17, డిసెంబర్ 2023, ఆదివారం

సుభాషితం

 *జైశ్రీరామ్*


                              22-6-2020

                              అభ్యాసం-32


                            *సుభాషితం*


"హిమాలయం సమారభ్య

  యావదిందు సరోవరమ్ |

  తం దేవనిర్మితం దేశం

  హిందూ స్ధానం ప్రచక్చతే"||

             (బృహస్పతి ఆగమం)


                                  *భావం* 


హిమాలయాలు మొదలుకొని దక్షిణ (ఇందు) సముద్రమువరకు వ్యాప్తమగుచూ దేవతలచే నిర్మించబడిన భూమి హిందుస్ధానమని చెప్పబడుచున్నది.

       బృహస్పతి ఆగమశాస్త్రం ప్రకారం *హిందూ* అన్న పదం హిమాలయములలోని 'హి'వర్ణము,ఇందుసరోవరము (దక్షిణ సముద్రం) లోని 'ఇందు' పదములతో కూడి ఏర్పడి మన సంపూర్ణ మాతృభూమిని సూచిస్తున్నది.


                          *అమృతవచనం* 


మహాయోగి అయిన *శ్రీకృష్ణుడు* *కర్ణునితో*( కురుక్షేత్ర యుద్ధరంగంలో ఉండగా బురదలో దిగబడిన రధచక్రాలను పైకి లేవనెత్తడానికి కర్ణుడు రధంనుంచి క్రిందకు దిగినప్పుడు,అతనిపై బాణ ప్రయోగం చెయ్యమని శ్రీకృష్ణుడు అర్జునుని ఆజ్ఞాపించినప్పుడు, విరధుడై నిరాయుధుడైన ప్రత్యర్ధిపై బాణప్రయోగం అధర్మమని చెపుతూ తనను కొట్టవద్దని ' *ధర్మంపేరున* ' అర్జునుణ్ణి అర్ధించినపుడు) ఇలాఅన్నాడు:

            *కర్ణా*! ఈనాటివరకు నువ్వు అనుష్ఠించిన ధర్మశాస్త్ర నియమాలు ఏమున్నాయని ఈనాడు మాకు ధర్మాన్ని బోధిస్తున్నావు ?    

     మాయా జూదంలో పాండవులను ఓడించినపుడు ఏమైంది నీ ధర్మం ?  

      నిరాయుధుడు, పశివాడైన *అభిమన్యుని* యోధానయోధులైన మీరందరూ చుట్టుముట్టి సిగ్గువిడిచి నిర్ధాక్షిణ్యంగా సంహరించినపుడు నీవు చెప్పే ఈ ధర్మం ఏమైంది ?

      నిస్సహాయురాలు,అబల ఐన *ద్రౌపదిని* నిండుసభలో బహిరంగంగా *దుశ్శాసనుడు* అవమానిస్తోంటే  అడ్డుకోకుండా ఇంకా రెచ్చగొట్టేటట్లు మాట్లాడావు అప్పుడు ఈ నీ ధర్మం ఎటు మాయమయింది ?

       నేను రక్చించవలసింది ఒక ధర్మమే అదే *ధర్మరాజు* అతని సోదరులు.ఎందుకంటే ధర్మం వారివైపుంది కాబట్టి.నాకు పక్ఛపాతాలు ఏమీ ఉండవు.నేను ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాను.

        *శ్రీకృష్ణుడు* ఇట్టి సరియైన దృష్టికోణాన్ని నిరూపించి తద్వారా *అర్జునుని* (పాండవుల) సంకల్పశక్తిని వజ్రసదృశం చేసాడు కాబట్టే అర్జునుడు యుద్ధం చేయగలిగాడు, తద్వారా ధార్మికశక్తుల విజయపతాకాన్ని ఎగురవేశాడు.


                      శ్రీవేంకటేశ్వర్లు వబిలిశెట్టి


.

కామెంట్‌లు లేవు: