3, జూన్ 2024, సోమవారం

జ్యోతిష్య శాస్త్రం

 ఆరు వేదాంగాలలో జ్యోతిష్యం ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో ఇది కూడా ఉంది. మొట్టమొదటిగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంధరూపంలో వరాహమిహిరుడు అందించాడు.


జ్యోతిష్య శాస్త్రం ఉపవేదాగం అవటంవల్ల 

ఈ శాస్త్రాన్ని అపహాస్యం చేయుట ఖండిచతగ్గది.


జ్యోతిష్య శాస్త్రం  ఈ విశ్వానికి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. 


1.   ఖగోళ శాస్త్రం ఉన్న గ్రహాలు ఒకటిపై ఒక మరొకటి చూపే ప్రభావములు తద్వారా ఈ విశ్వంలో వచ్చే మార్పులు ముందుగా చూఛాయగా జీవులకు అందజేయడం. 


2.    గర్భం చీల్చుకొని భూమి మీద పడ్డ శిశువు జననం కాలానికి ఏడు గ్రహాలు, రెండు ఛాయా గ్రహాలు విరసి 9 గ్రహాల అంతరిక్షంలో వాటి స్థానం. ఇవన్నీ ప్రాధాన్యత అంతరించుకుంటాయి.


మొట్టమొదటి విషయంలో విశ్వంలో జరిగే మార్పులు అనగా గ్రహణాలు, ఋతువులు, రుతువుల్లో వచ్చే మార్పులు కొన్ని కోట్ల సంవత్సరాల ముందు ఋషులు కనుక్కున్నారు.


రెండో విషయంలో జీవి యొక్క తనువుకు సంబంధించిన విషయాలు, కుటుంబ విషయాలు, భార్య యొక్క విషయాలు, రాజ్యాధికారం, యోగములు కాలములు మొదలైన విషయాలు ప్రస్తావింపబడ్డాయి. 


నాస్తికులు దీన్ని అపహాస్యం చేస్తున్నారు. వితండులు కృషితో నాస్తి దుర్భిక్షం అనే వాదన కూడా చేస్తారు. 


జీవులు జన్మించిన తర్వాత అందరూ తమ భుక్తికై కష్టపడుతూనే ఉంటారు. ఎవరు కృషి చేయకుండా ఉండలేరు. అది ఏ బుద్ధిజీవికైనా తెలుసు. కానీ కొందరు స్వల్ప ప్రయత్నానికే విజయం సాధిస్తారు. కొందరు ఎంత కష్టపడినా నిరుత్సాహం ఎదురవుతుంది. ఇదంతాయు గ్రహ అనుకూల,వ్యతిరేకతలే. 

అయినా మానవ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. గ్రహాలు అనుకూలమైనప్పుడు ప్రయత్నాలు ప్రకాశం చెందుతాయి. 


ఇంకా ప్రస్తుత సబ్జెక్టు ప్రకారం, రాజకీయ పార్టీలనిబట్టి జ్యోతిష్యం చెప్పడం హాస్యాస్పదమే. 


ఇది ఆయా నాయకుల గ్రహ స్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. నాయకుడికి రాజ్యాధికారానికి గ్రహం అనుకూలిస్తే తప్పకుండా రాజ్యాధికారం చేపడతాడు. రాజ్యాధికారం లేనట్టయితే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. 


అందువలన పార్టీలపై జ్యోతిష్యం కుదరదు. 

ఈ విధంగా జ్యోతిష్యాన్ని  ధన సంపాదనకై వాడుకునే

ప్రయత్నం సమాజం గర్హించాలి.

కామెంట్‌లు లేవు: