27, ఏప్రిల్ 2021, మంగళవారం

పెంపకంలో తల్లి

 👍 *పిల్లల పెంపకంలో తల్లి* *భాద్యత* 👍


ఒక బాలుడికి జట్కాబండిలో ప్రయాణించడం చాలా ఇష్టం. రోజూ బడికి జట్కాలోనే వెళ్లేవాడు.


పెద్దయ్యాక ఏం కావాలనుకున్నారని స్కూల్లో టీచరు అడిగారు.

ఒకరు డాక్టరని,

ఇంకొకరు ఇంజినీరని,

మరొకరు లాయరని

అన్నారు.


ఈ బాలుడు మాత్రం జట్కావాలా అవుతానన్నాడు.


టీచరు, పిల్లలు ఘొల్లున నవ్వారు. 


ఇంటికెళ్లేలోపే ఇది బాలుడి తల్లికి తెలిసి, ప్రశాంతవదనంతో


బాబూ! పెద్దయ్యాక ఏమవుతావని అడిగింది.


స్కూళ్లో చెప్పిందే చెప్పాడు.


తల్లి:

"అలాగే అవుదువుగానీ, ఇలా రా"

అంటూ పూజామందిరం తలుపులు తెరిచి,

"ఒక్క గుర్రంతో నడిపే బండి కాదు! నాలుగు గుర్రాలు నడిపే బండీకి నువ్వు జట్కావాలావి కావాలి, అదిగో ఆ శ్రీకృష్ణుడి లాగా" అని బోధించింది ఆ తల్లి


ఆ 4గుర్రాల పేర్లు

*ధర్మ, అర్థ, కామ, మోక్షాలనీ*,

ఆ *బోధించే జట్కావాలా జగద్గురువైన శ్రీకృష్ణుడనీ* చెప్పింది.

"నువ్వు కూడా జగత్తుకి

ఈ నాలుగింటిని బోధించే గురువువి కావాలి, సరేనా!" అంటూ అతడిఆలోచనను మలుపు తిప్పింది.


ఆ బిడ్డడే పెద్దయ్యాక వివేకానందుడయ్యాడు.


పెంపకం అంటే అదీ!

పిల్లలు తెలియక తప్పు చేసినా,

తప్పు మాట్లాడినా

దానిని సరిదిద్దాల్సింది తల్లే!


*అందుకే అమ్మని తొలి గురువు, తొలి దైవం అంటారు.*


 *అమ్మ మాటలో ఎంతో మహత్తు వుంది కదా*


**సర్వేజనా సుఖినోభవంతు.**

🙏🙏🙏

తెల్లవారుజామున

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

అది 1976 నవంబర్ 11 వ తేదీ, న్యూఢిల్లీ ... 


తెల్లవారుజామున 5 గంటలకు టెలీఫోన్ మొగుతోంది, పక్క గదిలో ధ్యానం చేసుకుంటున్నాడు వైద్యనాథ్, అతని భార్య గౌరీ వెళ్లి ఫోన్ తీసుకుంది ...  


గౌరీ : హలో ఎవరు ?

అవుతలి వ్యక్తి : మేడమ్ !!! నేను పరమేశ్వర్ మాట్లాడుతున్నాను, అయ్యగారు ఉన్నారా ? 


గౌరీ : అయ్యగారు ధ్యానంలో ఉన్నారు పరమేశ్వర్, ఏమిటీ విషయం ఇంత పొద్దున్నే ఫోన్ చేశావ్ ? 

పరమేశ్వర్ : సరే అమ్మా, అర్జంట్ గా అయ్యగారితో మాట్లాడాలి, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ... 


గౌరీ : సరే ఆయన రాగానే చెబుతాను, ఆయనతో మాట్లాడు

పరమేశ్వర్ : అలాగే అమ్మ ... 


ధ్యానం అయిపోయాక గౌరీ పరమేశ్వర్ ఫోను చేసిన విషయం చెప్పింది. వైద్యనాథ్ పరమేశ్వర్ తో మాట్లాడి హుటాహుటిన రామేశ్వరం ప్రయాణమయ్యాడు ...


గౌరీ : ఏమిటండీ ఈ పరుగులు, అంత అర్జంట్ ఏమిటీ అని అడిగింది.

 

రామేశ్వరంలో ఒక రోగికి అత్యవసర చికిత్స చేయాలి, సమయం తక్కువగా ఉంది, వెంటనే వెళ్లకపోతే ప్రాణానికే ప్రమాదం అంటూ, ఆ వైద్యానికి కావలసిన పరికరాలు ఒక పెద్ద సూట్ కేసులో సర్దుకుని బయల్దేరాడు. 


రామేశ్వరమా !!! అయితే సముద్ర స్నానం చేసి, స్వామి వారి దర్శనానికి కూడా వెళ్ళిరండి అనింది గౌరీ. చూడు నాకు దేవుని మీద నమ్మకం లేదు అని తెలుసు కదా, ఇలాంటివి నాకు చెప్పకు అన్నాడు చిరాగ్గా.


ఇక ఏమి చెప్పాలో తెలియక ఊరుకుంది గౌరీ, నిజానికి వైద్యనాథ్ నాస్తికుడు. తన తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడం వల్ల, మేనమామ దగ్గర పెరిగాడు, తన తల్లిదండ్రులను అంత చిన్న వయసులోనే దూరం చేసాడనే దేవుడంటే కోపం. దానికి తోడు చిన్నప్పటినుండీ తన మేనమామ కూడా నాస్తికత్వం నూరిపోసాడు. 


నేను వెళ్ళి రెండురోజుల్లో వచ్చేస్తాను అంటూ, టెలిఫోన్ ద్వారా రెండు విమాన టికెట్లు రానూ పోనూ బుక్ చేసాడు. ఆయనతో పాటుగా కాంపౌండర్ ను కూడా తీసుకెళ్లాడు వైద్యనాథ్, రమేశ్వరానికి నేరుగా విమాన సౌకర్యం లేదు, మధురైకి వెళ్లి అక్కడి నుండీ 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. సాయంత్రం 6 గంటలలోపు చేరుకోవాలి.


 మధ్యాహ్నం 3:30 గంటలకు మధురై చేరారు. అక్కడ వారికోసం ఒక కారు సిద్ధంగా ఉంది. ఆ కారు డ్రైవర్, ఢిల్లీ నుండీ వచ్చిన డాక్టర్ విద్యానాథ్ మీరేనా అని అడిగాడు, అవును నేనే అని సమాధానం చెప్పాడు వైద్యనాథ్. మీకోసం రామేశ్వరం నుండీ కారు పంపించారు డాక్టర్ సుందరేశ్ అన్నాడు ఆ డ్రైవర్. 

డాక్టర్ సుందరేశా, ఆయనెవరో నాకు తెలియదే అనుకున్నాడు మనసులో కానీ రామేశ్వరంలో ఇంచార్జ్ అయ్యుంటాడులే అని సమాధానపడి, సరే వెళదాం పదా అన్నాడు వైద్యనాథ్.


 వాళ్ళు కారు ఎక్కుతుండగా, ఒక వృద్ధుడు వారి దగ్గరకు వచ్చాడు. ఆయన ఒంటి నిండా విభూతి రేఖలు, మేడలో రుద్రాక్షలు, జడలు కట్టిన జుట్టు, చిల్లులు పడిన పాత మాసిన పంచ కట్టుకుని, చేతి కర్ర సాయంతో వారి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఆయన ఎవరో బిక్షకుడు అనుకుని రెండు రూపాయలు ఇవ్వబోయాడు వైద్యనాథ్, " నాకు వద్దు ఏమీ నాయనా, గౌరీ ఎలా ఉంది " అని అడిగాడు ఆ వృద్ధుడు. 


గౌరీ వాళ్ళ పూర్వీకులది మధురైయ్యే కానీ ఈయన్ని ఎప్పుడూ చూసిన గుర్తులేదు. " క్షమించండి, మీరు భిక్షకు వచ్చారేమోనని అలా ప్రవర్తించాను, మిమ్మల్ని ఎప్పుడూ చూసిన గుర్తులేదు, మీ పేరు ? " అని అడిగాడు వైద్యనాథ్. 


" నేను మిమ్మల్ని ఎరుగుదును, నేను భిక్షకుడినే, నా పేరు ఏమని చెప్పను, ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తారు, ఇప్పుడే గౌరీ పెట్టిన బొబ్బట్లు తిన్నాను, అన్నాడు ఆ వృద్ధుడు. అది వినగానే ఈయనెవరో మతిస్థిమితం లేనివాడు అనుకున్నాడు వైద్యనాథ్. ఆయనతో మాట్లాడుతూ సమయం వృధా చేయడం ఇష్టంలేక వైద్యనాథ్ సతమతమవుతూ చూస్తున్నాడు, నీకు సమయం అవుతున్నట్లుంది, ఇందా ఇది తీసుకుని వెళ్ళి ముత్తులక్ష్మికివ్వు, కుమార్ కి నయమవుతుందని ధైర్యం చెప్పు అంటూ ఒక చిన్న పొట్లం వైద్యనాథ్ చేతిలో పెట్టి, బయలేదరండి అని డ్రైవర్ తో అన్నాడు . 


వారు మధురై నుండీ బయలుదేరిన కాసేపటికే ఆకాశం మేఘావృతమై ఉంది, స్వాతంత్రం 4 గంటలకే నల్లని మేఘాల వల్ల చిమ్మ చీకటి ఆవరించింది, చెవులు చిల్లులు పడేలా ఉరుములు, కళ్ళు మిరిమిట్లు గలిగేలా మెరుపులు, కొండలను కొట్టుకుపోయేలా గాలులు, వీటి మధ్య ప్రయాణం మొదలయింది. ఉన్నట్లుంది కుండపోతగా వానా కురవడం మొదలయ్యాయి. త్వరగా చేరుకోవాలని వేగంగా వెళుతోంది కారు. వారికి ఒక 100 మీటర్ల దూరంలో ఒక చెట్టు మీద పిడుగు పడి అది నిలువునా చీలిపోయి కాలిపోతూ రోడ్డు మీద అడ్డంగా పడిపోయింది.


ఉన్నఫళాన కారు ఆపే సరికి, ఆ వేగం వలన తడి రోడ్డు మీద కారు ఒక పది మీటర్లు జారుతూ వెళ్లి నిలిచింది. అందరి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. కొద్ది సేపట్లోనే తేరుకున్నారు, సమయం దగ్గర పడుతోంది, వేరే దారి ఏదైనా ఉందా అని డ్రైవర్ ని అడిగాడు వైద్యనాథ్, వెనక్కు తిరిగి ఒక 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే, ఒక చిన్న దారి వస్తుంది కానీ అది అంత సౌకర్యంగా ఉండదు, పైగా వర్షం కదా, బురదగా ఉంటుంది, టైర్లు బురదలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది అని చెప్పాడు డ్రైవర్.


మనకు వేరే దారి లేదు కదా, ఆ దారిలోనే వెళదాం, సమయం లేదు అన్నాడు వైద్యనాథ్. సరే మీ ఇష్టం సర్ అంటూ డ్రైవర్ కారును వెనక్కి తిప్పి ఆ ఇరుకు మార్గంలో ప్రయాణం కొనసాగించాడు. మట్టి రోడ్డు కావడం వలన నిదానంగా వెళుతున్నారు. అలా కాస్త దూరం వెళ్ళాక వారి దారికి అడ్డుగా ఒక వాగు పొంగి పోర్లుతోంది. 


ఇక ఎటూ పోలేని పరిస్థితి, అన్ని దారులూ మూసుకుపోయాయి, ఇప్పుడెలా అని ఆలోచిస్తున్నారు. సర్, ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయం వెళ్ళడం మంచిది, కొద్ది దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది, అక్కడకు వెళ్ళి తలదాచుకుందాం, ఇక్కడ క్రూర మృగాలు సంచరిస్తుంటాయి అన్నాడు డ్రైవర్. 


సరే, ఇక చేసేదేముంది అని తలూపుతూ, చీకటి, పైగా వర్షం, వీధి దీపాలు కూడా లేవు, ఎవరింటికి వెళ్ళి తలుపు తట్టాలన్నా ఇంత రాత్రి సమయంలో కొత్తవారిని ఆదరిస్తారో లేదో అన్నాడు వైద్యనాథ్. మీరు చెప్పింది నిజమే కానీ ఇలాంటి పరిస్థితులలో ఈ అడవిలో ఉండడం కంటే ఆ ఊరి దగ్గర ఉంటే మంచిది కదా అన్నాడు డ్రైవర్. సరే పద అన్నాడు వైద్యనాథ్.


ఆ డ్రైవర్ చెప్పిన పల్లెకు చేరేసరికి రాత్రి 8 గంటలయ్యింది. హోరున వాన, పట్టుమని పదిళ్ళు కూడా లేవు, నిర్మానుష్యంగా ఉంది. కారు వచ్చిన దగ్గర నుండీ ఆ ఊరిలోని కుక్కలు అరవడం మొదలుపెట్టాయి. వర్షం తగ్గేంతవరకూ వేచి ఉండడమే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితి. అందరికీ చాలా ఆకలిగా ఉంది. 


అలా ఒక అరగంట పాటూ కారులోనే ఉన్నారు వాళ్ళు, అప్పుడు  ఒక లాంతరు పట్టుకుని, గొడుగు అడ్డుపెట్టుకుని, వాళ్ళ కారు వైపుకు ఎవరో వస్తున్నట్లు అనిపించింది. వస్తున్నదెవరో సరిగ్గా కనిపించడం లేదు. సర్ తొందరపడి తలుపు తీయకండి, ముందు చూద్దాం ఎవరో ఏంటో అని చెప్పాడు డ్రైవర్. సరే అన్నాడు వైద్యనాథ్, ఎంత ప్రయత్నించినా ఆ కారు అద్దాల మీద నుండీ వర్షపు చినుకులు కారుతుండడం వల్ల ఆ వస్తున్న మనిషిని చూడలేకపోతున్నారు. ఆ వ్యక్తి వాళ్ళ కారు కిటికీ వైపుకు వచ్చి, అద్దం మీద తట్టాడు.


నిదానంగా కిటికీ అద్దం కిందకు దించాడు వైద్యనాథ్, ఎవరో ఒక ముసాలివిడ నిలబడి ఉంది, ఎవరు బాబు మీరు, ఇందాకటినుండీ చూస్తున్నా, దారి తప్పిపోయారా అని అడిగింది. ఆవిడను చూసాక కాస్త ధైర్యం వచ్చింది వారికి, అవును అవ్వా మేము రామేశ్వరం వెళ్ళాలి వర్షం వల్ల వాగు పొంగుతోంది అందుకే ఇక్కడ ఉన్నాము అన్నాడు డ్రైవర్. సరే మా ఇంటికి రండి నాయనా, రాత్రికి ఉండి రేపు పొద్దున్న వెళ్ళచ్చు అన్నది. హమ్మయ్య !!! అనుకుని ఆవిడ వెనుకే వాళ్ళింటికి వెళ్ళారు ముగ్గురూ ... 


ఆ వర్షంలో పూర్తిగా తడిసిపోతూ ఆ ముసలవ్వ ఇంటికి చేరారు ముగ్గురూ. ఇందా ఈ తువాలుతో తలలు తుడుచుకుని, ఈ పంచలు కట్టుకోండి అని మూడు పాత పంచలు ఇచ్చింది ఆ ముసలవ్వ. రెండు గదులున్న పూరి పాక అది. అవి కట్టుకుని కూర్చున్నారు. ఎప్పుడు తిన్నారో ఏంటో, కాస్త వేడిగా ఈ రాగి జావ జాగి తాగి, ఈ జొన్న రొట్టెలు తినండి అంటూ మూడు కంచాల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరపకాయలు, కాస్త ఉప్పు, జొన్న రొట్టెలు పెట్టిచ్చింది. వైద్యనాథ్ కి ఆ పదార్ధాలు అమృతంలా అనిపించాయి. అవి తిని తమ ఆకలి తీర్చుకున్నారు. మీరు ఇక్కడే పడుకోండి అని చెప్పి మూడు చాపలు, దుప్పట్లు ఇచ్చింది.


 పాపం ఆ రోగికి ఎలా ఉందో ఏమిటో, సమయానికి చేరుకోలేకపోయాను అంటూ కాస్త బాధపడి, అయినా నా చేతుల్లో ఏముంది అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు వైద్యనాథ్. 

 

నీకోసం కనీసం ఒక్క రొట్టైనా ఉంచుకోవచ్చు కదమ్మా, ఇలా పస్తుంటే ఎలాగ, అసలే నీ ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే కదా, అని ఎవరో అనగానే, నాకేమీ కాదులేరా, మనం ఎదుటివారి ఆకలి తీరిస్తే, మన ఆకలి ఆ భగవంతుడే తీరుస్తాడు అని ఆ ముసలవ్వ వినిపించింది. ఆ తీరుస్తాడు, తీరుస్తాడు మరి రాత్రంతా నీ ఆకలి ఎందుకు తీర్చలేదు అన్నాడు మళ్ళీ. తనకు మెలకువ వచ్చినప్పటి నుండీ ఈ సంభాషణ వింటునే ఉన్నాడు వైద్యనాథ్. లేచి వెళ్ళి ఆ వచ్చిందెవరో చూసాడు. 


ఆ ముసలమ్మ కొడుకు షుమారు 45 సంవత్సరాల వయసుంటుంది. వాళిద్దరూ ఆరుబయట కుర్చుని మాట్లాడుకుంటున్నారు, వైద్యనాథ్ ను చూస్తూనే రండి అని పలకరించాడు ఆ వ్యక్తి. వీడు నా కొడుకు కార్తీక్ అని పరిచయం చేసింది ఆ ముసలవ్వ. అవునా మంచిది అంటూ నవ్వుతూ పలకరించాడు విశ్వనాథ్. ఏవిటి ఇందాకటినుండీ ఏదో మాట్లాడుతున్నారు ఆని అడిగాడు వైద్యనాథ్.


ఏమీ లేదులే బాబు, నువ్వు మొహం కడుక్కొని రా జావ తాగుదువు గానీ అన్నది ఆవిడ. సరే అని వెనక్కి తిరిగి చూడగానే గోడకానుకుని ఒక ఆవిడ కూర్చుని ఉంది, ఆమె ఒడిలో తల పెట్టుకుని 11 సంవత్సరాల బిడ్డ పడుకొని ఉన్నాడు. వైద్యనాథ్ ను చూస్తూనే నమస్కారం పెట్టింది, తను కూడా నమస్కారం పెట్టి మొహం కడుక్కుని ఇంట్లోకి వెళ్ళాడు వైద్యనాథ్. తనకు వేడి వేడి జావ ఒక చెంబులో ఇస్తూ ఇక్కడ కాఫీ టీ దొరకవు బాబు అని చెప్పింది. అయ్యో పరవాలేదు అవ్వ అన్నాడు వైద్యనాథ్. 


 వాళ్ళు నా కోడలు, మనవడు అని పరిచయం చేసింది ముసలవ్వ. వైద్యనాథ్ ఆ రెండవ గదిలోకి తోని చూసాడు, మొత్తం పేడ నీళ్ళతో తడిసిపోయుంది. అవ్వా ఈ గదంతా ఇలా తడిసిపోతే నువ్వెక్కడ పడుకున్నావ్ అని అడిగాడు, మాకిది అలవాటేలే బాబు, ఇక్కడే పడుకున్నాను అనింది. అక్కడ ఎవరూ నిద్రపోలేరు అలా ఉంది ఆ గదిలో పరిస్థితి, రాత్రి నువ్వు రొట్టెలు తినలేదా అవ్వా అని అడిగాడు వైద్యనాథ్, ఆ తిన్నాను బాబు అంటుండగానే ఇంతలో వాళ్ళబ్బాయి కార్తీక్ అప్పుడే లోపలికి వస్తూ లేదు సర్, తనకోసం మేము చేసి పెట్టి వెళ్ళినవి మీకిచ్చి, తను పస్తుంది, పైగా తనకు చెక్కర వ్యాధి కూడా ఉంది అన్నాడు, ఈ వయసులో ఇంకా ఉపవాసాలు, పస్తులు ఉంటుంది అన్నాడు. వైద్యనాథ్ గుండె ద్రవించింది, ఆవిడ త్యాగం శ్లాఘనీయం అనిపించింది. ఎంత గొప్ప మనసు ఈవిడది అనుకున్నాడు. రాత్రంతా పస్తుంది, నిద్ర కూడా లేదు, ముక్కూ మొహం తెలియని వారికోసం ఇంత త్యాగం ఎలా చేసావు, ఎంత గొప్ప మనసు అవ్వా నీది అంటుండగా బయటకి నుండీ ఒక కేక వినిపించింది.


పరుగున వెళ్ళారు అవ్వా, కార్తీక్. వైద్యనాథ్ కూడా వెళ్ళి చూచాడు. వాళ్ళ మనవడు గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఏమయ్యింది అన్నాడు వైద్యనాథ్, ఏదో జబ్బు చేసింది నా మనవడికి, పట్నంలో పెద్దాసుపత్రిలో చూపిస్తున్నాం, దానికి ఎంతో కర్చవుతుందట పైగా దీన్ని నయం చేసే వైద్యుడు కూడా ఇక్కడ లేడు అంటున్నారు అని చెప్పాడు కార్తీక్. ఏదీ తన రిపోర్ట్లు ఉంటే ఇవ్వండి అన్నాడు విశ్వనాథ్, అది చూసి ఆశ్చర్యపోయాడు.


తను రామేశ్వరంలో ఏ జబ్బుకైతే ఆపరేషన్ చేయాలని వచ్చాడో అవే లక్షణాలు ఉన్న ఈ అబ్బాయిని చూసాడు. మాకోసం ఇంత సహాయం చేసిన వీరికోసం ఈ మాత్రం చేయడం నా కనీస ధర్మం అనిపించింది విశ్వనాథ్ కి. అవ్వా నేను డాక్టర్ ని, మీ మనవడికి వెంటనే ఆపరేషన్ చేయాలి అన్నాడు వైద్యనాథ్. ఎంత కర్చవుతుంది అన్నాడు కార్తీక్, వాటి గురించి ఆలోచించకండి, నా దగ్గర ఆపరేషన్ కి కావలసిన పరికారాలు సిద్ధంగా ఉన్నాయి, కొన్ని మీరు ఇంట్లో ఉండేవే సమకూరిస్తే ఇప్పుడే చేస్తాను అన్నాడు. ఆ మాటలు వినగానే ఆ అవ్వ కళ్ళలో నీళ్ళు మొదలయ్యాయి. 


వెంటనే వైద్యనాథ్ అడిగినవన్నీ సమకూర్చారు, కాంపౌండర్ సహాయంతో వాళ్ళ మనవడికి ఆపరేషన్ చేసాడు. మీ మనవడికి నయమవుతుంది, భయపడాల్సిన పని లేదు ఈ మందులు వాడితే చాలు, పది రోజుల తరువాత కుట్లు ఊడిపోతాయి అన్నాడు వైద్యనాథ్, కృతజ్ఞతతో వైద్యనాథ్ కాళ్ళ మీద పడ్డారు కార్తీక్, అతని భార్య. మీరు దేవుడిలా వచ్చారు సర్, మీ ఋణం తీర్చుకోలేము అన్నాడు కార్తీక్. అలాంటిదేమీ లేదు అని చెప్పి, భోంచేసి త్వర త్వరగా రామేశ్వరం బయలుదేరారు. అక్కడకు చేరి, ఆసుపత్రిలో విచారిస్తే అసలు అలాంటి జబ్బుతో అక్కడ ఎవరూ లేరు అని చెప్పారు వాళ్ళు. ఆశ్చర్యపోయాడు వైద్యనాథ్. మరి డాక్టర్ సుందరేశ్ పంపించారని చెప్పి, మధురైకి కారు ఎవరు పంపించారు అని అడిగాడు వైద్యనాథ్. అసలు ఇక్కడ సుందరేశ్ అనే పేరుతో ఏ డాక్టరూ లేరు, మేమేకారూ పంపలేదు, ఏదీ చూద్దాం పదండీ అన్నారు అక్కడి సిబ్బంది. 


బయటకు వెళ్ళి చూసేసరికి అక్కడ ఏ కారూ లేదు, ఆశ్చర్యపోయారు వైద్యనాథ్ , కాంపౌండర్. అంతా విచిత్రంగా ఉంది అనుకుంటుండగా మధురైలో కనిపించిన వృద్ధుడే కాస్త దూరంలో కనిపించాడు వైద్యనాథ్ కి. వెంటనే ఆయన దగ్గరకు పరిగెత్తాడు వైద్యనాథ్ కానీ అంతలోనే ఆయన అదృశ్యమయ్యాడు. అప్పుడు వైద్యనాథ్ కి ఆ వృద్ధుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి, వెంటనే ఒక కారు మాట్లాడుకుని మళ్ళీ ఆ పల్లెటూరికి వెళ్ళాడు. అక్కడ ఆ ముసలవ్వను చూస్తూనే, మీ పేరేమిటి అని అడిగాడు, ముత్తులక్ష్మీ బాబు అనింది. నీ మనవడి పేరు కుమార్ కదూ అన్నాడు, అవును బాబు అనింది ఆ ముసలవ్వ.


 ఇక చేసేది లేక తిరుగు ప్రయాణం అయ్యాడు, అప్పుడు తనకు ఒక విషయం గుర్తొచ్చింది, ఆ ముసలవ్వ మనవాడి పేరు రిపోర్ట్ లో కుమార్ అని ఉంది. వెంటనే ఆ పల్లెటూరికి వెళ్ళారు వాళ్ళు, మళ్ళీ వీళ్ళను చూస్తూనే ఎంతో సంతోషించింది ఆ అవ్వ. నీ పేరేంటి అవ్వ అని అడిగాడు వైద్యనాథ్. ముత్తులక్ష్మీ బాబు అన్నది. అప్పుడు అర్ధమయ్యింది ఆ ముసలాయన ఇచ్చిన పొట్లం వీరికోసమే అని, తన బాగు లోనుండీ తీసి అది ఆవిడకు ఇచ్చాడు. మొదటిసారిగా ఒళ్ళు పులకరించింది వైద్యనాథ్ కి, తనలోని నాస్తికత్వం పటాపంచాలయ్యింది, కళ్ళలో నీళ్ళు కారడం మొదలయ్యాయి. ఏవిటి బాబు ఏమయ్యింది, ఇవన్నీ ఎందుకడుగుతున్నారు అనడిగింది ఆ ముసలవ్వ. 


అవ్వా ! నువ్వెంత అదృష్టవంతురాలివి నీకోసం ఢిల్లీ నుండీ నన్ను రప్పించాడు ఆ దేవుడు అని జరిగినదంతా చెప్పి, తన బాగు లోనుండీ అ పొట్లం తీసి వణుకుతున్న చేతులతో ఆ ముసలవ్వకిచ్చాడు వైద్యనాథ్. అక్కడి వారందరికీ ఆ క్షణం భగవంతుని అనుగ్రహం వర్షిస్తున్నట్లనిపించింది. ఆనందబాష్పాలు రాలుతుంటే ఆవిడ అది తెరిచి చూసింది, అందులో కాస్త విభూతి, అక్షితలు ఉన్నాయి. ఆ ఇచ్చింది సుందరేశ్వరుడైన ఈశ్వరుడే, మా ఇంటి దేవుడు ఆయనే అని చెప్పి కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆ పొట్లాన్ని భక్తితో కళ్ళకద్దుకుని నుదుటిన పెట్టుకుని, అక్కడ ఉన్న అందరికీ పెట్టింది. వైద్యనాథ్ ఒళ్ళంతా పులకరించింది, వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ఢిల్లీ కి ప్రయాణమయ్యారు వైద్యనాథ్, కాంపౌండర్.


తను ఇంటికి చేరి జరిగిందంతా చెప్పాలనే ఆతృతతో ఉన్నాడు. తలుపు తీస్తూనే గౌరీ, నీకో విషయం చెప్పాలి ఇలారా అంటూ సోఫాలో కూర్చోబెట్టి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు, గౌరికి కూడా ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యింది. ఉండండి అంటూ లోపలికి వెళ్ళి ఒక కవర్ తెచ్చిచ్చింది. దాని మీద పేరు ఊరు లేదు, ఎక్కడి నుండీ వచ్చింది, ఎవరు పంపిందో తెలియదు, ఇదేక్కడిది అని అడిగాడు వైద్యనాథ్. మొన్న మీరు రామేశ్వరం వెళ్ళిన రోజున మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఒకాయన వచ్చారు, మీకు బాగా తెలుసునని చెప్పి మీకిమ్మని ఈ కవర్ ఇచ్చారు అని చెప్పింది. దానిని వెంటనే తీసి చూసాడు, అందులో పది వేల రూపాయలు, ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ తీసి చూస్తే అందులో మీనాక్షీ సుందరేశ్వరుల దివ్య ఆశీస్సులతో అని రాసుంది, అలానే ఆ దేవతా మూర్తుల చిత్రపటం చిన్నది ఒకటుంది. 


వైద్యనాథ్ వలవలా ఏడ్చేశాడు, స్వామి వారి అనుగ్రహం ఎంతని చెప్పగలం అంటూ, అది చూసి నివ్వెరపోయింది గౌరీ, మీరెంత అదృష్టవంతులండీ స్వామి మీతో మాట్లాడారు అని భర్త కాళ్ళ మీద పడి దణ్ణం పెట్టింది. 


 అప్పుడు వైద్యనాథ్, ఆయన వచ్చినప్పుడు తినడానికి బొబ్బట్లు  పెట్టావా అని అడిగాడు, అవునండీ అనింది గౌరీ, ఆయన నాకు మధురైలో నువ్వు బొబ్బట్లు పెట్టిన విషయం కూడా చెప్పాడు, అప్పుడు ఏదో పిచ్చి వాడు అనుకుని పట్టించుకోలేదు, ఆ మహాదేవుడ్ని గుర్తించలేకపోయాను అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. ఈ విషయం వినగానే గౌరి ఒళ్ళంతా వెయ్యి వాట్ల విద్యుత్తు ప్రవహించినట్లయ్యింది, తన ఇంటికి వచ్చి, తను పెట్టిన బొబ్బట్లు సాక్షాత్తూ ఆ ఈశ్వరుడే తిన్నాడంటే ఎంత అదృష్టం కదా, ఎన్నో జన్మల పుణ్యఫలం అది. స్వామి నీతోనూ మాట్లాడాడు, నువ్వు పెట్టిన నైవేద్యం తిన్నాడు అని చెప్పాడు వైద్యనాథ్. అది తలచుకుని ఆనందభాష్పాలు రాల్చింది గౌరీ.


సాధారణంగా అటువంటి ఆపరేషన్ కు 7 వేలు తీసుకుంటాడు వైద్యనాథ్, రాను పోనూ చార్జీలతో కలిపి పది వేల వరకూ అయ్యింది. అదే ఇలా ఇచ్చాడు అనిపించింది వైద్యనాథ్ కు. వెంటనే గౌరీ వైద్యనాథ్ లు మధురై వెళ్ళి, మీనాక్షీ సుందరేశ్వరులను దర్శించుకుని, మళ్ళీ ఆ పల్లెటూరికి వెళ్ళి కుమార్ కు ఎలా ఉందో కనుక్కుని, ఆ పది వేలు ఆ అవ్వకు ఇచ్చేసారు ...


చూసారా ఢిల్లీ ఎక్కడ, మధురై ఎక్కడ, ఆ పల్లెటూరు ఎక్కడ, రామేశ్వరం ఎక్కడ ... ఎవరిని ఎలా కలుపుతాడో, ఏ పావును ఎలా కదుపుతాడో ఆ ఈశ్వరునికే ఎరుక ... మా అమ్మమ్మ ఈ లీలను చెప్పడం అయ్యేసరికి అందరికీ ఆనందభాష్పాలు రాలడం మొదలయ్యింది, పిల్లలకు అన్నం తినిపించేప్పుడు ఇలాంటివి చెప్పడం వలన వాళ్లలో సత్వగుణం మేల్కొంటుంది, వారి తినే అన్నం కూడా పవిత్రమైన ప్రసాదమవుతుంది అని మా అమ్మమ్మ అంటుండేది, ఈ లీల జరిగిన కొన్ని సంవత్సరాలకు డాక్టర్ వైద్యనాథ్ వాళ్ళ కుటుంబం మధురై వచ్చి స్థిరపడ్డారట, వాళ్ళ బంధువులు చెన్నైలో మా అమ్మమ్మ గారి పక్కింట్లో ఉన్నప్పుడు చెప్పిన అనుభవం ఇది, ప్రస్తుతం వారి వివరాలు తెలియవు కానీ ఇటువంటి లీలలు ఎందరో భక్తుల జీవితాలలో నేటికీ జరుగుతూనే ఉన్నాయి, మన అదృష్టం కొద్దీ మనకు కూడా తెలుస్తుంటాయి, మరింత భక్తి శ్రద్ధ విశ్వాసాలు పెంపొందించుకుంటే మనకూ అనుభవమవుతూ ఉంటాయి.


🌺🍀🌹💦💐🌷🌻☘️

సర్వేజనా సుజనోభవంతు

సర్వే సుజనా సుఖినోభవంతు


అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

సేకరణ: ముఖ పుస్తకం.

రుద్రంలో భగశ్చమే

 రుద్రంలో భగశ్చమే యని భగము అనగా ఈశ శబ్ద చైతన్యమై పదార్ధ రూపం దాల్చి సృష్టి ధర్మ లక్షణములుగల క్షేత్రమని తెలిను. ఆ రూపం ధరణియై అమ్మ రూపంలో సృష్టి మూల కారణమై ప్రకాశవంతమగుచున్నది.లేనియెడల క్షేత్రము చైతన్యమవనియెడలఅటువంటి సృష్టి మూలమైన ప్రకృతి ధర్మం తెలియదు. దీనికి సూర్య శక్తి మూల కారణము. సూర్యకాంతి కూడా జీవ లక్షణమునే  తెలియుచున్నది. సూర్యకిరణాలు ప్రతీ రోజు వక డిగ్రీ మార్పు వలన కాంతి లక్షణము భూమిపై మార్పు కలుగుచున్నది. మూర్ఖపు పిడి వాదన వలన సత్యం మరుగున పడి అజ్ఞానం, ఆవహించును జీవకోటికి. ఆంగ్ల భాషకు యితర అన్ని భాషలకు మూలమైన సంస్కృతం మూలం. బ బి అనగా కొంత మాత్రమే అనగా దాని లక్షణం తెలియదు. మెటీరియలైజ్ అయి భ ప్రకాశవంతమైన దాని లక్షణము తెలియును.అదియును జీవ ఆవిర్భావ లక్షణము అనగా భూ అయినది.భూ శక్తి ః విసర్గగా మారి భూః ప్రణవం తో కలిసి అనగా ఆ ప్రాణశక్తి ఫల్గుణీయని అణువు మార్పు చెందుటను తెలుపుచున్నది. అదియును కేతు శక్తి యైన మఘ ఎమ్ అనే పంచభూతాత్మకమైన మెటిీరియల్స్ సముదాయం మాఘ మాస శక్తి లక్షణముగా (కాంతి) నక్షత్రం యెుక్క రూపమే తరువాత నక్షత్ర శక్తి ఫల్గుణీయని అనగా చైతన్య మైన కాంతి లక్షణము గా తెలియుచున్నది. యిదే ఓం ప్రణవంతో గూడిన వ్యాహృతమైన భూః యని తెలియుచున్నది.తెలియుట అనగా భువః యని రూఢిగా తెలియుట. అనగా అది సత్యమని తెలుయుచున్నది. ప్రకృతి రూపంలో గల సృష్టి సత్యం. కాని  లయం కూడా సత్యమే. తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

  

*శ్రీ చెక్కా కేశవులు గారి అనుభవం..*


*(పదవ రోజు)*


శ్రీ స్వామివారితో చెక్కా కేశవులు గారు, తమ మనసులోని కోరికను సందేహిస్తూనే బయటపెట్టారు..ఆ కోరిక వినగానే శ్రీ స్వామివారు ఫక్కున నవ్వారు..


తనకు అమ్మవారి దర్శనం చేయించమని శ్రీ స్వామివారిని కేశవులు గారు కోరారు..శ్రీ స్వామివారు.."అది అంత సులభంగా..అరచేతిలో చూపేది కాదనీ..గొప్ప గొప్ప సాధకులకే సాధ్యం కాని కోరికలు కోరకూడదనీ.." కేశవులు గారికి నచ్చచెప్పబోయారు..కానీ..కేశవులు గారు మాత్రం..తల్లి వద్ద పసిబిడ్డ మారాము చేసినట్టు, అదే పట్టు మీద ఉండిపోయారు..


శ్రీ స్వామివారు..."సరే!..నాయనా..ఇలారా..నాకెదురుగా పద్మాసనం వేసుకొని స్థిరచిత్తంతో కళ్ళు మూసుకొని కూర్చో..ఎటువంటి పరిస్థితుల లోనూ కళ్ళు తెరవకు!..జాగ్రత్త సుమా!.." అని హెచ్చరించి కేశవులు గారిని తమ కెదురుగా కూర్చోబెట్టుకున్నారు..కేశవులు గారు కళ్ళు మూసుకున్నారు..శ్రీ స్వామివారు కూడా పద్మాసనం వేసుకొని..కళ్ళుమూసుకొని..సమాధి స్థితి లోకి వెళ్లిపోయారు..కొద్దిసమయం గడిచేసరికి..కేశవులు గారికి, తన శరీరమంతా కంపించిపోతున్నట్టు..ఏదో వెలుగు తన శరీరమంతా క్రమ్ముకుంటునట్లూ..తాను గాలిలో తేలిపోతున్నట్లు..అనుభూతి కలుగసాగింది..ఏం జరుగుతుందో అర్ధం కాలేదు..ఒకరకమైన భయం మనసునిండా ఆవరించిపోయింది..తట్టుకోలేక కళ్ళు తెరిచారు..పార్వతీదేవి మఠం లేదు..స్వామివారు లేరు..నింగినుండి నేలదాకా.. ఎఱ్ఱని కాంతిపుంజాలు వ్యాపించి ఉన్నాయి..


"స్వామీ!..స్వామీ!.." అంటూ వెఱ్ఱి కేకలు పెట్టారు..తనెక్కడున్నాడో తెలీడం లేదు..ఏదో మాయ క్రమ్ముకొస్తోంది..కొద్దిసేపటికి ఆ కాంతిపుంజాలు మాయమయ్యాయి..శ్రీ స్వామివారు పద్మాసనం లో నిశ్చలంగా కూర్చుని నవ్వుతూ వున్నారు..


"ఏం కేశవులు గారూ..అమ్మ దర్శనం అయిందా?.." అన్నారు..కేశవులు గారు ఇంకా ఆ భ్రమలో నుంచి బైటపడలేదు..వళ్ళంతా చెమటలు పట్టి.. కంపిస్తోంది..


"లేదు స్వామీ..ఆ వెలుగు భరించలేకపోయాను.." అన్నారు..


"చూసావా నాయనా!..కొద్దిపాటి చిత్కళ నే భరించలేకపోయావే.. ఇక సంపూర్ణ దర్శనం అయితే తట్టుకొని ఈ భూమ్మీద వుండగలవా?..మహా మహా యోగులు ఎంతో సాధన చేసి..తపస్సు చేసి..ఒక స్థాయికి చేరిన తరువాతే..ఆ వెలుగును భరించగలరు..ఆ నమ్మకం వారికి కలిగాకే..వారు భగవంతుడి సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తారు..దైవ దర్శనం, యోగం, బ్రహ్మవిద్య అనేవి సులభసాధ్యాలైతే..ధనం తోనో..కానుకలతోనో..పొందేవి అయితే..ఈపాటికి ఈ భూమ్మీద ఎంతో మంది ధనవంతులు దేవీ దేవతల సాక్షాత్కారం పొంది..వారిని కూడా తమ ఇనప్పెట్టెలో దాచివుంచేవారు..దేనికైనా ఒక స్థాయి ఉంటుంది..గృహస్తు కర్తవ్యం గృహస్థు చేయాలి..సన్యాసి కర్మ..సన్యాసి చేయాలి..ఎవరికి నిర్దేశించిన మార్గం వారు అనుసరించాలి..నాలాటి వారికి ఈ యోగ సాధన అనువైనది..మేము ప్రలోభాలకు లొంగకూడదు..నా సౌకర్యాల కోసం నీవు తపించకు.." అని చెప్పారు..


కేశవులు గారికి ఆ క్షణమే శ్రీ స్వామివారు చేసిన బోధ బాగా హత్తుకున్నది.. ఆనాటి నుంచీ శ్రీ స్వామివారికి శిష్యుడిగా మారిపోయారు..తన కర్తవ్యమేమిటో చెప్పమని స్వామివారిని కోరారు..


"ఆ మాల్యాద్రి లక్ష్మీనృసింహుడి గర్భాలయాన్ని బాగుచేయించు!..భక్తులకు ఇబ్బందిగా ఉంది..పదిమందికి సేవ చేసినట్లుగా ఉంటుంది" అని శ్రీ స్వామివారు ఆజ్ఞాపించారు..తక్షణమే ఆ పని చేయిస్తానని..కాకుంటే ఒక్కసారి తన కోరికను మన్నించి, తన గృహాన్ని పావనం చేయమని ప్రాధేయపడ్డారు కేశవులు గారు..శ్రీ స్వామివారు సరే నని ఒప్పుకున్నారు..


ఆ తరువాత కొంతకాలానికి  విజయవాడ లోగల కేశవులు గారింటికీ శ్రీ స్వామివారు వెళ్లారు..అక్కడ కొంతకాలం వున్నారు..కేశవులు గారి తోడల్లుడు శ్రీ మెంటా మస్తాన్ రావు గారింట్లోనూ కొద్దిరోజులున్నారు స్వామివారు..శ్రీ స్వామివారు ఎక్కడున్నా తన సాధన మాత్రం ఖచ్చితంగా చేసేవారు..కేశవులు గారు, మస్తాన్ రావు గార్లు నాగార్జున సాగర్ సమీపంలో ఒకటిన్నర ఎకరా స్థలాన్ని శ్రీ స్వామివారి ఆశ్రమం కోసం ఇస్తామని తెలిపారు..వద్దు అని ఖచ్చితంగా చెప్పేసారు శ్రీ స్వామివారు.


శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నృసింహుడి గర్భాలయ మరమ్మత్తులు కేశవులు గారు మొదలుపెట్టారు..సరిగ్గా అప్పుడే శ్రీధరరావు గారితో పరిచయం ఏర్పడింది కేశవులు గారికి..శ్రీధరరావు గారితో శ్రీ స్వామివారి గురించిన మరెన్నో విశేషాలు కేశవులు గారు చెప్పుకొచ్చారు..ఇద్దరికీ శ్రీ స్వామివారి మూలంగా విడదీయరాని అనుబంధం ఏర్పడింది..


అలా శ్రీధరరావు గారు  శ్రీ స్వామివారి గురించి అన్ని వివరాలూ సేకరించారు...అందుకే..ప్రభావతి గారడిగినప్పుడు "అన్ని విషయాలూ నేను చెపుతాను ప్రభావతీ!.." అన్నారు...


శ్రీ స్వామివారి కోరిక....రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

సమర్పించిన

 వందేమాతరం


దత్తా అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది, త్రిమూర్తులు   సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది.


గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉంది.  ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ చేసినట్లు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.


ఆ ఆదిగురువు అవతారాలలో ఒకటైన  విశ్వాంబరావధూత   జననం  *చైత్ర పౌర్ణమితో కూడిన మంగళవారం*.‌ అటువంటి మహత్యము గల ఈరోజు శ్రీ దత్తాత్రేయుని జన్మ విశేషాలు, ఆయన షోడశ అవతారములు, వాటి విశేషాల గురించి శ్రీమతి పమ్మి శేషారత్నం గారు విపులంగా వివరించారు.


https://drive.google.com/file/d/1L2bdfWXbGU5qi9Q0TREEgtIJUZ4-uPf7/view?usp=drivesdk


ఇది భక్తులు అందరూ తప్పక విని శ్రీ దత్తాత్రేయుని అవతార విశేషాలు తెలుసుకోగలరని మనవి.


భవదీయుడు


దశిక ప్రభాకర శాస్త్రి

హనుమజ్జయంతి

 _*హనుమజ్జయంతి ఎప్పుడు జరుపుకోవాలి ? హనుమజ్జయంతి రోజు ఆంజనేయ స్తోత్రాలను స్తుతిస్తే ?*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


హనుమజ్జయంతి చైత్రంలోనా , వైశాఖంలోనా.. ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. అలాంటి వారు ఈ కథనం చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమజ్జయంతి చేసుకోవాలి. 


అయితే కొన్ని ఐతిహ్యాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమజ్జయంతిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. 

 

అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని జయంతి జరుపుకుంటారు. చైత్ర పూర్ణిమ నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున మళ్లీ హనుమజ్జయంతి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు. 

 

హనుమజ్జయంతిని వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. *"కలౌ పరాశర స్మృతి:"* అని శాస్త్రాలు చెప్తున్నాయి. 

 

*శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే* 

*పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే ||* అని చెప్పబడింది. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమజ్జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ చాలీసా , ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

fb నుండి సేకరించబడినది

మహాభారత తాత్పర్యము

మహాభారత తాత్పర్యము

ఇక్కడ ఉన్నదే ఎక్కడైనా ఉన్నది. ఎక్కడ లేనిది ఎక్కడా లేదు. అన్న వ్యాసుడి వాక్యం మహాభారతాన్ని స్థూలంగా వర్ణించేది. విశ్వమంతా వ్యాపించి ఉన్న ప్రతి అంశం దీనిలో నిక్షిప్తం కావడం వల్ల విశ్వం యొక్క తాత్పర్యం గ్రహించడం ఎంత కష్టమో, దీని తాత్పర్యం గ్రహించడం అంతే కష్టం. మహాభారత ఆరంభంలో రెండు చెట్లను వ్యాసుడు వర్ణించాడు. యుధిష్ఠిరుడనే ధర్మ వృక్షము, దుర్యోధనుడనే మన్యు వృక్షము ఈ గాథకి ప్రధాన ఆధారాలు. రెండు చెట్లు విడిగా వర్ణించడం వల్ల ఈ గాథంతా రెండు ప్రవాహాలుగా, సమాంతరంగా.. కొన్ని చోట్ల ఓతప్రోతంగా ప్రవహించినట్లు గ్రహించవచ్చు. మొత్తం గాథలో శంతనుడి కామ భావం, ఆధారంగా సత్యవతి వివాహం జరగడం భీష్ముడు రాజ్యత్యాగం చేయడం ఈ కథకు ఆధార బిందువు. అయితే, భీష్ముడి వంటి దైవాంశ సంభూతుడు, ఆద్యంతము వ్యాపించి ఉండటము, అతడు సమర సందర్భంలో ధర్మ పక్షంలో కాకుండా అధర్మ పక్షంలో నిలిచి పోవడం ఒక విలక్షణమైన విరోధాభాస. పతితమైన బ్రాహ్మణ్యం శస్త్రాన్ని ధరించడం ద్రోణుడి పాత్రలో వ్యక్తమైతే, ఆతడు ప్రతీకార వాంఛతో ద్రుపదుణ్ణి పరాభవించటం, ఏకలవు్యడి నుంచి గురుదక్షిణగా అంగుష్ఠాన్ని యాచించడం, మొత్తం యుద్ధంలో పాండవులకు వ్యతిరేకంగా ప్రవర్తించటం ఒక విచిత్రమైన సన్నివేశం. అంతేకాక ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ ఎప్పుడూ ధర్మ చైతన్యంతో సంబంధం లేకుండా అసూయతో జీవించటం, యుద్ధాంతంలో అపాండవం కరిష్యామి అని చనిపోతున్న దుర్యోధనుడికి వాగ్దానం చేసి నిద్రితులైన ఉప పాండవులను సంహరించటం, గర్భస్థుడైన ఉత్తరాసుతుణ్ణి సంహరించటానికి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించటం ఒక పిశాచావేశం లాగా గోచరిస్తుంది. అర్జునుడితో పాటు తాను రుద్ర ఆరాధకుడైనా, రుద్రుడి లోని ఆనుకూల్యాంశం ఇతణ్ణి ఎప్పుడూ ఆవేశించలేదు.

ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం లేకపోవడం, పాండురాజు దిగ్విజయాలు సాధించి అతని చేత నూరు అశ్వమేధాలు చేయించినా, చివరకు అరణ్యవాసంలో శాపగ్రస్తుడై మరణించటం వల్ల ధృతరాష్ట్రుడు, రాజు కావడం సంభవించింది. రాజ్యాధికారం కలిగిన గుడ్డివాడు, అతని ప్రవృత్తి అంతా అంతర్బహిర్చేతనలలో వైరుధ్యంతో పుత్ర మమకారం వల్ల పాండవుల యందు పెంచుకున్న అప్రీతి వల్ల ఒక నాటకంగా జీవితం గడపడం జరిగింది. మహా భారతానికి మొత్తం నాయకుడైన ధర్మరాజు ద్యూత వ్యసనం వల్ల ద్రౌపది దయ వల్ల కలిగిన రాజ్యం కూడా పోగొట్టుకోవడం అరణ్యవాస, అజ్ఞాత వాసములు చేయవలసి వచ్చింది. ధర్మరాజులో ఎంత మెత్తదనం ఉన్నదో అంతటి ప్రతీకారేచ్ఛ కూడా ఉన్నట్టు అది గడుసుదనం వల్ల చప్పబడినట్లు యుద్ధ పర్వాల్లో గోచరమవుతుంది. దుర్యోధనుడు క్రోధము, అసూయ ఈ రెండు లక్షణాలు మూర్తీభవించినవాడు. తనకు జన్మతః సంక్రమించని రాజ్యాధికారాన్ని పొంది దాన్ని ఇతరులతో పంచుకునే ఉద్దేశం లేకుండా దురాశ వల్ల పాండవులను చిన్ననాటి నుంచి ప్రతీకారేచ్ఛతో రూపుమాపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ విషయంలో అతడు చేయని దుష్కార్యం, పాపము మరెక్కడా లేదు. దుశ్శాసనుడు కేవలం సేవాధర్మం కలిగిన వాడే తప్ప అతని స్వతంత్రించి చేసిన కార్యమంటూ ఏమీ లేదు. ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో కర్ణుడు ప్రవర్తించిన తీరు సజ్జనులకెవరికైనా సిగ్గు తెప్పించేదే. దుర్యోధనుని వస్త్రాపహరణాది దుష్కార్యాలకు ప్రేరేపించి తన దుష్టమైన వాక్కుల చేత భారతానికే కళంకం ఆపాదించినాడు. అతని లోని ధర్మవేతృత, దానుగుణం, పరాక్రమము, మిగిలిన గుణాలన్నీ ఈ ఒక్క దోషంతో తుడుచుకుపెట్టుకు పోతున్నవి.

అసలు విచిత్ర వీర్యుడు చనిపోయిన తరువాత సత్యవతి ప్రార్థననుసరించి భీష్ముడే రాజ్యాన్ని గ్రహిస్తే, చరిత్ర మరొకరకంగా ఉండేది. ఆతడు రాజు కాకున్నా, కాశీరాజు సభలో ఆతని పుత్రికలను బలవంతంగా తీసుకువచ్చినప్పుడు తరువాత అంబను విడిచిపుచ్చడం, ఆమె తిరిగి రాగా స్వీకరించకపోవడం ఆ పట్టుదలను నిలుపుకోవడం కోసం గురువుతో కూడా పోరాడటం, అనేక సందేహాలకు ధర్మ వైరుధ్యాలకు తార్కాణమైన అంశం. యుద్ధం తరువాత అంపశయ్య మీద నుంచి ధర్మరాజుకు ఉపదేశం చేయడం తాను అంతకు ముందు ఆచరించిన దోషాలను తొలగించుకోవడం కోసం చేసిన ప్రాయశ్చిత్త కర్మగా కనిపిస్తుంది. అతని లోని కృష్ణ భక్తి తత్త్వ జ్ఞానం, ఇవేవీ అంపశయ్య మీదకు చేరేదాకా పనిచేసినట్టు లేవు. భీష్ముడు వసు రుద్రాదిత్యులలో వసువులు భూ చైతన్యానికి చెందిన వారు. అందువల్లనే శరీరాన్ని పోషించిన కౌరవుల యెడ ఆతడు కృతజ్ఞుడై ఉండటం జరిగి ఉండవచ్చు.

మహాభారతంలో ప్రధానంగా మూడు యజ్ఞాలు, కనిపిస్తుంటాయి. సర్పయాగము, రాజసూయం, అశ్వమేథం. సర్పయాగం ప్రతీకార బుద్ధితో ఒక వ్యక్తి చేసిన దోషానికి ఒక జాతిని సంహరించే కార్యం. అంతకు ముందు భార్గవ రాముడు క్షత్రియుల విషయంలో ఇదే పని చేశాడు. ఈ ప్రతీకార బుద్ధి వల్ల సత్వరజస్సులు అణగి తమోగుణం ఆవరిస్తుంది. భారత ఆరంభం ప్రవేశ ద్వారం ఈ తమస్సు చేత నిర్మింపబడ్డది. రాజసూయం రజో గుణ ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది. ధర్మరాజు చక్రవర్తిగా అభిషేకింపబడటం దీని లక్ష్యం. దీని కోసం అతని తము్మలు నిర్వహించిన విజయయాత్రలు హింస లేనివని జన నష్టం లేనివని చెప్పడానికి అవకాశం లేదు. ధర్మరాజు యుద్ధానంతరం చేసిన రాజసూయం ఒక చక్రవర్తి చేయగలిగిన కార్యం. దీన్ని నిర్వహించినప్పుడు ఆ యాగంలో చేయబడే సర్వ త్యాగ లక్షణం చేత అది సత్వమయంగా నిర్వహింపబడి ఉండవచ్చు.

మహాభారతంలో మూడు ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. ఒకటి, సనత్సుజాతీయము, రెండు భగవద్గీత, మూడు విష్ణు సహస్రనామము. సనత్సుజాతీయములో మృత్యువు యొక్క స్వరూపము చెప్పబడింది. మృత్యువంటే ప్రమాదము, ఏమరుపాటు. ఏమరుపాటు లేనివానికి సదా బ్రహ్మచైతన్యంలో నిలిచి ఉండేవానికి మృత్యువు అనేది ఉండదు. మనం అనుకునే మృత్యువు దేహముల యందు మాత్రమే. జాగ్రదవస్థలో నిలిచి ఉండేవాడు నిత్య జన్మ జన్మాంతరాలలో చైతన్య ధార తెగకుండా ఉండటం వల్ల మృత్యు అనుభవాన్ని పొందనే పొందడు. అట్లాగే భగవద్గీత కూడా మృత్యు తత్వాన్నే ప్రధానంగా ప్రస్తావించింది. ``కాలోస్మి లోకక్షయకృత్‌ ప్రవృద్ధః'' నేను మృత్యు స్వరూపాన్ని లోకాన్ని నశింపజేయడం కోసమే ప్రవర్తిస్తున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ జీవితమంతా మృత్యుముఖంగా పయనించడమే దీని యథార్థ తత్త్వం. ఈ మృత్యు రహస్యాన్ని చెప్పడం కోసం కథాగతంగా నడుమ సావిత్రి ఉపాఖ్యానాన్ని వ్యాస మహర్షి ప్రపంచించడం జరిగింది. మృత్యువును తరించే లక్షణము ఈ గాథ ఉపనిషత్‌ సంప్రదాయం ప్రకారం నిర్వహించవలసిన యోగ రహస్యాన్ని చెప్పడం కోసం తెల్పబడింది. విష్ణు సహస్రనామము కూడా విశ్వం అనే శబ్దంతో ప్రారంభమై సర్వప్రహరణాయుధ శబ్దంతో పూర్తయి సృష్టి అంతా మృత్యుతీరానికి చేరుతున్న అంశాన్ని తెలియజేస్తుంది. అందువల్లనే మహాభారతానికి మృత్యువు పుత్రుడైన ధర్మరాజు నాయకత్వం వహిస్తున్నాడు. మొత్తం మహాభారతం సర్పయాగం నుంచి స్వర్గారోహణం దాకా మృత్యుహేలయై ప్రవర్తించింది. పాండవులందరూ మృత్యు పుత్రుడు తప్ప చివరకి మృతి చెందారు. అతని స్వర్గారోహణం కూడా నరక దర్శనం చేత మృత్యు తత్తా్వన్ని మరల మరల గుర్తు చేస్తుంది. అతని వెంట నడిచి వచ్చిన ధర్మరూపమైన శునకం కూడా మృత్యువునకు ప్రతీకయే కావచ్చును.

ఈ మొత్తం ఇతిహాసానికి కేంద్ర బిందువైన ద్రౌపది అగ్ని సంభూత. ఈ అగ్ని పంచభూతాలలో కేంద్ర స్థానంలో నిల్చి ఉంటుంది. పంచభూతాలు పంచపాండవులైతే, అగ్ని పార్థుడవుతాడు. ఈ పార్థుడు నరనారాయణులలోని నరుడనే తపస్వి. ఈ మృత్యుక్రీడ కోసం లోకంలో తమోమయ, రజోమయ శక్తులను తొలగించివేయడం కోసం అర్జునుడుగా ఈతడు అవతరించి లయకారకుడైన శివుని వరాన్ని పొంది కురుపాండవ యుద్ధాన్ని మొత్తం నిర్వహించాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ మొత్తం ఇతిహాస ప్రవర్తనలో ఎక్కడా ప్రత్యక్షంగా జోక్యం కలిగించుకోలేదు. ఒక్క ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో మాత్రమే ఆయన వస్త్రప్రదానం చేసి ఆమెను రక్షించడం ద్వారా సర్వ జగత్‌ ప్రవృత్తికి మూలమైన స్త్రీత్వాన్ని చెదరకుండా కాపాడటం జరిగింది. మిగిలిన అన్ని సందర్భాల్లో ఆయన సాక్షీభూతుడే. భగవద్గీత ఎంత ప్రవర్తించినా, దాని సారంగా తేలేది తస్మాత్‌ యుధ్యస్వ అన్న మాటయే. యుద్ధం చేయమని చెప్పడం స్థితికారకుడైన నారాయణ లక్షణం కాకుండా, రుద్రాంశ ఆవరించిన శివుని లక్షణంగా కనిపిస్తుంది. మొత్తం మహాభారతంలో ఈ దృష్టితో చూసినప్పుడు ఇదంతా హరిహరుల క్రీడవలె, మహామాతృ అంశమైన కాళికాదేవి వైభవం వలె గోచరిస్తుంది. ద్రౌపదీదేవి కాళికాదేవి యొక్క రూపాంతరమే.

