22, జులై 2021, గురువారం

*శ్రీ కంచి పరమాచార్య వైభవమ్ - 292*

 *శ్రీ కంచి పరమాచార్య వైభవమ్ - 292*

🙏🌻🌻🌻🌻🌹🌹🌻🌻🌻🌻🙏


 *ఎక్కడ నేర్చుకున్నావు?* 


ఇది 1956-57లలో జరిగిన సంఘటన. కంచి పరమాచార్య స్వామి వారు మద్రాసు మైలాపూరులోని సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నారు. 


ఒక సాయింత్రం పరమాచార్య స్వామి వారు ఒక పెద్ద సభలో ప్రసంగించవలసి ఉంది. ఆ సభలో రాజాజీ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. స్వామివారు ఏ విషయం గురించి మాట్లాడాలా అని ఆలోచనలో ఉన్నారు. వెంటనే వేదిక పక్కన నిలబడి ఉన్న ప్రొ. శంకరనారాయణ అయ్యర్ ని పిలిచి ఒక సంస్కృత శ్లోకంలో రెండు పాదాలు చెప్పి, మిగిలిన శ్లోకం ఏమైనా గుర్తున్నదా అని అడిగారు. ఆయన తన అజ్ఞానాన్ని మన్నించమని అడిగి తెలియదని చెప్పి వేదిక దిగి వచ్చేసారు. 


ఈ సంభాషణ అంతా మైక్ ముందు జరగడం వల్ల సభికులందరికి దీని గురించి తెలిసింది. ఈ వ్యాసం వ్రాసిన డా. సి.ఆర్. స్వామినాథన్ కూడా ఆ శ్లోకం పాదాలు విన్నారు. ఆయనకు ఈ శ్లోకం పూర్తిగా వచ్చు కాబట్టి, వెంటనే శంకరనారాయణ అయ్యర్ దగ్గరికి వెళ్ళి మిగిలిన రెండు పాదాలు చెప్పారు. 


అయ్యర్ గారు మరలా వేదికపైకి వెళ్ళి మహాస్వామి వారి ముందు ఆ శ్లోకాన్ని చెప్పారు. 


స్వామివారు ఆయనతో, “నీకు ఈ శ్లోకం తెలియదన్నావు. మరి ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నవు?” అని అడిగారు.


“సభికులలో ఒకరు గుర్తుతెచ్చుకుని నాకు చెప్పారు పెరియవ” అని బదులిచ్చారు.


మహాస్వామివారు అతని గురించిన వివరాలు కనుక్కొని, డా. స్వామినాథన్ ను వేదిక పైకి పిలవాల్సిందిగా అయ్యర్ గారికి చెప్పారు. ఆయన వేదిక పైకి రాగానే, అతని పేరు, వృత్తి మొదలైన వివరములు అడిగి, “ఎక్కడ చదివావు?” అని అడిగారు.


అతని విద్యా సంబంధమైన విషయములు అడుగుతున్నారు అనుకుని స్వామినాథన్ మద్రాసు ప్రెసిడెన్సి కాలేజిలో అని చెప్పారు. అందుకు స్వామివారు ”అది కాదు. ఈ శ్లోకం ఎక్కడ నేర్చుకున్నావు?” అని అడిగారు.


తన చిన్నతనంలో తన తాత వద్ద ఈ శ్లోకం నేర్చుకున్నానని స్వామినాథన్ బదులిచ్చారు. మహాస్వామి వారు స్వామినాథన్ స్వస్థలం, వారి తాతగారి పేరు, వారి కుటుంబ వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఈ మొత్తం సంభాషణ అంతా మైకు ముందు జరగడం వల్ల అక్కడున్నవారు మొత్తం విన్నారు. 


ఆ శ్లోకం ఇదే: 


*అర్థాతురాణాం న గురుర్ న బంధుః*

*క్షుధాతురాణాం న రుచికి న పక్వం*

*విద్యాతురాణాం న సుఖం న నిద్ర*

*కామాతురాణాం న భయం న లజ్జ*


ధనార్జన చేయువానికి గురువులు, బంధువులు అన్నది ఉండదు. ఆకలిగొన్నవాడికి రుచి, పక్వం పట్టింపు ఉండదు. నేర్చుకోవాలి (చదువుకోవాలి) అన్న ధృతి ఉన్నవాడికి నిద్ర, సుఖము తెలియదు. కోరికలతో సతమతమయ్యేవాడికి భయము, సిగ్గు ఉండవు. 


తరువాత పరమాచార్య స్వామివారి అనుగ్రహ భాషణంలో కేనోపనిషత్తు గురించి చెబుతూ, పార్వతీ దేవి గురు స్వరూపిణియై దేవతలకు పరబ్రహ్మం గురించి ఎలా విశదపరచిందో చెప్పారు. ఉపన్యాసం ముగిస్తూ చివర్లో ఇలా అన్నారు. 


”ఉపన్యాసం మొదలుపెట్టక ముందు ఒక వ్యక్తిని వేదికపైకి పిలిచి నేను సగం చెప్పిన ఈ సుభాషితాన్ని ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాను. అతను ఎవరో నాకు తెలుసు. కాని ఎందుకు పిలిచి మరీ అడిగాను అంటే ఇక్కడున్న మీకందరికి తెలియాలి అది ఏదో పాఠశాలలోనో, కళాశాలలోనో నేర్చుకున్నది కాదు. బాల్యంలో అతని తాత వద్ద నేర్చుకున్నది. పిల్లలకు మంచి విషయాలు, విలువలు ఇంట్లోని పెద్దల ద్వారానే సమకూరుతాయి తప్ప ఆధునిక పాఠశాలలోనో, కళాశాలలోనో కాదు”


ఇంకా స్వామినాథన్ చివరలో ఇలా వ్రాసారు: 


నాలాంటి అల్పుడు, సిగ్గు, భయం కలవాడిని కొన్ని వేలమంది సభికులున్న వేదికపైకి పిలిచి పరమాచార్య స్వామివారు అందరికి ఏమి చెప్పలనుకుంటున్నారు అంటే 


> పాఠశాల విద్యార్థులకి చదువుతో పాటు సంస్కారము, విలువలు నేర్పడం పెద్దలు (నాన్నమ్మలు తాతయ్యలు) ఉన్న ఒక ఉమ్మడి కుటుంబం వల్ల మాత్రమే సాధ్యం. 


> పెద్దలు కూడా వారి విలువైన సమయాన్ని పిల్లలకు మంచి విషయాలు మంచి కథలు చెప్తూ గడపవచ్చు. 


> ఆ వయసులో నేర్చుకున్న విషయాలు వారి జ్ఞాపకాల పొరలలో పదిలంగా ఉండి వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. 


--- డా. సి.ఆర్. స్వామినాథన్, భారత ప్రభుత్వ మాజీ సహాయ విద్యా సలహాదారు.



*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*

🙏🌻🌻🌻🌻🌹🌹🌻🌻🌻🌻🙏



*💠 సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్*


*🚩 హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ సమూహంలో సభ్యులుగా చేరటానికి, మరిన్ని హైందవ సంస్కృతీ సాంప్రదాయాలు, హిందూ ధర్మం యొక్క సమాచారం, రోజువారి పంచాంగం - రాశి ఫలాలు తెలుసుకోవడానికి మరియు మరింత భక్తి సమాచారం పొందటానికి 9908949429 నెంబరుకు వాట్సాప్ లో 'ఓం' అని సందేశం పంపండి. వివరాలకు 9000905270 నెంబరును సంప్రదించండి*


*🪔 హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా ఆధ్వర్యం నందు మీ యొక్క వివాహాది శుభకార్యాలకు, గ్రహ శాంతులకు, పుట్టిన రోజు వేడుకలకు, సంబంధిత పండుగలకు మీ కోరిక మేరకు పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించబడును.*


*🙏🏻 దయచేసి సహృదయులు అందరూ కూడా తమ విరాళాలను (ట్రస్ట్ అభివృద్ధి కొరకు, పేదలకు చేయూత కొరకు, హిందూ ధర్మ సంరక్షణ కొరకు) ఇవ్వదలచిన వారు*


*UNION BANK*

*HAINDAVA PARISHAT CHARITABLE TRUST*

*A/C NO : 032311010000001*

*IFSC CODE : UBIN0803235*

*KAKARAPARRU*


*✅ పై చిరునామాకు మీ అమూల్యమైన ఆర్థిక వితరణ అందచేసి ఆ వివరాలతో పాటు మీ పేరు, మీ ఊరు పేరును 9160337196 నెంబరుకు వాట్సాప్ చేయగోరుచున్నాము.*

తల్లి దండ్రులు- పిల్లల భాద్యత

తల్లి దండ్రులు- పిల్లల భాద్యత 

తల్లిదండ్రులు ప్రతివారికి కనిపించే దేముళ్ళు.  ఆ దేముడికి అపకారం చేసినా దేముడు క్షమిస్తాడు కానీ తల్లిని కానీ, తండ్రిని కానీ లేక కుటుంబంలోని యితర పెద్ద వారిని అంటే తాతగారు, నయనమ్మగారు వున్న వారి పట్ల చులకన భావన కలిగి ఉండటం.  వారిని నిర్లక్షయం చేసిన పూర్వము రాజులు కఠినంగా శిక్షించే వారు.  ఇప్పుడు రాజులు లేరు.  ప్రజా నాయకులు వారే ధర్మాన్ని ఆచరించటం లేదు ఇక అటువంటి అధర్మ పరులకు శిక్షలు వేయటం లేదు.  కానీ భగవంతుని దృష్టిలో తల్లిదండ్రుల విషయంలో నిర్లక్షము చేసిన వారు ఈ లోకములో మాత్రమే కాక పరలోకములో కూడా అంటే నరకములో కూడా శిక్షింపబడతారు. 

మన హిందూ ధర్మంలో ముందుగా మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అతిధి దెవొ భావ అనే మనకు మన పెద్దలను దైవస్వరూపులుగా భావిస్తూ వారిని సేవించాలని మన ధర్మం చెపుతున్నది. ఇప్పుడు పాశ్చాచ్య నాగరికతకు అలవడి తల్లిదండ్రుల సొమ్ము మీద మాత్రమే శ్రర్ధ చూపిస్తూ వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మనం రోజు ఎన్నో వార్తలు చూస్తున్నాము.  విదేశీ వ్యామోహంతో తల్లిదండ్రులను వదిలి వారి యోగక్షేమం పట్టించుకోని వారు కొందరైతే, భార్యల మాటలకు తలవొగ్గి తల్లిదండ్రులను నిర్ధాక్షిణ్యంగా ఇంట్లోంచి వెళ్లగొట్టె వారు కొందరు తయారౌతున్నారు. తల్లిదండ్రులు ఆస్తి పాస్తులు ఉంటే ఏ వృధాశ్రమంలోనో తలదాచుకుంటున్నారు. ఒకసారి ప్రముఖ  ప్రవచనకారులు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు తన ప్రవచనంలో చెప్పినదేమిటంటే తానూ ఒక పర్యాయము ఒక వృధాశ్రమాన్ని సందర్శించానని అక్కడ ఒక వృద్ధురాలు సంచి పట్టుకొని గేటు వద్ద తారట్లాడుతున్నదని.  ఆ విషయం తెలుసుకుంటే అక్కడి నిర్వాహకులు చెప్పింది విని తానూ నిస్చేస్తుడనయినానని ఎంతో బాధగా తెలిపారు ఇంతకూ అసలు విషయం ఏమిటంటే ఆ తల్లి కుమారుడు కారులో ఆమెను అక్కడ దింపి ఇప్పుడే వస్తానని చెప్పి రెండు సంవత్సరాల క్రితం వెళ్ళాడట అప్పటినుండి ఆమె తన కన్నకొడుకు కోసం వేచి వున్నడట.  ఇటువంటి హృదయ విదారక సంఘటనలు మన సమాజంలో కో కోల్లలు.  తల్లి పెంషన్ తీసుకొని తల్లిని వెళ్లగొట్టె ప్రబుద్ధులు లేక పోలేదు. 

పెంపక లోపం:  తల్లిదండ్రులను పిల్లలు సరిగా చూడటం కేవలం పిల్లలదే ఆ దోషం అనటానికి వీలులేదు.  చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో, లాలనతో పెంచి చక్కటి క్రమశిక్షణ నేర్పితే  వారు తప్పకుండా తమ కన్నవారిపైన ప్రేమ, భక్తి కలిగి వుంటారు.  కొన్ని సందర్భాలలో ఇంటి అల్లుడు చూపే ఆదరణ కూడా కన్నకొడుకులు చూపటం లేదని మనం కొన్ని చోట్ల చూస్తున్నాము.  అయినా వృద్ధ తల్లిదండ్రులు కొడుకులమీద వ్యామోహం పెంచుకొంటూ వుండి అనేక కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ఎంతో కాలం క్రితమే వేమన వ్రాసిన ఈ పద్యం చుడండి. 

తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు
పుట్టనేమీ వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవ గిట్టవా
విశ్వదాభిరామ వినుర వేమా!

భావం : తల్లిదండ్రులపైన దయ తో ఉండాలి. వృద్ధాప్యం లో వారిని దయతో ప్రేమతో ఆదరించాలి. అలా చేయని కొడుకు ఉన్న లేనట్టే . అలంటి వాడు పుట్టలోని పుట్టి చచ్చే చెద పురుగులతో సమానం

యోగి వేమన 17 వ శతాబ్దంకు చెందిన వాడు అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం వేమన పద్యం ఇప్పటి సమాజానికి అద్దం పెట్టినట్లుగా ఉన్నదంటే మనం సామాజికంగా ఎంతగా అభివృద్ధి చెందామన్నది ఎవరికి వారు వేసుకోవలసిన ప్రశ్న.

కుంచిత మనస్తత్వాలు:  సమాజంలో పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు కానీ తల్లిదండ్రుల విషయంలో మాత్రం ఎందుకు కుంచిత మనస్కులై వర్తిస్తున్నారు.  మా అమ్మ తాను నవమాసాలు మోసి తన రక్త మాసాలు ఇచ్చి నాకు జన్మని ఇచ్చిందే అని  ప్రతి వక్కరు తెలుసుకోవాలి అప్పుడు వృధాశ్రమాల అవసరం మన సమాజానికి ఉండదు. తల్లిదండ్రులను వేదనకు గురిచేసి కొడుకులకు గరుడపురాణం ప్రకారం నరకంలో శిక్షలు వున్నాయి చుడండి.

 కాలసూత్ర నరకం: తల్లిదండ్రులకు, సద్బ్రాహ్మణులకు, వేదానికి ద్రోహం తలపెట్టిన వారు ఈ నరకలోకాన్ని పొందుతారు. రాగి నేల కలిగి, నెత్తిన నిప్పులు చెరిగే సూర్యుడు వీరిని మాడ్చి వేస్తుంటాడు.

భూమి మీద వున్న జంతుకోటిలో మానవుడు ఒక్కడే బుద్దిజీవి.  కానీ వక్రబుద్ధితో సమాజాన్ని, కుటుంబాన్ని నాశనం చేస్తూ చివరకు తనుకూడా నాశనం అవుతున్నాడు. తన కన్నవారిని సరిగా చూడని వారి పిల్లలు రేపు వారిని ఎలా చూస్తారు అని ఆలోచించాలి.  ప్రతివారికి మనసాక్షి ఉంటుంది దానిని ఎవ్వరు కాదనలేరు. 

ఈ వ్యాసం ఒక్క కుమారుడినైనా మార్చి ఒక్క తల్లి జీవితానికి వెలుగు నిచ్చిన ఈ వ్యాస కర్త ప్రయత్నం ఫలించినట్లే.  

పిల్లలకు నేర్పించండి


ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.


 దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం


మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం


 వేదాలు :(1) ఋగ్వే దం, 

(2) యజుర్వేదం,(3) సామవేదం,

(4) అదర్వణ వేదం


 పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ,

(3) కామ,(4) మోక్షా


 పంచభూతాలు :(1) గాలి, (2) నీరు,

(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.


  పంచేంద్రియాలు : (1) కన్ను, 

(2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,

(5) చర్మం.


 లలిత కళలు : (1) కవిత్వం,

(2) చిత్రలేఖనం, (3) నాట్యం,

(4) సంగీతం, (5) శిల్పం.


 పంచగంగలు : (1) గంగ, (2)  కృష్ణ,

(3) గోదావరి, (4) కావేరి, 

(5) తుంగభద్ర.


 దేవతావృక్షాలు : (1) మందారం, 

(2) పారిజాతం, (3) కల్పవృక్షం, 

(4) సంతానం, (5) హరిచందనం.


 పంచోపచారాలు : (1) స్నానం,

(2) పూజ,  (3) నైవేద్యం,

(4) ప్రదక్షిణం, )5) నమస్కారం.


  

పంచామృతాలు : (1) ఆవుపాలు,

(2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర, 

(5) తేనె.


 పంచలోహాలు : (1) బంగారం, 

(2) వెండి,  (3) రాగి,

(4) సీసం, (5) తగరం.


 పంచారామాలు : )1) అమరావతి,

(2) భీమవరం, (3) పాలకొల్లు,

(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం


 షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు, 

(3) చేదు, (4) వగరు, 

(5) కారం, (6) ఉప్పు.


అరిషడ్వర్గాలు  షడ్గుణాలు:(1) కామం, 

(2) క్రోధం, (3) లోభం, (4) మోహం,

(5) మదం, (6) మత్సరం.


ఋతువులు : (1) వసంత,(2) గ్రీష్మ,

(3) వర్ష, (4) శరద్ఋతువు, 

(5) హేమంత, (6) శిశిర


 సప్త ఋషులు : (1) కాశ్యపుడు,

(2) గౌతముడు,  (3) అత్రి,

(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,

(6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.


తిరుపతి సప్తగిరులు : (1) శేషాద్రి,

(2) నీలాద్రి, (3) గరుడాద్రి, 

(4) అంజనాద్రి, (5) వృషభాద్రి, 

(6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.


సప్త వ్యసనాలు : (1) జూదం,

(2) మద్యం, (3) దొంగతనం, 

(4) వేట, (5) వ్యభిచారం, 

(6) దుబారఖర్చు,

(7) కఠినంగా మాట్లాడటం.


 సప్త నదులు : (1) గంగ, 

(2) యమునా,  (3) సరస్వతి, 

(4) గోదావరి,  (5) సింధు,

(6) నర్మద,  (7) కావేరి.

            

నవధాన్యాలు : (1) గోధుమ,

(2) వడ్లు,  (3) పెసలు,

(4) శనగలు, (5) కందులు,

(6) నువ్వులు, (7) మినుములు, 

(8) ఉలవలు, (9) అలసందలు.


నవరత్నాలు : (1) ముత్యం, 

(2) పగడం, (3) గోమేధికం,

(4) వజ్రం, (5) కెంపు, (6) నీలం, 

(7) కనకపుష్యరాగం, 

(8) పచ్చ (మరకతం), 

(9) ఎరుపు (వైడూర్యం).


నవధాతువులు : (1) బంగారం,

(2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి, 

(5) ఇనుము, (6) కంచు,

(7) సీసం, (8) తగరం, 

(9) కాంతలోహం.


నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార, 

(3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర, 

(6) భయానక, (7) బీభత్స, 

(8) అద్భుత, (9) వీర


నవదుర్గలు : (1) శైలపుత్రి, 

(2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,

(4) కూష్మాండ, (5) స్కందమాత, 

(6) కాత్యాయని, (7) కాళరాత్రి, 

(8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.


 దశ సంస్కారాలు : (1 ) వివాహం, 

( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం , 

(4 ) సీమంతం, (5) జాతకకర్మ, 

(6 ) నామకరణం, (7) అన్నప్రాశనం, 

(8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం, 

(10) సమవర్తనం


దశావతారాలు : (1) మత్స్య,

(2) కూర్మ, (3 ) వరాహ,

(4) నరసింహ, (5) వామన, 

(6) పరశురామ, (7) శ్రీరామ,

(8) శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.


జ్యోతిర్లింగాలు :


హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .


కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .


మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)


గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)


మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)


ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం) 


తమిళనాడు ~ రామలింగేశ్వరం

 

తెలుగు వారాలు : (1) ఆది, (2) సోమ, 

(3) మంగళ, (4) బుధ, (5) గురు, 

(6) శుక్ర, (7) శని.


తెలుగు నెలలు : (1) చైత్రం,

(2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం, 

(5) శ్రావణం, (6) భాద్రపదం, 

(7) ఆశ్వీయుజం, (8) కార్తీకం, 

(9) మార్గశిరం, (10) పుష్యం, 

(11) మాఘం, (12) ఫాల్గుణం.


 రాశులు : (1) మేషం,(2) వృషభం, 

(3) మిథునం, (4) కర్కాటకం,

(5) సింహం, (6) కన్య, (7) తుల, 

(8) వృశ్చికం, (9) ధనస్సు, 

(10) మకరం, (11) కుంభం, 

(12) మీనం.


తిథులు : (1) పాఢ్యమి, (2) విధియ, 

(3) తదియ, (4) చవితి,(5) పంచమి, 

(6) షష్ఠి, (7) సప్తమి, (8) అష్టమి, 

(9) నవమి, (10) దశమి,(11) ఏకాదశి, 

(12) ద్వాదశి, (13) త్రయోదశి, 

(14) చతుర్దశి, 

(15) అమావాస్య /పౌర్ణమి.


నక్షత్రాలు : (1) అశ్విని, (2) భరణి, 

(3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర, 

(6) ఆరుద్ర, (7) పునర్వసు, 

(8) పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ, 

(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త, 

(14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ, 

(17) అనురాధ, (18) జ్యేష్ఠ, 

(19) మూల, (20) పూర్వాషాఢ, 

(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం, 

(23) ధనిష్ఠ, (24) శతభిషం, 

(25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర, 

(27) రేవతి.


తెలుగు సంవత్సరాల పేర్లు :

(1) ప్రభవ :-

1927, 1987, 2047, 2107


(2) విభవ :- 

1928, 1988, 2048, 2108


(3) శుక్ల :-

1929, 1989, 2049, 2109


( 4 ) ప్రమోదూత :-

1930, 1990, 2050, 2110


( 5 ) ప్రజోత్పత్తి :-

1931, 1991, 2051, 2111


( 6 ) అంగీరస :- 

1932, 1992, 2052, 2112


( 7 ) శ్రీముఖ :-

1933, 1993, 2053, 2113


( 8 )భావ. - 

1934, 1994, 2054, 2114


9యువ.  - 

1935, 1995, 2055, 2115


10.ధాత.  - 

1936, 1996, 2056, 2116


11.ఈశ్వర. - 

1937, 1997, 2057, 2117


12.బహుధాన్య.-

1938, 1998, 2058, 2118


13.ప్రమాది. - 

1939, 1999, 2059, 2119


14.విక్రమ. - 

1940, 2000, 2060, 2120


15.వృష.-

1941, 2001, 2061, 2121


16.చిత్రభాను. - 

1942, 2002, 2062, 2122


17.స్వభాను. - 

1943, 2003, 2063, 2123


18.తారణ. - 

1944, 2004, 2064, 2124


19.పార్థివ. - 

1945, 2005, 2065, 2125


20.వ్యయ.-

1946, 2006, 2066, 2126


21.సర్వజిత్తు. - 

1947, 2007, 2067, 2127


22.సర్వదారి. - 

1948, 2008, 2068, 2128


23.విరోధి. - 

1949, 2009, 2069, 2129


24.వికృతి. - 

1950, 2010, 2070, 2130


25.ఖర. 

1951, 2011, 2071, 2131


26.నందన.

1952, 2012, 2072, 2132


27 విజయ.

1953, 2013, 2073, 2133,


28.జయ. 

1954, 2014, 2074, 2134


29.మన్మద.

1955, 2015, 2075 , 2135


30.దుర్మిఖి. 

1956, 2016, 2076, 2136


31.హేవళంబి. 

1957, 2017, 2077, 2137


32.విళంబి. 

1958, 2018, 2078, 2138


33.వికారి.

1959, 2019, 2079, 2139


34.శార్వారి. 

1960, 2020, 2080, 2140


35.ప్లవ

1961, 2021, 2081, 2141


36.శుభకృత్. 

1962, 2022, 2082, 2142


37.శోభకృత్. 

1963, 2023, 2083, 2143


38. క్రోది.

1964, 2024, 2084, 2144, 


39.విశ్వావసు.

1965, 2025, 2085, 2145


40.పరాభవ.

1966, 2026, 2086, 2146


41.ప్లవంగ. 

1967, 2027, 2087, 2147


42.కీలక. 

1968, 2028, 2088, 2148


43.సౌమ్య. 

1969, 2029, 2089, 2149


44.సాధారణ . 

1970, 2030, 2090, 2150


45.విరోధికృత్. 

1971, 2031, 2091, 2151


46.పరీదావి. 

1972, 2032, 2092, 2152


47.ప్రమాది. 

1973, 2033, 2093, 2153


48.ఆనంద. 

1974, 2034, 2094, 2154


49.రాక్షస. 

1975, 2035, 2095, 2155


50.నల :-

1976, 2036, 2096, 2156, 


51.పింగళ                 

1977, 2037, 2097, 2157


52.కాళయుక్తి         

1978, 2038, 2098, 2158


53.సిద్ధార్ధి              

1979, 2039, 2099, 2159


54.రౌద్రి                 

1980, 2040, 2100, 2160


55.దుర్మతి              

1981, 2041, 2101, 2161


56.దుందుభి             

1982, 2042, 2102, 2162


57.రుదిరోద్గారి         

1983, 2043, 2103, 2163


58.రక్తాక్షి                 

1984, 2044, 2104, 2164


59.క్రోదన                  

1985, 2045, 2105, 216


60.అక్షయ              

1986, 2046, 2106, 2166.


ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం.... 

నమస్కారం

Read and Enjoy*

 *Read and Enjoy*

-----------------------


*Height of Fashion*

```Lungi with a zip.``` 


*Height of Laziness*

```Asking lift for morning walk.```


*Height of Craziness*

```Get blank paper xeroxed.```


*Height of Honesty*

```Pregnant woman taking 2 tickets.```

 

*Height of De-Hydration*

```Cow giving milk powder.```


*Height of Hope*

```A 99 year old woman going for Rs 295/- recharge to get lifetime incoming.```


*Height of Stupidity*

```Looking through key hole of a glass door.```


*Height of Suicide Attempt*

```A person jumps from the footpath on the road.```


*Height of Friendship*

```It’s when your friend runs away with your wife; and you are really worried for your friend!```


*Height of Attitude*

```A Sleeping Beggar puts a Notice Board in front of Him.```

_*Please do not make noise by dropping coins! Use Currency Notes.*_


*AND*


*THE ULTIMATE ONE*


*Height Of Work Pressure*

" An employee opens his Tiffin Box on the road side to see, whether he is going to office or coming back from office "

😅😂🤣😅😂🤣

*శ్రీ సరస్వతీ అష్టోత్తర శత నామ స్తోత్రం

 *శ్రీ సరస్వతీ అష్టోత్తర శత నామ స్తోత్రం:* 


సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా ।

శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రగా ॥ 1 ॥ 


శివానుజా పుస్తకధృత్ జ్ఞానముద్రా రమా పరా ।

కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ ॥ 2 ॥ 


మహాశ్రయా మాలినీ చ మహాభోగా మహాభుజా ।

మహాభాగా మహోత్సాహా దివ్యాంగా సురవందితా ॥ 3 ॥ 


మహాకాలీ మహాపాశా మహాకారా మహాంకుశా ।

సీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ ॥ 4 ॥ 


చంద్రికా చంద్రవదనా చంద్రలెఖావిభూషితా ।

సావిత్రీ సురసా దెవీ దివ్యాలంకారభూషితా ॥ 5 ॥ 


వాగ్దెవీ వసుధా తీవ్రా మహాభద్రా మహాబలా ।

భొగదా భారతీ భామా గొవిందా గొమతీ శివా ॥ 6 ॥ 


జటిలా వింధ్యవాసా చ వింధ్యాచలవిరాజితా ।

చండికా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మజ్ఞానైకసాధనా ॥ 7 ॥ 


సౌదామినీ సుధామూర్తిస్సుభద్రా సురపూజితా ।

సువాసినీ సునాసా చ వినిద్రా పద్మలొచనా ॥ 8 ॥ 


విద్యారూపా విశాలాక్షీ బ్రహ్మజాయా మహాఫలా ।

త్రయీమూర్తీ త్రికాలజ్ఞా త్రిగుణా శాస్త్రరూపిణీ ॥ 9 ॥ 


శుంభాసురప్రమథినీ శుభదా చ సర్వాత్మికా ।

రక్తబీజనిహంత్రీ చ చాముండా చాంబికా తథా ॥ 10 ॥ 


ముండకాయ ప్రహరణా ధూమ్రలొచనమర్దనా ।

సర్వదెవస్తుతా సౌమ్యా సురాసురనమస్కృతా ॥ 11 ॥ 


కాలరాత్రీ కలాధారా రూప సౌభాగ్యదాయినీ ।

వాగ్దెవీ చ వరారొహా వారాహీ వారిజాసనా ॥ 12 ॥ 


చిత్రాంబరా చిత్రగంధా చిత్రమాల్యవిభూషితా ।

కాంతా కామప్రదా వంద్యా విద్యాధరా సూపూజితా ॥ 13 ॥ 


శ్వెతాసనా నీలభుజా చతుర్వర్గఫలప్రదా ।

చతురాననసామ్రాజ్యా రక్తమధ్యా నిరంజనా ॥ 14 ॥ 


హంసాసనా నీలజంఘా బ్రహ్మవిష్ణుశివాత్మికా ।

ఎవం సరస్వతీ దెవ్యా నామ్నామష్టొత్తరశతం ॥ 15 ॥ 


ఇతి శ్రీ సరస్వత్యష్టొత్తరశతనామస్తొత్రం సంపూర్ణం ॥

తేట తెలుగు

 దేశభాషలందు 

ఉగ్గుపాలనుండి ఉయ్యాలలోననుండి
అమ్మ పాట పాడినట్టి భాష
తేనెవంటి మందు వీనులకును విందు
దేశభాషలందు తెలుగులెస్స!

 

సంస్కృతంబులోని చక్కెర పాకంబు,
అరవభాషలోని అమృతరాశి,
కన్నడంబులోని కస్తూరి వాసన,
కలిసిపోయె తేట తెలుగునందు.

 

వేనవేల కవుల వెలుగులో రూపొంది
దేశదేశములను వాసిగాంచి
వేయి యేండ్లనుండి విలసిల్లు నా “భాష”
దేశ భాషలందు తెలుగు లెస్స!

 సేకరణ 

మీ భార్గవ శర్మ 

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*గానామృత బోధ!..*


శ్రీ స్వామివారు తపోసాధన చేసుకుంటున్న రోజుల్లో..నేను తరచూ వారిని కలిసినా..పెద్దగా నాతో మాట్లాడింది లేదు..నేను వయసులో చిన్నవాడిని కావటం..అదీకాక వారి స్థాయికి తగ్గ మానసిక పరిపక్వత లేకపోవడం..కారణం కావొచ్చు..మామూలు క్షేమ సమాచారం అడుగుతూ వుండేవారు..లేదా అమ్మా నాన్న గార్లకు ఏదైనా చెప్పదలుచుకుంటే..వారిని తన దగ్గరకు ఫలానా సమయం లో రమ్మనమని నా ద్వారా కబురు చెప్పి పంపేవారు..ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు ఆశ్రమ ప్రాంగణంలో పచార్లు చేస్తూ వుండేవారు..అప్పుడు మాత్రం చాలా ఉత్సాహంగా..స్వచ్ఛమైన నవ్వుతో..వెలిగిపోతున్న ముఖంతో వుండేవారు..


ఒకరోజు నేను మా పొలానికి వెళుతూ..ఆశ్రమం దగ్గర ఆగాను..ఆ సమయం లో శ్రీ స్వామివారు ఆశ్రమం బయటే నిలుచుని వున్నారు..నన్ను చూసి పలకరింపుగా నవ్వి.."మాగాణికి పోతున్నావా?.."అన్నారు..


ఔనన్నాను..నన్ను తనతో పాటు రమ్మన్నట్టుగా సైగ చేసి..ఆశ్రమం లోకి వెళ్లారు..వెనుకనే నేనూ వెళ్ళాను..తాను తపస్సు చేసుకునే గది బైట వరండా లో పద్మాసనం వేసుకొని కూర్చుని..నన్నూ కూర్చోమన్నట్టుగా చేయి చూపారు..కొద్దిదూరంగా కూర్చున్నాను..ఆ సమయం లో శ్రీ స్వామివారు ప్రశాంతంగా వున్నారు..పైగా హాయిగా నవ్వుతూ వున్నారు..


"ఇప్పుడు కనిగిరి లో చదువుతూ ఉన్నావా?.." అన్నారు ..తలూపాను..


పెద్దగా నవ్వుతూ.."నేను మాట్లాడుతూ వుంటే...నువ్వు మౌనంగా ఉన్నావా?.." అన్నారు..


"అదేం లేదు స్వామీ..మీకు తెలుసు కదా నేను కనిగిరి లో చదువుకుంటున్నాననీ..మొన్ననే ఇంటర్ మొదటి సంవత్సరం లో చేరాను." అన్నాను..


"సినిమాలు చూస్తావా?.." అని అడిగారు..తలూపాను..నవ్వారు..


"నీకు తెలుసా?..నేను ఒక్క సినిమా చూసాను..నా చిన్నప్పుడు.."అన్నారు..


కొద్దిగా ఆశ్చర్యంగా అడిగాను.."ఏ సినిమా స్వామీ.." అని..


"భక్త ప్రహ్లాద.." అన్నారు.."నువ్వు చూసావా?..ఆ సినిమాను.." అన్నారు..చూసాను అని చెప్పాను..


ఒక్కక్షణం కళ్ళు మూసుకొని.."అందులో ఒక పాట ఉంది..నారాయణ మంత్రం..శ్రీమన్నారాయణ భజనం..అని..ఆ పాటలో నీలాటి వాళ్ళు తరించడానికి సులభమైన ఉపాయం బోధించారు..ఈసారి ఎప్పుడైనా మనసు పెట్టి విను.."

అంటూ..


"గాలిని బంధించి, హఠించి గాసిల పనిలేదు..

జీవుల హింసించి క్రతువుల చేయగ పనిలేదు..

మాధవా..మధుసూదనా అని మనసున తలచిన చాలుగా..." 

రాగయుక్తంగా పాడి వినిపించారు..


ఎంత మధురమైన కంఠస్వరం?..ఏదో దివ్యగానం వింటున్న అనుభూతి కలిగింది..ఒక్కనిమిషం పాటు మైమరపు కలిగింది..పాటలోని భావం తెలుసుకోవడం కన్నా..శ్రీ స్వామివారి గాత్రం లోంచి జాలువారిన ఆ పాట కర్ణపేయంగా అనిపించింది..


"అర్ధమైందా?..మేము సాధకులము..హఠ యోగం ద్వారా సాధన చేస్తున్నాము..అందరికీ ఇది సాధ్యం కాదు కదా..ముఖ్యంగా నీలాటి వాళ్ళు..రోజుకు కొద్దిసేపైనా ఆ పరమాత్ముడిని తలచి తరించమని ఎంత చక్కగా చెప్పారో చూసావా?.."


కొద్దిసేపటి క్రితం దాకా ఎంతో ఉల్లాసంగా..నవ్వుతూ ఉన్న స్వామివారు..అంతే ఉత్సాహంగా సినిమా ప్రసక్తి తెచ్చి..చిన్నపాటి బోధ చేశారు..


అందులోని తాత్వికభావాన్ని ఆరోజు నేను పూర్ణంగా ఆకళింపుచేసుకోలేక పోయాను..కానీ..ఇప్పటికీ శ్రీ స్వామివారు పాడిన ఆ చిన్నపాటి చరణం నాచెవుల్లో గింగురుమంటూనే ఉంది!..


