29, ఫిబ్రవరి 2024, గురువారం

గాయత్రి జపించండి

 కంచి పరమాచార్య వైభవము…

0104b. 290224-2.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀362.



          *గాయత్రి జపించండి*

                ➖➖➖✍️


```

ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి మద్రాసులోని తేనంపేట్ నుండి నలభై మంది బ్రాహ్మణులు వచ్చారు. స్వామివారికి నమస్కరించి వారందరినీ బాధిస్తున్న ఒక సమస్య గురించి స్వామివారికి విన్నవించారు. వారు ఉంటున్న ప్రాంతంలో బ్రాహ్మణులు ధైర్యంగా తిరగడానికి సిగ్గుపడుతున్నారని, అక్కడ ఉన్న కొంతమంది నాస్తికవాదులు తమని చూసి గేలి చేస్తున్నారని, కనపడిన ప్రతిసారి వారి శిఖలు, యజ్ఞోపవితాలు, వైష్ణవ ప్రతీకలైన ఊర్ధ్వపుడ్రాలు చూసి చాలా హేళనగా మాట్లాడుతున్నారని స్వామివారితో వాపోయారు.


అంతా విన్నవెంటనే స్వామివారు వారిని ఇలా అడిగారు, “మీరందరూ రోజూ గాయత్రి జపం చేస్తున్నారు కదా?” అని.


అందరూ మౌనంగా ఉన్నారు. వారి మౌనంలోని సమాధానాన్ని స్వామివారు గ్రహించి, “ఇక రోజూ గాయత్రి జపం చెయ్యడం కొనసాగించండి. అంతా సర్దుకుంటుంది” అని ఆదేశించారు.


పరమాచార్య స్వామివారి ఆదేశం అనుసరించి వారు రోజూ గాయత్రి జపం చెయ్యడం మొదలుపెట్టారు. రెండు నెలల్లోనే పరిస్థితి మారిపోయింది. వారు చాలా సంతోషించారు. మహాస్వామి వారిని దర్శించి విషయం అంతా చెప్పారు.


మహాస్వామి వారందరితో ఇలా అన్నారు, “మీకు కలిగిన కష్టాలకు కారణం అంతా మీరు గాయత్రి జపాన్ని వదిలేయడమే. గాయత్రి మంత్రం యొక్క శక్తిని అంచనా వెయ్యడం, లెక్కగట్టడం సాధ్యమయ్యే పని కాదు!”


“మీ సమస్యలన్నిటికీ మూలం మీరు గాయత్రిని వదిలెయ్యడమే!”


ఇది కేవలం అక్కడున్న బ్రాహ్మణులకు మాత్రమే చెప్పిన విషయం కాదు. శాస్త్రం చెప్పినట్టు మన ధర్మాన్ని మనం తప్పక పాటించినట్లయితే ఎవరూ మనల్ని బాధపెట్టరు. అందరూ అందరిని గౌరవిస్తారు.✍️```


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్।

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

జ్ఞానాన్ని

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 ||శ్లో||.    _

*ఏకమేవాక్షరం యస్తు-*

*గురుః శిష్యం ప్రబోధయేత్-।*

*పృథివ్యాం నాస్తి తద్ద్రవ్యం-*

*యద్ దత్త్వా చాఽనృణీ భవేత్-॥*


||తా|| *జ్ఞానాన్ని ఇచ్చే గురువు ఒక్క అక్షరమే బోధించినా, అతని ఋణం తీర్చుకోవడానికి ఈ భూమి మీద సరిసమానమైనది ఏదీ ఉండదు*......

కవి చమత్కారానికి

 6000లపై ఓ కవి చమత్కారం

🌹🌹🌹

ఒక కవి అనవేమారెడ్డి కొలువుకు వెళ్లి, ఆయన్ని కీర్తిస్తూ ఈ పద్యం చదివాడట.


*అనవేమ మహీపాల స్వస్త్వస్తు తవ బాహవే*

*అహవే రిపుదోర్దండ చంద్రమండల రాహవే*

(శత్రువులను అంతమొందించడంలో అనవేమ ప్రభువు చంద్రమండలంలోని రాహువు లాంటివాడని అర్థం.)

రాజు సంతోషించి, కవికి మూడువేల వరహాల బహుమానం ప్రకటించాడు. అప్పుడు కవి, ‘ప్రభూ, మీకు నేను నాలుగు ‘వే’లిచ్చాను. మీరు నాకు మూడు వేలివ్వడం ధర్మమా?’ అన్నాడు.

రాజు కవి చమత్కారానికి మళ్లీ సంతోషించి, ‘అయితే నాలుగు వేల వరహాలు పుచ్చుకోండి’ అన్నాడు. ‘నేను మీకిచ్చినంతే మీరు నాకు ఇస్తే మీ గొప్పేమిటి?’ అన్నాడు కవివర్యుడు.

రాజు పెద్దగా నవ్వి, బహుమానాన్ని అయిదు వేల వరహాలకు పెంచాడు. దానికి కూడా ఆ కవిపుంగవుడు, ‘నేను ఆరువేల నియోగిని మహాప్రభూ’ అన్నాడట.

కవి సమయస్ఫూర్తికి మెచ్చి, ఆరువేల వరహాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు రాజు. కానీ కవీంద్రడు ఊరుకున్నాడా! ‘నా దగ్గర వున్నదే నాకు ఇస్తే మీ ఘనత ఏమిటి ప్రభూ’ అన్నాడు.

కవి యుక్తి రాజుకు నచ్చి, ఏడు వేల వరహాలు చేశాడు బహుమానాన్ని. ఊహూ! ‘ఏడు అంకె శుభసూచకం కాదుగా’ అన్నాడు ఆ కవి.

చివరకు అనవేమారెడ్డి అక్షరాలా ఎనిమిది వేల వరహాలతో ఆ కవికేసరిని సత్కరించాడట.

పోతనగారి కవితా మాధుర్యం!

 శు భో ద యం🙏


పోతనగారి కవితా మాధుర్యం!


మందార మకరంద...


మందార మకరంద మాధుర్యమున దేలు

మధుపంబు వోవునే మదనములకు

నిర్మల మందాకినీవీచికల దూగు

రాయంచ చనునే తరంగిణులకు

లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు

కోయిల జేరునే కుటజములకు

పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక

మరుగునే సాంద్ర నీహారములకు


అంబుజోదర దివ్య పాదారవింద

చింతనామృత పాన విశేష మత్త

చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు!

వినుత గుణశీల, మాటలు వేయునేల?


పోతన భాగవతంతో కాస్తంత పరిచయం ఉన్న ఎవరికైనా ఈ పద్యం తప్పకుండా తెలుస్తుంది. భక్తప్రహ్లాద సినిమా చూసినవాళ్ళకి కూడా ఇది తెలిసే ఉంటుందండోయ్! ప్రహ్లాదుడు మన తెలుగువాళ్ళ హృదయాల్లో నిలిచిపోడానికి ముఖ్య కారణం పోతనంటే అది అతిశయోక్తి కాదు. ఇందులో ఎన్నెన్ని ఆణిముత్యాల్లాంటి పద్యాలు తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోయాయో!

కవిత్వంలో, చెప్పే విషయం ఎంత గొప్పదైనా, అది చెప్పే విధానంకూడా అంతగొప్పదీ అయితేనే పాఠకుల మనసులకి హత్తుకుంటుందనడానికి ఈ పద్యం ఒక చక్కని ఉదాహరణ.

విష్ణు భక్తిని వదలడం తన సాధ్యం కాదని చెప్పడం ఈ పద్యం సారాంశం. దాన్ని చక్కని నాలుగు ఉదాహరణల్తో సమర్ధిస్తున్నాడు ప్రహ్లాదుడు. ఆ తీసుకున్న ఉదాహరణల్లో ఎంతో ఔచిత్యం ఉంది. తేనెటీగ, హంస, కోయిల, చకోరం - ఇవన్నీ పురుగులూ, పక్షులూను. వాటికి ఇష్టమైన ఆ వస్తువులు భౌతికమైనవి, అశాశ్వతమైనవి. అలాటి ప్రాణులకే అలాటి వస్తువులమీద అంత వదల్లేని అనుబంధం ఉంటే, ఇంక మనుషులకి, అందులోనూ అమృత ప్రాయమైన హరి చింతన వదిలిపెట్టడం సాధ్యమౌతుందా? సాధ్యమవదు అన్న జవాబు మళ్ళీ ఆ ఉదాహరణల్లోనే దొరుకుతుంది. మందారాల తేనె, గంగా ప్రవాహము, మావిడి చిగురు, వెన్నెల - వీటితో తుమ్మెద, హంస, కోయిల, చకోరాలకి ఉన్న సంబంధం అతి సహజమైనది. ప్రకృతి సిద్ధమైనది. వాటికి తెలియకుండానే పుట్టుకతో వచ్చింది. ప్రహ్లాదుని భక్తి కూడా అలాంటిదే! అందుకే దాన్ని వదులుకోడం అసాధ్యం!


పద్యం ఎత్తుకోడంతోనే అందమైన పదాలకూర్పుతో చదివేవాళ్ళ, వినేవాళ్ళ మనసులని వశం చేసుకోడం ఒక నేర్పు. ఈ పద్యంలో మరింత లోతైన కూర్పు నేర్పు కూడా చూపించాడు పోతన. ఇష్టమైన వస్తువులను ఎక్కువ పదాలతో వర్ణించి, ఇష్టపడని వస్తువులను ఒకటి రెండు పదాలతో చెప్పి ఊరుకున్నాడు. మదనములు - ఉమ్మెత్త చెట్లు. తరంగిణులు - సెలయేళ్ళు. కుటజములు - (వానాకాలంలో పూసే)కొండ మల్లె చెట్లు. సాంద్ర నీహారము - దట్టని మంచు. అయితే వీటిగురించి చెడు విశేషణాలేవీ వాడకపోవడం ఒక విశేషం. ప్రహ్లాదుడు దేనిగురించీ చెడ్డగా మాట్లాడే వాడు కాదు కదా!వాడిన క్రియలుకూడా చెప్పిన ప్రాణులకీ వస్తువులకీ ఉన్న గాఢమైన అనుబంధాన్ని చెప్పేవే - తేలు, తూగు, సొక్కు, స్ఫురితము (చుంబించబడిన).


అంతా చెప్పి చివరికన్న మాట చూడండీ! "అయినా నువ్వు గొప్ప గుణాలున్న శీలవంతుడివి. నీకు నేనింతగా చెప్పాలా!" ఇదేదో ప్రహ్లాదుడు గడుసుగా అన్న మాటలు కావు. అతనికి తండ్రి మీదున్న అచంచలమైన గౌరవమే!

ప్రహ్లాదుని భక్తి మాట అటుంచి, కనీసం అతని సౌశీల్యాన్నయినా ఆదర్శంగా తీసుకుంటే, పిల్లలు మంచి మనుషులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అది మనందరి చేతుల్లోనే ఉంది!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

అహం ఉన్న వ్యక్తికి

 *🎻🌹🙏అహం ఉన్న వ్యక్తికి ఎన్ని తెలివితేటలు ఉన్నా పరాభవం తప్పదు....!!!*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

                                       

🌿ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే, పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేక పోయేవారు. 


🌸ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే, అవన్నీ ప్రాణమున్న వాటివిగా, మన పక్కన వున్నట్టు, మనకు చేయి అందిస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి.. ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే! ఆ అసాధారణ ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని నింపాయి


🌿ఇదిలావుండగా, ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి  'మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా!") అని చెప్పాడు


🌸శల్పికి చెమటలు పట్టాయి, ఆయన ఇలా అనుకొన్నాడు, నేను బ్రహ్మ లాంటివాడిని కదా! ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే, ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా.... అనిపించే శిల్పాలు సృష్టిస్తాను.. 


🌿కాబట్టి, నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కి వుంచుతాను. అపుడు మృత్యు దేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక  వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు


🌸అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి, మృత్యు దేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొన్నాడు


🌿మృత్యుదేవత ఆ గది లోకి వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు. దేవత వెతుకుతూ వస్తోంది. ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదులే అని అనుకొన్నాడు. 


 🌸శిల్పి ప్రతిభకు మృత్యు దేవత ఆశ్చర్య పోయింది.  ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో... శిల్పమేదో... కనుక్కోలేక పోయింది


🌿ఇక తనవల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళి పోవాలనుకొని  వెనుతిరిగింది. శిల్పి ఆనందనాకి అవధులు లేవు. తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి "ఈ శిల్పి" ఎవరోకానీ, ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు! అంది


🌸అంతే !మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది. తన వృత్తి జీవితంలో ఇప్పటివరకు హేమాహేమీలు  ఒక్కరుకూడా వంక పెట్టలేదు. అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా! ఈ దేవత... అనుకున్నాడు.


🌿 వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో  '' 

ఏది ? ఎక్కడుంది తప్పు చూపించు? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు!" అనేసాడు


🌸అపుడు మృత్యుదేవత నవ్వుతూ.... నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి  చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు!ల్"ప్రాణాధార మైన నీ శ్వాసను కూడా నియంత్రించ గలిగావు కానీ, నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించ లేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది" అని ఆయన్ను తీసుకెళ్ళి పోయింది


🌿మనం పెంచుకొనే అహంభావం 

 అంత ప్రమాదకరమైనది అది సత్యాన్ని చూడనివ్వదు, వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు, మనం అనుకొన్నదే సరైంది, ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. 


🌸నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి ''నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు'' అనుకొంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం, దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం

మీరు గమనించారా ?


🌿'' అహంభావం '' అనే పదం లోంచి అహం 'తీసేస్తే మిగిలేది ' భావం ' అంటే  ' అర్థం' అర్థమైతే అనర్థం జరగదు....నమస్కారం..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

28, ఫిబ్రవరి 2024, బుధవారం

మారాల్సినది

 ముందు మారాల్సినది రాజకీయాలు నేతలు 


గురుశిష్యులు ప్రజలు మానసికంగా ఎదగాలంటే సంభాషణ సంస్కృతం వేదాలను భగవద్గీతను అనివార్యంగా నేర్చుకోవాలి



మన ప్రభుత్వాలు


మద్యపాన ఆపణాలకు

 నిర్మాణ కర్మాగారాలకు 


ధూమపానమ్ ఆపనాలకు

నిర్మాణ కర్మాగారాలకు


గుట్కా ఆపణాలకు

నిర్మాణకర్మాగారాలకు 


వాటిని ప్రచారం చేయడానికి ప్రచార మాధ్యమాలల్లో నిమిషానికి ఒకసారి

విజ్ఞాపనలకు 


రెస్టారెంటులకు

బార్ ఆపణాలకు

డిస్కో క్లబ్బులకు


అశ్లీలచిత్రాలకు

అశ్లీలసాహిత్యానికి

అశ్లీలనృత్యాలకు

అశ్లీల కథలకు

అశ్లీలఫ్లెక్సీలకు

అశ్లీలసంభాషణలను


ఆనవశ్యక పిల్లల పెద్దల నానావిధ ప్రజల మనస్సులను   విచలితం చేసే వాటికి


అనుమతులు  ఇచ్చిన రాజకీయ నాయకులదే ప్రభుత్వాలదే తప్పు


యథా రాజా తథా ప్రజా


⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡


ఈ దేశంలో మారాల్సింది రాజకీయ నాయకులు


గురుర్ బ్రహ్మ అని గురువుల గొప్పతనం చెబుతారు


గురువులను ఈ ప్రభుత్వాలు 


ప్రైవేటు గురువు అని

ప్రభుత్వ గురువు అని

పార్ట్ టైమ్ గురువు అని

కాంట్రాక్టు గురువు అని

గెస్ట్ ఫ్యాకల్టీ గురువు అని

టైమ్ స్కేల్ గురువు అని


యస్ టి గురుకులాల గురువు అని

యస్ సి గురుకులాల గురువు అని


బి.సి గురుకులాల గురువు అని


ఓ.సి గురుకులాల గురువు అని


మైనారిటీల గురుకులాల గురువు అని


విడదీసినారు


ప్రభుత్వ గురువులకు తప్ప మిగితా గురువులకు చాలీ చాలని వేతనాలు ఇస్తున్నారు


అది కూడా 7 8 నెలలు మాత్రమే


ఈ తెలంగాణాలో 


గురువులందరికి మినిమమ్


50 వేల జీతం ఉండాలి


పోలీసు ఆర్మీ రంగం వలే గురువుల రంగం ప్రభుత్వ ఆధీనమై ఉండాలి


గురువులను సైతం సమాజాన్ని గొప్పగా మార్చే

 క్రమశిక్షణగా ఉంచే ఉండే 


పోలీసు 

ఆర్మీ రంగం వలే ఉంచి 


సరైన వేతనం ఇచ్చి కొన్ని బాధ్యతలను ఇవ్వాలి


ప్రపంచంలో మనిషి మనీషి కావాలంటే నీతిగా మనుగడసాగించాలన్న


అది ఒక్క గురువు వలనే సాధ్యం అని ఈ సమాజం గ్రహించాలి


విద్యను వ్యాపారం చేసి గురువులను బానిసలుగా చేసిననాడే మానవత్వం మాయం అయినది


అర్హులైన వక్తలైన కవులైన పండితులైన ఋషిలైన అంకితభావం గొప్ప మేధావంతులైన గురువులు ఉండాలి

జన్మించాలి


అలాంటి వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలి


యోగ్యలైన గురువులను గుర్తించి ప్రభుత్వం లో భాగస్వామ్యం చేసి


సలహాలు పొందుతూ


గురు శిష్యులను వారి కుటుంబాలను

 అన్ని విధాలుగా ఆదుకోవాలి


గురువులకు


50 వేల వేతనం 12 నెలలు ఇవ్వాలి


అర్హులైన గురువులందరిని కాపాడుకోవాలి ప్రోత్సహించాలి


 గురు శిష్యులందరూ


 గొప్ప వక్తలు కవులు పండితులు ఋషులు పరోపకారపరాయణులు 

నాయకులు కావాలి


సంఘసంస్కర్తలు కావాలి


ఈ సమాజస్వరూపాన్ని కుల్లు రాజకీయాలను మార్చేయాలి


ఏ దేశంలో గురుశిష్యులు మేధోమథనం చేస్తారో


ఆ దేశంలోనే పరోపకారపరాయణులు గొప్ప నాయకులు జన్మిస్తారు


ఈ ప్రపంచచరిత్ర మార్చేస్తారు


సంస్కృతభాషను జాతీయ భాషగా ప్రకటించుకుందాం


వేదాలను భగవద్గీతను జాతీయ గ్రంథాలుగా


ఆవును జాతీయజంతువుగా చేద్దాం


ఈ విశ్వమానవుల చరిత్రను మార్చేద్దాం


వీథి వీథి లో 


సంస్కృతమాధ్యమ గురుకులాలను స్థాపిద్దాం


సంస్కృతసంభాషణను విశ్వసంభాషణం కుర్యామ

పాఠశాలలో

 *🎒మన పాఠశాలలో..!!*

====================


*"ఏంటి సర్..సిలబస్* *అయిపోవచ్చిందా?"*

*అన్న మాటలు విని  వెనక్కి తిరిగి చూసా..*


*ఎదురుగా* *హెడ్డుమాస్టర్..*

*కళ్ళజోడు* *సవరించుకుంటూ..*


*"లేదు సర్,ఇంకా ఒక లెసన్ ఉంది"*

*కొంచెం తటపటాయిస్తూ నా సమాధానం.*


*"మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు"*

*అని మా హెడ్డుమాస్టర్ కొంచెం గంభీరంగానే అడిగారు.*


*"సమాజంలో విలువలు" కోసం చెప్తున్నా సర్..!*

*అని*

*"సర్" కళ్ళలోకి కొంచెం గర్వంగా చూస్తూ..చెప్పా*

*ఆ మాటకు మా హెడ్డు గారు కొంచెం చిరాకుగా మొహం పెట్టి*

*"అవన్నీ నీకు ఎవరు చెప్పామన్నారయ్యా?"*

*అని పిల్లల వైపు ఒకసారి తేరిపారా చూసి బయటకు రమ్మన్నారు.*

*వెళ్లి ఆయన ఎదురుగా నిల్చున్నా..*


*నన్ను ఒకసారి పైకి కిందకి చూసిన ఆయన*

*కొంచెం మెల్లిగా మాట్లాడుతూ..*


*"నీకేమైనా పిచ్చా?"*


*"ఈ రోజుల్లో పేరెంట్స్ వచ్చి మా వాడికి మార్కులు ఎందుకు తగ్గాయి అని అడుగుతారు కానీ..*

*"విలువలు,క్రమశిక్షణ ఎంతవరకు నేర్పించారు?"అని అడగరయ్యా!!*


*"పోనీ ప్రోగ్రెస్ రిపోర్టులో విలువలు, క్రమశిక్షణ కాలమ్  ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా??"*


*"ఈ రోజుల్లో వాటితో పెద్ద పనిలేదయ్యా"*


*అని చెప్పి..నాకు ఆయన మరింత దగ్గరగా వచ్చి*


*"ముందు సిలబస్ కంప్లీట్ చేసి,మన బడుద్దాయిలకి నాలుగు ప్రశ్నలు ఇచ్చి కంటస్థ పెట్టించు.విలువలదేముంది బాబూ..!అవి మనం* *నేర్పించకపోయినా ఎవడూ అడగడు"అన్నారు.*


*ఆ మాటకు నా మొహంలో వస్తున్న మార్పులు* *గమనించినట్టున్నారు.*  *మా హెడ్డుమాస్టర్.*

*వెంటనే..ఇలా అన్నారు.*


*"ఈ రోజుల్లో ఉపాధ్యాయ వృత్తి కత్తి మీద సాము లాంటిదయ్యా!"*


*నాకు అర్ధం అయ్యీ..అవనట్టుగా ఉండి అలానే చూస్తున్నాను.*


*ఆయన నా వైపే చూస్తూ..*


*"అవునయ్యా..!ఈ రోజుల్లో మనం వాళ్ళకి చదువు మాత్రమే చెప్పగలం.*

*"జ్ఞానం"ఇవ్వడానికి మన దగ్గర టైం లేదు.*


*"జ్ఞానం" ఇవ్వాలంటే*


*"క్రమశిక్షణ" కావాలి...అది నేర్పించాలంటే*


*"దండన" కొన్నిసార్లు తప్పకపోవచ్చు.*


*కానీ...ఈ రోజుల్లో అది సాధ్యమయ్యే పనేనా..!?*


*ఎంతమంది విద్యార్థులని రోజూ చూడటంలేదు*


*ఒకడు కన్నాలున్న పాంటుతో వస్తాడు*

*ఇంకొకడు సగం*

*గొరిగి మధ్యలో వదిలేసిన హెయిర్ స్టైల్  తో వస్తాడు.*

*"అదేమిట్రా?" అంటే*

*మా నాన్న చేయించాడు అంటాడు.*

*మరొకడేమో..*

*నిన్ను..నన్నూ..* *గుద్దుకుంటూ పోతాడు.*


*"అది తప్పురా"*

*అని కొంచెం గద్దిస్తే చాలు*

*సాయంకాలానికి వాడి తల్లిదండ్రులు*

*"గేట్"ముందు ధర్నాకు దిగుతారు.*


*పోనీ..వాళ్ళకే ఏదో సర్దిచెపుదాం అంటే..*


*"డబ్బులు కడుతున్నాము..గుద్దితే కొంచెం సర్దుకుపోలేరా??" అని మనల్నే ప్రశ్నిస్తారు.*


*"పిల్లవాడికి మొదటి సమాజం పాఠశాల"*


*సమాజంలో ఎలా బ్రతకాలో నేర్చుకునేది ఇక్కడే..!*


*కానీ...*


*"విద్యార్థి చేసిన ఏ చిన్న తప్పుకు కూడా పాఠశాల లో దండన లేదు కాబట్టే వాడు పెద్దయ్యాక సమాజంలో తప్పు చేయడానికి భయపడటం లేదు."*


*విచిత్రం ఏమిటంటే..!!*


*చేసిన తప్పుకు పాఠశాలలో దండన లేదు కానీ*

*సమాజంలో మాత్రం ఉంటుంది.*

*పాపం అది తెలుసుకునే సరికే..వాడు తల్లిదండ్రుల చేయి దాటిపోతాడు.*


*"మా వాడిని ఎందుకు దండిచావయ్యా?"*

*అని "జిల్లా జడ్జి గారి"ని అడగలేరు కదా..*

*తప్పుకు శిక్ష పడాల్సిందే కదా..*


*అదే పాఠశాల లో సరిఅయిన*

 

*"శిక్షణ"*


*జరగడానికి..వీళ్లందరూ సహకరిస్తే..ఆ*

*"శిక్ష"లు పడవు కదా..*


*అని చెప్పి,కొంచెం ఆలోచించి మళ్లీ ఇలా అన్నారు.*


*"నాకు కూడా మంచి సమాజం స్థాపన కోసం*

*క్రమశిక్షణ కలిగిన విద్యార్థులని తయారు చేయాలని ఉందయ్యా..!"*


*"చదువంటే మార్కులు కాదు,క్రమశిక్షణ మరియు విలువలతో కూడిన జ్ఞానం అని ప్రతి పేరెంట్* *తెలుసుకున్నపుడు..తప్పకుండా మనం మంచి సమాజ స్థాపన కోసం పాఠశాలలోనే పునాది వేద్దాం"*


*అని చెప్తూ..ఆయన గది వైపు నడుచుకుంటూ వెళ్లిపోయారు.*


*నేను ఆయన్నే తదేకంగా చూస్తూ..నిల్చుండిపోయాను.*


*"సైనిక పాఠశాలలో ఎంతోమంది* *విద్యార్థులని బెత్తం దెబ్బలతో అయినా* *"క్రమశిక్షణ" నేర్పించి*

*వారిని ఉత్తములుగా తీర్చిదిద్దిన*

*"హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు గారు "*

*ఈ రోజు మార్కుల కోసం ఆలోచించడం ఏంటో..!!"*


*"హ్మ్మ్..ఏదైనా తల్లిదండ్రులకి కావాల్సింది ఈ రోజుల్లో మార్కులే కదా..!!"*


*అని మా ఆఫీస్ బాయ్ లింగరాజు అంటున్న*

*మాటలు నా చెవికి అస్పష్టంగా వినిపిస్తున్నాయి.*


*రాసిన మహానుభావుడికి...*

🙏🙏🙏🙏🙏🙏

Panchaag


 

/ రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*28-02-2024 / బుధవారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

మేషం


సోదరులతో  మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగమున  ఊహించని  మార్పులు ఉంటాయి. 

---------------------------------------

వృషభం


ధన వ్యవహారాలు కలసివస్తాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా  వ్యవహరిస్తారు.  నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున  పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

మిధునం


అవసరానికి చేతికి ధనం అందుతుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి  అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------

కర్కాటకం


ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------

సింహం


ఉద్యోగులు చేయని పనికి నిందలు పడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృధా  ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించక ఇబ్బందిపడతారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.

---------------------------------------

కన్య


నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

---------------------------------------

తుల


ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు  ఎదుర్కొంటారు. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప  ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు అంతగా కలిసి రావు. స్ధిరాస్తి సంబంధిత వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

---------------------------------------

వృశ్చికం


కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు  వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

---------------------------------------

ధనస్సు


వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మారుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ  బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. అనుకున్న సమయానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసివస్తుంది.

---------------------------------------

మకరం


కుటుంబ సభ్యులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. దీర్ఘ కాలిక ఋణ సమస్యలు  నుండి బయట పడతారు. స్థిరస్తి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది.

---------------------------------------

కుంభం


నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో  దూర ప్రయాణాలు చేస్తారు.

---------------------------------------

మీనం


ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాల వలన శ్రమాదిక్యత పెరుగుతుంది. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

🍀 *శుభం భూయాత్* 🍁

ధర్మార్థములు లేని చోట

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 ||శ్లో||.   

*ధర్మార్థౌ యత్ర న స్యాతామ్*

*శుశ్రూషా వాపి తద్విధా|*

*తత్ర విద్యా న వక్తవ్యా* 

*శుభం బీజమివోషరే||*


||తా|| *ధర్మార్థములు లేని చోట, వినవలెనని కోరిక లేని చోట విద్యని బోధించరాదు*.... బోధించినట్లైన చవిటిభూమిలో విత్తనములు జల్లినట్లేయగును...

మాఘ పురాణం

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*🌺మాఘ పురాణం - 18 వ అధ్యాయము🌹*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*ఇంద్రుని శాపవిముక్తి*


శ్రీమహా విష్ణువు దేవతలతో మరల నిట్లనెను." దేవతలారా! మాఘమాస మహిమను యెంత చెప్పినను చాలదు. మాఘపూర్ణిమనాడు, మాఘస్నానము, పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నియు, నశించును.మాఘ వ్రతము నాచరించినవారు, నాకిష్టులు. వారు దేవతలై, వైకుంఠమును చేరుదురు.


మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించువారిలో గొప్పవాడు. అశ్వర్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను(విష్ణువు) ఉత్తముడును. వేదములు, శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో, శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో, రామతారకము ఉత్తమము. స్రీలలో లక్ష్మి దేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరువు పర్వతములలో గొప్పది. అన్ని  దానములలో, ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము, సర్వ ఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరీ, ఇలా సర్వనదులయందును, పది సంవత్సరముల పాటు, సూర్యోదయ సమయమున, స్నానము చేసినచో, వచ్చు పుణ్యము, మూడు దినములు, అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి, పూజ  మున్నగువానితో, వివిధ పుష్పములతో, సాలగ్రామరూపమున నున్న నన్ను పూజించిన, మోక్షము వచ్చును, అని శ్రీమన్నారాయణుడు, దేవతలకు, మాఘవ్రత మహిమను వివరించెనుl.


దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి, యింద్రుని వెదకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదకుచున్నవారికి, చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండయొకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి.ఎంత ప్రయత్నించినను, ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని, శ్రీమహావిష్ణువు చెప్పిన మాట యెట్టిదో చూడవచ్చునని తలచి, మరునాడు మాఘస్నానాదికమును చేసి, ఆ తీర్థమును తొండపై పోసిరి.


