20, ఆగస్టు 2024, మంగళవారం

దోమ‌ల దినోత్స‌వం .


*నేడు ప్ర‌పంచ దోమ‌ల దినోత్స‌వం ..*

*ఎందుకు నిర్వ‌హిస్తారో తెలుసా?*

ఈ ప్రపంచంలో మనం దేనినీ తక్కువ అంచనా వేయలేము ఎందుకంటే అది మనకు ఎంత ప్రమాదకరమో మనకు తెలియదు. దోమల వల్ల వ్యాపించే వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 3700 రకాల దోమలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో దాదాపు ప్రతి వ్యక్తికి దోమలు కుట్టిన అసహ్యకరమైన అనుభవం ఉంది. దోమ కుట్టినప్పుడు ఆ శరీర భాగానికి దురద మరియు వాపు వస్తుంది. ఒక వ్యక్తిని కుట్టడం ద్వారా ఒక శరీరం నుండి మరొక శరీరానికి ప్రమాదకరమైన వ్యాధులు మరియు వైరస్‌లను వ్యాప్తి చేసే దోమలు ఉన్నాయి. దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి.


గణాంకాల ప్రకారం మలేరియాతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 4,35,000 మంది దాకా చనిపోతున్నారు. ఐతే.. ఏటా 21.9 కోట్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. అంటే.. కరోనా కంటే మలేరియానే ప్రమాదకరం అనుకోవచ్చు. చాలా మంది మలేరియాను తేలిగ్గా తీసుకుంటారు. అందుకే ఎక్కువ మంది దాని బారిన పడుతున్నారు. ప్రస్తుతం మలేరియా 100కు పైగా దేశాల్లో ఉంది. ఎండ ఉండే దేశాల్లో ఇది బాగా ఉంది. మొత్తం మలేరియా కేసుల్లో 70 శాతం 11 దేశాల్లో నమోదవుతున్నాయి. వాటిలో ఇండియాతోపాటూ... ఆఫ్రికా ఖండ దేశాలు ఉన్నాయి..


దోమల వల్ల మలేరియా సంక్రమిస్తుందని 1897లో సర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నారు. ఆందుకు గానూ ఆయనకు గౌరవసూచకంగా ప్రపంచ దోమల దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. మలేరియా, డెంగ్యూ జ్వరం, జికా వైరస్ వంటి వాటి ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి అవగాహన పెంచడానికి ఈ రోజును రూపొందించారు. ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం, నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా, ఈ కీటకాల నుంచి మనల్ని, చుట్టూ ఉన్నవారిని అ రక్షించుకోవచ్చు.

కామెంట్‌లు లేవు: