7, జులై 2024, ఆదివారం

కోమాలో వున్న రోగి…

 ప్రతిరోజూ…

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…

070724-2.    నడిచే దేవుడు…

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀483. పరమాచార్య పావన గాధలు…



*కోమాలో వున్న రోగి…*

           *బయటపడిన వైనం..!*

                   ➖➖➖✍️

```

ఒకసారి ఒక భక్తుడు పరమాచార్య స్వామి వద్దకు వచ్చి తన బంధువు ఒకరు ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడని, వైద్యులు ఇక ఏమీ చెయ్యలేమని తేల్చేశారని బావురుమన్నాడు. 


తమ అసలు స్వరూపం ఏంటో తెలియడానికి ఇష్టపడని మహాస్వామి వారు తేనంబాక్కం దేవాలయానికి వెళ్ళమన్నారు.


“తేనంబాక్కం దేవాలయానికి వెళ్లి, విభూతి ప్రసాదాన్ని తీసుకుని మరలా ఇక్కడకు రా” అని ఆదేశించారు. 


అతను ఆలయానికి వెళ్ళగా, అప్పటికే ఆలయం తలుపులు వేసి ఉండటంతో, విభూది ప్రసాదం ఇవ్వడానికి అర్చకులు ఎవ్వరూ లేకపోవడంతో అతను నిరాశ పడ్డాడు. దిగాలుగా తిరిగొచ్చి నిలబడ్డాడు.


“సరే! చుట్టూ ఉన్న ప్రాకారంలో ఎవరైనా భక్తులు ఉంచిన విభూతి గాని, కుంకుమ గాని తీసుకుని రా” అని చెప్పారు స్వామివారు. 


ఆ భక్తుడు మరలా దేవాలయానికి వెళ్ళాడు కాని, ప్రాకారం మొత్తం చూసినా ఎక్కడా ప్రసాదం కనపడలేదు ఆరోజు. ఇదే ఆశ్చర్యకరమైన విషయం అనుకుంటే, పరమాచార్య స్వామివారు మనకు కలిగించబోయే ఆశ్చర్యం ఇంకా పెద్దది.


ఆ భక్తుడు మరలా తిరిగిరావడంతో, “సరే వదిలేయ్. వెళ్లి ఆ దేవాలయ ప్రాకారం నుండి మట్టిని తీసుకుని రా” అని ఆదేశించారు. 


అతను మట్టిని తెచ్చి మహాస్వామివారి ముందు ఉంచాడు. ఇప్పుడు స్వామివారి అద్వితీయ శక్తులు బహిర్గతం అయ్యాయి.


శ్రీవారు ఆ మట్టిని దగ్గరకు తీసుకుని, మహిమాన్వితమైన వారి చేతివేళ్ళతో తాకుతూ ఆ మట్టికి మహత్వాన్ని ఇచ్చారు. 

కొద్దిసేపటి తరువాత దాన్ని బాలు మామకు ఇచ్చి, “వెళ్ళు. వెళ్లి దీన్ని అతనికి(రోగికి) ఇవ్వు” అని ఆదేశించారు.


స్వామివారి ఆదేశానుసారం బాలు మామ ఆసుపత్రికి బయలుదేరారు. 


కాని ICU లో కోమాలో ఉన్న రోగి వద్దకు తనను వదులుతారా, అతని వద్ద ఈ మట్టిని,ఇసుకను ఉంచడానికి ఒప్పుకుంటారా అన్న ప్రశ్నలతో ఆసుపత్రికి చేరుకున్నారు. 


కాని అక్కడకు చేరుకున్న తరువాత 

ఏ సమస్య లేకుండా లోపలకు వెళ్ళగలిగారు. లోపలి గదిలోకి వెళ్లి 

ఆ రోగి దగ్గరకు వెళ్ళగానే, ఈ అద్భుతం జరిగింది. లోపలకు వెళ్ళగానే, అతని వద్దకు వెళ్లి అతనికి దగ్గరగా ఆ మట్టిని ఉంచి రావాలని బాలు మామ ఆలోచన. కాని అక్కడ జరిగింది వేరు...


బాలు మామ లోపలికి వెళ్ళగానే, కోమాలో ఉన్న రోగి కొద్దిగా కదలికలను చూపించాడు. పరమాచార్య స్వామివారి ప్రసాదం అడుగుతున్నట్టుగా హఠాత్తుగా చేతులను బయటపెట్టాడు. ఆ స్థితి చూస్తే అతనే లేచి “అది పరమాచార్య స్వామి ప్రసాదమా? దయచేసి ఇవ్వండి” అని అడుగుతాడేమో అనుకున్నారు బాలు మామ.


బాలు మామకు చాలా ఆశ్చర్యం వేసింది. 


పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్ల ఇలాంటి అద్భుతాల జరుగుతాయని తనకు తెలుసు కాబట్టి కొద్దిసేపటి తరువాత తేరుకున్నారు. ప్రసాదాన్ని ఇచ్చి తిరిగొచ్చారు. 


మొత్తం జరిగిన విషయం మహాస్వామివారికి తెలిపారు. తమ శక్తిని తెలపడానికి ఇష్టపడని స్వామివారు, “సరే! మరో రెండు మూడు రోజులు ఆసుపత్రికి వెళ్లి, అతనికి ప్రసాదం ఇచ్చి రా” అని ఆదేశించారు.


స్వామివారి ఆజ్ఞానుసారం బాలు మామ మూడు రోజులపాటు ఆసుపత్రికి వెళ్లి, అతనికి ప్రసాదం ఇచ్చారు. 


అక్కడి డాక్టర్లందరూ ఆశ్చర్యానికి లోనయ్యేటట్టుగా, ఆ రోగి కోమా నుండి బయటపడి మామూలు మనిషి అయ్యాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


పరమాచార్య స్వామివారి వైభవాన్ని, మహిమలను వర్ణించడం ఎవ్వరి తరమూ కాదు.✍️```

--- ‘శ్రీ పెరియవ మహిమై’ పత్రిక నుండి.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥


#KanchiParamacharyaVaibhavam #

 "కంచిపరమాచార్యవైభవం"!!!🙏

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

ఆచార్య సద్భోదన*

 070724-1.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀207.

నేటి... 


                *ఆచార్య సద్భోదన*

                    ➖➖➖✍️

      

*అపుత్రస్య గతిర్నాస్తి* ```

‘పుత్రులు లేని వాళ్ళకు మోక్షప్రాప్తి లేదంటారా?’  అని  చాలామంది సందేహం వెలిబుచ్చుతారు.```


*పుత్రస్య* ```అంటే పుత్రులే అని కాదు. పుత్రికలు కూడా అని అర్థం వస్తుంది.```

 *పుత్ర* ```అనే పదం సంస్కృతంలో ఏక శేష సమానం క్రిందకు వస్తుంది. పురుషార్థాలు, పురుష పయత్నం అనేవి స్త్రీలకు కూడా వర్తిస్తాయి.``` 


*పుత్ర* ```అనే పదం``` *పుత్రిక* కు ```కూడా వర్తిస్తుందని ఆడపిల్లలు తమను పున్నామ నరకం నుంచి తప్పించలేరని తండ్రులు పెదవి విరుస్తుంటారు.``` 

అసలు *అపుత్రస్య గతిర్నాస్తి* అంటే ```ఆడ, మగ ఏ సంతానము లేని వారికి ఉత్తమ గతులుండవని అర్థం. 


సంతానం కలగని వాళ్ళు ఒక అనాథాశ్రమం నుంచి ఒక బిడ్డను తెచ్చుకొని, చట్టబద్ధంగా దత్తత చేసుకొని, పెంచుకోవచ్చు. అయితే బిడ్డలున్న వాళ్ళంతా మోక్షానికి పోతున్నారనుకుంటే పొరపాటే.


మోక్షమిచ్చేవాడు ఆ పరమాత్మ తప్ప అన్యులు కారు. సదాచార్యుని ద్వారా ఆయన్నే శరణువేడాలి. వీలైనంత వరకూ దానధర్మాలు చేయాలి. మన వెంట వచ్చేవి, మనకు మోక్షాన్ని ప్రసాదించేవి మనం చేసిన దానధర్మాలు తప్ప మరేమీ కావు.✍️