కోవెల సువ్రసన్నాచార్య

విశ్వం నాద మయం

 David Hawkins యొక్క అద్భుతమైన అధ్యయనం సారాంశం:

నేను చెప్పే విషయం ఆధ్యాత్మికులు అర్థం చేసుకో గలుగుతారు. మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారని ఆశిస్తాను.


ఈ పూర్తి విశ్వం నాద మయం. సృష్టిలోని ప్రతీ వస్తువూ, జీవి ఒక నిర్దుష్టమైన ప్రకంపన సామర్థ్యాన్ని అంటే vibrating frequency కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనందరిని భయపెడుతున్న covid వైరస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. దాని vibrating frequency 5.5 Hz ఉంటుంది. ఇది 25Hz vibrating frequency దగ్గర మానలేదు. 


ఇంతకు మించిన ప్రకంపన సామర్థ్యం కలిగిన వారిలో covid పెద్ద ప్రమాదకారి కాదు. కేవలం కాస్త ఆనారోగ్యం కలిగించ గలదు అంతే. చాలా త్వరగా కోలుకుంటారు. 

అంటే ఇప్పుడు అందరూ పెంచుకోవాల్సింది vibrating frequency. 


ముందు మనుషుల్లో vibrating frequency ఎందుకు తగ్గుతుందో తెలుసుకుందాం. 

భయం

ఫోబియా

అనుమానం

ఆందోళన

ఒత్తిడి

కోపం

ద్వేషం 

దురాశ

మోసం

బాధ

విపరీతమైన మోహం... 

వంటివి మనలోని ప్రకంపనా సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.


ప్రస్తుతం భూమండల సగటు vibrating frequency 27.4Hz. 

Hospitals, cellarls, జైళ్ల వంటి కొన్ని ప్రదేశాలు చాలా తక్కువ frequency లో ఉంటాయి. వీటి frequency దాదాపు 20hz ఉంటుంది.  లేదా అంతకంటే తక్కువ ఉంటుంది. ఇలాంటి చోటుల్లో వైరస్ ప్రమాదకరంగా మారుతుంది. అలాగే తక్కువ vibrating frequency కలిగిన మనుషుల్లో వైరస్ ప్రాణాంతకం అవుతుంది. 


భావోద్వేగాల frequency

మనుషుల్లో ఉండే భావోద్వేగాలు ఎంత ఫ్రీక్వెన్సీ తో vibrate అవుతాయో ఒక సారి చూద్దాం

బాధ - 0.01 Hz

భయం - 0.2 - 2.2

చికాకు -  0.9 - 6.8

చప్పుళ్ళు - 0.6 - 2.2 

గర్వం - 0.8 

దర్పం - 1.9

ఇవ్వన్నీ తక్కువ స్థాయి frequency తో ఉండే భావోద్వేగాలు. 

వీటి వల్ల మనుషుల vibrating frequency చాలా పడిపోతోంది. ఫలితంగా నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. ప్రస్తుతం ఇది చాలా ప్రమాదకరం. 


ఏదీ మంచిది?

ఎక్కువ frequency కలిగిన ప్రవర్తన అలవరచుకోవడం ఇప్పుడు అత్యవసరం. ఎటువంటి ప్రవర్తన ద్వారా అది సాధ్యమో చూద్దాం.

దయ - 95 Hz

కృతజ్ఞత -250

సహనుభుతి - 150

షరతులు లేని ప్రేమ - 250hz ప్రేమించటం, కృతజ్ఞత కలిగి ఉండటం, క్షమించడం, కళాసాధన, యోగ, ధ్యానం, సూర్య రష్మీలో నడవటం, ప్రకృతి ఆరాధన వంటి చిన్న చిన్న సాధనలతో మనం high frequency లో vibrate కావచ్చు. 


సహజమైన ఆహారం తీసుకోవడం ద్వారా, అంతెందు స్వఛ్చమైన నీటిని తాగడం ద్వారా మనం మన vibrating frequency ని పెంచుకోవచ్చు. కేవలం కొద్ది సమయం దైవ సాన్నిధ్యం లో గడపడం ప్రార్థన చెయ్యటం ద్వారా 120 నుంచి 35O Hz వరకు మన ఫ్రీక్వెన్సీ ని పెంచుకోవచ్చు. 


ఆలస్యం వద్దు ఇక ఆ పనిలో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. పదండి... నవ్వుదాం, నవ్విద్దాం, ప్రేమిద్దాం, ఆడుదాం, పాడుడాం, ధ్యానిద్ధాం, పూజిద్దాం, సకల సృష్టి తో అనుసంధానమై కృతజ్ఞత కలిగి మెలుగుదాం. మన vibrating frequency ని పెంచుకుందాం. 


(ఈ సమాచారం మొత్తం power vs force అనే పుస్తకం నుంచి సేకరించింది. ఇది డేవిడ్ హాకిన్స్ రాసిన doctoral thesis లోనిది. )

26, ఏప్రిల్ 2021, సోమవారం

మృత్యుంజయ మంత్రం*

 *మహా మృత్యుంజయ మంత్రం*

=======================


*ఓం త్య్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం* |

*ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్* || *ఓం* ||

(శుక్ల యజుర్వేద సంహిత, 3.60)


సుగంధం వెదజల్లే అన్నాన్నిచ్చి పోషించేవాడు, త్రినేత్రుడూ అయినా పరమశివుడిని ఆరాధిస్తూ- 

ఈశ్వరా! తొడిమ నుంచి దోస పండులా సంసారబంధం నుంచీ, మరణం నుంచీ, అశాశ్వతం నుంచీ నన్ను విడిపించు ఆత్మస్థితి నుంచి మాత్రం వీడిపోకుండా చూడమని ప్రార్థిస్తుందీ మంత్రం. మహామృత్యుంజయమంత్రంగా చెప్పబడిన ఈ మంత్రంలో అద్భుత అంతరార్థం దాగుంది. 

మృత్యుంజయమంటే మరణాన్ని జయించడం అని అర్థం. జీవితం జనన మరణ బంధనం. *మరణాన్ని జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరాలు జీవించి ఉండడం కాదు.* శరీరం నుంచి ప్రాణం వీడిపోవడం మరణం. కానీ జీవించి ఉన్నప్పుడే బుద్ధిపూర్వకంగా ప్రాణం అశాశ్వతం అనీ, ఆత్మయే శాశ్వతమనే అనుభూతిని పొంది, తమతమ కర్తవ్యాలను నిర్వర్తించడమే మరణాన్ని జయించడం. భ్రమల్లో బతుకుతూ, కాలయాపన చేస్తూ జీవిత సత్యాన్ని మన అంతరాత్మ పదేపదే గుర్తుచేస్తున్నా పట్టించుకోకుండా అసంతృప్తితోనే జీవితమంతా బతుకుతాం. అశాంతితోనే మరణాన్ని ఆశ్రయిస్తాం. ఆత్మ ఒక్కటే శాశ్వతమని గుర్తించగలిగితే తారతమ్యాలూ, విభేదాలకు తావుండదు. సర్వసమానత్వ భావనతో ప్రపంచమంతా ఏకమై జీవిస్తుంది.

కర్మకు బాధ్యులు

 **మనము చేసే - కర్మకు బాధ్యులు - ఎవరు???...*

ఈ విషయంలో మానవునికే కాదు, జగజ్జనని అయిన పార్వతీ దేవికి కూడా అనుమానం కలిగింది...


ఒక రోజు పార్వతీదేవి ఈశ్వరుని తో... 

మానవులు కర్మలు చేస్తుంటారు కదా.. ఆకర్మలను మానవుల చేత దేవుడు చేయిస్తుంటాడా?.. లేక వారంతట వారు సంకల్పించి చేస్తుటారా అని అడిగారు... 


*అప్పుడు పరమశివుడు ఇలా చెప్పారు...*


పార్వతీ ! దేవుడు ఏ పనీ చెయ్యడు, దేవుడు కేవలం సాక్షిభూతుడు మాత్రమే... కాని దేవుడు మానవుడి కర్మలకు తన సహాయము అందిస్తాడు. 

మానవుడు చేసే కర్మలకు తగిన ఫలము అందిస్తాడు, ఏ పని చెయ్యాలో నిర్ణయించి కర్మలు చేసేది మానవుడే...

ఇందులో దైవప్రమేయము ఏదీయు లేదు, పూర్వజన్మ కర్మఫలితంగా మానవుడు తను చేయవలసిన కర్మలను నిర్ణయించి కర్మలుచేస్తాడు...


మానవుడు పూర్వజన్మలో చేసే పనులు దైవములు అయితే, ఈ జన్మలో చేసే పనులు పౌరుషములు అనగా అవే పురుషప్రయత్నములు...


"ఒక పని చెయ్యడానికి మనిషి చేసే ప్రయత్నములు వ్యవసాయము వంటిది, దైవ సహాయము మొక్కకు అందించబడే గాలి, నీరు వంటిది."


నేలను తవ్వితే భూగర్భము నుండి నీరు ఉద్భవిస్తుంది. 

అలాగే ఆరణి మధిస్తే అగ్ని పుడుతుంది, అలాగే ఏ పనికైనా పురుషప్రయత్నము ఉంటేనే దైవము కూడా తోడై చక్కటి ఫలితాలను అందిస్తాడు. పురుషప్రయత్నము లేకుండా దైవము సహాయపడతాడని అనుకుంటే కేవలము దైవము చూస్తాడని ఊరకుంటే దేవుడు ఫలితాన్నివ్వడు...


_కనుక పార్వతీ ! ఏ పని సాధించాలని అనుకున్నా పురుషప్రయత్నము తప్పక కావాలి, అప్పుడే దేవుడు సత్పఫలితాలను ఇస్తాడు...

                        *🌹శుభమస్తు🌹_*

       🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

అరచేతిలో తీర్ధాలు

 *🤲అరచేతిలో తీర్ధాలు🤲*



అగ్నిపురాణంమన అరచేతిలో 5 తీర్థాలున్నాయని చెబుతున్నది.

ఈ ఐదు తీర్థస్థానాలను పంచతీర్థాలని అంటారు.


కుడిచేతి బొటనవ్రేలిని వంచి దానిపై చూపుడు వ్రేలిని వంచి ఉంచి, ఆ విధంగా ఏర్పడిన పల్లపు ప్రదేశంలో నిలిచేట్టు పోసే జలం తీర్థం అని అంటున్నాము. అలా నీటిని


"ఓమ్ కేశవాయస్వాహా, "

"ఓమ్ నారాయణాయస్వాహా, "

"ఓమ్ మాధవాయస్వాహా ",

అని జపిస్తూ తీసుకోవడాన్ని ఆచమించడం అంటారు. 

ఈ సందర్భంలోని


ఐదు స్థానాలను పంచతీర్థాలని అగ్నిపురాణం అంటున్నది.


చూపుడు వ్రేలి క్రింది ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అని దాన్నే

బ్రహ్మతీర్థం అని అంటారు. 


చిటికెన వ్రేలి మూలస్థానం ఋషితీర్థం అని ప్రజాపతి స్థానమనీ, ప్రజాపతి తీర్థం అని అంటారు.


అరచేతి మధ్య పల్లపు ప్రదేశాన్ని అగ్ని స్థానమని 

దాన్ని అగ్ని తీర్థం అని అంటారు. 


చూపుడు వ్రేలినుంచి, చిటికెన వ్రేలి వరకు ఉన్న వ్రేళ్ళ

కొనల భాగం దేవస్థానాలని అవే దేవతీర్థాలు అని అంటారు.


ఎడమ అరచేతిలోని పల్లపు ప్రదేశాన్ని సోమతీర్థం అంటారు.


ఆచమనం చేసేప్పుడు మణికట్టువైపు బొటనవ్రేలి క్రింద ఉండే ప్రదేశం నుండి నీటిని గ్రహిస్తాము. కనుక దీన్ని కూడ బ్రహ్మతీర్థం అంటారు.


