ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
17, జులై 2023, సోమవారం
రెండో దెబ్బ
*మోడి రెండో దెబ్బ రాబోతోంది - చట్టం 30A -*
*నెహ్రూ హిందువులకు చేసిన ద్రోహాన్ని సరిదిద్దడానికి మోదీజీ సిద్ధంగా ఉన్నారు.*
*మీరు "లా 30" & "లా 30 A" విన్నారా ?*
*"30A" అంటే ఏమిటో తెలుసా?*
*మరింత తెలుసుకోవడానికి ఆలస్యం చేయవద్దు ......*
*30A అనేది రాజ్యాంగంలో పొందుపరచబడిన చట్టం*
*నెహ్రూ ఈ చట్టాన్ని* *రాజ్యాంగంలో చేర్చాలని ప్రయత్నించినప్పుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారు.*
*సర్దార్ పటేల్, “ఈ చట్టం హిందువులకు ద్రోహం, కాబట్టి ఈ గౌవాన్ష్ చట్టాన్ని రాజ్యాంగంలోకి తీసుకువస్తే, నేను మంత్రి వర్గం మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను. అప్పుడు నేను ఈ ద్రోహానికి వ్యతిరేకంగా పోరాడుతాను, భారతీయులందరినీ ఏకం చేస్తాను. దీనికి వ్యతిరేకంగా పోరాడుతాను.*
*చివరగా.....*
*సర్దార్ పటేల్ సంకల్పం ముందు నెహ్రూ మోకరిల్లాల్సి వచ్చింది.*
*కానీ దురదృష్టవశాత్తు..*
*ఈ సంఘటన జరిగిన కొన్ని నెలలలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ అనూహ్యంగా ఎలా మరణించాడో... ?????*
*పటేల్ మరణానంతరం నెహ్రూ ఈ చట్టాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు.*
*30 A దీని లక్షణాలు*
*ఈ చట్టం ప్రకారం - హిందువులు తమ "హిందూ మతాన్ని" హిందువులకు బోధించకూడదు. "చట్టం 30A" అతనికి అనుమతి లేదా అధికారం ఇవ్వదు....*
*కాబట్టి హిందువులు తమ ప్రైవేట్ కాలేజీలలో హిందూ మతాన్ని బోధించకూడదు.*
*హిందూ మతాన్ని బోధించడానికి కాలేజీలు ప్రారంభించకూడదు.... హిందూ మతాన్ని బోధించడానికి*
*హిందూ పాఠశాలలు ప్రారంభించకూడదు. ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలల్లో హిందూ మతాన్ని బోధించడం చట్టం 30A ప్రకారం అనుమతించబడదు ...*
*అలాగే..*
*ఇది వింతగా అనిపిస్తుంది, (30A) నెహ్రూ తన రాజ్యాంగంలో మరొక చట్టాన్ని చేసారు - "లా 30". ఈ "లా 30" ప్రకారం ముస్లింలు తమ మత విద్య కోసం ఇస్లామిక్ మత పాఠశాలలను ప్రారంభించవచ్చు.*
*ముస్లింలు తమ మతాన్ని బోధించగలరు...*
*చట్టం 30 మంది ముస్లింలకు వారి స్వంత 'మదరసా'ను ప్రారంభించేందుకు పూర్తి అధికారం మరియు అనుమతిని ఇస్తుంది. ..... మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 క్రైస్తవులకు వారి స్వంత మత పరమైన పాఠశాలలు మరియు కళాశాలలను స్థాపించడానికి మరియు వారి మతాన్ని ఉచితంగా బోధించడానికి మరియు ప్రచారం చేయడానికి పూర్తి అధికారం మరియు అనుమతిని ఇస్తుంది...!!*
*ఇందులోని మరో చట్టపరమైన అంశం ఏమిటంటే, హిందూ దేవాలయాల ధనం, ఆస్తులన్నీ ప్రభుత్వ విచక్షణకే వదిలేయవచ్చు.... హిందూ దేవాలయాల్లో హిందూ భక్తులు ఇచ్చే డబ్బు, ఇతర విరాళాలన్నింటినీ రాష్ట్ర ఖజానాకు చేర్చవచ్చు. ....*