```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

వేదాంగాలు/వ్యాకరణ సంబంధ 55 పుస్తకాలు(PDF

 *వేదాంగాలు/వ్యాకరణ  సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

ఆధునిక భాషా శాస్త్ర సిద్దాంతాలు www.freegurukul.org/g/Vedangalu-1


అక్షర సమామ్నయము www.freegurukul.org/g/Vedangalu-2


బాల వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-3


ఆంధ్ర సంస్కృత వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-4


సంగ్రహ వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-5


విద్యార్ధి కల్పతరువు-2 www.freegurukul.org/g/Vedangalu-6


సంస్కృత వ్యాకరణము-1 www.freegurukul.org/g/Vedangalu-7


తెలుగు వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-8


అలంకార శాస్త్రము - ఆధునిక సాహిత్యము www.freegurukul.org/g/Vedangalu-9


బాల వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-10


బాల వ్యాకరణ సూక్తులు-1 www.freegurukul.org/g/Vedangalu-11


బాల వ్యాకరణ సూక్తులు-3 www.freegurukul.org/g/Vedangalu-12


ఛందో వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-13


సంస్కృత క్రియలు www.freegurukul.org/g/Vedangalu-14


సరస్వతీ కంఠాభరణము -1 www.freegurukul.org/g/Vedangalu-15


విభక్తి భోదిని www.freegurukul.org/g/Vedangalu-16


విద్యార్ధి వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-17


శబ్ద మంజరి www.freegurukul.org/g/Vedangalu-18


శబ్ద రత్నావళి www.freegurukul.org/g/Vedangalu-19


సంస్కృత వ్యాకరణ సంగ్రహము www.freegurukul.org/g/Vedangalu-20


తెలుగు వ్యాకరణాలపై సంస్కృత ప్రాకృత వ్యాకరణాల ప్రభావం www.freegurukul.org/g/Vedangalu-21


ఆకురాయి -తెలుగు వ్యాకరణ సంపుటి www.freegurukul.org/g/Vedangalu-22


సులభ వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-23


అలంకార మంజరి www.freegurukul.org/g/Vedangalu-24


ప్రౌడ వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-25


జానపద సాహిత్యంలో అలంకార విధానము www.freegurukul.org/g/Vedangalu-26


వ్యాకరణ చంద్రిక-1 www.freegurukul.org/g/Vedangalu-27


లక్షణ సార సంగ్రహం www.freegurukul.org/g/Vedangalu-28


సులభ వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-29


లఘు సిద్ధాంత కౌముది www.freegurukul.org/g/Vedangalu-30


తెలుగులో దేశిచ్చందస్సు www.freegurukul.org/g/Vedangalu-31


బాల ప్రౌడ వ్యాకరణ సర్వస్వము-2 www.freegurukul.org/g/Vedangalu-32


వ్యాకరణ పదకోశము www.freegurukul.org/g/Vedangalu-33


సులభ వ్యాకరణము-1 www.freegurukul.org/g/Vedangalu-34


బాలచందాలోకము www.freegurukul.org/g/Vedangalu-35


ఆంధ్ర శబ్ద తత్వము-2 www.freegurukul.org/g/Vedangalu-36


ప్రౌడ వ్యాకరణ ఘంటాపధము www.freegurukul.org/g/Vedangalu-37


ఆంధ్ర శబ్ద తత్వము - క్రియా ప్రకరణము www.freegurukul.org/g/Vedangalu-38


ప్రసిద్దాంధ్రవ్యాకరణాలు www.freegurukul.org/g/Vedangalu-39


ఆంధ్ర వ్యాకరణ సర్వస్వతత్వము www.freegurukul.org/g/Vedangalu-40


ఆంధ్ర శబ్ద మంజరి-1 www.freegurukul.org/g/Vedangalu-41


ప్రౌడవ్యాకరణ వ్యాఖ్యానుశీలనము-1 www.freegurukul.org/g/Vedangalu-42


లక్షణ శిరోమణి www.freegurukul.org/g/Vedangalu-43


ఛందో దర్పణము www.freegurukul.org/g/Vedangalu-44


ఆంధ్ర మహా భారతము ఛందఃశిల్పము www.freegurukul.org/g/Vedangalu-45


భాషా కువలయానందము www.freegurukul.org/g/Vedangalu-46


పరమ లఘు మంజూష -1 www.freegurukul.org/g/Vedangalu-47


తెనుగు లఘు వ్యాకరణము www.freegurukul.org/g/Vedangalu-48


వాక్య పదీయము-1 www.freegurukul.org/g/Vedangalu-49


వాక్య పదీయము-2 www.freegurukul.org/g/Vedangalu-50


ఆంధ్ర వ్యాకరణ సర్వస్వము www.freegurukul.org/g/Vedangalu-51


సార సంగ్రహ గణితము-1 www.freegurukul.org/g/Vedangalu-52


యాజ్ఞవల్క్య శిక్ష www.freegurukul.org/g/Vedangalu-53


తెలుగు కోర్స్ www.freegurukul.org/g/Vedangalu-54


ఆంధ్ర భాషా వికాసము www.freegurukul.org/g/Vedangalu-55


వేదాంగాలు/వ్యాకరణము పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

ఆషాఢంలో గోరింటాకు

 ఆషాఢంలో గోరింటాకు ఎందుకు!


ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు... గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు పోరుతూ ఉంటారు. ఎందుకంటే...


జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాల ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది.ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి.


ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట.


ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది.వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.


ఆయుర్వేదం ప్రకారం గోరింటి ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే! గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే! కేవలం ఆషాఢంలోనే కాదు... అట్లతద్దినాడూ, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు.


ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో, కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి.

6, జులై 2024, శనివారం

*శ్రీ తారకేశ్వర ఆలయం*

 🕉 *మన గుడి : నెం 370*






⚜ *కర్నాటక  : హాంగల్ - హావేరి*


⚜ *శ్రీ తారకేశ్వర ఆలయం*



💠 హంగల్ , దీనిని ఒకప్పుడు 'విరాటనగర' అని పిలుస్తారు, ఇది కర్ణాటకలోని ఒక చారిత్రాత్మక పట్టణం.


💠 హంగల్ ప్రారంభ పత్రాలలో పనుంగల్ అని నమోదు చేయబడింది . ఇది ఒకప్పుడు కదంబుల సామంతుల రాజధాని . 

 కదంబులు దక్షిణ భారతదేశంలోని పురాతన రాజవంశం , ఇది ప్రస్తుత గోవా రాష్ట్రం మరియు సమీపంలోని కొంకణ్ ప్రాంతాన్ని దాదాపు  485 నుండి 11వ శతాబ్దం వరకు పాలించింది. 

వారు జైన సంప్రదాయంలో హంగల్‌లో దేవాలయాలను నిర్మించారు .


💠 మధ్యయుగ పురాణాలలో, దీనిని విరాటకోటే మరియు విరాటనగరి అని పిలుస్తారు, అదే విరాట కోట మరియు నగరం. స్థానిక పురాణాల ప్రకారం, పాండవులు తమ వనవాసం యొక్క పదమూడవ సంవత్సరం గడిపిన ప్రదేశంగా ఇది నమ్ముతారు . 


💠 హనగల్ అగ్నిహోత్ర (మూడు కుండ శ్రౌతాగ్ని)కి కూడా ప్రసిద్ధి చెందింది, దీనిని శ్రోత్రియ సామ్రాట్ బ్రహ్మశ్రీ ఛాయనయాజీ-గిరిశాస్త్రి కాశీకర్-ఏడు తరాలపాటు 1973 వరకు ఆచరించారు.

1031లో, హొయసలలు హంగల్‌ను స్వాధీనం చేసుకున్నారు. 1060లో శిలహారానికి చెందిన మల్లికార్జునుడు హంగల్‌ను ముట్టడించాడు. 

12వ శతాబ్దంలో, దక్కన్ పాలకులు కల్యాణి చాళుక్యులచే హంగల్ నిర్వహించబడింది.


💠 తారకేశ్వర ఆలయం 12వ శతాబ్దం మధ్యలో చాళుక్యుల శకం నాటి చిత్రాలు మరియు స్తంభాలతో అలంకరించబడిన ఒక పెద్ద కట్టడం మరియు హిందూ దేవుడైన శివుని తన రూపంలో తారకేశ్వరునిగా అంకితం చేయబడింది.


💠 తారకేశ్వర ఆలయంలో శివుని వాహనం , నంది మరియు అతని కుమారుడు గణేశ దేవాలయం కూడా ఉంది . 

ఈ సముదాయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క జాబితా చేయబడిన స్మారక చిహ్నం . 

ఇది మూడు స్మారక రాళ్లను కలిగి ఉంది, ఇవి మతపరమైన మరియు సైనిక దృశ్యాలతో చెక్కబడ్డాయి మరియు కన్నడ భాషలో వచనంతో చెక్కబడ్డాయి .


💠 కళ్యాణ చాళుక్యులు దక్కన్‌లో 10 వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు పాలించారు . 

వారు ఇట్టగి , గడగ్ మరియు లక్కుండితో పాటు హంగల్‌లో హిందూ దేవాలయాలను నిర్మించారు . 

తారకేశ్వర ఆలయాన్ని కూడా వారిచే నిర్మించబడింది


💠 ప్రధాన ఆలయం  గర్భగుడిని కలిగి ఉంటుంది, ఇది అంతరాల, నవరంగ, సభామండప మరియు ముఖమండప వంటి ప్రక్కనే ఉంటుంది. 

గర్భగుడిలో విష్ణు, బ్రహ్మ, కార్తికేయ మరియు నంది శిల్పాలతో పాటు తారకేశ్వరుడు లింగ రూపంలో ఉన్నాడు.


💠 ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ ప్రధాన హాలు, ఇది కమలం రూపంలో పెద్ద పైకప్పును కలిగి ఉంటుంది. విపులంగా చెక్కబడిన నిర్మాణం 9 మీటర్ల వ్యాసం మరియు 6 మీటర్ల వ్యాసం కలిగిన భారీ రాయి ఈ నిర్మాణం యొక్క పైకప్పును ఏర్పరుస్తుంది. 

కమలం ఆకారంలో కత్తిరించిన రాయికి ఎనిమిది స్తంభాలు మద్దతుగా ఉన్నాయి. స్తంభాలపై ఉన్న అలంకరణలలో ఏనుగులు మరియు వజ్రాల ఆకారపు మూలాంశాల యొక్క చాలా వివరణాత్మక శిల్పాలు ఉన్నాయి. ప్రధాన హాలుకు ఆనుకొని శివుని వాహనం నందికి అంకితం చేయబడిన నంది మంటపం అని పిలువబడే మరొక హాలు ఉంది. 


💠 తారకేశ్వర ఆలయం కళాత్మక, వాస్తు మరియు నిర్మాణ సంబంధమైన ఆవిష్కరణలకు ఒక ఆదర్శప్రాయమైనది. 

ఈ అద్భుతమైన శిల్పాలు, గూళ్లు, మూలాంశాలు, జంతువులు, దేవతలు, పురాణాలు , రామాయణం మరియు మహాభారతం నుండి దృశ్యాలు , అప్సరసలు , ఋషులు, సంగీతకారులు మరియు నృత్యకారులను ఇంత ఖచ్చితత్వంతో, నిష్పత్తిలో, సమరూపతతో హస్తకళాకారులు ఎలా చెక్కగలిగారు అనేది నిజంగా ఆశ్చర్యకరమైనది. 


💠 తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయానికి ముఖ మండపం ముందు ప్రవేశ తోరణం మరియు గరుడ కంభం ఉన్నాయి  . వృత్తాకారంలో చెక్కబడిన బలిపీఠం ప్రాంగణంలో ఉంది.


💠 నవరంగానికి వాస్తవానికి ఉత్తరం, దక్షిణం మరియు తూర్పున ప్రవేశాలు ఉన్నాయి, అయితే ఉత్తరం మరియు దక్షిణం 12వ శతాబ్దం చివరిలో చిన్న పుణ్యక్షేత్రాలుగా మార్చబడ్డాయి.  

అంతరాలయంలో బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణువు, గణేశుడు మరియు కార్తికేయ దేవతల శిల్పాలు, అద్భుతమైన అలంకరణలు ఉన్నాయి.  అంతరాలయంలో నంది భగవానుడు గంభీరంగా కూర్చున్నాడు.