మరో అనుభవం తో రేపు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

కవితా శరధి:-

 🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄

*దాశరథి-ఘన కవితా శరధి:-

---భోగయగారి. చన్ద్రశేఖర శర్మ.✍️

~~~~~~~~~

సీసపద్యం:-

************

గూడూరులో పుట్టె కోటికొక్కడు మేటి,

"కోటి రత్నమ్ముల" సాటి యతడు

పది వత్సరమ్ముల వయసున్న తరుణాన

పద్యముల్ వ్రాసిన పండితుండు

పద్యమే తనదైన పదునైన శస్త్రంగ

వాడి,"పాలన" కూల్చె పటువతండు

"అగ్నిధార"ను రాల్చి యా "నిజాము"ది బూజు

కాల్చివేసినయట్టి ఘనుడతండు


తేటగీతి

********

చలనచిత్ర గీతాలను చాల వ్రాసి

"నా తెలంగాణ కోటిరత్నాల వీణ"

యనిన తనకు,మహాకవికి నతులివియె

దాశరథికి ఘన సుకవితా శరధికి🙏🏼

౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿

21, జులై 2021, బుధవారం

గౌట్

 గౌట్ గురించి సంపూర్ణ వివరణ  - 


   ఈ వ్యాధిలో కాలిబాటన వ్రేళ్లు వాచి ఉంటాయి. నడిచినప్పుడు నొప్పిని కలిగించును. ఈ వ్యాధి కొంతకాలం ఉండి ఆ తరువాత దానంతట అదే తగ్గిపోవును . మరలా వస్తుంది. రక్తములో యూరిక్ ఆసిడ్ మోతాదు పెరగటం వలన ఈ సమస్య ఎక్కువుగా వచ్చును. 


 ఈ సమస్య రావడానికి గల కారణాలు  - 


      అధిక పరిమాణం ప్రొటీన్స్ గల పదార్ధాలలో "ప్యూరిన్స్ " అనబడు పదార్థాలు ఉంటాయి. ఇది జీర్ణం అగునప్పుడు యూరిక్ ఆమ్లం తయారగును. సాధారణముగా ఇది మూత్రములో విసర్జించబడుతుంది. కాని కొన్ని సందర్భాలాలో ఇది పూర్తిగా విసర్జించబడదు . ఇది రక్తములో నిలువ ఉండిపోతుంది. ఈ విధముగా విసర్జించబడని యూరిక్ ఆమ్లం స్పటిక రూపములో ముఖ్యముగా కాలిబాటన వ్రేలి కీలు వద్ద నిక్షిప్తమై ఉంటుంది . కావున బ్రొటన వ్రేలు వాచి నొప్పి కలిగించును. 


              ఈ యురిక్ ఆమ్లము ఎక్కువుగా ఉత్పత్తి అగుటకు కారణాలు  -

   

  *  ప్యూరిన్ ఎక్కువ గల ఆహార పదార్థాలు అయిన మాంసము విపరీతముగా తినటం . 


 *  నీరు తక్కువుగా తాగుతూ మద్యము , కాఫీ , టీ మొదలైన వాటిని అధికంగా సేవించుట . 


 *  విపరీతమైన మానసిక సంఘర్షణ . 


 *  వంశపారంపర్యముగా రావడం . 


            ఈ సమస్యకు సరైన ఔషధాలు వాడుతూ ముఖ్యముగా పథ్యం పాటించవలెను . ఈ సమస్యతో ఇబ్బందిపడువారు నన్ను సంప్రదించగలరు .  సంప్రదించవలసిన నంబర్       9885030034 . 


  

       మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


 

    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

దుర్గా సప్తశతి

 *దుర్గా సప్తశతి గ్రంథ పరిచయం..*  *(మొదటి భాగం)*


అమ్మవారి భక్తులకు దుర్గా సప్తశతి ఒక ప్రధానమైన పారాయణ గ్రంధము.   ఈ పుస్తకంలో వర్ణింపబడిన అమ్మవారి చరిత్ర దేవీభాగవతానికి సంక్షేప రూపంలోనూ సార రూపంలోనూ ఉంటుంది. 


వేద వ్యాసులవారు రచించిన  మార్కండేయ పురాణంలో సావర్ణి మన్వంతర విభాగంలో దేవీ మహత్మ్యం లో 13 అధ్యాయాలలో దుర్గా సప్తశతి విస్తరించి ఉన్నది. 


*మొత్తం సప్తశతి 13 అధ్యాయాలు ప్రధానంగా మూడు భాగాలుగా ఉంటుంది. వాటిని ప్రథమ చరిత్ర మధ్యమ చరిత్ర ఉత్తర/ఉత్తమ చరిత్ర అని పిలుస్తారు..*


మొత్తం పుస్తకం యొక్క పారాయణ మే కాకుండా ఈ పుస్తకంలో అత్యంత శక్తివంతమైన  స్తోత్రాలు విడివిడిగా పారాయణ చేసుకునేవి ఉన్నాయి. ఆ స్తోత్రాలు కూడా చాలా ప్రసిద్ధమైనవి చాలామంది నిత్యం పారాయణ చేసుకుంటూ ఉంటారు.  మొదటి అధ్యాయం లో 70 -87 శ్లోకాలు లో ఉన్న బ్రహ్మ దేవుడు చేసిన నిద్రాదేవత (కాళికా) స్తుతి. 4వ అధ్యాయం లో 3-27 శ్లోకాల లో ఉన్న దేవతలచే  చేయబడిన దుర్గా స్తోత్రం. ఐదవ అధ్యాయము లో 9-82 శ్లోకాల లో   యా దేవీ సర్వ భూతేషు అనివచ్ఛే   అపరాజిత దేవి స్తుతి . 11వ అధ్యాయములో 3-35 శ్లోకాల లో ఉన్న కాత్యాయని దేవి స్తుతి అంటే నారాయణి నమోస్తు తే అని వచ్ఛే నారాయణీ స్తోత్రము మొదలైనవి ఆ ప్రధానమైన స్తోత్రాలు. ఈ స్తోత్రాలకు వేదంలోని సూక్తాల  కున్నంత ప్రామాణ్యత గౌరవము ఉన్నాయి.  ఈ స్తోత్రాలు చాలామంది కి నోటికి వచ్చి రోజూ చదువుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళలో చాలామందికి ఈ స్తోత్రాలు  సప్తశతిలో ఉన్నాయి అన్న విషయం తెలియక పోవచ్చు.


అలాగే ఈ సప్తశతిలోని కొన్ని భాగాలను ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. అవి ప్రాధానికం రహస్యం, వైకృతికం రహస్యం, మూర్తి రహస్యం అనేవి. ఈ మూడింటినీ కలిపి రహస్య త్రయం అని ప్రత్యేకంగా పారాయణం చేస్తారు. 


పెద్దలూ గురువులూ సప్తశతిలోని కొన్ని శ్లోకాలు సిద్ధ మంత్రాలు గా గుర్తించి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఫలితాన్ని నిర్ణయించారు. అంటే ఏ కోరిక కోరుకునే వాళ్లకు దానికి సంబంధించిన ఆ మంత్రము జపం చేసుకోవాలి. ఆ సిద్ద మంత్రాల వివరాలన్నీ సాధారణంగా దేవీ సప్తశతి పారాయణ పుస్తకాలలో ఉంటాయి.


సూక్ష్మంలో మోక్షం కోరుకునే వాళ్లకోసం సప్తశతి లో నుంచి ఏడు శ్లోకాలను తీసి "సప్తశ్లోకీ దుర్గా" అని వాటిని పారాయణ చేస్తూ ఉంటారు. అది కూడా చాలా శక్తివంతమైన పారాయణ మంత్రము. ఆ ఏడు శ్లోకాలు కూడా చదువ లేని వాళ్ళ కోసం అందులో ఉన్న "సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే" శ్లోకం ఒకటైనా చదువుకోమంటారు.


*సప్తశతి లో ఉండకపోయినా సప్తశతి పారాయణమప్పుడు పఠించే అనుబంధ స్తోత్రాలు ::  దేవీ కవచము, అర్గలా స్తోత్రము, సిద్ద కుంజికా స్తోత్రము మొదలైనవి  ఉన్నాయి.*


సప్తశతి లో 587 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలను స్వతంత్రమైన వాక్యాలు గాను మంత్రాల గాను విభజించడం జరిగింది. అలా విభజించినప్పుడు 535 పూర్తి శ్లోకాలు, 42 అర్ధ శ్లోకాలు,  66 త్రిపాన్మంత్రాలు  ఇవి కాక రాజోవాచా  వైశ్య ఉవాచ మొదలైన ఉవాచ వాక్యాలు 57 ఉంటాయి. ఇవి మొత్తం కలిపితే 700 అవుతాయి. సప్తశతి అంటే 700 అని అర్థము. సప్తశతి లో మంత్రం కానటువంటి వృధా పదం అనేది ఏదీ లేదు.


*హిందూమతంలో వేదమంత్రాలను  ఉపయోగించి మాత్రమే వివిధ రకాలైన హోమాలు చేస్తుంటారు. పురాణాలలో మంత్రాలూ స్తోత్రాలూ ఉపయోగించి హోమాలు చెయ్యరు. కానీ సప్తశతి పురాణాలలోది అయినా దీనిని ఉపయోగించి చండీ హోమం జరపడం సాంప్రదాయంగా వస్తోంది.  చండీ హోమం మొత్తం కూడా దుర్గా సప్తశతి లోపలుండే ఏడు వందల మంత్రాల తోనే జరుగుతుంది.* *ప్రధానంగా సప్తశతి ని ఆధారం చేసుకుని చండీ హోమం జరుగుతుంది.* 


అందులోఅక్కడక్కడ పైన చెప్పిన స్తోత్రాలతోనూ నవార్ణ మంత్రజపము  తో కూడిన మరికొన్ని హోమాలు ఉంటాయి. రుద్ర, గణపతి మొదలైన హోమాలు కూడా మధ్య మధ్యలో ఉపాంగాలు గా ఉంటాయి..

సప్తశతి కి వేద భాగంగా పరిగణించేటంత మంత్రశక్తి, ప్రభావము ఉన్నాయన్నమాట...


.....ఇంకా వుంది.


*పవని నాగ ప్రదీప్*

Question-- Answer Rajneesh

 A follower of Rajneesh questioned him.

