11, డిసెంబర్ 2021, శనివారం

కాశీ.

 కాశీ.....🛕🙏💐


కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం...


కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. 


విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న 

ప్రత్యేక స్థలం.


ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. 

ప్రపంచ సాంస్కృతిక నగరం.

స్వయంగా శివుడు నివాసముండె నగరం.


ప్రళయ కాలంలో మునగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. 


కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.


కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, 

కాలభైరవ దర్శనము 

అతి ముఖ్యం....


ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.


కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....

డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...


కాబట్టే కాశీలో కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.


కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.


అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.

మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.


గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.


శివుని కాశీలోని కొన్ని వింతలు.

కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.


కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.


కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు. 


అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి, అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు 

అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.


కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు, కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.


కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.


విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.


ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.


కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి... ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి 

ఎన్నో వున్నాయి. 


అందులో కొన్ని.....


1) దశాశ్వమేధ ఘాట్...


బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.


2) ప్రయాగ్ ఘాట్...


ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.


3) సోమేశ్వర్ ఘాట్...


చంద్రుని చేత నిర్మితమైనది.


4) మీర్ ఘాట్...


సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం. ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.


5) నేపాలీ ఘాట్...


పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.


6) మణి కర్ణికా ఘాట్...


ఇది కాశీలో మొట్ట మొదటిది. 

దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు.

ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. 

ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.


7) విష్వేవర్ ఘాట్...


ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. 

ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.


😎 పంచ గంగా ఘాట్...


ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.


9) గాయ్ ఘాట్...


గోపూజ జరుగుతున్నది.


10) తులసి ఘాట్...


తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.


11) హనుమాన్ ఘాట్...


ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.


12) అస్సి ఘాట్...


పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.


13) హరిశ్చంద్ర ఘాట్...


సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...


14) మానస సరోవర్ ఘాట్...


ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.


15) నారద ఘాట్.. 


నారదుడు లింగం స్థాపించాడు.


16) చౌతస్సి ఘాట్...


ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 

64 యోగినిలు తపస్సు చేసినారు.

ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... 

ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 

64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.


17) రానా మహల్ ఘాట్...


ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.


18) అహిల్యా బాయి ఘాట్...


ఈమె కారణంగానే మనం ఈరోజు 

కాశీవిశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము. 


కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.


పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.


కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము. విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు. 


నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, 

మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది. అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.


కాశీ స్మరణం మోక్షకారకం...🙏


|| ఓం నమః శివాయ ||

10, డిసెంబర్ 2021, శుక్రవారం

తులనాభికాభంగ

 లలనా జనాపాంగ వలనావసదనంగ

తులనాభికాభంగ దోఃప్రసంగ

మలసానిల విలోలదళ సాసవ రసాల

ఫల సాదర శుకాలపన విశాల

మలినీ గరుదనీక మలినీకృత ధునీ క

మలినీ సుఖిత కోకకులవధూక

మతికాంత సలతాంత లతికాంతర నితాంత

రతికాంత రణతాంత సుతనుకాంత

తే.

మకృత కామోద కురవ కావికల వకుల

ముకుల సకల వనాంత ప్రమోద చలిత

కలిత కలకంఠకుల కంఠకాకలీ వి

భాసురము వొల్చు మధుమాస వాసరంబు!

అష్ట సిద్ధులు

 అష్ట సిద్ధులు  - 


  హిమాలయాలలో , దక్షిణమున నల్లమల అడువుల్లోని శ్రీశైల శిఖర ప్రాంతాన గొప్ప గొప్ప యోగులు ఉన్నారు . వారికి తెలియని విద్యలు అంటూ ఏమి లేవు . వారు ఎలాంటి విద్యలు కలిగి ఉంటారో మీకు ఈ పొస్ట్ లొ వివరిస్తాను.


 * అణిమ -  


 అన్ని జంతువుల కంటే స్వల్ప జంతువు వలే కనపడుట . తన ఆకారం కంటే కొద్ది ఆకారం గల జీవము వలే యుండుట .


 * మహిమ -


 బ్రహ్మ , విష్ణు, శివుడు ఈ త్రిమూర్తులు కంటే పెద్దవాడిగా కనపడుట.


 * లఘిమ - 


 దూది కంటే తేలిక అయ్యి ఉండుట. యే మాత్రం బరువు లేకుండా ఉండుట . 


 * గరిమ - 


 బరువుగల సమస్త జీవములు, సమస్త పదార్దముల కంటే బరువు అయ్యి ఉండుట. 


 * ప్రాప్తి  - 


 కోరిన దానినేల్లా కలగ చేసుకొనుట . తనకే ఆకారం కావలెను అన్న ఆ ఆకారంని పొందుట. కొరిన చోటకేల్లా క్షణ మాత్రములో పోవుట , కొరిన వస్తువుని గాని జీవముని గాని తన యోద్దకి తెప్పించు కొనుట . 


 * ప్రాకామ్యము  - 


 ఆకాశ గమనము కలిగి యుండుట, తన శరీరం వదిలి త్రిలోక సుందరమగు యవ్వన శరీరము తాను కోరినంత కాలము పొంది యుండుట. 


 * వశిత్వము  - 


 సమస్త జంతువులను , దుష్ట మృగములను పెద్ద పులి,చిరుత పులి , సింహము, మదగజము మొదలగు అడివి జంతువులను మొసలి, తాంబేలు, చేప మొదలగు నీటి జంతువులను, సర్పములు మొదలగు వాటిని మచ్చిక చేసుకొనుట .


 * ఈశత్వము  - 


 కామ, క్రోధ, లోభ, మోహ , మధ, మాత్సర్యము అనెడు అరిషడ్వర్గములను జయించి ఆధ్యాత్మిక , బౌతికాది , ధైవికములు అనెడి తాపత్రయములు లేనివాడై జితేన్ద్రియుడై , భూత, భవిష్యత్ , వర్తమాన విషయాలను సర్వమును గ్రహించి ఈశ్వరుని వలే సృష్టి, స్థితి, లయములు లకు కారణ భూతుడు అగుట .


                 

              కాళహస్తి వేంకటేశ్వరరావు 


                అనువంశిక ఆయుర్వేదం 


                      9885030034

9, డిసెంబర్ 2021, గురువారం

గుడికి వెళ్లి పూజచేయడం ఎందుకు?📚

 📚ఇంట్లో దేవుని ప‌టాలు ఉండ‌గా గుడికి వెళ్లి పూజచేయడం ఎందుకు?📚


ఇంట్లో దేవతారాధన చేస్తాం. అలాంటప్పుడు ‘గుడికి వెళ్లి పూజచేయడం ఎందుకు?’ అనే సందేహం చాలా మందికి వ‌స్తుంది. దేవాలయంలో మూలవిరాట్టు ఉన్న చోట బీజాక్షర యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. యంత్రాన్ని రాగితో చేస్తారు. దానిమీద బీజాక్షరాలు ఉంటాయి. చక్రాలు వేసి ఉంటాయి. చక్రం బోలెడు కోణాల కలయిక. ఒకసారి ఇందులోకి ప్రవేశించిన ఏ శక్తైనా ప్రతి కోణానికీ తాడనం చెందుతూ పెద్దదిగా మరింత బలమైనదిగా మారుతుంది. రాగి మంచి వాహకం. భూమిలోపల ఉండే విద్యుదయస్కాంత తరంగాల శక్తిని ఒక దగ్గరికి తీసుకురావడంలో యంత్రం గొప్పగా పనిచేస్తుంది. అందువల్ల అక్కడ శక్తిక్షేత్రం ఏర్పడుతుంది. 


నిజానికి స్వయంభూ దేవాలయాలన్నింటి దగ్గరా ఇలాంటి శక్తి తరంగాలు అత్యధికంగా ఉంటాయి. అలా దేవుడు వెలసిన చోటును రుషులు గుర్తించి దేవాలయాల్ని నిర్మించేవారు. ఇక, మంత్రబలంతో ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. గుళ్లొ నిరంతరం అర్చన జరుగుతూనే ఉంటుంది. దేవాలయంలో ఎన్ని పూజలు జరిగితే ఆ విగ్రహానికి అంత శక్తి వస్తుంది. ఆ విధంగా ఏళ్లతరబడి ఆ విగ్రహానికి శక్తి ఆపాదన జరుగుతుంది. అందుకే పురాతన ఆలయాలకు వెళ్లడం గొప్పవిషయంగా చెబుతారు....

మార్గశిర మాసం ప్రారంభం

 _*రేపటి నుండి మార్గశిర మాసం ప్రారంభం , మార్గశిర మాస విశిష్టత*_


ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది అని అందరికి తెలిసిన విషయం. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో *మాసానాం మార్గశీర్షోహం* అని చెప్పారు అంటే హిందువులకు ఈ మాసం ఎంత పవిత్రమైనదో అని బాగా తెలుస్తుంది. మోక్ష గ్రంధమైన భగవద్గీత అవతరించినది కూడా ఈ మాసంలోనే అని చెప్తూ ఉంటారు. హిందువులు నెల రోజుల పాటు తిరుప్పావై చదువుతూ పరమభక్తితో చేసుకునే ధనుర్మాసం వ్రతం కూడా ఈ మాసంలోనే మొదలు అవుతుంది. ఈ మాసంలో విష్ణుప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది.


శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం ఇది అని అందరు చెప్తూ ఉంటారు.


పెద్ధలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా లేదా మోక్ష సాధనా మాసం అని కూడా అంటూ ఉంటారు. భక్తితో ఉపవాసం , జాగరణ ఉండి చేసే మోక్షద ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది. నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయం గురించి తెలుసుకుందాం .... మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం మొదలు అవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం.


అలా చూసుకుంటే దక్షిణాయనం చివరిభాగం , ఉత్తరాయణం ముందు వచ్చే భాగం అయిన మార్గశిరం పగలుకు ముందు వచ్చే బ్రాహ్మీముహూర్తం లాంటిది అని తెలుస్తుంది. బ్రాహ్మీ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగినదో , సంవత్సరానికి స్వయం విష్ణుస్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. ఎలాగైతే బ్రాహ్మీమహూర్తంలో మనం నిత్య పూజ చేసుకుంటామో , అదే విధంగా దేవతలకు బ్రాహ్మీముహూర్తమైన ఈ మాసమంతా దేవతలు , ఋషులు, యోగులు శ్రీమహావిష్ణువును భక్తితో పూజిస్తారు. ఈ మాసం లక్ష్మీనారాయణ స్వరూపం. శ్రావణ శుక్రవారం , కార్తీక సోమవారం లాగా మార్గశిర లక్ష్మివారం (గురువారం) , మార్గశిర శనివారం చాలా ప్రాముఖ్యమైనవి.

............. 💐💐🌹🌹...........




8, డిసెంబర్ 2021, బుధవారం

శ్రీరమణీయం* *-(249)*_

 _*శ్రీరమణీయం* *-(249)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"ఆలోచనలను అదుపుచేసుకునే మార్గం ఏమిటి ?"*_


_*మనం ఏర్పరుచుకున్న జ్ఞాపకాలే మనకు ఆలోచనలుగా వస్తాయి. ఒక విషయం జ్ఞాపకంగా మారేంతగా మమైకత చెందకుండా జాగ్రత్త పడాలి. అంతేగాని ఆ జ్ఞాపకాలు ఆలోచనగా వచ్చినప్పుడు బాధ పడితే ప్రయోజనం ఏముంది ? పూజలో కూర్చున్నప్పుడు మనకి ఇతర ఆలోచనలు వస్తున్నాయని చికాకు పడతాం. విత్తనాలు నాటేప్పుడే తాలు గింజలు ఏరివేస్తే మొలిచేవన్నీ మంచి మొక్కలే అవుతాయి. అలాగే మన బాహ్యవృత్తుల్ని నియంత్రించుకుంటే తప్ప ప్రవృత్తులను నియంత్రించలేము. లేదంటే ఆలోచనలను అదుపులో ఉంచుకోవటం కష్టం అవుతుంది !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'పని స్ఫురించని మనసే ధ్యానం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

శ్రీమదాంధ్ర భాగవతం - 26*

 *శ్రీమదాంధ్ర భాగవతం - 26*


*బ్రహ్మోత్పత్తి–స్వాయంభువ మనువు*


విదురుడు కురుసభలో ఉండగా ఒకానొక సందర్భంలో ఆయన అవమానించ బడ్డాడు. విదురుడు అక్కడ నుండి బయలుదేరి ఉద్ధవుడి దగ్గరకు వెళ్ళి ఉద్ధవుడిని ‘కృష్ణ భగవానుడు ఎక్కడ ఉన్నాడు?’ అని అడిగాడు. ఉద్ధవుడు “కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాడు. యాదవులు అందరూ వెళ్ళిపోయారు’ అని చెప్పాడు. ఈ సందర్భములో పరీక్షిత్తు ‘ఉద్ధవుడు కూడా యాదవుడే కదా – అతను ఎందుకు ఉండిపోయాడు?’ అని శుకుని అడిగాడు. కృష్ణుడికి ఏ జ్ఞానం ఉన్నదో అదే ఉద్ధవుడికి ఉన్నది. కృష్ణుడు తన తరువాత లోకమునకు జ్ఞానం చెప్పడం కోసం ఉద్ధవుడిని భూమిమీద ఉంచేశాడు. ఉద్ధవుడు శ్రీమన్నారాయణుని ఆదేశమును అనుసరించి బదరికాశ్రమమునకు  వెళ్ళిపోతున్న ఉద్ధవుడిని విదురుడు కలుసుకుని ‘నీవు శ్రీమన్నారాయణుడి దగ్గర తెలుసుకున్న భాగవత జ్ఞానమును నాకు చెప్పవలసింది’ అని అడిగాడు. ఉద్ధవుడు ‘అది నాదగ్గరే కాదు. జ్ఞానమును మైత్రేయునికి కూడా చెప్పాడు. మైత్రేయుడు హరిద్వార్ లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి వినవలసింది’ అని సలహా చెప్పాడు. విదురుడు గంగ భూమి మీద పడిన చోటయిన హరిద్వార్ వెళ్ళి, భాగవత జ్ఞానమును విన్నాడు. శ్రీమహావిష్ణువు నాభికమలములో నుండి చతుర్ముఖ బ్రహ్మ గారు పుట్టారు అప్పటికి సృష్టి లేదు. లోకములన్నీ నీటితో నిండి పోయి ఉన్నాయి. నీటితో నిండిపోయి వున్న లోకములందు తాను ఏమి సృష్టి చేయాలో ఆయనకేమీ అర్థం కాలేదు. ‘నేనన్న వాడని ఒకడిని వచ్చాను కదా –  నన్ను కన్నవాడు ఒకడు ఉండాలి కదా!’ అని చుట్టూ చూశాడు. చుట్టూ నీళ్ళు తప్ప ఏమీ లేవు కంగారుపడ్డాడు.

ఏమిటి సృష్టి చేస్తాను? ఎలా సృష్టి చేస్తాను? అని ఆలోచిస్తున్నాడు.  ఆయనకు పైనుంచి ‘తపతప’ అనే ఒక మాట వినపడింది. ఆయన తపించాడు. ధ్యానమగ్నుడై ఈమాట ఎవరి నుండి వెలువడిందో ఆయన దర్శనము అపేక్షించాడు. అలా తపించగా తపించగా శ్రీమన్నారాయణ దర్శనం అయింది. ఆయన ‘నీవు ఇలా సృష్టి చెయ్యి’ అని బ్రహ్మగారికి వేదములను ఇచ్చి ఆదేశం ఇచ్చాడు.   చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేయడం ప్రారంభం చేశాడు.

ఆయన అలా సృష్టి చేయడం ప్రారంభం చేయడంలో ఒక గమ్మత్తయిన ప్రక్రియ జరిగింది. బ్రహ్మము నుండి సృష్టి వెలువడింది. ఆయన మొట్టమొదట సనక, సనందన, సనత్కుమారులను సృష్టించాడు. ఆ నలుగురుని సృష్టించి మీరు సృష్టిని వృద్ధి చేయండి. బిడ్డలను కనండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు ‘మేము ప్రవృత్తి మార్గములో వెళ్ళము. ఆ మార్గము మాకు అక్కరలేదు. మేము సృష్టి చేయము. మేము శ్రీహరి పాదములు చేరిపోతాము’ అన్నారు. వారు ఎప్పుడూ అయిదేళ్ళ వయసులో, చిన్నపిల్లల్లా బట్టలు విప్పుకుని, ఎప్పుడూ ధ్యానం చేస్తూ శ్రీహరి వైపు వెళ్ళిపోయారు. బ్రహ్మగారికి కోపం వచ్చింది. కోపంతో తన భ్రుకుటి ముడి వేశాడు. అందులోంచి నీలలోహితుడనే పేరుగల రుద్రుడు పుట్టాడు. వాడు కింద పడి ఏడవడం మొదలు పెట్టాడు. బ్రహ్మగారు వానిని ఏడవకు అన్నారు.  ఆ రుద్రుడు ‘నేను ఎక్కడ ఉండాలి? ఏమి చేయాలి?’ అని అడిగాడు.

ఇక్కడ ఒక విషయము గమనించాలి. అక్కడ అప్పుడు సృష్టి,  సంకల్పం నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం  ఉన్న సృష్టి మిధున సృష్టి అనగా స్త్రీ పురుష మైధునం చేతనే సృష్టి జరుగుతూ ఉంది. అప్పుడు జరిగిన సృష్టి కేవలము ఈశ్వర సంకల్పము చేత మాత్రమే జరిగిన సృష్టి.

  చతుర్ముఖ బ్రహ్మగారు ‘నువ్వు పుడుతూనే వచ్చావు  కాబట్టి నిన్ను రుద్రుడంటారు అని చెప్పి రుద్రుడికి ఎనిమిది రూపములను, ఎనమండుగురు భార్యలను ఇచ్చి నీవు అలా ఉండి సృష్టి చెయ్యి’ అని చెప్పారు. ఆయన కొన్ని గణములను సృష్టించాడు. ఆ గణములు అక్కడ వున్న వాళ్ళను తినివేయడం మొదలుపెట్టాయి. బ్రహ్మగారు రుద్రుడిని పిలిచి ‘ఇక నీవేమీ సృష్టి చేయవద్దు. కేవలం తపస్సు చేసుకుంటూ ఉండవలసింది’ అని చెపితే ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు.

మళ్ళీ బ్రహ్మగారు ఆలోచిస్తూ కూర్చున్నారు. అలా ఆలోచిస్తుంటే ఆయన శరీరభాగముల నుండి రకరకముల మహర్షులు బయటకు వచ్చారు. బ్రహ్మగారి ఒడిలోంచి నారదమహర్షి బయటకు వచ్చారు. వీపు నుంచి ‘అధర్మము’ వచ్చింది. అధర్మములోంచి ‘మృత్యువు’ వచ్చింది. ముందుభాగం నుంచి ‘ధర్మం’ వచ్చింది.  బ్రహ్మగారు ‘ఇలా నేను సంకల్ప వికల్పములు చేస్తే ఎంత సృష్టి చేస్తాను’ అనుకున్నారు. ఒక్కొక్కసారి సృష్టి చేసే వారియందు కూడా మోహము కలుగుతుంది. బ్రహ్మ ఒక స్త్రీని సృష్టించాడు. సృష్టించి ఆ స్త్రీ యందు మోహమును పొందాడు. ఋషులు ‘మీరు సృష్టించిన స్త్రీ యందు మీకు మోహమేమిటి' అని ప్రశ్నించారు. ఆయన ‘ఇది సృష్టికి ఉండే లక్షణము. ఏ శరీరముతో అలా మోహమును పొందానో ఆ శరీరమును వదిలిపెట్టేస్తున్నాను’ అని శరీరమును వదిలిపెట్టేశాడు. ఆ శరీరము పొగమంచు అయింది. మనకు రోజూ కళ్ళకు అడ్డముగా వచ్చే పొగమంచు అదే!

 బ్రహ్మగారు మైథున సృష్టి చెయ్యాలని అనుకొని తన శరీరములో నుంచి  రెండింటిని సృష్టించాడు. ఒకటి స్త్రీ, ఇంకొకటి పురుషుడు. అలా సృష్టించి ‘వీళ్ళయందు వ్యామోహమును ఏర్పాటు చేస్తాను. ధర్మబద్ధమైన ప్రజా సృష్టి జరుగుతుంది’ అన్నారు. మొట్టమొదట సృష్టించిన వాళ్ళలో మొట్టమొదట పుట్టిన వాడు స్వాయంభువ మనువు ఆయన భార్య పేరు శతరూప. 

 బ్రహ్మగారు ‘కొడుకు తండ్రిని సంతోషపెట్టాలి. నీవు సృష్టి చెయ్యి’ అన్నారు. అనగా స్వాయంభువ మనువు అయిదుగురు బిడ్డలను కని  వచ్చి తండ్రికి తాను అయిదుగురు బిడ్డలను కన్నట్లు చెప్పాడు. వాళ్ళు ఎవరు అని అడిగారు బ్రహ్మగారు. ఆయన తన బిడ్డల పేర్లు చెప్పాడు. ఒకాయన పేరు ప్రియవ్రతుడు, రెండవకుమారుని పేరు ఉత్తానపాదుడు. ఒక కుమార్తె పేరు అకూతి. మరొక కుమార్తె పేరు ప్రసూతి. మూడవకుమార్తె పేరు దేవహూతి.

 ఇప్పుడు ఏమి చెయ్యను?” అని తండ్రిని అడిగాడు.  బ్రహ్మగారు ‘శ్రీహరిని సంకీర్తన చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులను చేస్తూ సమస్తప్రాణులను రక్షిస్తూ పరిపాలన చేయవలసినది అని చెప్పాడు. ఆయన ‘నాన్నగారూ అలా పరిపాలించడానికి భూమి ఎక్కడ ఉన్నది? అని అడిగాడు. మీరు సృష్టి తామర తంపరగా ఎలా పెంచాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఈ భూమి ప్రళయం వల్ల  వచ్చిన సముద్ర జలముల లో పడిపోయి రసాతలానికి వెళ్ళిపోయింది. పాతాళ లోకంలో ఉన్న ఆ భూమిని పైకి తీసుకుని వస్తే ప్రాణులు  భూమి మీదకు చేరుతాయి.  ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి దీనిని పరిపాలించడానికి ఆనుకూల్యం ఏర్పడుతుంది. ఆ భూగోళమును పైకెత్తండి’ అన్నాడు. బ్రహ్మగారు ఆ భూమిని ఎలా పైకెత్తడం! అని ఆలోచించాడు. ఆయన సంకల్పం చేయగానే వెనుక నుండి చేయిస్తున్న వాడు ఒకాయన ఇన్నిగా వస్తున్న వాడు ఆయన బ్రహ్మగారి ముక్కులోంచి ఊడి క్రిందపడ్డాడు. నాసికా రంధ్రం నుంచి చిన్న వరాహమూర్తి ఒకటి క్రింద పడింది.

ఆ వరాహము దంష్ట్రలతో పెద్ద కొండంత అయిపోవడం మొదలుపెట్టింది. అది  అడుగులు తీసి అడుగులు వేయడం మొదలు పెట్టింది. అక్కడ వున్న ఋషులు అందరూ దానికేసి ఆశ్చర్యముగా చూస్తున్నారు. వాళ్లకి అర్థం అయింది. స్వామి సంకల్పమును అనుసరించి భూగోళమును పైకి ఎత్తడానికి ఎవరు మొట్టమొదటి నుండి చివరి వరకు ఉంటున్నటువంటి ఈశ్వరుడు వచ్చాడు అనుకున్నారు. అనగా మొదటి అవతారం వచ్చినది.

ఇది యజ్ఞవరాముగా వచ్చి అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి దూకింది. అది భూమికోసం మూపుపెట్టి వెతుకుతోంది. అలా వెతకడములో దాని ముఖం నిండా నీళ్ళు అంటుకు పోయాయి. అది తన ముఖమును పైకి తెచ్చి విదిలించింది. ఋషులందరూ ఋగ్యజుస్సామ వేదములతో స్తోత్రం చేస్తూ, ఆ నీళ్ళు మీద పడేటట్లు నిలబడ్డారు. ఈ కంటికి గోచరమవని వాడు రక్షించడం కోసమని  ఒక విచిత్రమయిన మూర్తిగా వచ్చి నీటితో తడిసిన దేములో ఉన్న నీటిని చిమ్ముతున్నాడు. దీనిని విన్నప్పుడు విదురుడు ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు. దానికి జవాబుగా ‘యజ్ఞవరాహం వచ్చినపుడు ఆయన ఎంత గొప్ప మూర్తియో అంత గొప్ప రాక్షసుడు ఒకడు నీళ్ళలోంచి వచ్చాడు. వచ్చి యజ్ఞవరాహమూర్తి మీద కలియబడ్డాడు. అక్కడ వున్న వాళ్ళందరూ యజ్ఞవరాహమూర్తిని స్తోత్రం చేస్తున్నారు. ఆయన ఆ రాక్షసుడిని చంపి అవతల పారేశాడు’ అని చెప్పాడు .

‘ఆ వచ్చిన వాడెవడు? ఎందుకు వచ్చాడు? అందరూ నమస్కరిస్తుంటే వాడొక్కడు యుద్ధం చేయడం ఏమిటి? అందుకు సంబంధించిన కథను చెప్పవలసినది’ అని పరీక్షిత్తు అడిగితే శుకుడు చెప్పడం ప్రారంభించాడు.

ఇంకావుంది.


సాంఖ్యాయనాచంట.

కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము-

 ఓం నమో మాత్రే నమః


_*కార్తీక పురాణం - 30 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*చివరి అధ్యాయం*


*కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి*



☘☘☘☘☘☘☘☘☘



నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను , విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి , వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున , సూతునిగాంచి , *"ఓ ముని తిలకమా ! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై , అత్యాచారపరులై జీవించుచు  సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా ? ధర్మములన్నింటిలో మోక్షసాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది ? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమదైవమెవరు ? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి ? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము. కావున దీనిని వివరించి తెలియజేయు"* మని కోరిరి.


అంత సూతుడా ప్రశ్న నాలకించి *"ఓ మునులారా ! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వివరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు , సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.


కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుడు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని , శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించకగాని , లేక , ఆచరించువారలను ఎగతాళి చేసినగాని , వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్టివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.


కార్తీక మాసములో కావేరి నదిలోగాని , గంగా నదిలోగాని , అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక , జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.


సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము ఉత్తమోత్తమమైనది అధికఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి , మరుజన్మలేక , వైకుంఠమందుగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు , దుర్మార్గులకు , పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.


కాన , ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి , జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము , ధాన్యము , బంగారము , గృహము , కన్యాదానములు చేసినచో ఎప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను , బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు , పురాణములు వింటూ , పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకంబును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్థప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము- ముప్పదవ(ఆఖరి రోజు) పారాయణము సమాప్తము.*

ఆసక్తికరమైన అంశం*

 💥💥 *ఆసక్తికరమైన అంశం* 💥💥

కరోనా వ్యాధి చికిత్స ఇచ్చే వార్డులో చికిత్స పొందుతున్న ఒక టీచర్ ఏమీ తోచక చదువుదామని ఒక పుస్తకం తీసుకోనే సమయానికి ఆమె ఫోన్ మ్రోగింది. ఆ ఫోన్ కాల్ ఒక తెలియని నంబర్ నుండి వచ్చింది. సాధారణంగా అలాంటి నంబర్ల ఫోన్ కాల్ ఆవిడ తీయదు, ఆసుపత్రిలో ఒంటరిగాఉంది, చేయడానికి వేరే పని లేనందున  ఆ ఫోన్ కాల్ ని తీసుకుంది. 


“ గుడ్ మార్నింగ్ మేడమ్, నేను సత్యేంద్ర గోపాలకృష్ణ, దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. సీమా కనకాంబరన్ గారితోనే మాట్లాడుతున్నానా?”, అని ఒక మగ గొంతుక తననుతాను పరిచయం చేసుకుంది.  

ఆ టీచర్ ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని కుతూహలంతో,“అవును నేనే మాట్లాడుతున్నాను” అని సమాధానం చెప్పింది. 

కొంత సమయం తర్వాత  అతను, “మాడమ్ కొన్ని సంవత్సరాల క్రితం మీరు నా పదో క్లాస్  టీచర్“ అని చెప్పాడు. 

టీచర్ అతడిని గుర్తించలేకపోయింది.“ప్రస్తుతం కోవిద్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాను. అంత ముఖ్యమైన విషయం కాకపోతే మనం తర్వాత మాట్లాడుకోవచ్చా?”అని అంది. 

దానికి బదులుగా సత్యేంద్ర, “1995 బ్యాచ్ లో మొదటి ర్యాంకర్ ఐన సుబ్బు ద్వారా మీకు ఆరోగ్యం బాగులేదని తెలిసింది“ అని చెప్పాడు.

 “ నాకు సుబ్బు బాగా తెలుసు నేను అతడిని గుర్తుపట్టాను కాని నిన్ను గుర్తుపట్టలేకపోతున్నాను” అని టీచర్ చెప్పింది. 


సత్యేంద్ర “ మీకు ఎప్పుడూ తలనొప్పి తెప్పించి, పొడుగ్గా, నల్లగా వుండి, ఆఖరి బెంచీలో కూర్చునే ఒక పిల్లవాడు బహుశా గుర్తుండివుంటాడు. ఆపిల్లవాడ్ని నేనే ” , అని చెప్పాడు.  


ఆ టీచరకి ఒక్కసారిగా గుర్తుకొచ్చి “ ఓ ! ఆ వెనక బెంచీ పిల్లలా“, అని అడిగింది. 


ఆ సంభాషణ ఆసక్తిగా మారడం వల్ల ఆవిడ పుస్తకాన్ని బల్ల మీద ఒక ప్రక్కగా పెట్టి  దిండుని తల వెనుకగా సర్దుకొని  తనకి తాను సుఖంగా కూర్చొని అప్పుడు అతడిని “ఇప్పుడు ఇంత అకస్మాత్తు గా నేను నీకు ఎందుకు జ్ఞాపకం వచ్చాను”, అని అడిగింది.

  

సత్యేంద్ర “ మీరు ఆసుపత్రిలో వున్నారని తెలిసినప్పుడు మా 1995 క్లాసు పిల్లలందరితో ఒక కాన్ఫరెన్సు కాల్ ఏర్పాటుచేద్దామని నాకు ఆలోచన వచ్చింది” అని చెప్పాడు.


“ తోటి విద్యార్ధులు ఏడుగురిని నేను ఈరోజు లైన్ లోకి తేగలిగాను. ఇప్పుడు వాళ్ళందరూ మన సంభాషణ వింటున్నారు. మేమందరం మీరు తొందరగా కొలుకోవాలని ప్రార్ధిస్తున్నామని మీకు తెలపడానికి ఫోన్ చేసాం“, అని అతను చెప్పగానే ఆ టీచర్ కి మాటలు తడబడ్డాయి. 


కొంత సమయం తరువాత ఆవిడ “ఇప్పుడు చెప్పు, నువ్వు ఎక్కడ వున్నావు?” అని అడిగింది. 


“ నేను ప్రస్తుతం దుబాయిలో ఉన్నాను. నేను స్వంతంగా లాజిస్టిక్ వ్యాపారం చేస్తున్నాను. మొదట్లో నేను ఉద్యోగం వెతుక్కోవడానికి ఇక్కడకు వచ్చాను. చివరికి ఒక విజయవంతమైన వ్యాపారవేత్తను అయ్యాను. ప్రస్తుతం నా సంస్థలో 2000 మంది ఉన్నారు“, అని సత్యేంద్ర చెప్పాడు. 


మేము పదో తరగతిలో వున్నప్పుడు మీరంటే  మా వెనక బెంచీ విద్యార్ధులకు క్రమశిక్షణ విషయంలో చాలా భయం వేసేది. కానీ అదేసమయంలో మీరు ఎంతో ఔదార్యంతో మాకు మద్దతు ఇచ్చి, గొడవ చేసి, అల్లరిచేసే వెనక బెంచీ విద్యార్ధులమైన మాలో విశ్వాసాన్ని పెంచారు. నేను వారి నాయకుడిగా వుండేవాడిని”, అని అతడు చెప్పాడు.


మీ చేతిలో అందరికన్నా నాకే ఎక్కువ శిక్షలు పడ్డాయి, మీరు నన్ను తరుచూ క్లాస్ బయట, కొన్ని సార్లు క్లాస్ లో బెంచీ మీద నిలబెట్టేవారు. ఆ అనుభవాలన్నీ నా తరువాతి జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయి. 


“బెంచీ మీద నిలబెట్టినప్పుడు నాకు క్లాస్ అంతా ఒకేసారి కనిపించేది, నేను నేర్చుకున్న ఈ పాఠాలు నేను నా జీవితంలోనే కాదు నా వ్యాపారం లో కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ రొజు నేను ఉన్న ఈ స్థితి అంతా మీ వల్లనే సాధ్యపడింది”, అని చెప్పాడు. 

 

టీచర్ కి ఇప్పుడు మాట్లాడడం చాలా ఇబ్బందిగా అనిపించింది. సత్యేంద్ర తన కధను చెప్తూనే వున్నాడు, ఆ టీచర్ కొన్ని దశాబ్దాలకి ముందు, 1995 సంవత్సరానికి వెనక్కివెళ్లి తన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంది. 1995 లో క్లాస్ ...


 “ అవును, ఆ పొడుగ్గా నల్లగా వుండే కుర్రవాడు, క్లాస్ కి ఎప్పుడు ఆలస్యంగా వచ్చి విసిగించడంలో దిట్ట. క్లాసులను మానేసి సినిమాలకు వెళ్ళేవాడు. తరచూ టీచర్ విధించిన శిక్షలు, వేసిన జరిమానాలను  తగ్గించమని కోరడానికి వాళ్ళ గదికి వచ్చే పిల్లవాడు ఇతనే. టీచర్లందరికీ ఓ పీడకలగా ఉన్నా  పిల్లలందరికి మాత్రం చాలా ప్రియమైనవాడు ఇతనేనని గుర్తించింది.


అవును, అతడినితో అందరూ స్నేహంగా ఉండేవారు. అతడు ఇప్పుడు దుబాయిలో ఎలా వున్నాడు?” అని ఆ టీచర్ అనుకుంటోంది. 


ఆవిడ ఆలోచనలకు అంతరాయం కలిగింది 

“ హలో ! మీరు వింటున్నారా ?” అని సత్యేంద్ర అడిగాడు.  


 టీచర్ స్పృహలోకి తిరిగి వచ్చి “ ఆ.. ఆ.. వింటున్నాను “ అని సమాధానం చెప్పింది.


ఆవిడ సంభాషణ కొనసాగిస్తూ “ సత్యేంద్ర! స్కూలు వదలి వెళ్ళిన తరువాత నీ గురించి ఏమీ తెలియలేదు. నువ్వు నాకు కాల్ చేయడం, అది కూడా నీ మిత్రులతో కాన్ఫరెన్స్ కాల్ చేయడం చాలా ఆశ్చర్యంగాను, సంతోషంగాను వుంది. అందరూ మీ గురించి చెప్పండి", అని అడిగింది.


ఆ గ్రూప్ కాల్ లో వున్న మిగతా ఆరుగురిలో ముగ్గురు మూడు ఖండాలలో ఇంజనీర్ లని,  ఒకడు ఢిల్లీ లో డాక్టర్, ఒకడు షిల్లాంగ్ లో పురోహితుడు, చివరిగా క్లాస్ లో మొదటి స్థానం లో వుండే సుబ్బు, “మేడమ్, నేను ఒక చార్టెడ్ అకౌన్టెంట్. సత్యేంద్ర కంపెనీ లో CFO ని” అని చెప్పారు.

ఆవిడ తాను విన్న మాటలను నమ్మలేకపోతోంది ఎంతో ఆశ్చర్యంగా, “నిజంగానే నా!”అని అంది. 

సుబ్బు ఆ మాటలను ధృడపరిచాడు, “నేను సత్యేంద్రతో  కలవక ముందు KPMG లో పనిచేసేవాడిని. సత్యేంద్రతో కలిసిన తరువాత వృత్తిపరంగా నాకు చాలా తృప్తి గా వుంది. అలాగే నా కుటుంబజీవితం కూడా బావుంది ”, అని చెప్పాడు. 


అందరూ వాళ్ళ కధలు పూర్తిచేసేటప్పటికి 40 నిమిషాలు గడిచాయి. సత్యేంద్ర  అంత ఎక్కువ సేపు మాట్లాడినందుకు క్షమించమని అడిగాడు, వాళ్ళ ప్రియమైన  టీచర్ త్వరగా కొలుకోవాలని కోరుకుంటూ  తాను ఇండియా  వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తానని  వాగ్దానం చేశాడు . 


కోవిద్ ఐసొలేషన్ వార్డులో ఒంటరిగా వున్న టీచర్ కళ్ళు కన్నీళ్లతో నిండాయి. ఆవిడ హృదయం సంతోషంతో పొంగిపోయింది, కన్నీళ్ళు ఆవిడ బుగ్గల మీదకు జారాయి. 

విద్యార్ధులకు క్రమశిక్షణ నేర్పినందుకు, వాళ్ళ మీద ఔదర్యాన్ని ప్రదర్శించినందుకు తనని జ్ఞాపకముంచుకున్నారని తెలుసుకోవడం ఆవిడకి ఆనందంలో ముంచెత్తే  అనుభవం.


అదేవిధంగా వాళ్ళందరూ సంతోషంగా వున్నారని ఆనందంగా జీవిస్తున్నారని తెలుసుకున్న ఆవిడ,  తరగతిలో తెలివైన వాళ్ళే కాదు తరగతిలో బాగా విసుగుపుట్టించే విద్యార్ధులు కూడా జీవితపు పాఠాలను నేర్చుకొని ప్రస్తుతం ఉత్తమంగా రాణిస్తున్నారని చాలా కృతజ్ఞతానుభూతి చెందింది. 


“ సిలబస్ లో లేనివి, తరగతిలో చెప్పని పాఠాలను జీవితంలో ఉపయోగించిన ఒక కుర్రవాడు ఇక్కడ వున్నాడు” అని ఆవిడ తనలో తాను అనుకుంది. 


అతడు అనుభవించిన శిక్షలు అతడ్ని పరిశీలకుడిగా ఒక విశాలమైన  దృష్టిని పెంపొందించుకోవాడానికి అవకాశం ఇచ్చాయి. క్లాసులను వదిలేసి పారిపోతూ దొరికిపోయినప్పుడు, చాలా చిన్నవయసులోనే కష్టాలను తగ్గించుకొని, వాటిని దాటడం నేర్చుకున్నాడు. 


అతడు తనకు విధించిన శిక్షను, పరిహారాన్ని తగ్గించమని ఆడగడానికి భోజనసమయంలో ఉపాధ్యాయుల గదికి వచ్చినప్పుడు చర్చించే కళను నేర్చుకున్నాడు. స్కూలులో వున్నప్పుడు అతను ఏర్పరచుకొన్న సంబంధాలు ఇప్పటికీ  బలంగా ఉన్నాయి.


లెక్కల్లో పోగొట్టుకున్న మార్కులను అతను నిజజీవితం కోసం భద్రపరుచుకున్నాడు. నూటికి నూరు మార్కులు తెచ్చుకున్న సుబ్బు  సత్యేంద్ర పోగొట్టుకున్న ఆ అంకెలతోనే పనిచేయడం ఆశ్చర్యకరమైన విషయం.


ఆవిడ ఆలోచిస్తూనే వుంది. కరోనా మహమ్మారి వలన రెండు సంవత్సరాలుగా మూసి వేసిన స్కూళ్ళు  పిల్లల స్వభావాలను మలచుకునే అవకాశం ఇవ్వకుండా బాగా నష్టాన్ని కలిగిస్తున్నాయి. 

ఇంట్లో కూర్చొని డిజిటల్ పద్దతిలో నేర్చుకోవడం కూడా గొప్ప నష్టాన్ని కలిగిస్తోంది. వాళ్ళు విద్యకు సంభందించినంత వరకు బాగా విజ్ఞానాన్ని పొంది వుండవచ్చు కానీ దానిని వాళ్ళు తమ జీవితంలో ఎలా ఆచరణలో పెట్టగలరు ?


సమాజం నిజమైన అభివృద్దిని పొందడానికి, తరగతి గదులకే పరిమితమై పుస్తకాల ద్వారా పొందేది మాత్రమే విద్య కాదు అని ప్రపంచానికి తెలియజేయడానికి సత్యేంద్ర, సుబ్బు వంటి వ్యక్తుల అవసరం చాలా ఉంది. 


(ఈ కధ వాస్తవ జీవితపు సంఘటన మీద ఆధారపడినది )


 గ్రంధాలు, పుస్తకాల నుండి పొందే జ్ఞానం జీవితపు సమస్యలను పరిష్కరించదు. అవి కేవలం పునాదిగా పనికొస్తాయి.🙏🙏🙏🙏🙏

Fb సేకరణ. 🙏

గర్భిణి స్త్రీ పాటించవలసిన నియమాలు -

 గర్భిణి స్త్రీ పాటించవలసిన నియమాలు - 


 * ఎల్లప్పుడూ మితిమీరి ఆహారాన్ని భుజించకుడదు. సులభంగా జీర్ణం అయ్యే ఆహార పదార్దాలు మాత్రమే తినాలి .


 * తినాలి అనిపించినప్పుడు వీధిలోని పదార్దాలు భుజించ కూడదు. ఇంట్లో చేయించుకొని తినాలి .


 * కొంతైనా శారీరక శ్రమ చేయాలి.


 * ప్రసవించెంత వరకు సామాన్యంగా ఇతరుల ఇళ్ళకు వెళ్ళకూడదు. ముఖ్యంగా చావులు, ఘర్షణలు , గొడవలు జరిగిన ప్రదేశాలకు వెళ్ళకూడదు .


 * గర్భిణులు బలవంతమైన అతి కష్టమైన పనులు అసలు చేయకూడదు. ఎత్తు ప్రదేశాలు ఎక్కడం , వేగంగా దిగడం చేయకుడదు . 


 * కారం, చేదు, ఉప్పు ఎక్కువ ఉన్న పదార్దాలు గర్భిణి లు తినకూడదు . 


 * పగలు నిద్రించడం, రాత్రి మేలుకోవడం , అతిగా టీవీ చూడటం, సినిమాలు చూడటం చేయకూడదు 


 * మనసుకి ఆందోళన కలిగించే విషయాలు వినకుడదు .


 * నూలు బట్టలు వదులు గా ఉన్నవి ధరించాలి.


 * మనసులో ఈర్ష్య, ద్వేషం , అసూయ లాంటి రజో,తమో గుణాలు కి గురి కాకూడదు . అలా గురి అవ్వడం వలన లోపల బిడ్డ మీద ప్రభావం పడుతుంది. పుట్టే వారు కూడా అవే లక్షణాలతో పుడతారు.


 * గర్భిణి స్త్రీలు చన్నీటి స్నానం చేయకూడదు .


 * ఆరోవ మాసం నుంచి సంభోగంలో పాల్గొనకుడదు . సంభోగం నుంచి ఆలోచనలు రాకూడదు.


 * సంభోగం లో పాల్గొనడం వలన గర్భ స్రావాలు , 8 మాసాలకే ప్రసవాలు , మృత శిశువులు పుట్టడం ఒక్కోసారి తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం వాటిల్లడం జరుగుతుంది.


 * గర్భిణి స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోను కొబ్బరి బొండాలు తాగకూడదు. అలా తాగడం వలన అప్పుడే నెల తప్పినా , మూడు లేకా నాలుగు మాసాల గర్భవతిగా ఉన్నా లేత కొబ్బరి బొండాల నీళ్లు తాగడం వలన గర్భ స్రావాలు జరుగుతాయి.


 * నువ్వులతో చేసిన కజ్జికాయలు, నువ్వుల నూనెతో వండిన పిండి వంటలు, నువ్వుల నూనెతో తయారయిన ఉరగాయ పచ్చళ్ళు తినడం వలన కూడా గర్భ విచ్చిత్తి జరుగుతుంది.


 * పాతకాలపు ఇళ్ళలో మొదటి సారిగా సమర్త ఆడిన ఆడపిల్లలకు నువ్వులు , బెల్లం కలిపి " చిమ్మిరి " తయారు చేస్తారు ఆ చిమ్మిరి ముద్ధలని పొరపాటుగా గర్భవతులు గనక సేవిస్తే వెంటనే గర్బం విచ్చిత్తి జరుగుతుంది.


 * రెండు, మూడు నెలలు గర్బవతులు గా ఉన్నప్పుడు అతిగా వేడిచేసే ఆవపిండి, ఆవకాయ , ఎక్కువుగా ఉప్పు , కాకరకాయ , కర్బూజా పండు , ఇంగువ, శోంటి , పిప్పిళ్ళు , మిరియాలు, నువ్వులు , బ్రాంది , విస్కీ, రమ్ , ఎక్కువ ఎండు కారం , లవంగాలు, కర్పూరం , వస, వెల్లుల్లి, సునాముఖి మొదలయిన పదార్దాలు ఎక్కువుగా వాడటం వలన కూడా గర్భ విచ్చిన్నం జరుగును.



          అనువంశిక ఆయుర్వేద వైద్యం 


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


                  9885030034

6, డిసెంబర్ 2021, సోమవారం

రావణ వధకై

 రావణ వధకై బ్రహ్మాది దేవతల ప్రార్థనకు స్పందించి, విష్ణువు.. దశరథుని తండ్రిగా చేసికోవడానికి ఇష్టపడ్డాడు. 

అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరితో 

"అవతరించే విష్ణువుకు సహాయకులుగా ఉండుటకై బలవంతులూ కామరూపులూ అయి, మీ మీ శక్తులు కలిగియుండేలాగు పుత్రులను సృజింపుడు" అన్నాడు.


"ఎలుగుబంటులలో శ్రేష్థుడైన జాంబవంతుని తాను చాల క్రితమే సృజించాను" అని కూడా అన్నాడు.


అప్పుడు...


1. ఇంద్రుని వల్ల       - వాలి,

2. సూర్యుని వలన   - సుగ్రీవుడు, 

3. బృహస్పతి వల్ల   - తారుడు, 

4. కుబేరుని వలన   - గంధమాదనుడు, 

5. విశ్వకర్మ వలన    - నలుడు, 

6. అగ్నీ వలన         - నీలుడు, 

7. అశ్వినీ దేవతల వల్ల  - మైంద ద్వివిదులు, 

8. వరుణుని వలన   - సుషేణుడు,

9. పర్జన్యుడని వలన - శరభుడు, 

10. వాయువు వల్ల   -    హనుమ జన్మించారు.


పరాక్రమాలు గల అనేకమంది - గోలాంగూల (కొండముచ్ఫు) స్త్రీలయందూ, ఋక్షస్త్రీల యందూ, కిన్నర స్త్రీలయందూ జన్మించారు.


ప్రధానంగా పైన పేర్కొన్న పదకొండు మందీ, పదకొండు విభాగాలకు చెందినవారు. తండ్రుల శక్తులు కలిగి, ఆయావిభాగాలలో నిష్ణాతులు. 


ఒక భారీ పథకము (Project) చేపట్టేటపుడు కావలసిన 11 ముఖ్య విభాగాలైన...


ప్రణాళిక(Planning), 

వ్యవస్థీకృత కార్మిక రంగం(Organised working sector), 

కుశాగ్రబుద్ధి కలిగిన పరిపాలన(Correct decisive administration), , 

మేధస్సు(Intellect), 

ఆర్థికం(Finance), 

నిర్మాణం(Archetech), 

చైతన్యం(Activeness), 

ఆరోగ్యం(Health), 

నీరు(Water), 

దాపరీకం(Secrecy), 

సర్వజ్ఞత(All rounder) అనేవి ప్రధాన విషయాలు.


అటువంటి వాటికి సంబంధించి వారు "రావణ వధ" అనే ప్రత్యేక ప్రణాళిక(Operation)కి గాను వచ్చిన కారణజన్ములు.


అందులో వాయుపుత్రుడు ఒక ప్రత్యేకమైన వాడు... 


వాయువు సర్వత్ర వ్యాప్తిచెంది, అందరకీ ప్రాణమైనది. అదే విధంగా వాయుదేవుని వలన జన్మించిన హనుమ, అందఱితోనూ అన్ని పనులలోనూ నేర్పుతో (all round) పని చక్కబెట్టగల్గినవాడు.


అంతేకాక, వాయువు...


(అ) సప్త మండలాలలో సప్త వాతస్కంధాలుగా కనబడుతుంది. అవి


(i) మేఘమండలం   - ఆవహము, 

(ii) సూర్యమండలం - ప్రవహము, 

(iii) చంద్రమండలం  - సంవహము, 

(iv) నక్షత్రమండలం  - ఉద్వహము, 

(v) గ్రహమండలం     - వివహము, 

(vi) సప్తర్షిమండలం  - పరివహము, 

(vii) ధ్రువమండలం  - పరావహము


అని ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అధిష్ఠానదేవతగా ఉంటుంది. అందుకనే వాయుపుత్రుడైన హనుమ అంతరిక్ష సంచారాన్ని  అలవోకగా చేస్తాడు. 


ఆకాశమార్గంలో సముద్ర లంఘనం, సంజీవని పర్వతం పెకలించి తీసుకురావడం, తిరిగి యథాస్థానంలో ఉంచడం వంటివి ఈ కోవలోకి వస్తాయి.


(ఆ) శరీరంలోని...


హృదిలో    - ప్రాణ, 

గుదిలో      - అపాన,

నాభి వద్ద   - సమాన, 

కంఠంవద్ద   - ఉదాన, 

సర్వశరీరమందు - వ్యాన 


అనే ఐదు వాయువులు అంతర్గతంగా అందరికీ జీవాధారంగా పనిచేస్తాయి. 


వాయునందనుడు ఈ ఐదు వాయువులతోనూ శారీరకంగా అద్భుతాలు చేసినవాడు కదా!


ఈ విధమైన కార్యాలవలనే,  విభీషణునితో జాంబవంతుడు


"హనుమ జీవించియున్నచో వానరసైన్యము హతమైననూ బ్రతికియున్నట్లే! మారుతి ప్రాణాలు విడిస్తే, మనమందరమూ బ్రతికియున్ననూ మరణించినవారితో సమానమే!"


అని వాయుపుత్రుడైన హనుమ గూర్చి అనగలిగాడు.


వాయువు:


"గంధనం హింసనం యో వాతి చరాచరం జగద్ధరతి బలినాం బలిష్ఠః స వాయుః" - అని వాయు పదానికి నిర్వచనం. అంటే, 


చరాచర జగత్తును ధరించి జీవింపజేసి లయింపచేయువాడునూ, బలవంతులకంటే బలవంతుడునూ అవడం వల్ల దానికి "వాయువు" అని పేరు అని అర్థం.


వాయుపుత్రుడుగా హనుమ శ్రీరామునికి ప్రీతిపాత్రుడై, మనందరికీ ఇష్టమైన ఇహలోక రక్షకుడు.


       🚩🙏 జై హనుమాన్ 🙏🚩

పిన్నీసు కథ

 *పిన్నీసు కథ* 🌷🍁💐... 


ప్రతిభ కనపర్చిన ఆటగాడి మెడలో వేలాడే మెడల్స్ ఎంత పవర్ ఫుల్లో... 

 *ముప్పైఏళ్ళ క్రితం 

మొలతాడుకూ, 

స్త్రీల పసుపుతాడుకూ 

వేలాడే సూదిపిన్నీసులు* అంతే!!!


ఆ రోజుల్లో హవాయి చెప్పు తెగిపోతే కాపాడేది పిన్నీసే


మూడు నాలుగు సంవత్సరాలకోసారి కుట్టించే నిక్కరు ఎనకాల కుట్లూడిపోతే కాపాడింది ఆ పిన్నీసే.


ఆ రోజుల్లో ఎప్పుడుపడితే అప్పుడు బట్టలు కొనేవారు కాదు... సంవత్సరానికోసారి, అదైనా పండక్కే.


కాల్లో ముల్లుగుచ్చుకుంటే పిన్నీసుతోనే ఆపరేషన్.


చెవిలో గులిమి (గుబిలి) తీసుకోవాలంటే పిన్నీసే...


ఏదైనా పీచున్న కూర తిన్నరోజున, ఇంకేదైనా నారవంటిది పంట్లో ఇరుక్కున్నా పిన్నీసే దిక్కూ...


చిన్నప్పుడు పెన్ను పత్తి సరిగ్గా రాయకపోతే పాళీని తీసేసి, దానికున్న గాడిలోంచి గడ్డకట్టిన ఇంకును పిన్నీసుతోటే శుభ్రం చేసేవాళ్ళం .


బాల్ పెన్నులో వుండే బాల్ సరిగ్గా తిరగకపోయినా ఆ పిన్నీసుతోటే రిపేరు .


జెండా వందనం రోజున పిల్లలజేబులకి జెండా బొమ్మని పిన్నీసుతోనే పెట్టుకున్న గుర్తు.


అటువంటి పిన్నీసుకు కాలం చెల్లింది అనుకునే టైంలో....


ఇవాళ ఒకబ్బాయి 

"అంకుల్, 

పిన్నీసుంటే ఓసారివ్వరా?

*సెల్లో సిమ్ము తీసుకోవాలి"* అన్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది. 

మన చిన్నప్పటి పిన్నీసుకు 

మళ్ళీ మంచిరోజులు 

వచ్చాయా అని?

తప్పకుండా వచ్చినయ్!


*పిన్నీసమ్మ తల్లీ నీక్కూడా ఓరోజుందని తెలిసింది.

5, డిసెంబర్ 2021, ఆదివారం

స్పాండిలైటిస్ మరియు సయాటిక

 స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ - 


          ఈ రెండు సమస్యలు నేడు సర్వసాధారణం అయినవి . దీనికి ప్రధానకారణం మన ఆహారపు అలవాట్లు మరియు మనం చేయు ఒత్తిడితో కూడుకొనిన పనులు కూడా కారణమే . ఇవి శరీరము నందు పెరుగు వాతదోషము వలన కలుగును. 


       ఈ స్పాండిలైటిస్ లో మెడ వెనుక భాగములో గల C 2 , C 3 , C 4 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడటం వలన నరం ఒత్తుకుపోయి ఈ సమస్య ప్రారంభం అగును. కొందరు తల పైకి ఎత్తలేరు . కొందరు తలను పక్కలకు సరిగా తిప్పలేరు . దీనికి కారణం వారి మెడ నరాలు , కండరాలు బిగుసుకొని పోతాయి . ఇంతకు ముందు చెప్పిన విధముగా నరము నొక్కుకొని పోయినప్పుడు నొప్పి మెడ నుంచి భుజాలకు మరియు చేతులకు కూడా పాకును . 


          సయాటిక నందు వెన్నుపాము చివర నొప్పి మొదలయ్యి కుడికాలు నందు గాని ఎడమకాలి చివర వరకు గాని నొప్పి ఉండును. ఈ నొప్పి తీవ్రత చాలా అధికంగా ఉండును. కదిలినప్పుడల్లా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. వెన్నపాము నందలి L4 , L5 , S1 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడి ఆ ఖాళి నందు నరం పడి నలగడం వలన ఈ సమస్య ఏర్పడును . 


              నేను ఈ రెండు సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు గమనించిన విషయాలు ఏమిటంటే స్పాండిలైటిస్ వచ్చిన వారికి చిన్నగా కొంతకాలానికి సయాటిక కూడా వస్తుంది. సయాటిక వచ్చిన వారికి కొంతకాలానికి స్పాండిలైటిస్ వస్తుంది. సమస్య మొదలైనప్పుడు సరైన చికిత్స తీసుకోకున్న రెండు సమస్యలు చుట్టుముట్టును . మరొక్క ముఖ్యవిషయం ఈ రెండు సమస్యలు మొదలు ఒకవైపు మాత్రమే మొదలై చివరికి రెండోవైపు కూడా సమస్య మొదలగును . ఉదాహరణకు సయాటిక వెన్నుపాము చివర నుంచి మొదలు అయ్యి కుడికాలుకు వచ్చింది అనుకుందాం మనం మన శరీర బరువును ఎడమకాలి మీద వేసి నడవటం కాని నిలబడటం కాని చేస్తాము . ఇలా కొంతకాలానికి ఎడమ కాలికి కూడా నొప్పి ప్రారంభం అగును. ఇది అత్యంత తీవ్రమైన సమస్య . 


       అల్లోపతి వైద్యము నందు వైద్యులు దీనికి సర్జరి పరిష్కారంగా చెప్తారు. కాని కొంతకాలానికి మరలా సమస్య తిరగబెట్టడం నేను గమనించాను . ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి అత్యంత అద్బుతమైన చికిత్సలు కలవు. 


      ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నవారు నన్ను సంప్రదించగలరు. ముఖ్యముగా ఆయుర్వేద చికిత్స యందు పథ్యం ప్రధానపాత్ర పోషిస్తుంది . ఇక్కడ పాటించవలసిన ఆహార పథ్యాలు మీకు వచ్చిన ఆనారోగ్య సమస్యకు మాత్రమే తప్ప ఔషధాలుకు కావు . నేను తయారుచేసి ఇచ్చు ఔషధాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  


                కాళహస్తి వేంకటేశ్వరరావు 


            అనువంశిక ఆయుర్వేద వైద్యం 


                      9885030034

సంపూర్ణ సూర్యగ్రహణం

 Oneindia Telugu

Surya Grahanam 2021: శనివారం..అమావాస్య..సంపూర్ణ సూర్యగ్రహణం: కనిపించే దేశాలివే

By Chandrasekhar Rao

Updated: Fri, Dec 3, 2021, 11:16 [IST]

  Google Oneindia New

కొద్దిరోజుల కిందటే చంద్రగ్రహణాన్ని చూశాం. కిందటి నెల నవంబర్ 19వ తేదీన కార్తీక పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. భారత్‌లో ఇది కనిపించలేదు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో కొంతభాగం మాత్రమే ఈ కార్తీక పౌర్ణమి నాటి చంద్రగ్రహణం కనిపించింది. ఇక సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. కనువిందు చేయనుంది. కొన్ని దేశాల ప్రజలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించగలుగుతారు. భారత్‌లో ఇది కనిపించదు.ముందుగా సూర్యగ్రహణం గురించి తెలుసుకుందాం. సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. దీన్నే సూర్యగ్రహణం అంటాం. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో చంద్రడు వచ్చిన సమయంలో చంద్రుడికి సంబంధించిన నీడ భూమిపై పడుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సూర్యుడి నుంచి వచ్చే కాంతిని పూర్తిగా అడ్డుకుంటుంది. దీన్నే అంబ్రా అని పిలుస్తాము. సూర్యుడి బాహ్య ప్రాంతంను మాత్రమే అడ్డుకుంటే పెనంబ్రా అని ఇంగ్లీషులో పిలుస్తాము. సంపూర్ణ సూర్యగ్రహణం రోజున చంద్రుడు మొత్తం సూర్యుడికి అడ్డుగా ఉంటుంది. అదే పాక్షిక సూర్యగ్రహణం రోజున సూర్యుడిలో ఒక భాగం మాత్రమే చంద్రుడు అడ్డుకుటుంది.



శనివారం అమావాస్య నాడు..

ఈ సంవత్సరపు చివరి సూర్య గ్రహణం ఇది. ఈ నెల 4వ తేదీన..శనివారం అమావాస్య నాడు ఏర్పడనుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. ఈ అంతరిక్ష అద్భుతం పలు దేశాల్లో కనిపిస్తుంది. పాక్షికమే అయినప్పటికీ..కొన్ని దేశాలు రింగ్ ఆఫ్ ఫైర్‌ను చూడగలుగుతాయి. గ్రహణం సమయం ఆరంభం నుంచి పూర్తి ఆ ఛాయ తొలగిపోవడానికి దాదాపు ఆరు గంటల పాటు పడుతుంది.




కనిపించే దేశాలివే..

దక్షిణార్ద్ర గోళంలో కొన్ని దేశాల్లో మాత్రమే ఇది కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. అంటార్కిటికా, అట్లాంటిక్ మహా సముద్రం దక్షిణ తీర ప్రాంత దేశాలు, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాల్లో కనిపిస్తుంది. సెయింట్‌ హెలెనా, నమీబియా, జార్జియా దక్షిణ ప్రాంతం, దక్షిణాఫ్రికా, శాండ్‌విచ్‌ ఐలండ్స్, క్రోజెట్‌ ఐలండ్, లెసొతొ, ఫాక్‌లాండ్‌ ఐలండ్స్, చిలీ, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల్లో ఈ సూర్యగ్రహణం పాక్షికంగా మాత్రమే కనిపిస్తుందని తెలిపింది.


.


.



ఐఎస్టీ ప్రకారం..

భారత్‌లో ఇది కనిపించదని నాసా స్పష్టం చేసింది. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం.. 4వ తేదీన ఉదయం 10 గంటల 59 నిమిషాలకు సూర్యగ్రహణం ఆరంభమౌతుంది. మధ్యాహ్నం 3:07 నిమిషాలకు ముగుస్తుంది. మధ్యాహ్నం 12:33 నిమిషాలకు గ్రహణం గరిష్ఠ స్థితికి చేరుకుంటుంది. క్రమంగా తగ్గుతుంది. 3:07 నిమిషాలకు గ్రహణ ఛాయ పూర్తిగా ముగిసిపోతుంది. ఈ సంవత్సరం మూడు గ్రహణాలు ఏర్పడ్డాయి. ఈ నెల 4వ తేదీన ఏర్పడేది నాలుగో గ్రహణం.



ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడొచ్చు..

ఇంతకుముందు మే 26వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం, జూన్‌ 10వ తేదీన వార్షిక సూర్యగ్రహణం, నవంబర్‌ 19 పాక్షిక చంద్రగ్రహణాలు కనువిందు చేశాయి. ఈ సూర్యగ్రహణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అంటార్కిటికాలోని యూనియన్ గ్లేసియర్ నుంచి లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నాసా అధికారిక యూట్యూబ్ ఛానల్‌ nasa.gov/live లో ఇది ప్రత్యక్ష ప్రసారమౌతుంది. మధ్యాహ్నం 12 గంటలకు లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు తెలిపింది

సంతోషము - సుఖము - ఆనందము*

 *ॐ సంతోషము - సుఖము - ఆనందము*


    సంతోషము, సుఖము, ఆనందము అనేవి వేరువేరైనా, 

    ఓకే విధమైన అర్థంలో వాడుతూ ఉంటాం. 

    వాటి నిర్వచనాలూ, ఆనందమనేదాని వివరణలు తెలుసుకొందాం. 


*సంతోషము:*


    సోమరిగా నుండకుండా, శక్తికొలది పురుషార్థములు (ధర్మముతో కూడిన అర్థ సంపద, తద్వారా ధర్మముతో కూడిన కోరిక, దానివలన వచ్చే మోక్షము అనేవి "ధర్మ అర్థ కామ మోక్షమనే పురుషార్థములు") చేయుచు, 

    హాని జరిగినప్పుడు శోకించకుండా, 

    లాభము కలిగినప్పుడు హర్షము లేకుండా ఉండడం "సంతోషము". 


*సుఖము:* 


    దేనిని పొందుట వలన మిగిలిన యే సంపదయైనను దానికన్న తక్కువదే అనిపించునో, 

    ఏ యితర లాభమును మనస్సును ఆకర్షింపని స్థితిలో, 

    మనస్సును ఆకర్షింపగల అనుభూతి ఒక్కటే సుఖము. 

    ఏ స్థితిని పొందినవాడు పెద్ద దుఃఖముల వలన కూడా చలింపడో అదే నిజమైన సుఖము. 


ఉదా॥ 

1. ఒకచోట కూర్చొని తృప్తి పొందినప్పుడు, మరింత సౌకర్యమైన అవకాశము వచ్చినా, 

    దానిని తిరస్కరించి, ఉన్నదానితో తృప్తిపొందుతూ ఉండడం "సుఖం". 

2. రేడియో ఉపయోగంతో తృప్తిపడుతూ, టేప్ రికార్డరుగానీ ఇతర సౌకర్యవంతమైన పరికరాలువచ్చినా, 

     రేడియో ఉపయోగానికే స్థిరపడితే, అది "సుఖం". 

3. పదోన్నతి (Promotion) అవుసరం లేక, ఉన్నదానితోనే తృప్తి పడితే, అది "సుఖం". 


*ఆనందము:* 


    వివిధ పదవులూ స్థానాలలో ఉన్నప్పుడు, 

    ఆ అధికారాన్ని పొందుతూ ఉండే దైహిక సౌకర్యమూ మానసిక ఉల్లాస స్థితీ ఆనందం. 

    ఇది పదవీ స్థాయిలను బట్టీ మారుతూంటుంది. 


ఉదా॥ 

    రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నరు, ముఖ్యమంత్రి, కలెక్టరు, న్యాయమూర్తి మొదలగు పదవులలో వారు పొందే మానసిక స్థితులు - వారివారి ఆనందములు. 


*ఆనందానికి శాస్త్ర ప్రమాణం*  


    వివిధ ఆనందాలను తైత్తిరీయోపనిషత్తు ఈ విధంగా తెలుపుతోంది.

1. మనుష్య ఆనందము 

     శారీరక మానసిక దృఢత్వంగల ఒక ఉత్తమవ్యక్తికి సర్వ సంపదలతోనూ ఈ భూమండలమంతా చెందితే ఎంత ఆనందం వస్తుందో అది మనుష్య ఆనందానికి ప్రమాణము(unit). 

" ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠః I 

  త స్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ I 

   స ఏకో మానుష ఆనన్దః"  

2. దీనికి వంద రెట్ల ఆనందం మనుష్య గంధర్వానందం, 

3. ఆ మనుష్య గంధర్వానందానికి వందరెట్లు దేవగంధర్వానందం, 

4. దానికి వందరెట్లు పితృదేవతల ఆనందం, 

5. ఆ పితృదేవతల ఆనందానికి వందరెట్లు అజానజుల ఆనందం, 

6. వారి ఆనందానికి వందరెట్లు కర్మదేవతల ఆనందం, 

7. ఆ కర్మదేవతల ఆనందానికి వందరెట్లు దేవతల ఆనందం, 

8. వారి ఆనందానికి వందరెట్లు ఇంద్రుని ఆనందం, 

9. ఇంద్రుని ఆనందానికి వందరెట్లు బృహస్పతి ఆనందం, 

10. బృహస్పతి ఆనందానికి వందరెట్లు ప్రజాపతి ఆనందం, 

11. ప్రజాపతి ఆనందానికి వందరెట్లు బ్రహ్మానందం.


                    =x=x=x= 

  

    — రామాయణం శర్మ 

            భద్రాచలం