💠 సభా మండపంలో మరణించిన వీరుల గౌరవార్థం మూడు స్మారక రాళ్లు మరియు విరిగిన శిల్పాలు ఉంచబడ్డాయి. 

 ప్రధాన ఆలయానికి ఈశాన్యంలో గణేశుడికి అంకితం చేయబడిన ఆలయం ఉంది. 


💠 ఇది హుబ్లీ - ధార్వాడ్ నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణం బెంగళూరు నుండి 370 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Panchang


 

ప్రశ్న పత్రం సంఖ్య: 8

 ప్రశ్న పత్రం సంఖ్య: 8                             కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

ఈ ప్రశ్న పత్రం సర్వ జన ప్రయోజనకరంగా వుండే విషయాలను తీసుకొని తయారు చేయబడినది. కాబట్టి అందరు దీనిని కూలంకుషంగా చదివి జవాబులు ఇవ్వ ప్రయత్నించండి.  

 క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి  

1) ఇంట్లో శిశువు జన్మించినప్పుడు బర్త్ సర్టిఫికెట్ కోసం ఎక్కడ దర్జీ పెట్టాలి. 

2) . ప్రామిసరీ నోటు ఎవరు ఎవరికి వాసి ఇస్తారు. 

3) రెవెన్యూ స్టాంపు అంటే ఏమిటి.  దానిని ఎప్పుడు వాడతారు. . 

4) సాధారణ చే బదులుగా అప్పు తీసుకున్నప్పుడు వ్రాయించుకొనే దాస్తావైజు ఏమిటి.  

5) ప్రామిసరీ నోటు సంబంధిత బాకీ వాసులు కాకపొతే యెంత కాలంలో కోర్టులో దావా వెయ్యాలి. 

6) ప్రామిసరీ నోటు మీద వేసే వాజ్యం సివిల్ కేసా లేక క్రిమినాలు కేసా 

7) అప్పు చెల్లు చేయటానికి ఇచ్చిన చెక్కు చెల్లక పొతే వేసే కేసు సివిల్ కేసా లేక క్రిమినల్ కేసా 

8) ప్రామిసరీ నోటుపై దావా వేయటానికి లాయరు నోటీసు ఇవ్వటం తప్పనిసరా. 

9) చెక్కు బౌన్స్ కేసు వేయటానికి లాయరు నోటీసు ఇవ్వటం తప్పనిసరా. 

10) మన దేశంలో భార్య భర్తలు ఒకరి నుండి ఇంకొకరు విడాకులు తీసుకోవాలంటే ఏ కోర్టుని ఆశ్రయించాలి.


ప్రామిసరీ నోటు విషయమై నేను దూరదర్శన్ యాదగిరిలో పాల్గొన్న ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని క్రింది లింకు ఫై క్లిక్ చేసి చూడగలరు 


https://www.youtube.com/watch?v=Ku7Vc_Uhnhk&t=619s 



గ్రామానికి చెందిన స్థలం

 *గ్రామకంఠం* :

గ్రామంలో నివసించేందుsకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.


*అసైన్డ్‌భూమి* :

భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు.


*ఆయకట్టు* :

ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు.


*బంజరు భూమి (బంచరామి)* :

గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.


*అగ్రహారం* :

పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.


*దేవళ్‌ ఇనాం* :

దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి.


*అడంగల్‌ (పహాణీ)*:

గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను అడంగల్‌ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్‌ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికపుడు ఇందులో నమోదు చేస్తారు.


*తరి* :        సాగు భూమి.

*ఖుష్కీ* :      మెట్ట ప్రాంతం.

*గెట్టు*: పొలం హద్దు.

*కౌల్దార్‌* : భూమిని కౌలుకు తీసకునేవాడు.

*కమతం* : భూమి విస్తీర్ణం.

*ఇలాకా : ప్రాంతం*

*ఇనాం* : సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి.

*బాలోతా ఇనాం* : భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి.

*సర్ఫేఖాస్‌* : నిజాం నవాబు సొంత భూమి

*సీలింగ్‌* : భూమి యొక్క గరిష్ఠ పరిమితి.

*సర్వే నంబర్‌*: భూముల గుర్తింపు కోసం కేటాయించేది.

*నక్షా*: భూముల వివరాలు తెలిపే చిత్రపటం.

*కబ్జాదార్‌*: భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి.

*ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ)*:       భూమి స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్‌ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.

*ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ (ఎఫ్‌ఎంబీ) బుక్‌*:           దీన్నే ఎఫ్‌ఎంబీ టీపన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.

*బందోబస్తు*: వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.

*బీ మెమో* : ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్‌ను బీ మెమో అంటారు.

*పోరంబోకు*: భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.

*ఫైసల్‌ పట్టీ*: బదిలీ రిజిస్టర్‌

*చౌఫస్లా* :       ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.

*డైగ్లాట్‌* : తెలుగు, ఇంగ్లిఫ్‌ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్‌.

*విరాసత్‌/ఫౌతి*:       భూమి యొక్క      యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.

*కాస్తు* :     సాగు చేయడం

*మింజుములే* : మొత్తం భూమి.

*మార్ట్‌గేజ్‌* : రుణం కోసం భూమిని కుదవ పెట్టడం.

