26, ఏప్రిల్ 2021, సోమవారం

మృత్యుంజయ మంత్రం*

 *మహా మృత్యుంజయ మంత్రం*

=======================


*ఓం త్య్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం* |

*ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్* || *ఓం* ||

(శుక్ల యజుర్వేద సంహిత, 3.60)


సుగంధం వెదజల్లే అన్నాన్నిచ్చి పోషించేవాడు, త్రినేత్రుడూ అయినా పరమశివుడిని ఆరాధిస్తూ- 

ఈశ్వరా! తొడిమ నుంచి దోస పండులా సంసారబంధం నుంచీ, మరణం నుంచీ, అశాశ్వతం నుంచీ నన్ను విడిపించు ఆత్మస్థితి నుంచి మాత్రం వీడిపోకుండా చూడమని ప్రార్థిస్తుందీ మంత్రం. మహామృత్యుంజయమంత్రంగా చెప్పబడిన ఈ మంత్రంలో అద్భుత అంతరార్థం దాగుంది. 

మృత్యుంజయమంటే మరణాన్ని జయించడం అని అర్థం. జీవితం జనన మరణ బంధనం. *మరణాన్ని జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరాలు జీవించి ఉండడం కాదు.* శరీరం నుంచి ప్రాణం వీడిపోవడం మరణం. కానీ జీవించి ఉన్నప్పుడే బుద్ధిపూర్వకంగా ప్రాణం అశాశ్వతం అనీ, ఆత్మయే శాశ్వతమనే అనుభూతిని పొంది, తమతమ కర్తవ్యాలను నిర్వర్తించడమే మరణాన్ని జయించడం. భ్రమల్లో బతుకుతూ, కాలయాపన చేస్తూ జీవిత సత్యాన్ని మన అంతరాత్మ పదేపదే గుర్తుచేస్తున్నా పట్టించుకోకుండా అసంతృప్తితోనే జీవితమంతా బతుకుతాం. అశాంతితోనే మరణాన్ని ఆశ్రయిస్తాం. ఆత్మ ఒక్కటే శాశ్వతమని గుర్తించగలిగితే తారతమ్యాలూ, విభేదాలకు తావుండదు. సర్వసమానత్వ భావనతో ప్రపంచమంతా ఏకమై జీవిస్తుంది.

కర్మకు బాధ్యులు

 **మనము చేసే - కర్మకు బాధ్యులు - ఎవరు???...*

ఈ విషయంలో మానవునికే కాదు, జగజ్జనని అయిన పార్వతీ దేవికి కూడా అనుమానం కలిగింది...


ఒక రోజు పార్వతీదేవి ఈశ్వరుని తో... 

మానవులు కర్మలు చేస్తుంటారు కదా.. ఆకర్మలను మానవుల చేత దేవుడు చేయిస్తుంటాడా?.. లేక వారంతట వారు సంకల్పించి చేస్తుటారా అని అడిగారు... 


*అప్పుడు పరమశివుడు ఇలా చెప్పారు...*


పార్వతీ ! దేవుడు ఏ పనీ చెయ్యడు, దేవుడు కేవలం సాక్షిభూతుడు మాత్రమే... కాని దేవుడు మానవుడి కర్మలకు తన సహాయము అందిస్తాడు. 

మానవుడు చేసే కర్మలకు తగిన ఫలము అందిస్తాడు, ఏ పని చెయ్యాలో నిర్ణయించి కర్మలు చేసేది మానవుడే...

ఇందులో దైవప్రమేయము ఏదీయు లేదు, పూర్వజన్మ కర్మఫలితంగా మానవుడు తను చేయవలసిన కర్మలను నిర్ణయించి కర్మలుచేస్తాడు...


మానవుడు పూర్వజన్మలో చేసే పనులు దైవములు అయితే, ఈ జన్మలో చేసే పనులు పౌరుషములు అనగా అవే పురుషప్రయత్నములు...


"ఒక పని చెయ్యడానికి మనిషి చేసే ప్రయత్నములు వ్యవసాయము వంటిది, దైవ సహాయము మొక్కకు అందించబడే గాలి, నీరు వంటిది."


నేలను తవ్వితే భూగర్భము నుండి నీరు ఉద్భవిస్తుంది. 

అలాగే ఆరణి మధిస్తే అగ్ని పుడుతుంది, అలాగే ఏ పనికైనా పురుషప్రయత్నము ఉంటేనే దైవము కూడా తోడై చక్కటి ఫలితాలను అందిస్తాడు. పురుషప్రయత్నము లేకుండా దైవము సహాయపడతాడని అనుకుంటే కేవలము దైవము చూస్తాడని ఊరకుంటే దేవుడు ఫలితాన్నివ్వడు...


_కనుక పార్వతీ ! ఏ పని సాధించాలని అనుకున్నా పురుషప్రయత్నము తప్పక కావాలి, అప్పుడే దేవుడు సత్పఫలితాలను ఇస్తాడు...

                        *🌹శుభమస్తు🌹_*

       🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

అరచేతిలో తీర్ధాలు

 *🤲అరచేతిలో తీర్ధాలు🤲*



అగ్నిపురాణంమన అరచేతిలో 5 తీర్థాలున్నాయని చెబుతున్నది.

ఈ ఐదు తీర్థస్థానాలను పంచతీర్థాలని అంటారు.


కుడిచేతి బొటనవ్రేలిని వంచి దానిపై చూపుడు వ్రేలిని వంచి ఉంచి, ఆ విధంగా ఏర్పడిన పల్లపు ప్రదేశంలో నిలిచేట్టు పోసే జలం తీర్థం అని అంటున్నాము. అలా నీటిని


"ఓమ్ కేశవాయస్వాహా, "

"ఓమ్ నారాయణాయస్వాహా, "

"ఓమ్ మాధవాయస్వాహా ",

అని జపిస్తూ తీసుకోవడాన్ని ఆచమించడం అంటారు. 

ఈ సందర్భంలోని


ఐదు స్థానాలను పంచతీర్థాలని అగ్నిపురాణం అంటున్నది.


చూపుడు వ్రేలి క్రింది ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అని దాన్నే

బ్రహ్మతీర్థం అని అంటారు. 


చిటికెన వ్రేలి మూలస్థానం ఋషితీర్థం అని ప్రజాపతి స్థానమనీ, ప్రజాపతి తీర్థం అని అంటారు.


అరచేతి మధ్య పల్లపు ప్రదేశాన్ని అగ్ని స్థానమని 

దాన్ని అగ్ని తీర్థం అని అంటారు. 


చూపుడు వ్రేలినుంచి, చిటికెన వ్రేలి వరకు ఉన్న వ్రేళ్ళ

కొనల భాగం దేవస్థానాలని అవే దేవతీర్థాలు అని అంటారు.


ఎడమ అరచేతిలోని పల్లపు ప్రదేశాన్ని సోమతీర్థం అంటారు.


ఆచమనం చేసేప్పుడు మణికట్టువైపు బొటనవ్రేలి క్రింద ఉండే ప్రదేశం నుండి నీటిని గ్రహిస్తాము. కనుక దీన్ని కూడ బ్రహ్మతీర్థం అంటారు.


సంధ్యవార్చే వ్రేళ్ల చివరలనుంచి తర్పణం జలాన్ని విడుస్తాం కాబట్టి ఇదికూడ దేవతీర్థం అవుతున్నది. పితృకర్మలలో తర్పణాలకు వదిలే జలం 

పితృతీర్థం అనబడుతున్నది.


ఇవండీ అగ్నిపురాణంలోని పంచతీర్థాలు మన అరచేతిలో.

🙏🏻

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

  

*మాలకొండ లో తపస్సాధన..*


*(తొమ్మిదవ రోజు)*


"ఏకేన చక్రమపరేణ కరేన శంఖం

అన్యేన సింధు తనయా మవలంబ్య తిష్ఠన్

వామేతరేణ వరదాభయ హస్తముద్రాం

శ్రీ లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబం౹౹"


"ఒకచేత సుదర్శన చక్రము, వేరొకచేత పాంచజన్య శంఖము, ఇంకొక చేత లక్ష్మీదేవిని చుట్టి, తన ఎడమ తొడపై కూర్చుండబెట్టుకొని, తన కుడిచేతితో అశేష భక్తకోటికి అభయం ఇస్తూ దర్శనం ఇచ్చే శ్రీ లక్ష్మీ నరసింహా!..నాకు చేయూత నివ్వు!!" 


అని శ్రీ ఆదిశంకరాచార్యులు చేసిన స్తోత్రం లోని శ్లోకాన్ని గుర్తుచేసుకుంటూ..శ్రీ స్వామివారు మాలకొండ కు చేరి, ముందుగా ఆ లక్ష్మీనృసింహుడి సన్నిధిలో కొంత సేపు గడిపారు..మాలకొండ లో ఉగ్రరూపంతో వుండే ఆ లక్ష్మీ నరసింహుడు..ఈ యువక యోగి పట్ల ప్రసన్నుడై..తన అక్కున చేర్చుకున్నాడు..


శ్రీ స్వామివారు మాలకొండలోనే ఉత్తరంగా కొద్దిగా దిగువున, రెండు పెద్ద బండరాళ్లు చీలి ఏర్పడిన దారితో, ఒకే పెద్ద గొడుగు లాటి రాతి కింద వున్న శివాలయం వద్దకు వచ్చారు..ఆ శివాలయానికి మరికొద్ది దిగువున ఉన్న పార్వతీదేవి మఠం చూసారు..తన ఆవాసానికి ఆ అమ్మవారు కొలువైయున్న మఠం సరైనదని నిర్ణయానికి వచ్చారు..శివాలయం..దానిపైన వున్న రాతి గుహలు తన తపస్సుకు అనువైన ప్రాంతాలని నిర్ధారించుకున్నారు..


ఒకవైపు సాక్షాత్తూ వైష్ణవావతారం నృసింహుడు..మరో ప్రక్క ఆది దంపతులైన శివ పార్వతులు..తనకు ఇంతకంటే రక్షణ ఇచ్చే ప్రదేశం మరోటి ఎక్కడుంది?..ఇది తన మోక్షమార్గాన్వేషణలో మరో మజిలీ..ఇప్పటిదాకా తాను చేసిన సాధన ఒక ఎత్తు..ఇక చేయబోయేది మరో ఎత్తు!..గురువు బాలబ్రహ్మం చెప్పినట్లు, ప్రకృతి అనుక్షణం మాయను ప్రదర్శిస్తుంది..అందులో చిక్కకుండా ఏకాగ్రచిత్తంతో సాధన చేయాలి..ఎల్లవేళలా జాగురూకత తో ఉండాలి..దేహాభిమానాన్ని త్యజించాలి..మమకారాన్ని మనసులోంచి తుడిచివేయాలి..తానింతకాలం ఏ మోక్షం కోసం తపించి సాధన చేస్తున్నాడో అందుకు అనువైన ప్రదేశం కూడా లభించిందని సంతోషపడ్డారు..


పార్వతీదేవి మఠం లో నివాసం ఏర్పరుచుకున్నారు..మితాహారం భుజించడం..సాధన చేసుకోవడం..ఇవి రెండే కార్యక్రమాలు..మాలకొండ క్షేత్రం ఒక్క శనివారం నాడు మాత్రమే భక్తుల కొరకు తెరచి ఉంటుంది..ఆ ఒక్కరోజు శ్రీ స్వామివారు శివాలయం పైనున్న గుహలలోకి వెళ్లిపోయేవారు..అక్కడ ఏకాంతంలో తపోసాధన చేసుకునేవారు..మిగిలిన ఆరు రోజులూ నరసంచారం వుండదు కాబట్టి, ఎక్కువభాగం శివాలయం లోనే తన తపస్సు కొనసాగించేవారు..


కానీ..కుతూహలం తో కూడిన మానవులున్న లోకం ఇది..ఎవరో యువక యోగి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడని..మాలకొండ క్రింద ఉన్న గ్రామస్థులు పసిగట్టేశారు..వాళ్ళు కొండపైనున్న అడవి కర్రలు ఏరుకొచ్చి అమ్ముకునే వాళ్ళు..శ్రీ స్వామివారు శివాలయానికి వెళ్ళేటప్పుడు..తిరిగి పార్వతీదేవి మఠానికి వచ్చేటప్పుడు గమనించడం మొదలెట్టారు..వాళ్లలో వాళ్ళు శ్రీ స్వామివారి గురించి చర్చించుకోవడం కూడా జరుగుతోంది..శ్రీ స్వామివారిని చూసినప్పుడు పలకరించడం చేయసాగారు..తాను మౌనం లో వున్నప్పుడు చిరునవ్వే వారికి సమాధానం!..మౌనం వీడినప్పుడు..ముక్తసరిగా సమాధానం చెప్పి, వారిని పంపించివేసేవారు..ఇలా కాలం గడచిపోతోంది..


మాలకొండకు పశ్చిమంగా కొంత దూరం లో కంబాలదిన్నె అనే గ్రామం ఉంది..ఆ గ్రామ వాస్తవ్యులు శ్రీ చెక్కా కేశవులు గారు వైశ్య కులస్థుడు.. ఆయన మాలకొండ లక్ష్మీనృసింహ స్వామి వారి భక్తుడు..విజయవాడ లో వ్యాపారం చేస్తున్నారు..తన గ్రామానికి వస్తూ పోతూ ఉన్నప్పుడల్లా మాలకొండకు వచ్చి, శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దర్శనం చేసుకొని వెళుతూవుండేవారు..అదొక నియమం తో కూడిన ప్రక్రియ వారికి..అలా వస్తూ పోతున్న సమయం లో ఒకసారి శ్రీ స్వామివారిని చూడటం తటస్థించింది..శ్రీ స్వామివారిలో ఉన్న తేజస్సు, చెక్కా కేశవులు గారిని కట్టిపడేసింది..క్రమంగా శ్రీ స్వామివారిని తరచూ చూడటం..మెల్లిగా పలకరించడమూ చేశారు..శ్రీ స్వామివారు సైతం చెక్కా కేశవులు గారితో మాట్లాడారు..కేశవులు గారికి నమ్మకం కలిగింది..శ్రీ స్వామివారు, ఇలా ఎటువంటి సరంజామా లేకుండా..భూశయనం చేయడం..కేశవులు గారికి నచ్చలేదు..శ్రీ స్వామివారు నెత్తి నోరు కొట్టుకొని వారిస్తున్నా వినకుండా..ఒక ఇనుప మంచాన్ని, దోమతెరను..కప్పుకోవడానికి దుప్పట్లు వగైరా అంతా పార్వతీదేవి మఠం కు చేర్చారు..


"నాయనా!..ఇవన్నీ నాకు వద్దు..నేను సర్వసంగపరిత్యాగిని..అన్నీ వదిలేసి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను..నన్ను మళ్లీ సంసారబంధం లోకి లాగకు..నీ కోరిక ఏమిటి?.." అని లాలనగా అడిగారు..


చెక్కా కేశవులు గారు చాలాసేపు తటపటాయించి..ఎట్టకేలకు తన మనసులోని కోరికను బయటపెట్టారు..విన్న స్వామివారు ఫక్కున నవ్వారు..


చెక్కా కేశవులు గారి అనుభవం..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా.. పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

25, ఏప్రిల్ 2021, ఆదివారం

కరోనా వ్యాధి లో CT స్కాన్

 కరోనా వ్యాధి లో CT  స్కాన్ (సిటీ స్కాన్) గురించి కచ్చితంగా తెలుసుకోవలసినవి 👇


ఇవాళ  చాలామందికి కరోనా ఉన్నదా ? లేదా ? అని తెలుసుకోవడానికి మరియు 

కరోనా జబ్బు వచ్చిన తర్వాత ఎలా ఉంది , ఎంత తీవ్రత వుంది అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్  చేస్తున్నారు.


ఈ సిటీ స్కాన్ లో రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.


ఒకటి  CORADS

రెండు CT severity index


CORADS : దీనిలో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు ఉంటవి


CORADS ... 

అనేది సిటీ స్కాన్ ప్రకారము కరోనా ఉండే అవకాశాలు ఎంత ? అని మాత్రమే తెలుసుకోవడానికి వీలుంటుంది .


