16, సెప్టెంబర్ 2023, శనివారం

జ్యోతిష్యం చెప్పబడును

 ⚜️[ 8074538053]⚜️

⚜8074538053⚜

   || జ్యోతిష్యం చెప్పబడును ||


మహిషాసురమర్ధిని జ్యోతిష నిలయం 


√నమ్మినవారు దురం కావటం👬


√నిందలూ, అవమానాలు రావటం


√ఇతరులు అపార్థం చేసుకోవడం


√వివాహాం ఆలస్యంగా అవ్వటం👰🤵


√ఉద్యోగం సమస్య 👮


√పిల్లల పుట్టకపోవడం🤱🤰


√వ్యక్తిగత  జతక సమాచారం కోరకు


⚜️[8074538053]⚜️


••••••••ఓం శ్రీ మాత్రే నమః••••••••••


✓వ్యాపార వశీకరణ లేక నష్టం


✓రావల్సిన ఆస్థి, ధనం రాకపోవడం


✓భార్యా భర్తలు మధ్య వశీకరణ👫


✓విద్యా, విదేశి ప్రయణం, ఉద్యొగం 


✓కుటుంబ సభ్యుల  మధ్య విబేధాలు👨‍👩‍👦‍👦


✓అరోగ్య సమస్యలకు 


✓ప్రేమా సమస్యలకు 💏


ఇటువంటి  సమస్యలకూ ప్రత్ర్యకం గా 


చేయబడును ⚜8074538053⚜


🌷ఉన్నదీ వున్నట్లు గా చెప్పబడును🌹⚜8074538053⚜


👉.మీరు అనేక మంది జ్యోతిష్యులను సంప్రదించి నిరాశ చెంది ఉన్నారా అయితే చివరగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి పూర్తి పరిష్కారం లభిస్తుంది దయచేసి టైం పాస్ కోసం సరదా కోసం కాల్ చేయకండి మేము కోరేది కూడా మీ మంచి గురించే..  📲📲[[8074538053]]

ధనప్రాప్తి-మారేడు ఆకు*

 లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం

శ్రీనివాససిద్ధాంతి9494550355


*ధనప్రాప్తి-మారేడు ఆకు*


ధన మూల మిదం జగత్ అనే సామెత అందరికీ తెలిసినదే ధనం చుట్టూ ఈ ప్రపంచం తిరుగుతుంది అనేది అక్షర సత్యం. ప్రతి ఒక్కరి అవసరాలు తీరడం అనేది ధనం తోనే ముడిపడి ఉందని చెప్పాలి. అటువంటి ధనము లభించాలి వృద్ధి చెందాలి అని భావించేవారు మారేడు దళం తో చిన్న పరిహారం చేయండి. మారేడు దళానికి ధనానికి అవినాభావ సంబంధం ఉంది. శ్రీ మహాలక్ష్మి దేవి మారేడు చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తూ మారేడు చెట్టుగా మారిపోయింది అని శ్రీ సూక్తం లో తెలియజేస్తుంది. అటువంటి మారేడు దళము పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కలియుగంలో ఈశ్వరో ఐశ్వర్య కారకః అని శాస్త్రం తెలియజేస్తున్నది అనగా ఈశ్వరుడు ఐశ్వర్యానికి కారకుడు అని అర్థం. ఈశ్వరుడికి అత్యంత ప్రతిపాత్రమైనది ఈ బిల్వదళము. ఈ బిల్వదలంతో ఒక చిన్న పరిహారం చేసిన ఎడల శ్రీ మహాలక్ష్మి మరియు పరమేశ్వరుని అనుగ్రహంతో ధనానికి ఈ విధమైన లోటు లేకుండా ఐశ్వర్యంతులవుతారని శాస్త్ర వచనం. ఏదైనా ఒక గురువారం నాడు శుచిగా మారేడు చెట్టు వద్దకు వెళ్లి చెట్టు మొదట్లో నీళ్లు పోయండి. తరువాత మారేడు చెట్టుకి గంధం రాసి బొట్టు పెట్టి అగరబత్తులు వెలిగించండి. చెట్టు మొదట్లో ఆవు నెయ్యి దీపం వెలిగించి తాంబూలం సమర్పించండి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ మారేడు చెట్టుని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఇప్పటినుండి ఆర్థికంగా అన్నీ కలిసి రావాలని ధనం అభివృద్ధి చెందాలని మనసులో కోరుకుని ఒక మారేడు ఆకు కోసి ఇంటికి తెచ్చుకోండి. దానిని లామినేషన్ చేయండి ఇలా చేస్తే ఆకు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. ఈ ఆకుని మీ పూజా మందిరంలో ఉంచండి లేదా మీ పర్సులో కానీ జేబులో కానీ ఉంచుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ధనానికి లోటు ఉండదు ఎల్లప్పుడూ ధనం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవాలయంలో మారేడు చెట్టు నుండి ఆకును సేకరించాలని కున్నప్పుడు దేవాలయం నుండి ఉచితంగా ఏ వస్తువు ఇంటికి తెచ్చుకోరాదు. దేవాలయంలో అర్చకునికి దక్షిణ సమర్పించిన తరువాత మారేడు చెట్టు వద్దకు వెళ్లి పైన చెప్పిన నియమాలు పాటించి మారేడు ఆకును సేకరించాల్సి ఉంటుంది. దేవాలయం బయట ఎక్కడైనా మారేడు చెట్టు నుండి మారేడు దళాని  సేకరించాలంటే ఎవరికి దక్షిణ సమర్పించాల్సిన అవసరం లేదు. పై విధానాన్ని పాటించండి. ఐశ్వర్య ప్రాప్తిని పొందండి


జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్న, member in international astrology federation. ..శ్రీనివాస సిద్ధాంతి*

*9494550355*


PlZ Forward the message

రామాయణమ్ 326

 రామాయణమ్ 326

....

మదించిన ఏనుగుల సమూహానికి రెక్కలు వచ్చి గాలిలోకి ఎగిరితే ఎలా ఉంటుందో అలాగా ఆకాశమంతా నిండిపోయి ప్రయాణం చేస్తున్నారు వానరవీరులు.

.

ముందు ఎగురుతున్న హనుమంతుని అపురూపంగా చూసుకుంటూ ఆయన మీదనుండి దృష్టి మరల్చకుండా గాలిని తోసుకుంటూ ఆధారమేలేని ఆకాశంలో రయ్యిమంటూ దూసుకు పోతున్నారు .

.

ఇక కిష్కింధ కొంతదవ్వున ఉన్నదనగా వారికి ఫలపుష్పాదులతో నయనానందకరంగా నందనవనాన్ని మరపిస్తున్న మధువనం కనపడ్డది .

.

అది సుగ్రీవునికి అత్యంత ఇష్టమైన వనం దానిని ఆయన మేనమామ దధిముఖుడు సంరక్షిస్తూ ఉన్నాడు.

.

ఆ వనాన్ని చూడగానే మధువులు గ్రోలి విజయోత్సవాలు జరుపుకోవాలన్న కోరిక వారిలో పెచ్చరిల్లింది . కోరిక పుట్టినదే తడవుగా అంగదుని అనుమతి కోరి ఆయన సమ్మతి మీద మధువనంలో ప్రవేశించారు వానరవీరులంతా .

.

రావడము రావడమే చెట్లమీద విరుచుకు పడ్డారు అందరూ.

.

పండ్లు తెంపి పొట్టపట్టినంతా తిని వాటితో బంతులాడేవాడొకడు!

తేనెతుట్టెలు తెంపి మధువులు గ్రోలి మత్తెక్కి ఊగేవాడొకడు

తోకనెత్తుకొని ఠీవిగ అటునిటు పరుగులెత్తేవాడింకొకడు

.

గంతులు వేసేవాడొకడు గొంతునిండా తేనెలు తాగేవాడొకడు

.

బారుగా చెట్లు ఎక్కేవాడొకడు 

వాడికి ఎదురుగా సర్రున దిగేవాడింకొకడు

.

కొమ్మలు పట్టుకొని వేలాడేవాడొకడు

అంత ఎత్తునుండి ధబ్బున నేలమీద దూకేవాడింకొకడు

.

చెట్టుమీదనుండి మరియొక చెట్టుమీదకు దూకేవాడొకడయితే

గుట్టలుగా పండ్లు తెంపి నేలపై విసిరేవాడింకొకడు

.

ఒకడివీపుమీద మరియొకడు స్వారీచేస్తుంటే వాడి మూపుమీద ఎక్కి ఊపున దూకేవాడు ఇంకొకడు.

.

పూలు కోసి ,కసుకాయలు తెంపి విసురుగా విసరివేస్తూ ఒకడు..

లేచిగుళ్ళు తెంపివేసి కొమ్మలు విరిచివేసి వికవిక నవ్వేవాడొకడు వాడిని చూసి పకపకనవ్వేవాడొకడు వారివురినీ చూసి పళ్ళికిలించి సకిలించేవాడింకొకడు.

.

మొత్తం వనమంతా ధ్వంసంచేస్తూ ఒకరినొకరు పరిహసించుకొంటూ ,హసిస్తూ కుప్పిగంతులు వేసి పాటలు పాడుకొంటూ ఉన్న వానరమూక ను చూసి కావలి వాళ్ళు వారించబోతే వారిని చావచితకకొట్టి పారిపోయేటట్లు చేయగా వారు వెళ్ళి దధిముఖుని వద్ద మొరపెట్టుకొన్నారు.

.

దధిముఖుడు మద్దిచెట్లు,తాడిచెట్లు,పెద్దపెద్దబండరాళ్ళు ఆయుధాలుగా పట్టుకొన్న బంట్లు వెంటరాగా హనుమదాదులు ఉన్నచోటికి వచ్చివారిని వారించబోగా,.

.

ఆ దధిముఖుడిని పట్టి ముఖముపైకొట్టి గడ్డము మీద గ్రుద్ది నేలపై పడద్రోసి ముష్టిఘాతాలతో అతని ఒడలంతా పొడిచిపొడిచి విడిచిపెట్టినాడు అంగదుడు.

.

ఆ దెబ్బలకు ఓర్వలేక పోయిపోయి సుగ్రీవుని ముందు వడలిపోయిన ఒడలుకలవాడై తీవ్రగాయాలతో రుధిరధారలు కారుతుండగా వానరరాజుముందు అంజలి ఘటించి నిలుచున్నాడు దధిముఖుడు.

.

వూటుకూరు జానకిరామారావు

16 సెప్టెంబర్, 2023

 🔔🔔 *_PVSN MURTHY_* 🔔🔔                                  🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీరస్తు.                          శుభమస్తు.                                                        అవిఘ్నమస్తు.  

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱                                                                   🙏    *ఓం శ్రీ గురుభ్యోనమః*    🙏 

         🙏  *శుభోదయం*  🙏 

🌿🎋 *16 సెప్టెంబర్, 2023,  శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,  దక్షిణాయణం, వర్షఋతువు, నిజశ్రావణ మాసం,కృష్ణపక్షం, శని వారం(స్థిరవాసరం)* 🎋🌿               

 తిధి                   : భాద్రపద శు. పాడ్యమి ఉ. 7.53. తదుపరి విదియ.        నక్షత్రం                  : ఉత్తర ఉ. 7.32. తదుపరి హస్త.         అమృతం              : తె. 3.01 ల. 4.45 వరకు.

దుర్ముహూర్తం        : ఉ. 5.50 ల. 7.28 వరకు.

వర్జం                      : సా. 4.38 ల. 6.22 వరకు.                                                                

 రాహుకాలం           : ఉ. 9.00 ల. 10.30 వరకు.                   

యమగండం            : మ. 1.30 ల. 3.00 వరకు.                               సూర్యోదయం        : 5.51.             

సూర్యాస్తమయం   : 6.02.                                                                                  🎋🌿 *2 తిథి, అనాధ్యాయః, చంద్ర దర్శనం, ఉత్తర శృంగం సమార్ఘ:*    🌿🎋                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  🌼🌼🌼🌼🙏🙏🙏🌼 🌼🌼🌼 

🕉🕉🕉🕉 *శుభమస్తు*  🕉🕉🕉

🔯🔯🔯🔯🔯🔯 🔯🔯🔯🔯

వృక్షములు

 🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝


*పాదపానాం భయం వాతాత్*

*పద్మానాం శిశిరాద్భయమ్*।

*పర్వతానాం భయం వజ్రాత్*

*సాధూనాం దుర్జనాద్భయమ్*॥


,*తా𝕝𝕝 వృక్షములు గాలి చేత భీతిల్లును..... పద్మములు శిశిరఋతువు చేత భీతిల్లును..... పర్వతములకు ఇంద్రుడియొక్క వజ్రాయుధమన్న భయము.....*

*సాధువులకు దుర్జనులన్నచో భయము ఏర్పడును*.....

భయము వృక్షములకు పవనంబు వలనను

భయము మంచు వలన పద్మములకు

పర్వతముల కెల్ల భయము యింద్రుని వలన

భయము సాధువులకు పాపి వలన

🧘‍♂️🙏🪷 ✍️🙏

సంస్కృత భారతీ* *3*

 *సంస్కృత భారతీ*

              *3*

    *తృతీయ పాఠః*

*మానుష సంబంధాః*

పితా= తండ్రి, మాతా= తల్లి, భ్రాతః/సహోదరః = అన్న/తమ్ముడు,

సహోదరీ = అక్క/చెల్లెలు, అగ్రజః = అన్న, అగ్రజా / భగినీ = అక్క, అనుజః = తమ్ముడు, అనుజా = చెల్లెలు,

 భావుకః/ ఆవుత్తః = బావ, ప్రజావతీ = వదిన, 

దేవరః = మరిది(వదినకు), శ్యాలకః = భావమరిది( (బావకు), మాతులః = మేనమామ, మాతులీ/మాతులానీ = మేనత్త (మేనమామ భార్య),మాతులేయః = మేనమామ కొడుకు, పితృవ్యః = పినతండ్రి (బాబయ్య), పితృవ్యా = పిన్ని(బాబయ్య భార్య), మాతృష్వసా =పిన్నమ్మ/ పిన్ని( తల్లి యొక్క చెల్లెలు), పితృష్వసా = మేనత్త (తండ్రి యొక్క చెల్లెలు), శ్వశురః = మామగారు, శ్వశ్రూ = అత్తగారు, భాగినేయః = మేనల్లుడు,

భాగినేయా = మేనకోడలు,

 భ్రాతృజః = అన్న లేదా తమ్ముని కొడుకు, భ్రాతృజా = అన్న(తమ్ముని) కూతురు. 

పితామహః = తండ్రి యొక్క తండ్రి, పితామహీ = తండ్రి యొక్క తల్లి, మాతామహః = తల్లి యొక్క తండ్రి, మాతామహీ = తల్లి యొక్క తల్లి, ఇదేవిధంగా ప్రపితామహః,ప్రపితామహీ అనగా పితామహుని తల్లిదండ్రులు. మాతుః పితామహః,మాతుః పితామహీ అంటే మాతామహుని తల్లిదండ్రులు మాతుః ప్రపితామహః అంటే తల్లి యొక్క పితామహుని తండ్రి, మాతుః ప్రపితామహీ అంటే తల్లి యొక్క పితామహుని తల్లి., పౌత్రః = మనుమడు, ప్రపౌత్రః = మునిమనుమడు,.నప్త్రః = మునిమనుమడి కొడుకు, వీరి స్త్రీ రూపాలు(మనుమరాలు, మునిమనుమరాలు, మునిమనుమడి కూతురు)పౌత్రీ,ప్రపౌత్రీ, నప్త్రీ

సఖా = మిత్రము(పుల్లింగము), 

( *కానీ వ్యావహారికముగా తెలుగు లో స్నేహితుని మిత్రుడు అని సంబోధిస్తున్నారు,కానీ మిత్రుడు అంటే సూర్యుడు అని అర్థం, ఎందుకంటే సంస్కృతమున మిత్రః అంటే సూర్యుడు అని అర్థం*) కానీ సమాసమేర్పడినప్పుడు విసర్గాంతమవుతుంది. ఉదాహరణకు రామసఖః, కృష్ణసఖః...ఇలా.

 సఖీ = మిత్రురాలు. 

*సాధారణగమనిక*:-- సంస్కృత పుం లింగ శబ్దాలు సాధారణంగా విసర్గాంతాలుగా ఉంటాయి, వాటిని తెలుగు లోనికి పుంలింగ శబ్దాలు గా మార్చి తే చివర "డు" చేరుతుంది, ఉదాహరణకు రామః అనేది రాముడు, శంభుః అనేది శంభుడు,మిత్రః అనే ది మిత్రుడు......ఇలా మారతాయి., సంస్కృత స్త్రీలింగ శబ్దాలు దీర్ఘాంతాలుగా ఉంటాయి, ఉదాహరణకు సీతా, గౌరీ,రాణీ... సంస్కృత నపుంసక లింగశబ్దాలు సాధారణంగా పూర్ణాంతాలుగా ఉంటాయి. అంతే కాకుండా సంస్కృతంలో ఏ లింగ శబ్దమైననూ తెలుగు లో పుంలింగశబ్దమైతే "డు" అంతం గానూ, నపుంసక తెలుగు పదం గా మారితే "ము" అంతం గానూ మారతాయి.

**శుభం భూయాత్***

**** *కొంపెల్ల శ్రీనివాస శర్మ***

ఎక్కువ పొడవుగా

 శ్లోకం:


 నాత్యన్తం సరళైర్భావ్యం గత్వా పశ్య వనస్థలీమ్ ।


ఛిద్యన్తే సరళాస్తత్ర కుబ్జాస్తిష్టన్తి పాదపాః ।।

           

         చాణక్య నీతిశాస్త్రం


పద విభాగం


న అత్యన్తం, సరళైః, భావ్యం, గత్వా, పశ్య, వనస్థలీమ్,

ఛిద్యన్తే, సరళాః, తత్ర, కుబ్జాః, తిష్టన్తి, పాదపాః,


తాత్పర్యం:


ఈ శ్లోకం చాణక్యుడి నీతి శాస్త్రం లోనిది.