సంధ్యవార్చే వ్రేళ్ల చివరలనుంచి తర్పణం జలాన్ని విడుస్తాం కాబట్టి ఇదికూడ దేవతీర్థం అవుతున్నది. పితృకర్మలలో తర్పణాలకు వదిలే జలం 

పితృతీర్థం అనబడుతున్నది.


ఇవండీ అగ్నిపురాణంలోని పంచతీర్థాలు మన అరచేతిలో.

🙏🏻

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

  

*మాలకొండ లో తపస్సాధన..*


*(తొమ్మిదవ రోజు)*


"ఏకేన చక్రమపరేణ కరేన శంఖం

అన్యేన సింధు తనయా మవలంబ్య తిష్ఠన్

వామేతరేణ వరదాభయ హస్తముద్రాం

శ్రీ లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబం౹౹"


"ఒకచేత సుదర్శన చక్రము, వేరొకచేత పాంచజన్య శంఖము, ఇంకొక చేత లక్ష్మీదేవిని చుట్టి, తన ఎడమ తొడపై కూర్చుండబెట్టుకొని, తన కుడిచేతితో అశేష భక్తకోటికి అభయం ఇస్తూ దర్శనం ఇచ్చే శ్రీ లక్ష్మీ నరసింహా!..నాకు చేయూత నివ్వు!!" 


అని శ్రీ ఆదిశంకరాచార్యులు చేసిన స్తోత్రం లోని శ్లోకాన్ని గుర్తుచేసుకుంటూ..శ్రీ స్వామివారు మాలకొండ కు చేరి, ముందుగా ఆ లక్ష్మీనృసింహుడి సన్నిధిలో కొంత సేపు గడిపారు..మాలకొండ లో ఉగ్రరూపంతో వుండే ఆ లక్ష్మీ నరసింహుడు..ఈ యువక యోగి పట్ల ప్రసన్నుడై..తన అక్కున చేర్చుకున్నాడు..


శ్రీ స్వామివారు మాలకొండలోనే ఉత్తరంగా కొద్దిగా దిగువున, రెండు పెద్ద బండరాళ్లు చీలి ఏర్పడిన దారితో, ఒకే పెద్ద గొడుగు లాటి రాతి కింద వున్న శివాలయం వద్దకు వచ్చారు..ఆ శివాలయానికి మరికొద్ది దిగువున ఉన్న పార్వతీదేవి మఠం చూసారు..తన ఆవాసానికి ఆ అమ్మవారు కొలువైయున్న మఠం సరైనదని నిర్ణయానికి వచ్చారు..శివాలయం..దానిపైన వున్న రాతి గుహలు తన తపస్సుకు అనువైన ప్రాంతాలని నిర్ధారించుకున్నారు..


ఒకవైపు సాక్షాత్తూ వైష్ణవావతారం నృసింహుడు..మరో ప్రక్క ఆది దంపతులైన శివ పార్వతులు..తనకు ఇంతకంటే రక్షణ ఇచ్చే ప్రదేశం మరోటి ఎక్కడుంది?..ఇది తన మోక్షమార్గాన్వేషణలో మరో మజిలీ..ఇప్పటిదాకా తాను చేసిన సాధన ఒక ఎత్తు..ఇక చేయబోయేది మరో ఎత్తు!..గురువు బాలబ్రహ్మం చెప్పినట్లు, ప్రకృతి అనుక్షణం మాయను ప్రదర్శిస్తుంది..అందులో చిక్కకుండా ఏకాగ్రచిత్తంతో సాధన చేయాలి..ఎల్లవేళలా జాగురూకత తో ఉండాలి..దేహాభిమానాన్ని త్యజించాలి..మమకారాన్ని మనసులోంచి తుడిచివేయాలి..తానింతకాలం ఏ మోక్షం కోసం తపించి సాధన చేస్తున్నాడో అందుకు అనువైన ప్రదేశం కూడా లభించిందని సంతోషపడ్డారు..


పార్వతీదేవి మఠం లో నివాసం ఏర్పరుచుకున్నారు..మితాహారం భుజించడం..సాధన చేసుకోవడం..ఇవి రెండే కార్యక్రమాలు..మాలకొండ క్షేత్రం ఒక్క శనివారం నాడు మాత్రమే భక్తుల కొరకు తెరచి ఉంటుంది..ఆ ఒక్కరోజు శ్రీ స్వామివారు శివాలయం పైనున్న గుహలలోకి వెళ్లిపోయేవారు..అక్కడ ఏకాంతంలో తపోసాధన చేసుకునేవారు..మిగిలిన ఆరు రోజులూ నరసంచారం వుండదు కాబట్టి, ఎక్కువభాగం శివాలయం లోనే తన తపస్సు కొనసాగించేవారు..


కానీ..కుతూహలం తో కూడిన మానవులున్న లోకం ఇది..ఎవరో యువక యోగి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడని..మాలకొండ క్రింద ఉన్న గ్రామస్థులు పసిగట్టేశారు..వాళ్ళు కొండపైనున్న అడవి కర్రలు ఏరుకొచ్చి అమ్ముకునే వాళ్ళు..శ్రీ స్వామివారు శివాలయానికి వెళ్ళేటప్పుడు..తిరిగి పార్వతీదేవి మఠానికి వచ్చేటప్పుడు గమనించడం మొదలెట్టారు..వాళ్లలో వాళ్ళు శ్రీ స్వామివారి గురించి చర్చించుకోవడం కూడా జరుగుతోంది..శ్రీ స్వామివారిని చూసినప్పుడు పలకరించడం చేయసాగారు..తాను మౌనం లో వున్నప్పుడు చిరునవ్వే వారికి సమాధానం!..మౌనం వీడినప్పుడు..ముక్తసరిగా సమాధానం చెప్పి, వారిని పంపించివేసేవారు..ఇలా కాలం గడచిపోతోంది..


మాలకొండకు పశ్చిమంగా కొంత దూరం లో కంబాలదిన్నె అనే గ్రామం ఉంది..ఆ గ్రామ వాస్తవ్యులు శ్రీ చెక్కా కేశవులు గారు వైశ్య కులస్థుడు.. ఆయన మాలకొండ లక్ష్మీనృసింహ స్వామి వారి భక్తుడు..విజయవాడ లో వ్యాపారం చేస్తున్నారు..తన గ్రామానికి వస్తూ పోతూ ఉన్నప్పుడల్లా మాలకొండకు వచ్చి, శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దర్శనం చేసుకొని వెళుతూవుండేవారు..అదొక నియమం తో కూడిన ప్రక్రియ వారికి..అలా వస్తూ పోతున్న సమయం లో ఒకసారి శ్రీ స్వామివారిని చూడటం తటస్థించింది..శ్రీ స్వామివారిలో ఉన్న తేజస్సు, చెక్కా కేశవులు గారిని కట్టిపడేసింది..క్రమంగా శ్రీ స్వామివారిని తరచూ చూడటం..మెల్లిగా పలకరించడమూ చేశారు..శ్రీ స్వామివారు సైతం చెక్కా కేశవులు గారితో మాట్లాడారు..కేశవులు గారికి నమ్మకం కలిగింది..శ్రీ స్వామివారు, ఇలా ఎటువంటి సరంజామా లేకుండా..భూశయనం చేయడం..కేశవులు గారికి నచ్చలేదు..శ్రీ స్వామివారు నెత్తి నోరు కొట్టుకొని వారిస్తున్నా వినకుండా..ఒక ఇనుప మంచాన్ని, దోమతెరను..కప్పుకోవడానికి దుప్పట్లు వగైరా అంతా పార్వతీదేవి మఠం కు చేర్చారు..


"నాయనా!..ఇవన్నీ నాకు వద్దు..నేను సర్వసంగపరిత్యాగిని..అన్నీ వదిలేసి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను..నన్ను మళ్లీ సంసారబంధం లోకి లాగకు..నీ కోరిక ఏమిటి?.." అని లాలనగా అడిగారు..


చెక్కా కేశవులు గారు చాలాసేపు తటపటాయించి..ఎట్టకేలకు తన మనసులోని కోరికను బయటపెట్టారు..విన్న స్వామివారు ఫక్కున నవ్వారు..


చెక్కా కేశవులు గారి అనుభవం..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా.. పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

25, ఏప్రిల్ 2021, ఆదివారం

కరోనా వ్యాధి లో CT స్కాన్

 కరోనా వ్యాధి లో CT  స్కాన్ (సిటీ స్కాన్) గురించి కచ్చితంగా తెలుసుకోవలసినవి 👇


ఇవాళ  చాలామందికి కరోనా ఉన్నదా ? లేదా ? అని తెలుసుకోవడానికి మరియు 

కరోనా జబ్బు వచ్చిన తర్వాత ఎలా ఉంది , ఎంత తీవ్రత వుంది అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్  చేస్తున్నారు.


ఈ సిటీ స్కాన్ లో రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.


ఒకటి  CORADS

రెండు CT severity index


CORADS : దీనిలో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు ఉంటవి


CORADS ... 

అనేది సిటీ స్కాన్ ప్రకారము కరోనా ఉండే అవకాశాలు ఎంత ? అని మాత్రమే తెలుసుకోవడానికి వీలుంటుంది .


అంటే స్టేజ్ 1 నుంచి 6 వరకు పెరిగేకొద్దీ కరోనా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నది అని మాత్రమే చెబుతుంది ,  స్టేజ్ పెరిగితే వ్యాధి తీవ్రత పెరుగుతుంది అని మాత్రం కాదు.


CORADS 1... ఏమి ఇబ్బంది లేదు.

CORADS 2... సిటీ స్కాన్ లో కొంచెం తేడా ఉంది కానీ అది కరోనా వల్ల అయి ఉండకపోవచ్చు.

CORADS 3.. సిటీ స్కాన్ లో కొంచెం తేడా ఉంది లేదా నెమ్ము లక్షణాలు ఉన్నది కానీ అది కరోనా వల్ల లేదా వేరే జబ్బు వల్ల వచ్చిందా అని  తెలియడం లేదు.

CORADS 4.  సిటి స్కాన్ బాగాలేదు, సిటి స్కాన్ లో కనిపిస్తున్న ఈ లక్షణాలు చాలావరకు కరోనా వల్లనే అనిపిస్తుంది.

CORADS 5... ఇది ఖచ్చితంగా కరోనా అని సీటీస్కాన్ చెప్తుంది.

CORADS 6 ... సిటీ స్కాన్ లో నెమ్ము లక్షణాలు కనిపిస్తూ RTPCR లేక Rapid antigen test పాజిటివ్ ఉంటే అది stage 6 అవుతుంది.


So, ఈ CORADS క్లాసిఫికేషన్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు వరకు సిటీ స్కాన్ చూసి కరోనానా? లేదా? అని చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది , స్టేజ్ పెరిగితే వ్యాధి తీవ్రత పెరుగుతుంది అని  ఏమాత్రం కాదు.


2 : CT severity index


మనకి రెండు ఊపిరితిత్తులు ఉంటవి. ఒకటి కుడిపక్క ,  రెండవది ఎడం పక్క. ఈ కుడి పక్కన ఊపిరితిత్తిలో మూడు లోబులు ( మూడు భాగాలు ) ఉంటాయి అంటే మూడుగా విభజించబడి వుంటుంది, ఎడమ పక్క ఊపిరితిత్తిలో రెండు లోబ్స్ ఉంటాయి అంటే రెండు గా విభజించబడి ఉంటుంది.... మొత్తం రెండు ఊపిరితితతుల్లో  మనకు 5 భాగాలు గా ఉంటాయి.


ఈ సిటి సివియారిటి ఇండెక్స్ ( CT severity index ) 0 నుంచి 25 వరకు ఉంటుంది .అంటే ఒక్కొక్క లోబ్ లో 0 నుంచి 5 పాయింట్లు ఇస్తారు. 5 x 5... మొత్తం పాయింట్లు 25 అవుతుంది.