*అదే సమయంలో ముస్లిం మరియు క్రైస్తవ మసీదుల నుండి విరాళాలు మరియు భిక్ష క్రైస్తవ-ముస్లిం సమాజానికి మాత్రమే ఇవ్వబడుతుంది...*
*ఈ "లా 30" యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి.*
*కాబట్టి, "చట్టం 30A" మరియు "చట్టం 30" హిందువులకు ఉద్దేశపూర్వక వివక్ష మరియు క్రమబద్ధమైన ద్రోహం.*
*ఇది అందరూ బాగా అర్థం చేసుకోవాలి... తెలుసుకోండి.....!!*
*ఇతరుల అవగాహన ప్రతి సనత్ మతాన్ని కాపాడుకుందాం.. చదవండి, నేర్చుకోండి మరియు వ్యాప్తి చేయండి.*
*ఆర్టికల్ 30 A వల్ల మన దేశంలో ఎక్కడా భగవద్గీతను బోధించలేము...*
*పైన చదవండి ఎవరు మరియు ఎందుకు చేశారో మనకు తెలుసు.*
*సోదర సోదరీమణులు అందరూ ఈ సమాచారాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరికీ చేరేలా సహకరించాలని కోరుచున్నాను.*
ధన్యవాదాలు
ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 118*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 118*
*రాజనీతి సూత్రాణి - ప్రథమధ్యాయము :*
*📕 మంచి రాజ్యాన్ని సంపాదించడం సర్వ సుఖాలకీ హేతువు 📕*
1. సుకస్య మూలం ధర్మః (సుఖానికి మూలం ధర్మం.)
2. ధర్మస్య మూలమర్థః (ధర్మానికి మూలం ధనం.)
3. అర్థస్య మూలం రాజ్యమ్ (అర్థానికి మూలం రాజ్యం.)
4. రాజ్యస్య మూలమింద్రియజయః (రాజ్యాధికారానికి మూలం ఇంద్రియాలను జయించడం.)
5. ఇంద్రియజయస్య మూలం వినయః (ఇంద్రియాలను జయించడానికి మూలకారణం వినయం.)
6. వినయస్య మూలం వృద్దోపసేవా (పెద్దవాళ్ళను, విద్యావంతులను సేవించడం వల్ల వినయం అలవడుతుంది.)
7. వృద్దోపసేవయా విజ్ఞానమ్ (వృద్ధుల సేవవలన విజ్ఞానం లభిస్తుంది.)
8. విజ్ఞానేనాత్మనం సంపదయేత్ (విజ్ఞానం చేత తనను సంపాదించుకోవాలి. వినయం, విజ్ఞానం ఈ రెండూ ఉన్నవాడు తనను తాను చక్కబరచుకొన్నవాడవుతాడు. ఆత్మసంపాదనం.)
9. సంపాదితాత్మా జితాత్మా భవతి (ఆత్మను సంపాదించుకొన్నవాడు తనను తాను జయించినవాడు అవుతాడు.)
10. జితాత్మా సర్వార్థె సంయుజ్యతే (ఆత్మను జయించినవాడు అన్ని లాభాలు పొందగలుగుతాడు. అర్థం అనగా సంపద, పొందుతాడు.)
11. అర్ధసంపత్ ప్రకృతి సంపదం కరోతి (అర్థసంపద ప్రకృతి సంపదను ఇస్తుంది. అమాత్యులు, మిత్రులు, ధనాగారం, రాష్ట్రం, దుర్గం, సైన్యం - ఈ ఆరింటికీ ప్రకృతులని పేరు. పరిపాలనకు కావలసినవి ఈ ఆరే. అర్థ సంపద బాగుంటే ఇవన్నీ బాగుంటాయి.)
12. ప్రకృతిసంపదా హ్యనాయకమపి రాజ్యం నీయతే (ప్రకృతి సంపదచేత రాజ్యవ్యవహారం పరిపాలకుడు లేకపోయినా నడిచిపోతుంది. ఉదాహరణకి - అప్పుడప్పుడు ప్రభుత్వాలు పడిపోయినా ఐ.ఏ. యస్. అధికారులు, భద్రతా సైన్యాదుల అధికారులు తమ తమ కార్యాలు సక్రమంగా నిర్వర్తిస్తే లోకవ్యవహారం నడిచిపోతూనే ఉన్నది కదా.)
13. ప్రకృతికోపః సర్వకోపేభ్యో గరీయాన్ (ప్రకృతుల విప్లవం అన్ని విప్లవాల కంటే ప్రమాదకరమైనది.)
14. అవినీతస్వామిలాభత్ అస్వామిలాభాఃశ్రేయాన్ (అవినీతిపరుడైన ప్రభువు దొరకడం కంటే ప్రభువు లేకపోవడమే మంచిది.)
(ఇంకా ఉంది)..🙏.
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️
_చేత వెన్నముద్ద
శ్లోకం:☝️
*కరతలనవనీతం హేమకాంచీసుదామం*
*కనకరుచిరచేలం కిణ్కిణీనాదలోలం |*
*కుముదకుసుమమాలం రత్నకేయూరభూషం*
*వ్రజజనదరదూరం డింభకృష్ణం భజేఽహం ||*
_చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ_
_బంగారు మొలతాడు పట్టు దట్టి_
_సందె తాయత్తు సరిమువ్వ గజ్జెలు_
_చిన్నికృష్ణ నిన్ను నే చేరికొలుతు_
🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏
పంచాంగం 17.07.2023 Monday,
ఈ రోజు పంచాంగం 17.07.2023 Monday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస కృష్ణ పక్ష: అమావాస్య తిధి ఇందు వాసర: పునర్వసు నక్షత్రం వ్యాఘాత యోగ: చతుష్పాత్ తదుపరి నాగవం కరణం ఇది ఈరోజు పంచాంగం.
అమావాశ్య రాత్రి 12:02 వరకు.
పునర్వసు రేపు తెల్లవారుఝామున 05:10 వరకు.
సూర్యోదయం : 05:54
సూర్యాస్తమయం : 06:50
వర్జ్యం : మధ్యాహ్నం 03:54 నుండి సాయంత్రం 05:41 వరకు.
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:48 నుండి 01:40 వరకు తిరిగి మధ్యాహ్నం 03:23 నుండి 04:15 వరకు.
రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
యమగండం : మధ్యాహ్నం 10:30 నుండి 12:00 వరకు.
కర్కాటక సంక్రమణ ప్రయుక్త దక్షిణాయన పుణ్యకాలం
శుభోదయ:, నమస్కార:
సిరిధాన్యాలు
సిరిధాన్యాలు గురించి సంపూర్ణ వివరణ - ఔషధ గుణాలు -
కొర్రలు యొక్క ఉపయోగాలు -
* కొర్రలు విరిగిపోయిన అంగములను అత్యంత వేగముగా అతుకొనునట్టు చేయును .
* శరీరానికి అమితమైన పుష్టిని ఇచ్చును.
* కొర్రలు నాలుగు రకాలుగా ఉండును. పసుపు, ఎరుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండును. నలుపు , తెలుపు రంగులు శ్రేష్టమైనవి.
* శరీరం నందు వేడిని కలిగించును.
* జ్వరమును, కఫమును హరించును .
* జీర్ణశక్తిని పెంచును.
* రక్తమును వృద్దిచేయును.
* నడుముకు మంచి శక్తిని ఇచ్చును.
* అతిగా తినిన వాతమును పుట్టించును . దీనికి విరుగుళ్లు నెయ్యి, పంచదార.
* గర్భస్రావం అయిన స్త్రీకి కొర్రగంజి ఇచ్చిన మంచి మేలు చేయును . బలము కలిగించును.
* కొర్రబియ్యపు అన్నం గేదె పెరుగుతో తినుచున్న ఎప్పటి నుంచొ ఉండి మానని మొండి వ్రణాలు సైతం మానును .
* కొర్రబియ్యపు అన్నం తినటం వలన రక్తపైత్య రోగం మానును .
* కొర్రబియ్యముతో పరమాన్నం చేసుకుని తినుచున్న అజీర్ణశూలలు (నొప్పి ) మానును .
* కొర్ర బియ్యములో 11.2 % తేమ , 12.3 % మాంసకృత్తులు , 4.7% కొవ్వులు , 3.2% సేంద్రియ లవణాలు , 8% పిప్పి పదార్థం , 60.6 % పిండిపదార్ధం ఉండును. ఇందు మాంసకృత్తులు , సేంద్రియ లవణములు, పిప్పి పదార్ధములు , కొవ్వులు ఎక్కువుగా ఉన్నందువల్ల ఆహారవిలువ ఎక్కువుగా ఉన్నది. జిగురు పదార్దాలు అత్యల్పముగా ఉండును.