పవిత్రోదకముచే తడిసిన తొండ, దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెనడిగిరి. ఆమెయు శాపవిముక్తికి సంతసించుచు. దేవతలకు నమస్కరించి యిట్లు పలికెను." నేను సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున, నా భర్త పెండ్లి జరిగిన నాల్గవనాడు మరణించెను. మా తల్లితండ్రులు చాలా యెక్కువగా దుఃఖించిరి. నా తండ్రి, "మనుష్య జన్మము కష్ట ప్రదము, స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకొన్న ఈమెను చూడజాలను, ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి, తపమాచరించుటమేలని" తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి, నా తల్లితండ్రులిద్దరును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి.


నేనును బంధువుల వద్దనుంటిని, వారి నిరాదరణ ఫలితముగ, చూచువారెవరును లేకపోవుటచే, భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్నదానిని భుజించుచు, బిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు, జీవించుచుంటిని. భక్తి, వ్రతము మున్నగువానిని ఎరుగను. ఉపవాసమననేమో తెలియదు. ఏకాదశీ వ్రతము చేయువారిని చూచి, పరిహాసము చేసితిని. ధనమును దాచి, సంపాదనపరురాలనైతిని. నన్ను కోరిన వారికి, నన్ను అర్పించుకొనుచు, నేను కోరిన వారిని పొందుచు, నీతి నియమములను విడిచి, దురాచారవంతురాలనై, జీవితమును గడిపితిని, తరువాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతుల శిక్షింపబడితిని.


పులి, కోతి, ఎద్దు, మున్నగు పెక్కు జంతువుల జన్మనందితిని, పెక్కు బాధలను పడితిని. ఒకనాటి  జన్మలో అయిదు దినముల క్రిందటి ఆహారమును, ఆకలి కల వానికి పెట్టితిని, ఆ చిన్న మంచి పని వలన, మీరు దయయుంచి, నాకు శాపవిముక్తిని కలిగించిరి" అని పలికెను మాఘ మాస పవిత్ర నదీజలస్పర్శచే, ఆమె దేవతత్వమునంది,' దేవప్రియ' అను పేరును పొందెను. దేవతలలో, ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును, దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదుకసాగిరి. పద్మగిరి గుహలలో, వికారరూపముతో తిరుగుచున్న యింద్రుని జూచి, బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికిపారిపోయెను. దేవతలను ఇంద్రుని జూచి, వెంబడించి, వానిని ఊరడించి, ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపములను పొగొట్టుకొనుటకు, మహావిష్ణువు, నీ శాపవిముక్తికి మార్గమును సూచించెను, ఆ, ప్రకారము చేయుదము" రమ్మని, తుంగభద్రాతీరమునకు తీసికొని వచ్చిరి. మాఘమాసమంతయు వానిచేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాపవిముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెనుl.


ఇంద్రుడును దేవతలతో కలసి స్వర్గమునకెగెను. రాక్షసులను జయించి, సుఖముగనుండెను. గృత్నృదమదమహర్షి జహ్నుమునికి యీ విధముగ మాఘమాస స్నానమహిమను వివరించెనని పలుకుతుండగా, జహ్నుముని, స్వామీ! యీ విష్ణు కథామృతము, ఇంకను వినవలెననున్నది. ఇంకను చెప్పుడని కోరెను. గృత్నృమదుడిట్లనెను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు .


ధనసంపాదనము తప్ప, ధనవినియోగము నాతడు  చేయలేదు. పూజ, దానము, మున్నగు మంచిపనులను గూడ చేయలేదు. అందువలన మరణించిన తరువాత, నరలోకమును చేరెను. అచట కొంతకాలముండి, దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై, పంపాతీరమున, మఱ్ఱిచెట్టు పైనుండి, అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠమహర్షి, ఆ ప్రాంతమునకు, శిష్యులతో వచ్చి, మఱ్ఱిచెట్టు సమీపమున నివసించుచు, మాఘస్నానము, పూజ, మున్నగునవి  చేయుచు, శిష్యులకు, మాఘమాస మహత్త్యమును, వివరించుచుండెను, అతదు మాఘస్నాన మహిమను వివరించుచు, నొకనాడు, మాఘస్నానము చేసిన వారి సర్వపాపములును, సూర్యోదయమువలన  చీకట్లు నశించినట్లుగా, నశించును. మాఘస్నానము చేయనివాడు  నరకమునపోవును" అనుచు, మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును, చేయుట వలని శుభములను, చేయకపోవుటవలని అశుభములను,  వివరించుచుండెను. ఆ సమయమున, పిశాచరూపము పైనుండి క్రిందపడింది. ఆ పిశాచము, వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లుచు, పంపాజలమున, మాఘస్నానమును, వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరి కథలను వినుట వలన, మాఘ స్నానము వలన, వాని పిశాచరూపముపోయి, దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన, వైకుంఠమును చేరెను.