 Question - Please tell what should we do when houses and property are being burnt, murders are being done by jihadis?  Should promote Hindu Muslim brother brother or take any step for security, please guide.


 Answer: Your question itself is telling your stupidity, it does not seem that you have learned anything from history.


 When Mahmud Ghaznabi attacked the temple of Somnath, Somnath was the largest and richest temple in India at that time.


 1200 Hindu priests who worshiped in that temple thought that we are engaged in meditation, devotion, worship, day and night.


 So God will protect us.

 He did not make any arrangement for protection, on the contrary, the Kshatriyas who could protect themselves were also refused.


 As a result, Mahmud killed thousands of unarmed Hindu priests, broke idols and temples and robbed them of immense wealth, diamonds, jewels, gold and silver.

 His meditation and devotional worship could not protect him.


 Today even after hundreds of years the same stupidity continues, it does not seem that you have learned anything from the lives of your great men.


 If meditation had so much power that it could change the hearts of the wicked, then why would Ramchandra ji need to always keep a bow and arrow with him.  With the power of meditation, he would have changed the hearts of demons and Ravana, explaining them as sur-asura brothers and brothers and the quarrel would have ended, but even Rama could not explain to anyone and the decision of Ram-Ravana's war was also decided by the weapon.


 If meditation had so much power that it could transform the mind of others.  So why the Purnavatar Shri Krishna would have needed to kill Kansa and Jarasangha!  Change them carefully.


 If meditation had the power to change the mind of another, then the Mahabharata war would not have happened, Krishna would have changed Duryodhana with the power of his meditation and the war would have been averted.  But on the contrary Krishna stopped Arjuna who wanted to go into meditation and engaged him in battle.


 The war of Mahabharata is the biggest war in the history in which crores of people were massacred, how many Maharishi saints were there in India in the last 1200 years, from Gorakhnath to Raidas and Kabir to Guru Nanak to Guru Gobind Singh, the power of meditation of all these also Muslim invaders and Britishers.  During this, crores of Hindus were massacred and their religion was forcibly converted at the tip of the sword.


 were killed and converted to Islam

 The teachings of those saints could not change the invaders.  Guru Nanak gave his philosophy of religion in such a way that Muslims could easily understand and assimilate him.  But in the same Guru tradition, Guru Gobind Singh had to take up the sword against the Muslims, to protect the Hindu religion, the unarmed Sikhs had to take up arms.


 It becomes clear from this that meditation can transform one's own consciousness.

 But we have to protect the matter (physical body) ourselves, for that we have to take the help of science and technology.


 Solve more than 70% of the country's problems


 * Lord Shri Krishna had asked for 5 villages!

 *We are asking for 5 laws in the interest of the country!!*


 *Equal Education*

 *uniform civil code*

 *Conversion Control*

 *Intrusion Control*

 *Population Control*


 If these five laws do not come, Sanatan will be completely destroyed like the whole world and nine states of India.


 *Save India Movement*


 *10 am, 8th August 2021*

 *Come to Jantar Mantar, Delhi*


 Contact No - 9868310740


 You have to send this message to at least 5 people.  *(I will send it to all my friends)*


 * in this way 5 people will message 5..*


 5 × 5 = 25

 25 × 5 = 125

 125 × 5 = 625

 625 × 5 = 3125

 3125 × 5 = 15,625

 15625 × 5 = 78,125

 78,125 × 5 = 390,625

 390,625 × 5 = 1,953,125

 1,953,125 × 5 = 9,765,625

 9,765,625 × 5 = 48,828,125

 48,828,125 × 5 = 244,140,626


 * you just have to add a link and,*

 * Seeing the whole country will stand with you.* 🙏🙏🚩🚩

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అప్పులు..అన్నదానం...* 


"ఏమిటోనండీ నన్ను మాత్రమే గురి పెట్టుకొని ఆ భగవంతుడు కష్టాలను సృష్టించాడేమో అనిపిస్తోంది..మూడేళ్ళ నుంచీ నలిగిపోతున్నాను..మనసుకు ఒక్క క్షణం శాంతి లేదు..తీవ్రమైన నైరాశ్యం లో కూరుకుపోయాను..చిన్నపాటి ఆశ కూడా లేకుండాపోయింది..ఇక నాకు మిగిలింది చావొక్కటే..నా అంతట నేను నా ప్రాణం తీసుకోలేను..ఆ భగవంతుడిని కోరుకునేది ఒక్కటే.."నాయనా! నన్ను కడతేర్చు తండ్రీ!..ఈ బాధలు, అవమానాలు నేను పడలేను.." అంటూ కన్నీళ్ల పర్యంతం అవుతున్న ఆ వ్యక్తిని చూస్తే..ఎంతో బాధ వేసింది..


మరి కొద్దిసేపటికి ఆయన కొద్దిగా ఊరడిల్లాడు..కళ్ళు తుడుచుకుని ఒక ప్రక్కగా కూర్చున్నాడు..మెల్లిగా ఆయన వివరాలు అడిగాను..ఆయన పేరు కామేశ్వర రావు..హైదరాబాద్ నుంచి వచ్చారు..ఒక ప్రైవేట్ కంపెనీ లో అకౌంటెంట్ గా పని చేస్తున్నారు..భార్యా ఇద్దరు పిల్లలు..ఉన్నంతలో సుఖంగానే వున్నారు..కామేశ్వరరావు గారి మంచితనాన్ని ఆసరాగా తీసుకున్న మిత్రులు..తాము చేసిన అప్పులకు ఈయనను హామీగా వుండమని కోరారు..ముందూవెనుకా ఆలోచించకుండా కామేశ్వరరావు గారు సంతకాలు పెట్టేసారు..కొన్నాళ్ళకు ఆ మిత్రులు ముఖం చాటేశారు..ఆ అప్పులను వడ్డీతో సహా ఈయన కట్టాల్సివచ్చింది..అందుకోసం వేరేవాళ్ళ దగ్గర కామేశ్వరరావు ఎక్కువ వడ్డీ కి అప్పు చేయాల్సి వచ్చింది..ఒక దశకు వచ్చేసరికి..ఈయనకు వచ్చే జీతంలో ముప్పావు భాగం తాను తెచ్చిన.. లేదా..హామీ ఉన్న అప్పుల తాలూకు వడ్డీలు కట్టడానికే సరిపోతున్నది..దానికి తోడు అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటికొచ్చి నానా మాటలు అనసాగారు..ఈ పరిణామాలతో కామేశ్వర రావు కృంగిపోయాడు..దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు..దేవుడి మీద భారం వేసి కాలం వెళ్లబుచ్చసాగాడు..