మరీ ఎక్కువ పొడవుగా ఎదగడం మంచిది కాదు. అడవి ప్రదేశాలకి వెళ్ళి చూడుము. అక్కడ మరీ ఎక్కువ పొడవుగా పెరిగిన చెట్లని నరికి వేస్తున్నారు. అక్కడ పొట్టిగా మరుగుజ్జుగా పెరిగిన చెట్లన్నీ నిక్షేపంగా అలాగే ఉన్నాయి.


ఈ శ్లోకం ద్వారా చాణక్యుడు జన బాహుళ్యానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు.


కుళ్ళు కుతంత్రాలతో నిండిన ఈ స్వార్థ పూరిత ప్రపంచంలో, మనిషి మనుగడకై దిశానిర్దేశం చేస్తున్నాడు. మరీ ఎక్కువ ఋజు వర్తనమైన ప్రవర్తనతో ఈ ప్రపంచంలో జీవించడం అనేది సాధ్యమైన పనికాదు. సంఘంలోని స్వార్ధపూరితమైన మనుషులు, దుష్ట శక్తులు అటువంటి వారికి జీవనమే కష్టసాధ్యం చేస్తారు. మనుగడే అసాధ్యమై పోతుంది. అది ఎలాగా అంటే అడవిలో నిట్ట నిటారుగా పెరిగిన చెట్లని నరికి వేసినట్టు గా.

పంచాంగం 16.09.2023 Saturday,

 ఈ రోజు పంచాంగం 16.09.2023 Saturday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: ప్రతిపత్తి తిధి స్థిర వాసర: ఉత్తరఫల్గుని నక్షత్రం శుక్ల యోగ: బవ తదుపరి బాలవ కరణం ఇది ఈరోజు 

పాడ్యమి పగలు 09:16 వరకు.

ఉత్తరఫల్గుని ఉదయం 07:34 వరకు .

సూర్యోదయం : 06:07

సూర్యాస్తమయం : 06:14

వర్జ్యం : సాయంత్రం 04:49 నుండి 06:35 వరకు.

దుర్ముహూర్తం : ఉదయం 06:07 నుండి 07:44 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30  వరకు.


యమగండం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

 ***********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు 

ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ. 16.09.2023

శని వారం (స్థిర వాసరే) 

******************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ  సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

___________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

వర్ష ఋతౌ

భాద్రపద మాసే శుక్ల పక్షే ప్రతి పత్తిథౌ (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

స్థిర వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ, 

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 


సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు 

శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

వర్ష ఋతౌ  భాద్రపద మాసే  శుక్ల పక్షే ప్రతిపత్తిథౌపరి ద్వితీయాయాం

స్థిర వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.51

సూ.అ.6.00

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 


శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం వర్ష ఋతువు

భాద్రపద మాసం 

శుక్ల పక్షం పాడ్యమి ఉ. 7.50 వరకు. 

శని వారం. 

నక్షత్రం ఉత్తర ఫల్గుణి ఉ. 7.50 వరకు. 


అమృతం రా.తె.2.59 ల 4.43 వరకు. 

దుర్ముహూర్తం ఉ. 5.51 ల 7.28 వరకు.

యోగం శుక్లం తె.5.06 వరకు. 

కరణం బవ  ఉ. 7.50 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.. 

రాహు కాలం ఉ.9.00 .ల 10.30 వరకు. 

గుళిక కాలం ఉ.6.00 ల 7.30 వరకు. 

యమగండ కాలం మ. 1.30 ల 3.00 వరకు. 

***********

పుణ్యతిధి భాద్రపద శు.విదియ.

************

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,

Sachivalayanagar,

Vanasthalipuram,

Rangareddy Dist, 500 070,

80195 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

నవగ్రహా పురాణం🪐* . *27వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *27వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*చంద్రగ్రహ జననం - 9*


*"గురువుగారూ ! చంద్రుడి జననం గురించి చక్కగా చెప్పారు. పతివ్రత అయిన శీలవతి జీవితం బాగుపడింది. అనసూయకు సంతానం కలిగింది. ఆ రెండు మార్పులకు మూలం మాండవ్య మహర్షి శాపం ! శూలానికి గుచ్చబడిన ఆ మాండవ్య మహర్షి ఏమయ్యాడో మీరు చెప్పడం మరిచిపోయారు !"* చిదానందుడు గురువు నిర్వికల్పానందతో అన్నాడు.


నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. *“మరిచిపోలేదు నాయనా ! మనం శ్రవణం చేస్తున్న నవగ్రహ చరిత్రతో ఆ మహర్షికి అనుబంధం అంతమాత్రమే ! అంచేత చెప్పకుండా దాటవేశాను.”*


*"ఆయన గురించి తెలుసుకోవాలని ఉత్కంఠగా వుంది , గురువుగారూ !”* విమలానందుడు అన్నాడు.


*"సరే. క్లుప్తంగా చెప్తాను. 'శూలప్రోతం' శిక్ష అనుభవిస్తున్న మాండవ్యుడు నిరపరాధి అని తెలుసుకున్న రాజు , ఆయనను శూలం నుండి కిందకు దింపించాడు. అయితే కంఠం దాకా పోయిన ఆ శూలం లాగితే రాలేదు. పదునుగా ఉన్న అగ్రభాగం ఆయన శరీరంలోని కంఠభాగంలో విరిగి , అలాగే వుండిపోయింది. అప్పట్నుంచీ ఆయన ‘ఆణిమాండవ్యుడు’గా ప్రసిద్ధి చెందాడు. మరొక విశేషమేమంటే - ఆ మాండవ్య మహర్షి శాపం వల్లే యమధర్మరాజు ద్వాపరయుగంలో భూలోకంలో 'విదురుడు'గా జన్మించాడు !”* అంటూ ముగించాడు నిర్వికల్పానంద.


*“గురువుగారూ... ఇప్పుడు కుజగ్రహ జన్మ వృత్తాంతం వినిపిస్తారా ?”* సదానందుడు అడిగాడు.


*"కుజుడు ఎవరికి జన్మించాడు. గురువు గారూ ?”* శివానందుడు అడిగాడు


నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. *"నవగ్రహాల గురించి ఆలకించాలని మీరంతా చాలా ఆత్రుతగా వున్నారు. ఇప్పుడు , ఇక్కడ మన ఆశ్రమంలో జరుగుతున్నట్టే - కుజుడి జననం గురించి చర్చ సత్యలోకంలోనూ జరిగింది. సరస్వతీ బ్రహ్మలు పద్మాసనాల మీద కూర్చుని వున్నారు. బ్రహ్మగారి మానసపుత్రుడూ , విశ్వవార్తాహరుడూ అయిన నారదుడు. చేరుకుని , తన జననీ జనకులకు నమస్కరించాడు..."* అంటూ కథనం ప్రారంభించాడు.


*"కావాలంటే మన నారదుణ్ని అడగండి !”* అంది సరస్వతి చిరునవ్వు నవ్వుతూ. *"ఏమిటి జననీ ?"* నారదుడు కుతూహలాన్ని అణచుకోకుండా అడిగాడు.


*"అది కాదు , నారదా ! మీ జనకుల అంశ అనసూయ కడుపు పంటగా చంద్రుడు జన్మించాడు కదా ! ఈ బ్రహ్మదేవుల కన్నా , ఆ బాలుడే అందంగా ఉన్నాడు అన్నాను. నేను కాదంటున్నారు ప్రాణేశ్వరులు!"* సరస్వతి నవ్వుతూ అంది.


*"పసిగుడ్డుతో మాకు పోలికా !"* బ్రహ్మ నవ్వు దాచుకుంటూ అన్నాడు. *"నువ్వు చెప్పు నారదా... ఈయనగారు అందంగా ఉన్నారా , ఆ బాలుడు అందంగా ఉన్నాడా ?"* సరస్వతి బ్రహ్మను వాలుగా చూస్తూ నారదుణ్ణి అడిగింది.


*“నారాయణ ! అమ్మ ముందు అసత్యం పలకరాదు ! చంద్రుడే అందగాడు !"* అంటూ నారదుడు ఓరకంటితో బ్రహ్మ ముఖాలను పరిశీలించాడు.


బ్రహ్మ చిరునవ్వులు కురిపిస్తున్నాడు. *“ఆ మాత్రం మాకు తెలియదా ఏమిటి ? చంద్రుడు అందచందాలలో అందరినీ తలదన్నే విధంగా ఉండాలని అతని జననానికి పూర్వమే మేము సంకల్పించాం కదా !"*


*"సత్యలోక ప్రభువుల నోట సత్యం పలికించడానికి ఎంత శ్రమ పడాల్సి వచ్చిందో చూశావా , నారదా !”* సరస్వతి నవ్వుతూ అంది. నారదుడూ , బ్రహ్మ శృతి కలిపారు. *"నారదా ! బాలచంద్రుడు ఎలా ఉన్నాడు ?"* సరస్వతి కుతూహలంగా అడిగింది. *"ఇంకా అనసూయ స్తన్యం త్రాగుతూనే ఉన్నాడా ?”*


*“నారాయణ ! మాతా... మీరు కాలగణనను నిర్లక్ష్యం చేసినట్టున్నారు. మన చంద్రుడిప్పుడు పాలు తాగే పసివాడు కాడు. అరణ్యంలో తిరుగాడుతూ దర్భలూ , సమిధలూ ఏరి తెస్తున్నాడు. తండ్రి అత్రి మహర్షి అధ్యాపకత్వంలో వేద శాస్త్రాలు ఔపోసన పడుతున్నాడు !”* నారదుడు వివరించాడు.


*"అలాగా !"* సరస్వతి ఆశ్చర్యంతో అంది. *"మరి నవగ్రహాలలో మూడవ గ్రహం ఆవిర్భవించాలి కదా !"*


*"ఔను ! ఆ కార్యం పరమేశ్వరుడి ద్వారా జరిగితే బావుంటుంది...”* బ్రహ్మ సాలోచనగా అన్నాడు. 


*"పరమేశ్వరుడా... !"* ఆశ్చర్యపోయింది సరస్వతి.


*"శ్రీమహావిష్ణువు నుండి మొదటి గ్రహదేవత సూర్యుడు అవతరించాడు. మా అంశతో రెండవ గ్రహదేవత చంద్రుడు ఉదయించాడు. త్రిమూర్తులలో ఇక మిగిలింది. శివుడే ! ఆయన మూలంగా మూడవ గ్రహం ఆవిర్భవిస్తే...”*


*“నారాయణ !"* నారదుడు ఉత్సాహంగా అడ్డు తగిలాడు. *"జనకా ! అయితే , వెళ్ళి కైలాసవాసుణ్ని హెచ్చరించమని ఆజ్ఞా !"*


*"మా జనకుల సంకల్పమూ , మా సంకల్పమూ అదే , పుత్రా !"* బ్రహ్మ అన్నాడు. నారదుడు ఆలస్యం చేయకుండా నిష్క్రమించాడు.


🐏🐏 *రేపటి నుండి కుజగ్రహ జననం ప్రారంభం*


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-48🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-48🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*తిరుమల ప్రధానాలయం*


తిరుమల ప్రధానాలయం అయిన గర్భగుడిలో శ్రీవారి దివ్య మంగళ విగ్రహంతో పాటు 4 విగ్రహాలుగా దర్శనమిచ్చే నలుగురు మూర్తులున్నారు. వీరినే చతుర్బేరాలు అంటారు. బేర మంటే విగ్రహం అని అర్ధం.


*1.కౌతుక బేరం:*


ఇక్కడ నిత్య సేవలన్నీ కౌతుక బేరానికి నిర్వహిస్తారు.

ఈయన భోగ శ్రీనివాసుడు.

7వ శతాబ్దంలో పల్లవ యువరాణి సమవాయి ఈ విగ్రహాన్ని బహుకరించారు.

రోజువారి అభిషేకాలు, దీపారాధన నైవేద్యాలన్ని భోగ శ్రీనివాసునికే జరపడం ఆచారంగా వస్తుంది


*2.బలి బేరం:*

 

సొమ్ము అప్పగింతలు, కొలువు బలి బేరానికి జరుగుతాయి.

గర్భగుడిలో ఉండే శ్రీవారి చిన్న విగ్రహం. ఈయన కొలువు శ్రీనివాసుడు.

మూల విరాట్ కు తోమాలసేవ తరువాత కొలువు శ్రీనివాసుని ఆలయ మండపానికి తీసుకువచ్చి రోజువారి పంచాంగ శ్రవణం జరిపిస్తారు.


*3.స్నపన బేరం:*


స్నపన బేరం ఈ మూర్తిని 11వ శతాబ్దం వరకు ఉత్సవ విగ్రహంగా పూజించారు.

ఈయనే ఉగ్ర శ్రీనివాసుడు. శ్రీదేవి భూదేవి సహిత శ్రీవారీయన.


*4.ఉత్సవ బేరం:*

 

ఉత్సవ కార్యక్రమాలన్ని ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సహిత మలయప్పస్వామికి నిర్వహిస్తున్నారు.

మలయప్పస్వామి వారు ఉత్సవాలతో వైభోగం వెలిగిస్తారు. ఉత్సవాలలో ఉత్సవ బేరాన్ని ఊరేగిస్తున్నారు. ఉత్సవ బేరమంటే మలయప్పస్వామి.

బ్రహ్మోత్సవాలలో బ్రహ్మా వెలిగించే స్వామి ఈయనే. భక్త కోటికి దర్శనమిస్తూ సాగిపోతుంటారు.

ఈయనకు ఇరువైపులా 24 అంగుళాల ఎత్తున శ్రీదేవి భూదేవి కొలువైయున్నారు.


*ధృవ బేరం:*

 

స్వామి వారి ప్రతిమను ధ్రువ బేరం అంటారు. నిశ్చల, ధీర, గంభీర మూర్తి శ్రీవారు.

ధ్రువమూర్తినే దేవదేవుడు ఈయనకు నిత్య సేవలు అందుతున్నాయి.

 

భక్తుల కోర్కెలు తీర్చే భారం 

మాత్రం ఈ మూర్తులలో ధ్రువ మూర్తిది. అంటే ప్రధాన మూర్తి శ్రీ వెంకటేశ్వరునిదే.


గర్భాలయంలో దర్పంగా చిద్విలాసం చిందించే స్వామియే బ్రహ్మాండ నాయకుడు మూల విరాట్. ఆగమ పరిభాషలో ఈ మూల విరాటునే ధ్రువ బేరం అని పిలుస్తున్నారు.


దేవ దేవుని విగ్రహం ఎత్తు తొమిదిన్నర అడుగులు. ప్రతి రోజు అనేక రకాల పూలతోను బంగారు నగలతోను ఈ ధ్రువ బేరాన్ని అలంకరిస్తారు. గర్భగుడిలో అలంకరించే విరిదండలు మరింత శోభను తెస్తాయి.

ఇక్కడ శ్రీనివాసునికి ఇరువైపులా ఇష్ట సకులుండరు. వీరిరువురు స్వామి వారి వక్ష స్థలం మీద దర్శన మిస్తుంటారు.

ప్రధాన విగ్రహంతో పాటు ఈ నలుగురు మూర్తులు శ్రీవారి ఆలయంలో కొలువై భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు.



*గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా;* 

 *గోవిందా హరి గోవిందా,* *వేంకట రమణా గోవిందా,* 


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏*

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 40*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 40*


శ్రీరామకృష్ణుల మనోఫలకంపై నరేంద్రుని భవిష్యత్తు దేదీప్య మానమైన చిత్తరువులా ద్యోతకమయింది. సమావేశానంతరం ఆయన ఇలా అన్నారు: "ఏ శక్తితో కేశవ్ లోకప్రసిద్ధుడై ప్రశంసలందుకొంటున్నాడో అలాంటి పద్దెనిమిది శక్తులు నరేంద్రునిలో పరిపూర్ణ స్థితిలో నెలకొని ఉండడం చూశాను! కేశవ్ లోనూ, విజయ్ లోనూ జ్ఞానప్రకాశం ఒక దీపంలా మాత్రమే ప్రకాశిస్తూన్నది. కాని నరేంద్రుణ్ణి చూస్తే, అతడి హృదయంలో జ్ఞానభాస్కరుడే ఉదయించి ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశం, మాయను ఆసాంతం తుడిచివేసింది.”


మరొకసారి ఇలా అన్నారు.... 


“నరేంద్రుడు అత్యున్నత స్థితికి చెందినవాడు. మగతనం గలవాడు. ఎందరో భక్తులు ఇక్కడకు వస్తూవుంటారు. కాని మచ్చుకు ఒక్కరు కూడా అతడి మాదిరి లేరు. ఇక్కడకు వస్తూవున్న భక్తుల గురించి అప్పుడప్పుడు నేను యోచించడం కద్దు. వారిలో కొందరు దశదళ పద్మాలు, కొందరు శతదళ పద్మాలు, కాని నరేంద్రుడో సహస్రదళ పద్మం, తక్కిన భక్తులు కుండలు, కడవలు; నరేంద్రుడు పెద్ద గంగాళం. తక్కిన వారు చిన్న నీటి గుంటలు; నరేంద్రుడు హాల్దార్పుకూర్ లాంటి పెద్ద చెరువు. తక్కినవారు చిన్న చిన్న చేపలు; నరేంద్రుడు ఎర్రటి కళ్లుగల పెద్ద బాడిస చేప.”


శ్రీరామకృష్ణులు ముఖతా ఇలాంటి ప్రశంసలు వింటే ఆంతరిక ప్రకాశం కొరవడిన దుర్బలుడు, అహంకారంతో కన్నూమిన్నూ తెలియకుండా గంతులు వేస్తాడు. నరేంద్రుని విషయంలో ఈ మాటలు పూర్తిగా మరో విధమైన ప్రభావాన్ని చూపాయి. అసాధారణమైన అంతర్ముఖ స్థితిలో ఉండే అతడి మనస్సు లోలోతులకు పోయి కేశవ్, విజయ్ ఎనలేని సుగుణాలతో తన అప్పటి స్థితిని పోల్చి చూసింది. అంతటి ప్రశంసలకు తాను తగననుకొన్న నరేంద్రుడు శ్రీరామకృష్ణుల వాక్కులను నిరసించాడు: 


“ఏమంటున్నారు? ఇది వింటే లోకులు మిమ్మల్ని పిచ్చివాడంటారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేశవ్ సేన్ ఎక్కడ? మహాత్ముడైన విజయ్ గోస్వామి ఎక్కడ? ఏమీలేని పాఠశాల విద్యార్థినయిన నే నెక్కడ? వారితో నన్ను పోల్చకండి, దయచేసి ఇలా మాట్లాడకండి" అన్నాడతడు. కాని నరేంద్రుని నిరసనను శ్రీరామకృష్ణులు పట్టించుకోలేదు. అది ఆయనకు సంతోషాన్నే కలిగించింది. ఆప్యాయంగా ఆయన ఇలా అన్నారు:


 “నాయనా! నేనేం చేయగలను? ఈ మాటలు నేను పలుకుతున్నానని అనుకొంటున్నావా నువ్వు? జగజ్జనని నాకు. దర్శింపజేసింది. నేను చెప్పాను. ఆమె సత్యం తప్ప మరేదీ దర్శింపజేయదు. అందువల్లనే అలా మాట్లాడాను.”🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 23* 🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 23*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


       *త్వయా హృత్వా వామం వపు రపరితృప్తేన మనసా*

       *శరీరార్ధం శంభో రపరమపి శంకే హృతమభూత్ |*

       *యదేత త్త్వద్రూపం సకల మరుణాభం త్రినయనం*

       *కుచాభ్యా మానమ్రం కుటిల శశి చూడాల మకుటమ్ ||*


అమ్మా 

త్వయా హృత్వా వామం వపు: = శివుడిలో వామార్థ  భాగం నీవు తీసుకొని కూడా


అపరితృప్తేన మనసా = నీ మనస్సు తృప్తి చెందటం లేదు.


శరీరార్ధం శంభో రపరమపి శంకే హృతమభూత్ = శంకరుని అర్ధభాగం కూడా నీవు ఆక్రమించుకున్నావు.


యదేత త్త్వద్రూపం సకలమరుణాభం = అలా ఆక్రమించుకొని పూర్తిగా అరుణ వర్ణంలో ప్రకాశిస్తున్నావు.

పోనీ మొత్తం నీవే ఉన్నావా అంటే మళ్ళీ త్రినయనాలతో వున్నావు. పైగా చంద్రవంక మకుటంపై ధరించి వున్నావు.*శశి చూడాల మకుటమ్*


అలాగని పూర్తిగా శివుడని అనుకుందామా కుదరటం లేదు. ఎందుకంటే, కుచాభ్యామానమ్రం = ఎత్తైన వక్షస్థలం తోనూ 


అరుణాభం = యెర్రని రంగుతోనూ ప్రకాశిస్తున్నావు.


ఇక్కడ శంకరులు శివ శక్త్యేక్య స్వరూపాన్ని చమత్కారంగా వర్ణించారు. 


కంచి కామాక్షి ఆలయంలో కూర్చున్న అమ్మవారు తపః కామాక్షి అనబడుతారు. అయితే అంత పెద్ద ఆలయ సముదాయంలో ఎక్కడా శివలింగం కనబడదు. అంటే, అమ్మవారిలోనే అయ్యవారు కూడా ఉన్నారనే భావనతో దర్శించాలి మనం.


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*బాల గోపాలుని మురళీగానం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

       🌷 *శు భో ద యం 🌷* 


  *బాల గోపాలుని మురళీగానం* 

         ----------------------------------

             *ప్రకృతి పరవశం!* 


ఉ: కానల నుండుచున్ సరస గాన వివేక విహీన జాతలై

వీనుల నేఁడు కృష్ణముఖ వేణు రవామృత ధారసోకినన్

మేనులు మేఁతలున్ మఱచి మెత్తని చూడ్కి మృగీ మృగావళుల్

మానిని ! చూడవమ్మ! బహుమానము చేసె, కృతార్ధ చిత్తలై ;


భాగ 8స్కం థం 785 ప:


బాలగోపాలుడు వేణువునూదుతుంటే ఆనాద మాధుర్యానికి ప్రకృతి యెంత పులకించి పోయిందో కిన్నర మిధునం దర్శిస్తూ  దానిని వర్ణిస్తున్నారు.

అసలు సంగీతమంటే యేమోతెలియని మృగాలు (అడవిలోజంతువులు) చేష్ఠలుడిగి తన్మయంగా చిత్రీకృత దృశ్యాలవలె నిలబడి పరవశంతో వింటున్నాయట!


మరోచిత్రం!


ఉ: తల్లుల చన్నుఁ బ్రాలు మును ద్రావు తరిన్ ,దమ కర్ణవీధులన్ 

వల్లభమైన మాధవుని వంశ రవామృత ధార చొచ్చినన్ 

ద్రుళ్ళక పాలురాఁ దివక దూఁటక మానక, కృష్ణుమీఁద దృ

గ్వల్లులు చేర్చి , నిల్చె నదె వత్సము లంగనలార!గంటిరే?