* కఫ సంబంధ వ్యాధులు , మధుమేహం కలవారు , ఆరోగ్యవంతులు ఈ ధాన్యముతో వండిన అన్నాన్ని తగినంత కూరలు మరియు మజ్జిగని కలుపుకుని తినవచ్చు.
* కడుపులో అల్సర్ , జిగట విరేచనాలు , రక్తప్రదరం , శుక్రనష్టం, శ్వేతకుసుమ, కుష్టు , క్షయ మొదలయిన ఉష్ణసంబంధ వ్యాధులతో బాధపడేవారు కొర్రలు ఉపయోగించరాదు.
సామలు యొక్క ఉపయోగాలు -
* సామలు తో చేసిన అన్నం చమురు కలిగి మృదువుగా , తియ్యగా , వగరుగా ఉండును.
* చలవ , వాతమును చేయును .
* మలమును బంధించును .
* శరీరము నందు కఫమును , పైత్యమును హరించును .
* ఈ బియ్యముతో పరమాన్నం చేసిన అద్భుతమైన రుచితో ఉండును.
* గుండెల్లో మంటకు మంచి ఔషదం.
* కీళ్లనొప్పులు మరియు ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచి ఔషధం .
రాగుల యొక్క ఉపయోగాలు -
* వీటికి మరొక్క పేరు తవిదెలు , చోళ్ళు అని కూడా పిలుస్తారు .
* రాగులను ఆహారముగా తీసుకోవడం వలన వెంట్రుకలకు బలమును ఇచ్చును.
* శరీరంలో పైత్యమును పెంచును. ఎక్కువుగా తీసుకోవడం వలన తలతిప్పుట చేయును .
* మేధోరోగం అనగా అధిక కొవ్వు సమస్యతో ఇబ్బందిపడేవారు ఆహారంలో రాగులను చేర్చుకోవడం వలన దేహములోని కొవ్వుని బయటకి పంపును .
* రాగులను జావలా చేసిన అంబలి అని అంటారు. దీనిని లోపలికి తీసుకోవడం వలన మేహరోగాన్ని అణుచును.
* రాగులను లొపలికి తీసుకున్నచో పైత్యమును పెంచును. రాగులను జావలా చేసి తీసుకున్నచో శరీరంలో పైత్యాన్ని హరించును . రాగిజావలో మజ్జిగ కలుపుకుని సేవించినచొ ఎక్కువ ఫలితం ఉండును.
* కఫాన్ని పెంచును. చలవ చేయును .
* శరీరంలో పైత్యం వలన కలుగు నొప్పులను పొగొట్టును.
* ఆకలిదప్పికలను అణుచును.
* విరేచనం చేయును . రక్తంలోవేడిని తీయును.
* రాగుల్లో పిండిపదార్ధాలు 72.7 గ్రా , కొవ్వుపదార్ధాలు 1.3 గ్రా , మాంసకృత్తులు 7 గ్రా , క్యాల్షియం 330 మీ.గ్రా , భాస్వరం 270 మి.గ్రా , ఇనుము 5 .4 మి.గ్రా , పొటాషియం 290 మి.గ్రా , పీచుపదార్థం 3.6 మి.గ్రా . శక్తి 331 కేలరీలు .
* రాగులలో ఇనుము అధికంగా ఉండటం వలన మలమును సాఫీగా బయటకి వెళ్లేవిధముగా చేయును .
* మెరకభూముల్లో పండే రాగులు మంచిరుచిని
కలిగించును. రాగుల్లో ఎరుపు, నలుపు రంగులు కలవు.
* రాగులు నానబెట్టి ఎండబెట్టి దోరగా వేయించి మెత్తగా విసిరి ఆ పిండిని పాలల్లో కలుపుకుని తాగడం గాని లేదా జావలా కాచుకొని తాగుచున్న అతిమూత్రవ్యాధి హరించును .
* రాగిజావలో మజ్జిగ కలుపుకుని తాగుచున్న శరీరంలో వేడి పోవడమే కాదు మూత్రబంధన విడుచును.
జొన్నలు -
* రుచికి వెగటుగా ఉండును.
* శరీరం నందు కఫమును, పైత్యాన్ని హరించును .
* వీర్యవృద్ధి బలాన్ని ఇచ్చును.
* జొన్నలలో ఎరుపు, తెలుపు, పసుపు మూడురంగుల జాతులు ఉండును.
* జొన్నలలోని మాంసకృత్తుల్లో మనకు అవసరమయిన అన్ని ఎమైనో ఆసిడ్స్ తగినంతగా లభ్యం అవుతాయి. వీటిలో విటమిన్ B కాంప్లెక్స్ మరియు సెల్యూలోజులు సమృద్ధిగా లభిస్తాయి.
* జొన్నపిండితో తయారుచేసిన రొట్టెలను ప్రతిరోజు స్వీకరిస్తుంటే మంచి బలవర్ధకమైన ఆహారంగా పనిచేయును . మలబద్ధకాన్ని తగ్గించి వేయును . జీర్ణశక్తి తక్కువ ఉన్నవారు తినరాదు.
* జొన్నలలో అధికంగా ఉన్న "ఫైటేట్స్ " అనే పదార్థం వలన మిగతా ఆహారపదార్ధాలలోని క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు శరీరానికి పట్టుట కష్టం అగును.కాబట్టి జొన్నలను పరిశుభ్రముగా శుద్ధిచేసి పిండిమరలో వేసి మెత్తగా పిండిచేసి ఆహారంలో ఉపయోగిస్తుంటే ఫైటేట్స్ అడ్డురావు. దీనివల్ల ఐరెన్ , క్యాల్షియం ఒంటికి పట్టును .
* మంచిగా శుద్ది చేసిన జొన్నపిండిని పాలతో కాని మజ్జిగలో కాని కలిపి తాగుతుంటే మొలలు , అజీర్తి , B1 , B2 లోపముతో బాధపడువారికి మంచి ఔషధంగా పనిచేయును .
* 100 గ్రాములు జొన్నలలో పిండి పదార్దాలు 73 గ్రా, మాంసకృత్తులు 10.5 గ్రా , కొవ్వులు 1.7 గ్రా , ఫాస్ఫరస్ 286 మి.గ్రా , కాల్షియం 20 మి.గ్రా , ఐరన్ 6 మి.గ్రా , సోడియం 7 మి.గ్రా , పొటాషియం 130 మి.గ్రా , విటమిన్స్ A - ౧౪0 , I.U ,B -345 మి.గ్రా , B2 - 365 మి.గ్రా , నియాసిన్ 1.7 మి.గ్రా ఉన్నాయి. ఇవి జీర్ణం అగుటకు 3 గంటలు పట్టును .
* జొన్నలను కడుపులో గుల్మాలు ఉన్నవారు , మొలలు సమస్య ఉన్నవారు తీసుకోరాదు . జొన్నలు అధికంగా తీసుకోవడం వలన నేత్రసంబంధ సమస్యలు వస్తాయి.
* జొన్నలకు విరుగుళ్లు పాలు , నెయ్యి, మిఠాయి
వాము .
సజ్జలు -
* 100 గ్రాముల సజ్జలలో కార్బోహైడ్రేట్స్ 66 గ్రా , ప్రొటీన్స్ 10 గ్రా, ఫాట్స్ 4.5 గ్రా , కాల్షియం 50 గ్రా , ఫాస్ఫరస్ 350 మి.గ్రా , ఐరన్ 10 మి.గ్రా , సోడియం 11 మి.గ్రా , పొటాషియం 30 మి.గ్రా , విటమిన్స్ A -2205 I .U , B1 - 329 మి.గ్రా , నియాసిన్ 3.2 మి.గ్రా ఆక్సాలిక్ ఆసిడ్ 14 .5 మి.గ్రా ఉన్నాయి .
* 100 గ్రా సజ్జలు జీర్ణం అగుటకు మూడున్నర గంటలు పడుతుంది.
* సజ్జలలో మాంసకృత్తులుకు అవసరం అయిన ఆర్డీనైన్ మొదలుకొని హెలైన్ వంటి ఎమైనో ఆసిడ్స్ తగినంతగా ఉన్నాయి. సజ్జలలో ఇంకా ఐరన్ , విటమిన్ A , B లు కూడా పుష్కలంగా ఉన్నాయి . ఇవి మంచి బలవర్థకమైన ఆహారంగా చెప్పవచ్చు.