*మోకా* : క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్‌ ఇన్‌స్పెక్షన్‌).

*పట్టాదారు పాస్‌ పుస్తకం* :    రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.

*టైటిల్‌ డీడ్‌*: భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.

*ఆర్వోఆర్‌* (రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌) :        భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్‌.

*ఆర్‌ఎస్సార్‌*:     రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ లేదా శాశ్వత ఏ రిజిస్టర్‌.

*పర్మినెంట్‌ రిజిస్టర్‌* :       సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్‌. సేత్వార్‌ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.

*సేత్వార్‌* : రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్‌. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత,     *ఖాస్రా పహాణీ* అందుబాటులోకి వచ్చింది.

*సాదాబైనామా*                   భూమి           క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.

*దస్తావేజు* : భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.

*ఎకరం* : భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు.   (ఒక సెంటుకు 48.4 గజాలు) గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.


*అబి* : వానకాలం పంట

*ఆబాది* : గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు

*అసైన్‌మెంట్‌* : ప్రత్యేకంగాకేటాయంచిన భూమి

*శిఖం* :    చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం

*బేవార్స్‌*: హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్‌ భూమి అంటారు.

*దో ఫసల్‌ : రెండు పంటలు పండే భూమి

*ఫసలీ* :      జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.

*నాలా* : వ్యవసాయేతర భూమి

*ఇస్తిఫా భూమి* : పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి

*ఇనాం* *దస్తర్‌దాన్‌*: పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి

*ఖాస్రాపహానీ*: ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.

*గైరాన్‌* : సామాజిక పోరంబోకు భూమి.

*యేక్‌రార్‌నామా* : ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్‌ తీసుకునే గ్రామాల ఒప్పందం.

దీపంలో ఉండే

 జై శ్రీ రామ్ 

*దీపంలో ఉండే నవగ్రహాల అంశం:*


🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔


*దీపపు ప్రమిద సూర్యుడు,*

*నూనె అంశం చంద్రుడు,* 

*దీపం వత్తి బుద్ధుని అంశం,*

*వెలిగే దీపం నిప్పు కుజుని అంశం,*

*దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు  గురువు,*

*దీపం నీడ రాహువు,*

*దీపం నుంచి వెలువడే  కిరణాలే శుక్రుడు( ఆశ )*

*దీపం వెలిగించడం వల్ల  పొందే మోక్షమే కేతు*

*దీపం కొండెక్కిన తర్వాత  మాడిన  నలుపు రంగె శని*


🪔🪔🪔🪔🪔🪔🪔🪔


*దీపంలో పంచభూతాల కలయిక ఎలాగంటే ప్రమిదపు మట్టి భూమి గాను నూనె నీరు గా ను అగ్నిజ్వాల నిప్పు గాను దీపం వెలగడానికి కారణమైన ఆక్సిజన్ గాలి గాను దీపపు కాంతిని ప్రసరింపజేసేది ఆకాశంగాను ఇలా పంచభూతాలు దీపంలో ఉన్నాయి.*


🪔🪔🪔🪔🪔🪔🪔🪔


*దానివల్లనే మన పెద్దవాళ్లు ఇంట్లో దీపం వెలిగించి పంచభూతాల నవగ్రహా కలయికతో అష్ట ఐశ్వర్యాలు పొందాలని ఈ విధంగా చెప్పారు....*

🙏 జై శ్రీ రామ్ 

కంచెర్ల వెంకట రమణ

ఆహ్వానము

శాస్త్రమాచార్య సన్నిధి జదు వడేని  
నిద్ధబోధంబు మదిసంగ్రహింపడే ని
తెగువ మీరి ప్రతిజ్ఞ సాధింపడేని 
జ్ఞాతి జయమందడేని తజ్జనుడు జనుడె  
           కాశీఖండం -శ్రీనాథుడు                   (సాహితీమిత్ర సమాఖ్య -రిజి
విజయ నగరం 
        537  
శ్రీ నాథ కవితా వైభవం 
               ఆహ్వానము 
    వేదిక 
గురజాడ స్మారక గ్రంథాలయం
   విజయనగరం 
సమయం :28-07-2024.ఆదివారం సా "6-30ని.లకు 
  సభాధ్యక్షులు :ఎమ్.విశ్వేశ్వర రావు -విశ్రాంత జిల్లాపరిషత్ విద్యాశాఖాధికారి.విజయనగరం.
వక్త : శ్రీమతి ముక్కు లింగలక్ష్మి 
  విశ్రాంత ఆంధ్రోపాధ్యాయి 
   విశాఖపట్నం 
విషయం :శ్రీనాథ కవితా వైభవం 
కవితాగానం :శ్రీ గాంధి కాకర్ల 
  ఉపాధ్యాయులు,పిట్టపేట 
  పూసపాటి రేగ మండలం.
సమ్మాన కర్త : శ్రీ ప్రాత రాజేశ్వరరావు 
 కార్యవర్గ సభ్యులు,విజయభావన

Support this blog

 Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145

ఆత్మ జ్ఞానం

 *ఆత్మ జ్ఞానం ద్వారాసర్వ పాపాలు పటాపంచలు అయిపోతాయి*


మనిషికి ఆధ్యాత్మిక చింతన కలగాలంటే మనసు నిర్మలంగా ఉండాలి. 