దూడలు తల్లి పొదుగు లోముట్టె దూర్చి పాలుతాగ బోతున్నాయి. ఇంతలో నల్లనయ్య మురళీరవం చెవిని సోకింది. అంతే అవి పాలుచేపేందుకు చేసేప్రయత్నం మాని యిటునటు త్రుళ్ళక మొగమును కృష్ణుని వయిపు తిప్పి వేణు రవాన్ని వింటానికి ఉత్సాహం చూపుతున్నాయట! యెంత ప్రకృతి విరుధ్ధం!


మరోవిచిత్రం!


మ: మమతన్ మోములు మీఁది కెత్తుకొని రోమంథంబు సాలించి హృ

త్కమలాగ్రంబున కృష్ణునిల్పి మురళీ గానామృత శ్రేణి క

ర్ణములన్ గ్రోలుచు మేఁత మాని గళితానందా శ్రులై చిత్రితో

పమ లై గోవులు చూచు చున్న వదిగో పద్మాక్షి ! వీక్షించి తే?


ఎంతో ప్రేమతో మోరలు పైకిలేపి హృదయకమలంలో కృష్ణుని దివ్యమంగళ విగ్రహం నెలకొలిపి మురళీగానామృతమును చెవులతో పానం చేస్తూ మేతమాని ఆనందాశ్రువులు కన్నులనుండి జాలువారగా చిత్రితోపమంగా నిలచి పోయి కృష్ణుని చూచు చున్నాయట!


మరో విచిత్రం!


మ: జగతీ జంబుల శాఖ లెక్కి మురళీ శబ్దామృత స్యందముల్ 

మిగుల్ వీనులఁ ద్రావి , వ్రేగుపడు నెమ్మిం గృష్ణరూపంబు చి

త్తగమై యుండగ నడ్డబెట్టు క్రియ నేత్రంబుల్ దగన్ మూసి యీ

ఖగముల్ సొక్కెడిఁ జూచితే మునిజనాకారంబులన్ గామినీ!!


పక్షులుగూడా పరవశములై తమలోనున్న కృష్ణుని రూపం బయటకు రాకుండా తలుపులు మూసినాయా?అనే రీతిగా కన్నులు మూసి మునులవలె మురళీగానాన్ని ఆశ్వాదిస్తున్నాయట!


నదులు సరోవరాలు తమ తరంగ హస్తాలతో పద్మములను దెచ్చి కృష్ణునకు పాదార్ఛనలు గావించేరీతిగా ఉన్నాయట! ఇదీ మురళీ గాన ప్రభావంతో అక్కడి చరాచర ప్రకృతి పరవశం!


" శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణీ! "- అన్నారు విజ్ఙులు!


కృష్ణుని మురళీ గానంలో నాదం ఉన్నది. అది సామ వేదం .విశ్వ ప్రేమవాదం .అదే కారణం ప్రకృతి మురిసిపోయి

మూగనోము పట్టటానికి. ఆఅదృష్టం అలనాడు నంద గోకులానికి దక్కింది. మన హృదయాలు కూడా పరిశుధ్ధమై ప్రేమ పూరితములై త్యాగ మయములై "ఆనందంతో నిండిన గోకులంగా (గోశబ్దానికి యింద్రియాలు అనే అర్ధంకూడా ఉంది)మారినప్పుడు ఆమురళీ గానం మనకు గూడా వినిపిస్తుందేమో? ప్రయత్నిద్దాం!


*సేకరణ:-  శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి పోస్ట్* 

💐🌷💐💐💐🌷🌷🌷💐💐💐

మనస్ఫూర్తిగా

 మనస్ఫూర్తిగా నమ్మాడు.* అపార నమ్మకం ,సమర్పణ


ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహం లో  భాగవత ప్రవచనం ఇస్తున్నారు..అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, ఒక మూల దాక్కున్నాడు.


భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల 

వర్ణన జరుగుతోంది. తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. 


భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము  అని అనుకున్నాడు. దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు.


బ్రాహ్మణుడు భయపడి ‘నా దగ్గర ఏమీ  లేదు ‘ అని అన్నారు. 

దొంగ: మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ  పడటంలేదు. మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి’ అని అన్నాడు.


బ్రాహ్మణుడు ఆలోచించి, “బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు  రోజూ  ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు.  ఆ నల్ల మబ్బు ఛాయలో , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు”అని ఆ దొంగ నుండి తప్పించుకోటానికి చెప్పాడు


దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు.యమునా నది తీరం వద్ద కూర్చుని, ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో 

పిల్లన గ్రోవి వినిపించింది , ఇద్దరు పిల్లలు వస్తున్నారు.ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ.


బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ, ‘ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు ‘ అని అనుకున్నాడు.


ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు  వచ్చింది..


తరువాత చూస్తే, దొంగ భుజం  మీద నగలు నిండి ఉన్న ఒక మూట  ఉంది. అది తీసుకుని,ఆ దొంగ బ్రాహ్మణుడి దెగ్గరకి వెళ్లి, జరింగింది అంతా చెప్పాడు.


ఆనందభాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన  చోటు, తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటికి  వెళ్ళగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి, కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణిడిని ,నీవు ఒక దొంగని  అనుగ్రహించావు , నాకు కూడా దర్శనం ఇవ్వవా?” అని  బాధపడ్డాడు.


అప్ప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు ‘ *నీవు భాగవత* *పురాణమును  కేవలము* *ఒక కథగా* *చదివావు* , *కాని , దొంగ,* *నువ్వు చెప్పిన* *కథని, మాటలని* *మనస్ఫూర్తిగా నమ్మాడు.* అపార నమ్మకం ,సమర్పణ

 శరణాగతి ఉన్న చోటే  నేను ఉంటాను.”


నీతి:


పురాణాలను  చదవడమే కాకుండా, దానిలో ఉన్నవి అనుభవించడం నేర్చుకోవాలి. 


మనము కూడా మన చిత్తములని ఆ చిత్త చోరునికి సమర్పిద్దాము.


🌼🌿 *బాలం ముకుందం మనసా స్మరామి🌼🌿