💠💠 🌷🪴

 🙏సర్వేజనా సుఖినో భవంతు🙏

అగ్ని దహించుచున్నది

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


     శ్లో𝕝𝕝 *న కశ్చిచ్చండ కోపానామ్*

          *ఆత్మీయో నామ భూభుజామ్* | 

          *హోతారమపి జుహ్వానం*

          *స్పృష్టో దహతి పావకః* ||


తా𝕝𝕝 *మితిమీరిన కోపమున్న ప్రభువులకు ఆత్మీయుడైన వాడు ఏ ఒక్కడును ఉండడు*... *యజ్ఞగుండం జ్వలించుప్పుడు తనను హోమద్రవ్యాలతో స్పృశించే (సేవించే) వారినిసైతం అగ్ని దహించుచున్నది కదా!*


 ✍️🌷🌹💐🙏

శనివారం,జూలై27,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హo*


శనివారం,జూలై27,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం -  బహుళ పక్షం

తిథి:సప్తమి రా1.04 వరకు 

వారం:శనివారం(స్థిరవాసరే)

నక్షత్రం:రేవతి సా5.27 వరకు  

యోగం:సుకర్మ ఉ6.35 వరకు తదుపరి ధృతి తె3.36 వరకు

కరణం:విష్ఠి మ2.16 వరకు తదుపరి బవ రా1.04 వరకు

వర్జ్యం:ఉ6.16 - 7.45

దుర్ముహూర్తము:ఉ5.40 - 7.22

అమృతకాలం:మ3.13 - 4.42

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి: కర్కాటకం 

చంద్రరాశి: మీనం 

సూర్యోదయం:5.40

సూర్యాస్తమయం:6.32


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి* 

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు* 

 *మిట్టాపల్లి*

⚜ *శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం*

 🕉 *మన గుడి : నెం 390*


⚜ *కర్నాటక  : హోసహోలాలు - మండ్యా*


⚜ *శ్రీ  లక్ష్మీనారాయణ ఆలయం*



💠 కొన్ని పురాతన వాస్తుశిల్పాలు

ఎంత పరిపూర్ణంగా మరియు సుష్టంగా ఉన్నాయని అనుకోగలమా.

నేడు, అటువంటి అధునాతన సాంకేతికతలతో కూడా, భవనాలను నిర్మించడానికి సంవత్సరాలు పడుతుంది, ఆ కాలంలో అవి ఎలా నిర్వహించబడతాయో ఊహించండి? వారి అభిరుచికి ధన్యవాదాలు, మనకు చాలా నిర్మాణ వారసత్వం ఉంది.

ఇన్ని సంవత్సరాల తర్వాత కొంచెం కూడా కదలని ఈ పురాతన నిర్మాణాలను అన్వేషించడం గొప్ప అదృష్టం.

భారతదేశంలోని ప్రతి సందు మరియు మూలలో మనల్ని ఆశ్చర్యపరిచే అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. అటువంటి వారసత్వ ప్రయాణంలో, కర్ణాటకలోని హోసహోలాలులోని లక్ష్మీ నారాయణ ఆలయాన్ని సందర్శిద్దాం !



💠 హోసహోలలు కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం . 

ఈ చారిత్రాత్మక పట్టణం ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోని గొప్ప సామ్రాజ్యాలలో ఒకటైన హోయసల సామ్రాజ్యానికి బలమైన కోటగా ఉండేది. 

హొయసల నిర్మాణ వారసత్వాన్ని మనం ఈ పట్టణంలో నేడు చూడవచ్చు. లక్ష్మీనారాయణ దేవాలయం హోసహోలాలులో ప్రధాన ఆకర్షణ.


💠 లక్ష్మీనారాయణ దేవాలయం కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని హోసహోలలు వద్ద ఉన్న పురాతన హిందూ దేవాలయం. ఇది కర్నాటకలో అంతగా తెలియని హోయసల దేవాలయాలు మరియు హసన్‌లో సందర్శించదగిన ప్రదేశాలలో ఒకటి.

హోసహోలలులోని లక్ష్మీనారాయణ ఆలయాన్ని 1250 లో హోయసల సామ్రాజ్యానికి చెందిన రాజు వీర సోమేశ్వరుడు నిర్మించాడు. విష్ణువుకు అంకితం చేయబడిన ఈ ఆలయం కర్ణాటకలోని ఇతర దేవాలయాల వలె ప్రసిద్ధి చెందకపోవచ్చు, కానీ ఇది ఒక రహస్య ప్రదేశం.


💠 హోసహోలాలులోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం త్రికూట విమాన (మూడు మందిరాలు) ఆలయానికి అద్భుతమైన ఉదాహరణ.

మధ్యలో లక్ష్మీనారాయణ విగ్రహం మరియు ఉత్తర మరియు దక్షిణ గర్భగృహాలను కలిగి ఉన్న ప్రధాన మందిరంలో వరుసగా శ్రీ వేణు గోపాల స్వామి మరియు శ్రీ లక్ష్మీ నరసింహ విగ్రహాలు ఉన్నాయి.


💠 అన్ని హొయసల దేవాలయాల మాదిరిగానే ఈ స్థావరంలో హంసలు, ఏనుగులు, గుర్రపు స్వారీలు, ఆకు పత్రాలు, వివిధ దేవతలు, రామాయణం మరియు మహాభారతం వంటి హిందూ ఇతిహాసాల దృశ్యాలతో కూడిన ఆరు పొరల అలంకార అచ్చులు ఉన్నాయి. 

ఆలయ మధ్యభాగం వివిధ దేవుళ్ల శిల్పాలు, విష్ణువు అవతారాలు, నృత్యం చేసే సరస్వతి, బ్రహ్మ, గణపతి, యోగ - మాధవ మరియు అనేక ఇతర దేవతల శిల్పాలతో అలంకరించబడి ఉంది. 


💠 లక్ష్మీనారాయణ ఆలయంలో చాలా శిల్పాలు మరియు చిత్రాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి మరియు చాలా బాగా భద్రపరచబడ్డాయి.


💠 లక్ష్మీ దేవిని, మహావిష్ణువును (విష్ణువు ఎడమ తొడపై లక్ష్మి ఉంటుంది).

గరుడుడు తన వీపుపై, ఇంద్రుడు తన ఐరావతం (తెల్ల ఏనుగు), మహావిష్ణువు యొక్క మోహినీ అవతారం, మహిషాసుర మర్దిని (దుర్గాదేవి అవతారం), కృష్ణుడు తన వేణువు  వాయిస్తున్నాడు. 

శ్రీకృష్ణుడు ఆదిశేషునిపై నిలబడి నృత్యం చేస్తున్నాడు,  బొటనవేలు పరిమాణం గల ఆంజనేయుడు  కొబ్బరి నీళ్ళు తాగుతున్నాడు.

ఇలాంటి ప్రతి శిల్పం మరియు చెక్కడం మన ఊహలను కట్టిపడేస్తాయి.


💠 వైష్ణవ దేవాలయం కావడంతో ఆలయంలో చెక్కబడిన శిల్పాలన్నీ ప్రధానంగా విష్ణుమూర్తికి సంబంధించినవి. రామాయణం మరియు మహాభారతం వంటి హిందూ పురాణాల నుండి అనేక దృశ్యాలు ఆలయ గోడలపై చెక్కబడ్డాయి.



💠 బెంగుళూరు నుండి 170 కిలోమీటర్ల దూరం.

బెంగుళూరు నుండి హోసహోలలుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మైసూర్ రోడ్డులో వెళ్లడం, మరొకటి బెంగళూరు నుంచి నేలమంగళ-కుణిగల్ రహదారిని ఎంచుకోవడం.


మీరు బెంగుళూరు - మైసూర్ రహదారిని ఎంచుకుంటే, మీ మార్గం బెంగుళూరు -> నైస్ రోడ్ -> రామనగర -> మద్దూర్ -> మాండ్య -> మేలుకోటే -> కృష్ణరాజ్‌పేట -> హోసహోలాలు.


మీరు బెంగుళూరు - హాసన్ రహదారిని ఎంచుకుంటే, మీ మార్గం బెంగుళూరు -> నైస్ రోడ్ -> నెలమంగళ -> కుణిగల్ -> యాడియూర్ -> బేలూర్ క్రాస్ -> నాగమంగళ -> కాంతాపుర -> కృష్ణరాజ్‌పేట -> హోసహోలాలు.