ఈ జీరో నుంచి ఐదు పాయింట్లు అనేది ఊపిరితిత్తులు ఎంత చెడిపోయింది అన్న దానిని బట్టి ఈ పాయింట్లు పెరుగుతాయి.


*0 : ఏమీ ఇన్ఫెక్షన్ లేదు

1 : 5% కన్నా తక్కువ గా ఉంది 

2 : 5 - 25  పర్సెంట్ 

3  :25 - 50% 

4 : 50-  75%

5 : 75 పర్సెంట్ కన్నా ఎక్కువగా దెబ్బతిన్నది*


సో ,  ఒక్కొక్క లోబ్ లో జీరో నుంచి ఐదు స్టేజి వరకు తీసుకొని 5 x 5 = 25 స్కోర్ అవుతుంది .

ఈ స్కోర్

8 కన్నా తక్కువ అయితే ...mild ( తక్కువగా వుంది )

 8 నుంచి 15 అయితే Modarate ( ఒకమొస్తరిగా)

15 కన్నా ఎక్కువ అయితే Severe ( ఎక్కవగా)


  ఊపిరితిత్తులు ఎంత దెబ్బతిన్నది అని తెలుసుకోవడానికి ఈ స్కోర్ ఉపయోగపడుతుంది .


కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అది ఆ రోజు సిటీ స్కాన్ చేయించిన రోజు ఎంత దెబ్బ తిన్నవి అని మాత్రమే తెలియజేసినది.

 వ్యాధి పెరుగుతున్నకొద్దీ ఈ స్కోరు  పెరుగుతుంది. 


అంటే డాక్టర్లు ఈ సిటీ స్కాన్ ని వ్యాధి పెరుగుతుందా లేదా అని మరియు ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి మళ్ళీ చేయవలసి వస్తుంది.


కాని పెరుగుతుందా లేదా తెలుసుకోవడానికి డాక్టర్ని మాత్రమే సంప్రదించవలెను. సొంతంగా వెళ్లి సిటీ స్కాన్ చేయించుకున్న ఎడల డబ్బులు వృధా అవుతాయి , అనవసరంగా ఎక్కువసార్లు సీటీ స్కాన్ చేయించుకోవడం వల్ల రేడియేషన్ కూడా వస్తుంది.


 అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ pulse oximeter  చెక్ చేసుకుంటే మనం కూడా గమనించవచ్చు .


ఈ పల్స్ ఆక్సిమీటర్ లో SPO2 అనేది 93 కన్నా ఎక్కువ ఉండాలి, 


 93 శాతం కన్నా తక్కువ ఉంటే మన ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం లేదని అర్థం.


  సో , ఈ CORADS  క్లాసిఫికేషన్ స్టేజ్ 1 - 6   అనేది  కరోనా ఉండే అవకాశాలు ఎంత అని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అది వ్యాధి తీవ్రత తెలియజేయదు.


 CT Severity index ఊపిరితిత్తులు ఎంత దెబ్బ తిన్నవి వ్యాధి తీవ్రత ఎంత ఉంది అని తెలియజేస్తుంది.


ఈ సిటీ స్కాన్ లో  వ్యాది ఎలా వుంది ఎంత తీవ్రత వుంది అని చెప్పడానికి మరో నాలుగు పదాలు వాడుతూ ఉంటారు .


  ground glass appearance


   Crazy paving pattern


     Consolidation


      Gradual resolution 


  ఈ ground glass అనగా ఒక ఐదు రోజుల లోపు కరోనా అటాక్  అయివుంటుంది


 5 రోజుల నుంచి 10 రోజుల్లో ఈ క్రేజీ పేవింగ్ పేటరన్ కనిపిస్తుంది


 10 నుంచి 13 రోజులు లో కన్సాలిడేషన్ లాగా అనిపిస్తుంది 


14 రోజుల తర్వాత అయితే గ్రాడ్యువల్ రిజల్యూషన్ లా  CT స్కాన్ లో కనిపిస్తుంది.


ఇవన్నీ మనము కొంచెం సిటిస్కాన్ గురించి తెలుసుకోవడానికి మాత్రమే ,పూర్తిగా అవగాహన కోసం డాక్టర్ ని సంప్రదించాలి.


copy post from whats app

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...  


*ఆశ్రమవాసం..ఆధ్యాత్మిక శిక్షణ..*


*(ఎనిమిదవ రోజు)*


వ్యాసాశ్రమం లో అడుగుపెట్టిన శ్రీ స్వామివారికి అక్కడి క్రమశిక్షణాయుత వాతావరణం నచ్చింది..తెల్లగా..సన్నగా ..తేజస్సు ఉట్టిపడుతున్న ముఖం తో ఉన్న ఆ బాల యోగి అందరినీ ఇట్టే ఆకర్షించాడు.. నియమిత ఆహారం..యోగ సాధన..నిరంతర భజనలు..భగవన్నామ సంకీర్తనమూ..సాధు సత్పురుషుల ఉపదేశాలూ..ఎటు చూసినా ఒకరకమైన భక్తి భావం తొణికిసలాడే ఆ ఆశ్రమం..శ్రీ స్వామివారికి అనువైన ప్రదేశం గా తోచడం లో ఆశ్చర్యం లేదు..


శ్రీ స్వామివారికి గురువులు బోధించే ఏ అంశమైనా క్షణాల్లో అవగతమైపోయేది..దానికి తోడు ఆయనకే స్వంతమైన ధారణ శక్తి తో అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చే నేర్పు అలవడింది..శ్రోతలు మంత్ర ముగ్ధుల్లా వినేవారు..తనకు సందేహం వస్తే..గురువు దగ్గర వినయపూర్వకంగా అడిగి తెలుసుకునేవారు..చెరగని చిరునవ్వు తో ఉండటం..ఎటువంటి ప్రశ్నకైనా తడుముకోకుండా జవాబు చెప్పటం..గురువుల వద్ద వినయం తో ప్రవర్తించడం..తాను తెలుసుకున్న జ్ఞానాన్ని తోటి మిత్రులకు సులభ శైలిలో వివరించడం..మొదలైన గుణాల వలన అనతికాలంలోనే ఆశ్రమంలో ఒక ముఖ్య శిష్యుడిగా మారిపోయారు..


సరిగ్గా ఆ సమయం లోనే..కొంతమంది ఆశ్రమవాసులు తదుపరి శ్రీ స్వామివారిని బోధగురువు గా నియమిస్తే బాగుంటుందని తలపోయసాగారు..ఆశ్రమానికి కూడా ఈ యువకయోగి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని ఆలోచన చేయ సాగారు..ఈ ఆలోచన వారి మదిలో ఎందుకు కలిగిందో తెలీదు కానీ..ఆనాటి నుంచి, శ్రీ స్వామివారిని ఒక ప్రత్యేక వ్యక్తిగా పరిగణించసాగారు..ఈ మార్పు శ్రీ స్వామివారి మనసుకు తోచింది..మూలకారణం ఏమిటో అని ఆరా తీశారు..ఆశ్రమవాసుల్లో కొందరు శ్రీ స్వామివారికి అసలు విషయం చెప్పారు..


శ్రీ స్వామివారు ఎంతో పరిణితి తో ఆలోచన చేశారు..తన జీవిత లక్ష్యం మోక్ష సాధన..అంతేకానీ ఆశ్రమ నిర్వహణ కాదు..మానవుని ఆధ్యాత్మిక పయనంలో అనేక బంధాలు అడ్డుపడతాయి..కీర్తి తో వచ్చే బంధాలు ("ఆయన లాంటి గురువు దొరకడం కష్టం అండీ..అంటూ ఆకాశానికి ఎత్తేసే రకం..)  కొన్ని..పదవుల తో (ఆశ్రమ నిర్వహణ, గురు పీఠం ఇత్యాదులు) వచ్చే బంధాలు కొన్ని..ఇలా వీటిలో చిక్కుకొని తన మార్గాన్ని తానే తప్పడం సుతరామూ ఆయనకు ఇష్టం లేకుండా పోయింది..క్రమంగా ఆశ్రమ వాసుల లో శ్రీ స్వామివారి మీద బాధ్యతలు మోపాలనే ఆలోచన బలపడసాగింది..ఈ ధోరణి శ్రీ స్వామివారి ధ్యానానికి అవరోధంగా మారింది..ఇక ఇక్కడ వుంటే..తనమీద ఏదో ఒక బాధ్యత పడక తప్పదు అని శ్రీ స్వామివారికి తేటతెల్లంగా తెలిసిపోయింది..


శ్రీ స్వామివారు ఆలోచన చేశారు..ముందుగా కొన్నాళ్ల పాటు వేరే ప్రదేశాలకు వెళ్లి వస్తానని ఆశ్రమవాసులకు చెప్పుకుని, గురువుల అనుమతి తీసుకొని బైటకు వచ్చారు..అలా చిత్తూరు జిల్లాలో "పాపానాయుడుపేట" అనే గ్రామానికి చేరారు..ఆగ్రామంలో "బాలబ్రహ్మం" అనే సాధువు శ్రీ స్వామివారిని చూసి.."ఈతడు సామాన్యమానవుడు కాదే..ఇలా తిరుగుతున్నాడేమిటి?.." అని తనలో తానే తర్కించుకుని, శ్రీ స్వామివారిని చేరదీసి..వాకబు చేశారు..బాలబ్రహ్మం ఏ నిమిషంలో శ్రీ స్వామివారిని కలిసాడో..శ్రీ స్వామివారికి అంతర్వాణి "ఇతడే నీ గురువు.." అని ప్రబోధించింది..శ్రీ స్వామివారు సాష్టాంగ నమస్కారం చేసారు..


"లే నాయనా!..దారితప్పి, దిక్కుతోచక అల్లాడుతున్నావా?..ఇక నీకు భయం లేదు..నిత్యమూ, సత్యమూ అయిన సచ్చిదానంద స్వరూపాన్ని కనుక్కోవడానికి సాధన అవసరం..ముక్తి మార్గాన్ని తెలుసుకోవాలంటే ముందుగా నిన్ను నీవు శోధించుకోవాలి..పరమాత్మ తత్వాన్ని గ్రహించాలనే నీ తపన అర్ధమయింది..ఆత్మ ను గ్రహిస్తే..పరమాత్మ వశం అవుతాడు.." అని చెప్పి, తపస్సాధన చేయాల్సిన విధం చెప్పి..గురూపదేశం చేశారు..భగవన్నామ జపం చేసేటప్పుడు ప్రకృతి కల్పించే ఆటంకాలు, మాయా పరీక్షలు ఎలా ఎదుర్కోవాలో వివరంగా తెలియచేసారు..


బాలబ్రహ్మం గారు చేసిన ఉపదేశం, శ్రీ స్వామివారిలో కొండంత మానసిక స్తైర్యాన్ని నింపింది..కొన్నాళ్ల పాటు ఆయనకు శుశ్రూష చేసి..తిరిగి ఎర్రబల్లె చేరారు..ఇక తపోసాధనకు అనువైన ప్రదేశం కావాలి..మోక్ష సాధన..మోక్ష సాధన..ఇదొక్కటే ఆయన మదిలో సుడులు తిరుగుతున్న ఆలోచన!..ఇదే తపన!..


భక్తుడు ఆర్తిగా తపిస్తుంటే..భగవంతుడు చూస్తూ ఊరుకోడు.. తన దగ్గరకు పిలిపించుకుంటాడు..మాలకొండ లో వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనారసింహుడు,  శ్రీ స్వామి వారి మొర ఆలకించాడు..శ్రీ స్వామివారికి అంతర్వాణి రూపంలో ఆదేశం వచ్చింది..ఒక్కక్షణం ఆలస్యం చేయలేదు.. పరుగు పరుగున మాలకొండ చేరారు..


మాలకొండలో తపోసాధన..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

Paata