ఐహిక చింతన ఉన్నంతకాలం ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది.


దీనికి ఉదాహరణగా ఒక కథ.


ఒక చీమ తన ఆహార అన్వేషణలో పొరపాటున ఒక ఉప్పు సీసాలో దూరింది.


ఇంతలో ఆ సీసా మూత వేసివేయడం జరిగింది.


అలా ఆ చీమ అందులో బందీ అయిపోయింది. తినడానికి ఏమీ లేక అప్పుడప్పుడు ఆ ఉప్పునే తింటూ కాలక్షేపం చేయసాగింది. 


మరొక చీమ పంచదార డబ్బాలో చేరి అందులో పంచదారను తింటూ ఎంతో ఆనందంగా జీవించ సాగింది.


అదృష్టవశాత్తూ ఒకసారి ఉప్పుసీసా మూత తీయడం జరిగింది. వెంటనే బ్రతికేనురా జీవుడా అనుకుంటూ అందులోని చీమ బయటకు వచ్చేసింది. 


కాని సరైన ఆహారం లేక ఆ చీమ చిక్కి శల్యమైపోయింది.


ఇంతలో అది పంచదార డబ్బాలో ఉన్న చీమ కంట బడింది.


వెంటనే ఆ చీమ “ఏం మిత్రమా! అలా అయిపోయేవు? క్షేమమేనా?”అని అడిగింది. “ఏం క్షేమం?అంతా క్షామమే” అంటూ మొదటి చీమ తన గోడునంతా వెళ్ళబోసుకుంది.


అది వినగానే రెండవ చీమ దానిని తన నివాసమైన పంచదార డబ్బాలోకి తీసుకెళ్ళి పంచదారను తినమంది.


చిత్రం! ఆ మొదటి చీమ అతిమధురమైన పంచదారనే వెగటుగా ఉంది అంది. 

రెండవ చీమకు ఆశ్చర్యమేసింది.


కారణం అంతుబట్టలేదు.

ఎందుకైనా మంచిదని మొదటి చీమను నోటిని తెరవమని అందులో ఉన్న ఉప్పు కణాలను తీసివేసింది.


అంతే! అంతవరకూ వెగటుగా అనిపించిన పంచదార అప్పుడు తియ్యగా అనిపించింది ఆ మొదటి చీమకు.


అలాగే మనిషిలో *అరిషడ్వర్గాలు* ఉన్నంతకాలం ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది.


ఎప్పుడైతే మనం వాటిని విడనాడతామో అప్పుడే మనం ఆధ్యాత్మిక చింతనలోని అఖండ ఆనందాన్ని అనుభవించగలం...


 పుట్టిన ప్రతి జీవికి ప్రారబ్దము తప్పదు. ఈ మాయలో పిడికెడు  ప్రారబ్ధంతో ప్రతిఒక్కరూ వస్తున్నారు. అందులో పుట్టుక మరణం స్థితి గురించి నిర్ధారించి ఉంటుంది. ముఖ్యంగా ఏ ఏ కర్మలను ఆచరించాలి ,అనుభవించాలి, అనేది తెచ్చుకున్నటువంటి కర్మతో అది ఏర్పడుతుంది .ఈ జన్మలో నీవు కొత్తగా ఏది తీసుకోవు. యేది జరగవలసి వున్నదో అది జరిగి తీరుతుంది. నీవు వద్దన్నా అది ఆగదు, మారదు అయితే నీవు దేహము కాదని . *నేనంటే ఆత్మ*  అను *జ్ఞానం* కలిగినప్పుడు, దేహం స్ఫురణ పూర్తిగా కోల్పోయి, నీవు ఆత్మగానే నిలిచి ఉంటావు. 