ఆ సమయం లో కామేశ్వర రావు కు చిన్ననాటి మిత్రుడు కలిసాడు..అతను దత్త భక్తుడు..పిఠాపురం లో ఉన్న పాదగయ క్షేత్రాన్ని దర్శించమని..అలాగే వీలుంటే మరికొన్ని అవధూతల మందిరాలను కూడా దర్శించమని..అలా దర్శిస్తే కొంత మేలు జరుగుతుందని సలహా ఇచ్చాడు..కామేశ్వర రావుకు ఈ సలహా పెద్దగా నచ్చలేదు..కానీ..స్నేహితుడి తో మాత్రం సరే అన్నాడు..ఆరోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి..దూరపు బంధువు ఒకాయన ఫోన్ చేసి..తాను ఈ శనివారం నాడు మాలకొండ వెళుతున్నాననీ.. అక్కడినుండి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి కూడా వెళుతున్నాననీ చెప్పాడు..కామేశ్వర రావు కు ఎందుకో తాను కూడా వెళితే బాగుండు అనిపించింది..వెంటనే తాను కూడా వస్తానని ఆయనకు చెప్పేసాడు..అలా శనివారం నాడు మాలకొండలోని శ్రీ మాల్యాద్రి లక్ష్మీనృసింహుడి ని దర్శనం చేసుకొని సాయంత్రానికి మొగలిచెర్ల వచ్చారు..


ఆరోజు పల్లకీ సేవ లో కామేశ్వర రావు పాల్గొన్నాడు..రాత్రికి మందిరం లోనే నిద్ర చేసాడు..ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి సమాధికి జరిగిన అభిషేకమూ.. విశేష హారతులూ శ్రద్ధగా చూసాడు..తరువాత తాను కూడా అర్చన చేయించుకొని..సమాధి దర్శనం చేసుకున్నాడు.. ఇవతలికి వచ్చిన తరువాత.."మొదటి సారిగా ఒక అవధూత మందిరాన్ని దర్శించుకున్నానండీ..నా సమస్యలన్నీ స్వామివారికి చెప్పుకున్నాను..అంతా ఆయనదే భారం..అన్నీ సర్దుకుంటే మళ్లీ ఒకసారి వచ్చి స్వామివారి సమాధి దర్శనం చేసుకుంటాను..ఆదివారం నాటి అన్నదానానికి అయ్యే మొత్తం ఖర్చు భరిస్తాను.."  అన్నాడు..


కామేశ్వర రావు హైదరాబాద్ చేరిన రెండు మూడు రోజుల్లోనే..ఢిల్లీ లో ఉంటున్న వాళ్ళ అక్కయ్య గారు హైదరాబాద్ వచ్చారు..కామేశ్వర రావు తాను అనుభవిస్తున్న బాధలు ఆవిడకు చెప్పుకున్నాడు..ఆవిడ శ్రద్ధగా విని..ఢిల్లీ లో తమకున్న అపార్ట్మెంట్ లో ఒకదానిని అమ్ముతున్నాననీ.. తనకు సుమారు రెండు కోట్లు వస్తాయని..అందులోంచి తమ్ముడి కోసం కొంత మొత్తాన్ని ఇస్తానని చెప్పారు..ఇది కామేశ్వర రావు ఏరకంగానూ ఊహించలేదు..ఆవిడ ఇవ్వబోయే మొత్తంతో తనకున్న అప్పుల్లో తొంభైశాతం తీరిపోతాయి..అవధూత మందిరాన్ని దర్శించుకుంటే మేలు జరుగుతుందని తన మిత్రుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి..ఆ దత్తాత్రేయుడు తనకు ఇలా మేలు చేశాడని నమ్మకం కలిగింది..


మరో రెండు నెలల కల్లా కామేశ్వరరావు గారి అక్కయ్య గారు నలభై లక్షల రూపాయలను తీసుకొచ్చి ఇచ్చారు..వెంటనే తనకున్న అప్పులను తీర్చివేశాడు..మరో పదిరోజుల తరువాత భార్యా పిల్లలను తీసుకొని మొగలిచెర్ల కు వచ్చాడు..ఆరోజు ఆదివారం నాటి అన్నదానానికి మొత్తం ఖర్చు తానే భరించాడు..


"ఆ దత్తాత్రేయుడే మా అక్కయ్య రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నాడు.. ఇక జన్మలో ఇంతకు ముందు చేసిన పొరపాట్లు చేయనండీ.." అని ఇప్పటికీ చెపుతుంటాడు కామేశ్వరరావు భక్తిగా..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

పదాల తేడా

 🍃🥀పదాల తేడా చదువుకోడానికి మాత్రమే..చర్చకోసం కాదు

🙂 🙂 🙂 🙂 🙂 🙂

'ఓ పల్లెటూరి కిరాణా వ్యాపారి టీచర్ దగ్గరకొచ్చి ' సింతపండు' అని రాసినందుకు నా కొడుకుని దండించారట. ' చింతపండుని సింతపండు అంటే దాని పులుపేమైనా తగ్గిపోతుందా ? ఎలా రాసినా పర్వాలేదు. కొంచెం కిరణాపద్దులు రాయడం నేర్పండి చాలు' అంటాడు. మునిమాణిక్యం వారి రచనలలోని సన్నివేశం ఇది.భాష ప్రయోజనం భావ వ్యక్తీకరణకే. కానీ కొన్ని పదాలు వాటి మూలాలు తెలుసుకుంటే చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. చూడండి.  

'వాడెదవ' అంటే తిట్టనుకునేరు .చెరకుగడ చివరిభాగం. tip of the sugar cane అన్నాడు బ్రౌన్.

'సమాజం' అనబోయి 'సమజం' అన్నారనుకోండి.ప్రజా సమూహం కాస్తా 'పశువుల మంద' అయిపోతుంది.

'రామబాణం' అంటే మనకు తెలిసిన అర్ధమే కాదు. 'తాటాకు గ్రంధాలను తొలిచే పురుగు' అనే అర్ధం కూడా ఉంది. (ఈ అర్ధం బాగుంది కదా !)

'శ్రీ' అంటే విషం అనే అర్ధం కూడా ఉందండోయ్.

'దస్తూరి' అంటే చేతిరాత అనే కాదు 'సుంకం' అని కూడా .(customary fee - బ్రౌన్)

 ఒకాయన ఉదయాన్నే ఓ పండితుడి ఇంటికి వెళ్లి అతని కుమారుణ్ణి " మీ నాన్నగారున్నారా ? " అని అడిగాడట. తండ్రికి తగ్గ ఆ కొడుకు " పెరట్లో పుష్పిక విముక్తికై నిష్టీవన కార్యక్రమంలో ఉన్నారు " అన్నాడట ఆ పెద్ద మనిషి అదేదో పూజా కార్యక్రమం అనుకుని వెళ్ళిపోయాడు పాపం. ఇంతకీ ఆ పండితుడు పళ్ళు తోముకుంటున్నాడు. పుష్పికం అంటే పళ్ళ పాచి ( దంత మలం అని శబ్దరత్నాకరం ) నిష్ఠివనం అంటే ఉమ్మేయడం.

 ఒక మీటింగులో ఓ వక్త మాట్లాడుతూ " మన మంత్రిగారు సభాజనమును బాగా ఆకట్టుకుంటారు " అన్నాడట . 'సభాజనము' అంటే చుట్టాలను కౌగాలించుకుని సంతోష పెట్టడం( శబ్దరత్నాకరం)

సొంతవిషయాలను పదేపదే చెబుతుంటే ' నీ సొద ఆపు అంటాం . విసుగెత్తించే ప్రసంగం అనే అర్ధం మాండలికాల్లో ఉంది కానీ " శవాన్ని కాల్చడానికి పేర్చిన కట్టెల పోగు " అనేది నిఘంటు అర్ధం.

ఫలానా రాజకీయ నాయకుడికి ప్రజలు 'బ్రహ్మరధం' పట్టారు అంటారు. గొప్ప సత్కారం అనే అర్ధమే తీసుకుంటాం. కానీ బ్రహ్మరథం అంటే 'చనిపోయిన సన్యాసులను తీసుకుపోయే వాహనం' అని సూర్యరాయాంధ్ర నిఘంటువు లో ఉంది. 

' గ్రామీణ ప్రాంతం' అంటున్నాం. 'గ్రామీణ' అంటే వేశ్య అనే అర్ధం కూడా ఉంది.

గందానికి లేని ఒత్తు తగిలించి 'గంధం' అని రాస్తున్నాం.

'బోగి పండుగ' ను 'భోగి పండుగ' అనకపోతే మనకి పండగలా అనిపించదు.

గొడుగు అంటే తెలుసు. మరి 'గిడుగు' అంటే? కర్ర లేని గొడుగు.

పంగనామం అంటే తెలుసు మరి 'బుంగనామం' ఏమిటి ? తెల్ల నామానికి ఎర్ర నామానికీ ఎడము లేకుండా ఉండే నామం.

బాధితులకు నష్ట 'పరిహారం' ఇవ్వాలంటారు. 'పరిహారం' అంటే విడిచిపెట్టడం అనే అర్ధం కూడా ఉంది 

'ఇలాగే ప్రయోగించండి' అని చెప్పడానికో, చర్చ కోసమో కాదు ఇది. ఆసక్తి ఉండాలే కానీ నిఘంటువులు తిరగేస్తే ఇలాంటి విశేషాలెన్నో చూడొచ్చని చెప్పడానికి.

                🍃🥀🍃🥀🍃

సేకరణ: అంతర్జాలం

శ్రీ కృష్ణుడు ఇప్పటికీ

 శ్రీ కృష్ణుడు ఇప్పటికీ సజీవంగా పూరి క్షేత్రంలో జగన్నాధుడిగా ఉన్నాడా?


శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, దహన సంస్కారాలు జరిగాయి, ఆయన శరీరమంతా ఐదు మూలకాలలో కలుపుతారు కాని ఆయన గుండె ఒక సాధారణ మనిషిలా కొట్టుకుంటుంది. ఆయన ఖచ్చితంగా సురక్షితంగా ఉన్నాడు, ఆయన గుండె ఈ రోజు వరకూ సురక్షితంగా ఉంది, ఇది జగన్నాథుని చెక్క విగ్రహం లో ఉంది. మరియు అదే విధంగా కొట్టుకుంటుంది, చాలా కొద్ది మందికే ఇది తెలుసు.


 మహాప్రభు జగన్నాథ్ (శ్రీ కృష్ణ) ను కలియుగ ప్రభువు అని కూడా అంటారు.


 ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాప్రభు విగ్రహం మార్చబడుతుంది, ఆ సమయంలో పూరి నగరం మొత్తం చీకటిగా మారుతుంది. అంటే మొత్తం నగరం అంతటా లైట్లు ఆపివేయబడతాయి. లైట్లు ఆపివేసిన తరువాత, crpf సైన్యం అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడుతుంది ... ఆ సమయంలో ఎవరూ ఆలయంలోకి ప్రవేశించలేరు ...


 ఆలయం లోపల దట్టమైన చీకటి ఉంది ... పూజారి కళ్ళు కట్టుకున్నాయి ... పూజారి చేతిలో చేతి తొడుగులు ఉన్నాయి .. పాత విగ్రహం నుండి "బ్రహ్మ పదార్ధం" తీసి కొత్త విగ్రహంలో ఉంచుతాడు ... ఈ బ్రహ్మ పదార్ధం ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ... ఈ రోజు వరకు ఎవరూ చూడలేదు. .. వేలాది సంవత్సరాలుగా ఇది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతోంది ...


 ఇది అతీంద్రియ పదార్ధం, దానిని తాకడం ద్వారా, ఒక వ్యక్తి శరీరం యొక్క రోగాలు ఎగిరిపోతాయి .. ఈ బ్రహ్మ పదార్ధం శ్రీ కృష్ణుడికి సంబంధించినది .. అయితే అది ఏమిటోి, ఎవరికీ తెలియదు ... ఈ మొత్తం ప్రక్రియ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆ సమయంలో భద్రత చాలా ఎక్కువగా ఉంటుoది .


 కానీ ఈ రోజు వరకు మహాప్రభు జగన్నాథ్ విగ్రహంలో ఏముంది అని ఏ పూజారి కూడా చెప్పలేకపోయారు ???


 కొంతమంది పూజారులు మేము అతని చేతిలో తీసుకున్నప్పుడు, అతను కుందేలు లాగా దూకుతున్నాడని ... అక్కడ కళ్ళకు కట్టినట్లు ఉంది ... చేతికి తొడుగులు ఉంటేనే మనకు ఆ అనుభూతి కలుగుతుంది అని చెప్తున్నారు. ...


 ఈ రోజు కూడా, జగన్నాథ్ యాత్ర సందర్భంగా, పూరి రాజు స్వయంగా బంగారు చీపురుతో తుడుస్తాడు.


 లార్డ్ జగన్నాథ్ ఆలయ సింహ ద్వారం నుండి లోపలికి మొదటి అడుగు వేసిన వెంటనే సముద్రపు తరంగాల శబ్దం వినబడదు, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు ఆలయం నుండి ఒక అడుగు బయటకు వేసిన వెంటనే, సముద్రం యొక్క అలల హోరు వినబడుతుంది.


 చాలా దేవాలయాల శిఖరంపై పక్షులు కూర్చుని ఎగురుతూ ఉండడాన్ని మీరు చూసిఉంటారు, కాని జగన్నాథ్ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు.


 జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది


 లార్డ్ జగన్నాథ్ ఆలయం యొక్క ప్రధాన శిఖరం రోజులో ఏ సమయంలోనైనా నీడ పడదు.


 లార్డ్ జగన్నాథ్ ఆలయం యొక్క 45 అంతస్తుల శిఖరంపై ఉన్న జెండాను ప్రతిరోజూ మార్చడం జరుగుతుంది, జెండాను ఒక రోజు కూడా మార్చకపోతే, ఈ ఆలయం 18 సంవత్సరాలు మూసివేయబడుతుంది.


 అదేవిధంగా, జగన్నాథ్ ఆలయం పైభాగంలో సుదర్శన్ చక్రం కూడా ఉంది, ఇది ఏ దిశ నుండి చూసినా అది మీకు ఎదురుగా ఉంటుంది.


 లార్డ్ జగన్నాథ్ ఆలయ వంటగదిలో, 7 మట్టి కుండలు ఒకదానికొకటి పైన ఉంచి ప్రసాదం ఉడికించాలి, ఇది ఒక చెక్క నిప్పుతో వండుతారు, ఈ సమయంలో పైన ఉంచిన కుండ యొక్క వంటకం మొదట వండుతారు.


 లార్డ్ జగన్నాథ్ ఆలయంలో ప్రతిరోజూ చేసిన ప్రసాదం భక్తులకు ఎప్పుడూ తగ్గదు, కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయ తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది.


 ఇవన్నీ ఆశ్చర్యకరమైనవి.

గురువు

 💥గురువు ??


🌹డబ్బు,  పేరు, పదవులు ఇవన్నీ అర్థాలు మాత్రమే.. పరమార్థాన్ని చేరుకోవడమే జీవన గమ్యం.. దానిని చేర్చగలిగేవాడు 'గురువు' మాత్రమే అని చెప్పే కధ ఇది.                                


💥ఓ మహానగరంలో  ఓ గురువుగారు తన వద్దకు వచ్చేవారికి ఆధ్మాత్మిక శిక్షణ ఇస్తూ.. ధర్మప్రబోధం చేస్తుండేవారు. మహాసంపన్నుడొకడు ఈ గురువుగారి దగ్గరకు వచ్చి

“ అసలు గురువు అవసరమా?

గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి?” అని ప్రశ్నించాడు. 


💥గురువుగారు నవ్వుకుని , మీరేం చేస్తుంటారని అడిగారు. నాకు అతిపెద్ద సూపర్ బజార్ ఉంది అని సమాధానమిచ్చాడు సంపన్నుడు.

అయితే! ఒకసారి మీ సూపర్ బజార్ కు నన్ను తీసుకువెళ్లండని గురువుగారు అడిగారు. 


💥ఇద్దరూ కలిసి సూపర్ బజార్ కు వెళ్లారు. ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది. 


💥ఏడంతస్థుల పెద్ద భవంతి. అందులో దొరకనిదంటూ ఉండదు. దానిని చూసిన గురువుగారు నవ్వుకున్నారు.


💥అక్కడే ఈ సంపన్నుడు ఆవులను, కుక్కలను పెంచుతున్నాడు. ఆ మందలోంచి ఒక ఆవును సూపర్ బజార్ లోపలికి వదలవలసిందిగా గురువుగారు కోరారు.


 💥కోరినట్లుగానే ఆవును లోపలికి ప్రవేశపెట్టారు. అది అన్నీ తిరుగుతూ, తిరుగుతూ చివరకు ఒక మూల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉన్న పండ్ల దుకాణంలోకి వెళ్లింది. కడుపునిండా , తృప్తిగా మేసింది. రెండుగంటల వ్యవధిలో తిరిగి వచ్చేసింది.


💥తదుపరి తను పెంచుతున్న కుక్కను లోపలికి వదలమని కోరారు గురువుగారు. దానిని కూడా లోపలికి పంపారు. అది కూడా తిరుగుతూ.. తిరుగుతూ.. వాసన చూస్తూ, మూడవ అంతస్థులో మాంసం అమ్మే దుకాణంలోకి వెళ్లింది. తృప్తిగా తినేసింది. మూడు గంటల వ్యవధిలో అది కూడా తోక ఊపుకుంటూ యజమాని దగ్గరకు వచ్చేసింది.


💥ఈసారి ఒక సామాన్యుడిని పిలిచి, నీకు నచ్చినన దానిని తీసుకో అని చెప్పి పంపారు గురువు. ఉత్సాహంతో లోపలికి ప్రవేశించిన మనిషి అన్నింటినీ చూసి, ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఏం తీసుకోవాలో అర్ధం కావటం లేదు. రెండు, మూడు, నాలుగు గంటలు గడిచిపోయినా బయటకు రావడం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు.

గురువుగారు యజమానిని కలిసి అతడున్న చోటకి చేరుకున్నాడు. నెత్తిమీద చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్ధం కావడం లేదు. ఈ వస్తులన్నింటినీ చూస్తుంటే పిచ్చెత్తిపోతోంది అన్నాడు ఆ వ్యక్తి. 


💥దీనిని విన్న సంపన్నుడు అవాక్కయ్యాడు. ఆవుకీ, కుక్కకీ పిచ్చెక్కలేదు. వాటికి ఏం కావాలో వెతుక్కుని తృప్తిగా ఆరగించి వచ్చాయి. 


*మనిషి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు. తనకే అన్ని తెలుసనుకుంటాడు*.


*పా..పం! అందుకే వీడికి గురువు కావాలి.*


💥ఎలా జీవించాలో జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి. అందుకే వాటిని తెలియజెప్పే గురువు అత్యంత అవసరమని గురువుగారు చెప్పడంతో యజమానికి ధనగర్వం తొలగింది.


💥పుస్తకాలు స్కూల్ లోనూ ఉంటాయి .. లైబ్రరీ లోనూ ఉంటాయి .. కాని పిల్లలు చదువుకోవాలి అంటే స్కూల్ లో చేరుస్తాము .. పిల్లలను స్కూల్ లో కాక లైబ్రరీ లో వదిలి పెడితే  ఏం చదవాలో తెలియక పిల్లవాడికి అసలు చదువంటేనే విరక్తి కలుగుతుంది .. ఆదే గురువు యొక్క. గొప్పదనం .. 


💥స్టూడెంట్ ని గమనిస్తూ  ఒక తల్లి తన బిడ్డకి ఆకలి తీర్చి పోషణ అందించినట్లు .. స్టూడెంట్ కి ఒక గురువు జ్ఞానం అనే పోషణ అందిస్తారు ...                                                                                                        

 

    🙏గురువుతోనే గమ్యం సాధ్యం🙏


     🌹సర్వేజనాః సుఖినోభవంతు 🌹


శ్రీ ధర్మశాస్త సేవాసమితి 🐆 విజయవాడ🏹 7799797799