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*చతుర్ధ స్కంధం*


*కేశవ! సంతత క్లేశ నాశనుఁడవు; కోరి మనో వా గగోచరుఁడవు*

*నిద్ధ మనోరథ హేతుభూ తోదార; గుణనాముఁడవు సత్త్వగుణుఁడ వఖిల*

*విశ్వోద్భవస్థితి విలయార్థ ధారిత; విపుల మాయాగుణ విగ్రహుఁడవు*

*మహి తాఖి లేంద్రియ మార్గ నిరధిగత; మార్గుఁడ వతిశాంత మానసుఁడవు*


కేశవా! నీవు ఎడతెగకుండా వచ్చిపడే ఘోరమైన కష్టాలనన్నింటినీ రూపు మాపుతావు. నీవు మనస్సులకూ, మాటలకూ అందనివాడవు. నీ గుణాలూ, నీ పేరులూ, భక్తుల హృదయాలలో చెలరేగే మోక్షకాంక్షను చక్కగా ఫలవంతం చేస్తాయి. సత్త్వగుణం నీ సొమ్ము. సంస్త లోకాల పుట్టుక, స్థితి, వినాశమూ అనే పనులను నిర్వహించడానికి నీవు మాయాగుణాలతో కూడిన రూపాలను స్వీకరిస్తావు. ఇంద్రియమార్గాలన్నీ నీ మార్గం దగ్గర నిలిచి పోతాయి. ఆ మార్గాలు నీ మార్గంలో అడుగు కూడా పెట్టలేవు. ప్రశాంతమైన మనస్సుతో విరాజిల్లుతూ ఉంటావు. భక్తుల సంసారమనే ఘోరమైన బంధాన్ని ఎలా నాశనం చేయాలో తెలిసిన జ్ఞానస్వరూపుడవు నీవు. దేవదేవుడవు. వాసుదేవుడవు. సర్వభూతాల హృదయాలే నీ ఆలయాలు. నీవు సర్వసాక్షివి. కృష్ణా! వాసుదేవా! నీకు నమస్కారాలు చేస్తూనే ఉంటాము.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 36*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవాహితాః ।*

*నిందంతస్తవ సామర్థ్యమ్ తతో దుఃఖతరం ను కిమ్ ।।*


*భావము:* 

నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు, దీనితో నీ గొప్పతనం చులకనయిపోతుంది. అయ్యో, దీని కంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా?

 

వివరణ: ఒకవేళ అర్జునుడు యుద్ధ భూమి నుండి పారిపోతే తోటి వీరుల మధ్య అతని గొప్పతనం తగ్గిపోవడమే కాక, తను చులకనైపోతాడు. శ్రీ కృష్ణుడు 'నిందంతః' అంటే 'నిందించుట, దూషించుట' అని. 'అవాచ్య వాదాన్' అంటే, 'నపుంసకుడు' వంటి కఠినమైన మాటలు. అర్జునుడి శత్రువులైన దుర్యోధనుడు వంటి వారు "చూడండి, ఈ చేతకాని అర్జునుడు యుద్ధ భూమి నుండి, కాళ్ళ మధ్యలో తోక ముడుచుకున్న కుక్క లాగ పారిపోతున్నాడు" అని చాలా అనుచితమైన మాటలు మాట్లాడుతారు. ఇలాంటి హేళన భరించటం అర్జునుడికి చాల బాధాకరంగా ఉంటుంది అని శ్రీ కృష్ణుడు గుర్తుచేస్తున్నాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 41*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 118*


*అదిఇది యని మది దోచెడు*

*సదనము గుర్తించి లోనె సాధించినచో*

*గుదురును బ్రహ్మానందము*

*గదసిన మది జేరనొక్కి కనవలె వేమా !*


*🌹తాత్పర్యము --*

ఆత్మసాక్షాత్కారముతో బ్రహ్మానందము కలుగునని గ్రహించాలి.


*💥వేమన పద్యాలు -- 119*


*అదియొకటి దెలిసి యాదిని నిల్పిన*

*యాది బాయకున్న నభవు డవును*

*యాది బాయువాడు యంధుని రీతిరా*

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

ఆదిమధ్యాంతములు తెలిసినవాడే దైవస్వరూపుడగును.

అది తెలియని వాడు గృడ్డివానితో సమానము.


*💥వేమన పద్యాలు -- 120*


*అధముడైన మనుజు డధికుని జబట్టి*

*యతని మాట నడచు నవని లోన*

*గజపతింట నెన్న గవ్వలు చెల్లవా* 

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

అధముడు , అధికుని చేరి అతని మాటే వేదవాక్కుగా భావించి ప్రవర్తిస్తాడు.

గజపతి ఇంటిలో అల్పులెందరు చలామణిగాలేరు.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నీచుల ఆశ్రయం

 🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 నీచాశ్రయో న ఖలు కర్తవ్యః

కర్తవ్యో మహదాశ్రయః|

పయోపి శౌండకీహస్తే

వారుణీత్యభిధీయతే||


తా𝕝𝕝 "నీచుల ఆశ్రయం, సహవాసం ఎప్పుడూ చేయకూడదు. మహదాశ్రయం అంటే మహానుభావుల ఆశ్రయం సాంగత్యం ఎల్లప్పుడూ కర్తవ్యంగా జీవించాలి. మద్యం విక్రయంచే ఆమెవద్ద పాలు వున్నా మద్యం గానే భావిస్తారు. అలాగే నీచుల ఆశ్రయం లో ఎంత నిష్ఠగా వున్నా నీచునిగానే పరిగణిస్తారు."


*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*

*_అడ్మిన్  - సంస్కృతసుధాసింధువు_*