ప్రారబ్ద కర్మలు మార్చటానికి  ఈ మాయలో నీకు వీలు లేదు. అవకాశమూ లేదు. ఉదాహరణకి దేహము, తల్లిదండ్రులు, సంసారం, పరిసరాలు . వీటిని ఎలా మారుస్తారు?  అది ఎట్లా ఉంటుంది అంటే విల్లుని విడిచిన బాణం అలాంటిది. దానికి చికిత్స లేదు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని  వ్రతములు ఆచరించినా, ఎన్ని క్రతువులు చేసినా మారదు. మారదు మారదు .అయితే నీవు దేహము కాదు. నేనంటే జ్ఞానమని తీవ్ర వైరాగ్యముతో, ఇది అసత్యమని గుర్తించి ,ఆత్మ విచారము చేసినప్పుడు ,అంటే నేను ఎవరిని? అని విచారించినప్పుడు, అక్కడ ఆలోచించే వాడు గానీ, ఆలోచనలు కానీ , ఇతరులు గానీ  మరేదీ కానీ , ప్రపంచము గాని, సంసారము  కానీ  యేదీ ప్రకాశించదు. కారణం అవన్నీ ఆలోచనలు. అన్యత్వం  ఏ ఒక్కటి ప్రకాశించదు. అంతా  అదృశ్యమైపోతుంది . నీవు నీవు గా నిలిచి ఉంటావు.  అహం స్ఫురణగా జ్ఞానమే నిలిచి ప్రకాశిస్తుంది.  ముఖ్యంగా ఇప్పుడు నీవు ఒక పని కొట్టు అనుకున్నప్పుడు ఇది ఎటు పోతే నీకెందుకు ? ఎందుకు నీకు దేహం మీద అభిమానం?  పూర్తిగా అదృశ్యమై పోతుంది.  జనన మరణాలకి అతీతంగా ఉంటావు. అంటే జ్ఞాన స్వరూపముగా  ,నేను అహం స్ఫురణ ప్రకాశిస్తుంది. ఆ ఉన్నాను అన్న ఎరుక కి ఉదయాస్తమానములు లేవు. .కనుక ప్రతి ఒక్కరూ ఏమంటున్నారు  అంటే, నాకు,  నేను ఏమి అనుకోకపోయినా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి ఎందుకు? కారణం నీ మనస్సు లో ఇదంతా నిజము అని, వాటి వెంట మనస్సు పరిగెడుతుంది. ఈ దేహానికి మరణము తప్పదు.  అది నీవు కానప్పుడు ఎందుకు దాని గురించి  యోచన? పుట్టిన దానికి మరణము తప్పదు. సరే గతించిన  దానికి తిరిగి పుట్టక తప్పదు.  అని కూడా కృష్ణ పరమాత్మ చెప్పుడం జరిగింది కదా! 


రమణ మహర్షి వారి చేతి మీద ఒక వ్రణం వచ్చింది. మీరు దీన్ని నయం చేసుకో లేరా? అంటే , చెప్పేవాడు  లేదన్నారు. అటువంటి స్థితిని ఏర్పడటానికి కారణం స్వరూప జ్ఞానం తప్ప మరొకటి లేదు  వారికి. నాయనా నీ ప్రారబ్ధం ని  ఎవరు మార్చలేరు. దాని జోలికి పోవద్దు .నీవు నీవుగా మిగిలి వున్నప్పుడు ,ఆత్మస్థితిలో  నిలిచి ఉన్నప్పుడు ,ఈ దేహము మనసు జరుగుతున్నటువంటి మార్పులు నిన్ను అంటవు. తెరమీది బొమ్మలలాగా!  రమణ మహర్షుల వారు ఈ సందర్భంలో ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అదేమిటంటే పరమేశ్వరుడు జీవులను కర్మానుసారముగా ఆడిస్తాడు. ఏది జరగవలసి వుందో  అది జరిగి తీరుతుంది. నీవు ఎంత ప్రయత్నం చేసినా అది ఆగదు. మరి ఏం చేయాలి ? మౌనమే శరణ్యం ( *దక్షిణామూర్తి* లాగా ) అని చెప్పుకొచ్చారు. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని గుర్తించు. అంతేగాని ఈ దేహాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? రోగాల నుంచి  ఎలా బయటపడాలి ?  అన్న ఆందోళనపడి ప్రయోజనం లేదు. ఎందుకు అంటే  నీవు దేహం  కాదు. నీవు నీవు గా నిలిచి ఉండటమే. మౌనమే శరణ్యం.

సేకరణ.

హనుమకు వందనంబు!!

 


హనుమకు వందనంబు!!


హనుమకు వందనంబు అనుమా మనమా!ఇక జాగదేలనే?

కనుము సమస్తమౌజగతిగాచెడుశక్తిగలట్టివీరునిన్;

చనువున రామ,నామమునుసన్మతి సల్పిన చాలు,చాలులే,

క్షణమున వచ్చివ్రాలునట వాంచితమెల్లను దీర్చిబ్రోవగా!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

సమంగా పంచుకుంటారు).

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


       శ్లో𝕝𝕝 *కర్తా కారయితా చైవ* 

            *ప్రేరకో హ్యనుమోదకః* |

           *సుకృతే దుష్కృతే చైవ*

           *చత్వారః సమభాగినః* ॥


              [  *సూక్తి సౌరభం*  ]


తా𝕝𝕝  “పుణ్యకర్మ అయినా పాపకర్మ అయినా - చేసినవాడు, చేయించినవాడు, చేయమని ప్రోత్సహించినవాడు, ‘చాలా బాగాచేశావు' అని అభినందించినవాడు - వీళ్ళు నలుగురూ ఆ కర్మఫలాన్ని సమంగా పొటదుతారు(పంచుకుంటారు).”

శనివారం,జూలై 6,2024

*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హo*


శనివారం,జూలై 6,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం -  శుక్ల పక్షం

తిథి:పాడ్యమి తె3.56 వరకు

వారం:శనివారం (స్థిరవాసరే)

నక్షత్రం:పునర్వసు తె5.09 వరకు 

యోగం:వ్యాఘాతం తె3.53 వరకు

కరణం:కింస్తుఘ్నం సా3.58 వరకు తదుపరి బవ తె3.56 వరకు

వర్జ్యం:సా4.56 - 6.34

దుర్ముహూర్తము:ఉ5.34 - 7.17

అమృతకాలం:రా2.42 - 4.19

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్య రాశి: మిథునం 

చంద్రరాశి: మిథునం 

సూర్యోదయం:5.34

సూర్యాస్తమయం:6.33


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*