* సజ్జలను మెత్తగా పిండిచేసి తయారుచేసిన రొట్టెలను తేనెతో కలిపి ప్రతినిత్యం ఉదయం పూట వాడుచున్న శరీరముకు మంచి బలం కలుగును.
* నిద్ర పట్టనివారు , మొలల వ్యాధితో బాధపడేవారు , నరాల బలహీనంతో బాధపడేవారు పైనచెప్పినట్టు సజ్జరొట్టెలను తేనెతో కలిపి తీసుకొనుచున్న మంచి ఫలితం కనిపించును.
* సజ్జలను అధికంగా తీసుకొనుచున్న యూరిక్ ఆసిడ్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. కావున మితముగా తీసికొనవలెను.
* మధుమేహ వ్యాధిగ్రస్థులు , శుక్రంనష్టం , తెల్లబట్ట సమస్య ఉన్నవారు, మలబద్దకం, క్షయ , గనేరియా , సిఫిలిస్ వంటి సుఖవ్యాధులు ఉన్నవారు సజ్జలు తినరాదు.
మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
పోతన కవితా మాధుర్యము
శు భో ద యం 🙏
పోతన కవితా మాధుర్యము
( భక్త ప్ర హ్లాదుని చరిత్రము )
ఉ: అచ్చపుఁ జీకటింబడి గృహ వ్రతులై విషయ ప్ర విష్ఠులై
చచ్చుచుఁ బుట్టుచున్ మరలఁజర్విత చర్వణు లైన వారికిన్ ,
జెచ్చెరఁ బుట్టునే పరులు సెప్పిననైన నిజేఛ్చనైన నే
మిచ్చిన నైనఁ గానలకు నేగిన నైన హరిప్రబోధముల్;
ఈఒక్క పద్యంతో ప్ర హ్లాద చరిత్ర యందలి పరమార్ధమును పోతన యభివ్యక్త మొనరించినాడు. " జీవు లందరూ అజ్ఙానాంధకార మగ్నులై పుడుతూ చస్తూ యిదేవలయంలో సాగుతున్నారే గాని భగవంతుని స్మరించి తరించాలనే ప్రయత్నం యేమాత్రం చేయలేక పోతున్నారు. అలాంటి వారికి యితరులు చెప్పినా, తమలోకోరికఁగల్గినా , లేక యేమైన నాశకల్పించినా, అడవుల కేగినా ,హరిని ధ్యానించి తరించే కోరిక మాత్రం కలుగఁ బోదుగదా! అంటున్నాడు పోతన. ఇది హిరణ్య కశ్యపుని మదిలో నిడుకొనిఁ జెప్పిన మాట. అతనికేగాదు అతనిని బోలిన దురహంకారులగు , సంసారమగ్నత, నజ్ఙత, జనన మరణాదిక ప్రయాణముల నిరంతరము నలసట నొందు మానవాళికిది హెచ్చరిక!
ప్రహ్లాదుఁడు పరమ భాగవతోత్తముడు . నిరంతర హరినామ చింతనా పరాయణుఁడు .అచంచలమైన చిత్త వృత్తితో హరిధ్యాన పరాయణుఁడై మోక్షగామి యైనవాఁడు. రాజ్యాభిలాష గాని, తండ్రి యాజ్ఙ గాని నాతనిని విష్ణు భక్తి నుండి వెనుకకు మరలింప లేకపోయెను . తుదకు ధండనము గూడ యతనికి మండనమేయైనది . విష్ణు భక్తి తో మైమరచిన యతనిని శిక్ష లు కక్షలు యేమాత్రము బాధింప లేక పోయినవి.
శా: పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాస లీ
లానిద్రాదులు సేయుచున్ దిరుచున్ లక్షింపుచున్ సంతత
శ్రీనారాయణ పాద పద్మ యుగళీ చింతామృతాస్వాద సం
ధానుండై మరచెన్ సురారి సుతుఁ డేత ద్విశ్వమున్ భూవరా! - ఇదీ ఆయన సుజీవన సరళి. సర్వకాల సర్వావస్థలయందును హరి చింతనమే! లోకముతోపనిలేదు, బంధుమిత్రులతో బనిలేదు, తలిదండ్రులతో పనిలేదు. తుదకు ఆహారముతోజను నతనికిఁ బనిలేకుండెను . కొట్టి కొఱత వేసినను లొంగడాయెను. పైపెచ్చు విష్ణు విరోధియైన తండ్రికే హరినామామృత విశిష్టత నెరిగించి యతనిమనంబును మరలిపఁ జూచినాడు. ఆహా యెంత ధీరుఁడాతడు!
సీ: మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదన ములకు ;
నిర్మల మందాకినీ వీచికలఁ దేలు
రాయంచ సనునె తరంగిణులకు;
లలిత రసాల పల్లవ ఖాదియైఁ జొక్కు
కోయిల సేరునే కుటజ ములకు;
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక
మరుగునే సాంద్ర నీహారములకు ;
తే: అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు
వినుత గుణశీల! మాటలు వేయు నేల?
యెంత చక్కనిపద్యము భాగవత పద్యకోటిలో నిది మణిపూస గదా! మధుర మనోహర పద సెయ్యతో గంభీరమైన భావముల పరంపరలతో నిది ప్రహ్లాదుని హృదయమునకు అద్దముఁ బట్టినది.
మందారపుష్పాలలోని మకరందాలను పానంచేసేగుణంగల మధుపం ఉమ్మెత్తకడకు బోవదుగదా! స్వర్గంగలో నీదురాజ హంస చిరు తరంగిణులను జేరబోదు గదా! మెత్తని తీయమావి చిగురులు మెసవు కోయిల కొండ మల్లి చిగురులు దిన గలదా! పూర్ణిమా చంద్రుని వెన్నెల మెసవు చకోరము మంచు తుంపరులకెగబడదు గదా! అటులనే పద్మనాభుని దివ్య పాదారవింద మరంద పాన మత్తులు యితరములు ఁ గోరరుగదా! వినుత గుణశీల యిక పలు మాటలేల? యని తండ్రికి ప్ర హ్లాదుని సమాధానము. యిందు చివరిపాదము ప్రశంసయో లేక హేళణయో? తెలినంత చతురతను పోతన ప్రదర్శించినాఁడు .
సీ: కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీ నాధు వర్ణించు జిహ్వ జిహ్వ!
సుర రక్షకుని ఁజూచు చూడ్కులుఁ జూడ్కులు!
శేష సాయికి మ్రొక్కు శిరము శిరము;!
విష్ణునాకర్ణించు వీనులు వీనులు,
మధువైరి దవిలిన మనము మనము!
భగవంతు వలఁగొను పదములు పదములు!
పురుషోత్తముని మీది బుధ్ధి బుధ్ధి!
తే: దేవ దేవుని చింతించు దినము దినము
చక్ర హస్తుని బ్రకటించు చదువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుడు గురుడు;
తండ్రి హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి!
చివరకు తండ్రికే సొడ్డుఁబెట్టినాడు నేటికి విరమింతము సెలవు !🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
సోమావతీ అమావాస్య*
*కొన్ని కోట్ల సూర్యగ్రహణములతో సమానమైన సోమావతీ అమావాస్య*
*అమావాస్య! సోమవారంతో కలసి వస్తున్నది !! బహుపుణ్య మహోదయకాలం!!*
*రుద్రాభిషేకం బహుపుణ్యప్రదం!*
*సోమావతి అమావాస్య*
సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజును *సోమావతి అమావాస్య* అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.
*సోమవతీ అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినవి:*
1. సోమావతీ అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం.
2. ఈ సోమావతీ వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి.
3. శని మంత్రాన్ని పఠించి, శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించాలి.
4. గంగా నది, త్రివేణీ సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతీ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే, ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు, బాధలు తొలగుతాయి, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది.
5. వేదవ్యాస మహర్షి చెప్పినదాని ప్రకారం - సోమావతీ అమావాస్య నాడు పేదవారికి గుప్తదానం చేసి, పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది.
*సోమావతి అమావాస్య గురించి ఒక కథకూడా ఉంది. దాని ప్రకారం …*
పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహమైన ఏడుగురు కుమారులు, పెళ్లికాని కుమార్తె ఉండేవారు. ఒకరోజు పెళ్ళికాని ఆ కుమార్తెనును ఆ సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోతాడు. దీనికి వారు చాలా బాధపడి దీని గురుంచి అడగడానికి ఒక పురోహితుడి దగ్గరకి వెళ్లి తమ కుమార్తె జాతకాన్ని చూపిస్తుంది వర్తకుని భార్య. అది చూసి పురోహితుడు ఆమె పెళ్లయిన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా, దానికి వారు చాలా బాధపడి దానికి పరిష్కారమడుగుతారు. అప్పుడు పురోహితుడు సింఘాల్ ప్రాంతానికి వెల్లి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు.
మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు, తన తల్లి ఆజ్ఞ మీద తన సోదరితో కలిసి వెళతాడు.వీరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సివస్తుంది. ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టుక్రింద విశ్రాంతి తీసుకుంటుంటారు. ఆ చెట్టుపైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి రాబందు పిల్లలను తినటం పరిపాటి. ఈ సారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంటతన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయ చేస్తుంది. వీరు అక్కడికి వెళ్ళి ఆమెకు కొన్ని నెలలు సేవ చేయగా, ఈ సోమావతి అమావాస్యరోజున ఈ కన్య నుదుటన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావిచెట్టు దగ్గరకి వెళ్లి 108 ప్రదక్షిణలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది. ఇది సోమావతీ అమావాస్య కథ.
అంతేగాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ రోజు సోమావతి అమావాస్య . ఈ రోజున వివాహితులు , అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరతాయి.
ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుని, పార్వతీపరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి, మౌనం పాటించాలి.
అందరం భక్తితో *"అరుణాచల శివ"* అని స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ అరుణాచలేశ్వరుడు
గర్వము వదిలి సుఖించాను....*
యదా కించిద్జ్ఞోఽహం ద్విప ఇవ మదాంధః సమభవం
తదా సర్వజ్ఞోఽస్మీత్యభవ దవలిప్తం మమ మనః ।
యదా కించిత్కించిద్బుధజన సకాశాదవగతం
తదా మూర్ఖోఽస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః ॥
తాత్పర్యము: *నాకేమి తెలియని కాలములో అంతయూ తెల్సిన సర్వజ్ఞునిగా భావించుకొని మదగజములా విర్రవీగాను....*
*తదుపరి ప్రాజ్ఞుల వలన కొద్దిగా తెల్సుకొన్నంతనే - నేను మూర్ఖుడినని, నాకేమీ తెలియదని గ్రహించి - జ్వరము తగ్గి కుదుటపడినట్లుగా నన్ను ఆవరించి వున్న గర్వము వదిలి సుఖించాను....*
ఎక్కువ మాట్లాడే వాడు,
🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*అనాహూతః ప్రవిశతి*
*అపృష్టో బహు భాషతేl*
*అవిశ్వస్తే విశ్వసితి*
*మూఢచేతా నరాథమాః॥*
*భావము*
*పిలవకుండా వెళ్ళే వాడు, అడగకుండా చాలా ఎక్కువ మాట్లాడే వాడు, విశ్వసింపదగని వారిని విశ్వసించే వాడు..ఇలాంటి వారు వారి..... మూర్ఖపు చేతలచేత పనికిరాని, పరిత్యజింపదగ్గ వ్యక్తులుగా పరిగణింప బడతారు*....
🧘♂️🙏🪷 ✍️🙏
*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
సోమవారం, జూలై 17, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం - బహళ పక్షం
తిథి:అమావాస్య రా10.38 వరకు
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:పునర్వసు రా4.44 వరకు
యోగం:వ్యాఘాతం ఉ9.41 వరకు
కరణం:చతుష్పాత్ ఉ9.58 వరకు తదుపరి నాగవ రా10.38 వరకు
వర్జ్యం:మ3.43 - 5.27
దుర్ముహూర్తము:మ12.31 - 1.23 &
మ3.06 - 3.58
అమృతకాలం:రా2.07 - 3.51
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00
సూర్య రాశి: మిథునం
చంద్ర రాశి: మిథునం
సూర్యోదయం:5.37
సూర్యాస్తమయం:6.34
*శ్రీమతే రామానుజాయ నమ:*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*