అంటే స్టేజ్ 1 నుంచి 6 వరకు పెరిగేకొద్దీ కరోనా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నది అని మాత్రమే చెబుతుంది ,  స్టేజ్ పెరిగితే వ్యాధి తీవ్రత పెరుగుతుంది అని మాత్రం కాదు.


CORADS 1... ఏమి ఇబ్బంది లేదు.

CORADS 2... సిటీ స్కాన్ లో కొంచెం తేడా ఉంది కానీ అది కరోనా వల్ల అయి ఉండకపోవచ్చు.

CORADS 3.. సిటీ స్కాన్ లో కొంచెం తేడా ఉంది లేదా నెమ్ము లక్షణాలు ఉన్నది కానీ అది కరోనా వల్ల లేదా వేరే జబ్బు వల్ల వచ్చిందా అని  తెలియడం లేదు.

CORADS 4.  సిటి స్కాన్ బాగాలేదు, సిటి స్కాన్ లో కనిపిస్తున్న ఈ లక్షణాలు చాలావరకు కరోనా వల్లనే అనిపిస్తుంది.

CORADS 5... ఇది ఖచ్చితంగా కరోనా అని సీటీస్కాన్ చెప్తుంది.

CORADS 6 ... సిటీ స్కాన్ లో నెమ్ము లక్షణాలు కనిపిస్తూ RTPCR లేక Rapid antigen test పాజిటివ్ ఉంటే అది stage 6 అవుతుంది.


So, ఈ CORADS క్లాసిఫికేషన్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు వరకు సిటీ స్కాన్ చూసి కరోనానా? లేదా? అని చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది , స్టేజ్ పెరిగితే వ్యాధి తీవ్రత పెరుగుతుంది అని  ఏమాత్రం కాదు.


2 : CT severity index


మనకి రెండు ఊపిరితిత్తులు ఉంటవి. ఒకటి కుడిపక్క ,  రెండవది ఎడం పక్క. ఈ కుడి పక్కన ఊపిరితిత్తిలో మూడు లోబులు ( మూడు భాగాలు ) ఉంటాయి అంటే మూడుగా విభజించబడి వుంటుంది, ఎడమ పక్క ఊపిరితిత్తిలో రెండు లోబ్స్ ఉంటాయి అంటే రెండు గా విభజించబడి ఉంటుంది.... మొత్తం రెండు ఊపిరితితతుల్లో  మనకు 5 భాగాలు గా ఉంటాయి.


ఈ సిటి సివియారిటి ఇండెక్స్ ( CT severity index ) 0 నుంచి 25 వరకు ఉంటుంది .అంటే ఒక్కొక్క లోబ్ లో 0 నుంచి 5 పాయింట్లు ఇస్తారు. 5 x 5... మొత్తం పాయింట్లు 25 అవుతుంది.


ఈ జీరో నుంచి ఐదు పాయింట్లు అనేది ఊపిరితిత్తులు ఎంత చెడిపోయింది అన్న దానిని బట్టి ఈ పాయింట్లు పెరుగుతాయి.


*0 : ఏమీ ఇన్ఫెక్షన్ లేదు

1 : 5% కన్నా తక్కువ గా ఉంది 

2 : 5 - 25  పర్సెంట్ 

3  :25 - 50% 

4 : 50-  75%

5 : 75 పర్సెంట్ కన్నా ఎక్కువగా దెబ్బతిన్నది*


సో ,  ఒక్కొక్క లోబ్ లో జీరో నుంచి ఐదు స్టేజి వరకు తీసుకొని 5 x 5 = 25 స్కోర్ అవుతుంది .

ఈ స్కోర్

8 కన్నా తక్కువ అయితే ...mild ( తక్కువగా వుంది )

 8 నుంచి 15 అయితే Modarate ( ఒకమొస్తరిగా)

15 కన్నా ఎక్కువ అయితే Severe ( ఎక్కవగా)


  ఊపిరితిత్తులు ఎంత దెబ్బతిన్నది అని తెలుసుకోవడానికి ఈ స్కోర్ ఉపయోగపడుతుంది .


కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అది ఆ రోజు సిటీ స్కాన్ చేయించిన రోజు ఎంత దెబ్బ తిన్నవి అని మాత్రమే తెలియజేసినది.

 వ్యాధి పెరుగుతున్నకొద్దీ ఈ స్కోరు  పెరుగుతుంది. 


అంటే డాక్టర్లు ఈ సిటీ స్కాన్ ని వ్యాధి పెరుగుతుందా లేదా అని మరియు ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి మళ్ళీ చేయవలసి వస్తుంది.


కాని పెరుగుతుందా లేదా తెలుసుకోవడానికి డాక్టర్ని మాత్రమే సంప్రదించవలెను. సొంతంగా వెళ్లి సిటీ స్కాన్ చేయించుకున్న ఎడల డబ్బులు వృధా అవుతాయి , అనవసరంగా ఎక్కువసార్లు సీటీ స్కాన్ చేయించుకోవడం వల్ల రేడియేషన్ కూడా వస్తుంది.


 అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ pulse oximeter  చెక్ చేసుకుంటే మనం కూడా గమనించవచ్చు .


ఈ పల్స్ ఆక్సిమీటర్ లో SPO2 అనేది 93 కన్నా ఎక్కువ ఉండాలి, 


 93 శాతం కన్నా తక్కువ ఉంటే మన ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం లేదని అర్థం.


  సో , ఈ CORADS  క్లాసిఫికేషన్ స్టేజ్ 1 - 6   అనేది  కరోనా ఉండే అవకాశాలు ఎంత అని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అది వ్యాధి తీవ్రత తెలియజేయదు.


 CT Severity index ఊపిరితిత్తులు ఎంత దెబ్బ తిన్నవి వ్యాధి తీవ్రత ఎంత ఉంది అని తెలియజేస్తుంది.


ఈ సిటీ స్కాన్ లో  వ్యాది ఎలా వుంది ఎంత తీవ్రత వుంది అని చెప్పడానికి మరో నాలుగు పదాలు వాడుతూ ఉంటారు .


  ground glass appearance


   Crazy paving pattern


     Consolidation


      Gradual resolution 


  ఈ ground glass అనగా ఒక ఐదు రోజుల లోపు కరోనా అటాక్  అయివుంటుంది


 5 రోజుల నుంచి 10 రోజుల్లో ఈ క్రేజీ పేవింగ్ పేటరన్ కనిపిస్తుంది


 10 నుంచి 13 రోజులు లో కన్సాలిడేషన్ లాగా అనిపిస్తుంది 


14 రోజుల తర్వాత అయితే గ్రాడ్యువల్ రిజల్యూషన్ లా  CT స్కాన్ లో కనిపిస్తుంది.


ఇవన్నీ మనము కొంచెం సిటిస్కాన్ గురించి తెలుసుకోవడానికి మాత్రమే ,పూర్తిగా అవగాహన కోసం డాక్టర్ ని సంప్రదించాలి.


copy post from whats app

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...  


*ఆశ్రమవాసం..ఆధ్యాత్మిక శిక్షణ..*


*(ఎనిమిదవ రోజు)*


వ్యాసాశ్రమం లో అడుగుపెట్టిన శ్రీ స్వామివారికి అక్కడి క్రమశిక్షణాయుత వాతావరణం నచ్చింది..తెల్లగా..సన్నగా ..తేజస్సు ఉట్టిపడుతున్న ముఖం తో ఉన్న ఆ బాల యోగి అందరినీ ఇట్టే ఆకర్షించాడు.. నియమిత ఆహారం..యోగ సాధన..నిరంతర భజనలు..భగవన్నామ సంకీర్తనమూ..సాధు సత్పురుషుల ఉపదేశాలూ..ఎటు చూసినా ఒకరకమైన భక్తి భావం తొణికిసలాడే ఆ ఆశ్రమం..శ్రీ స్వామివారికి అనువైన ప్రదేశం గా తోచడం లో ఆశ్చర్యం లేదు..


శ్రీ స్వామివారికి గురువులు బోధించే ఏ అంశమైనా క్షణాల్లో అవగతమైపోయేది..దానికి తోడు ఆయనకే స్వంతమైన ధారణ శక్తి తో అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చే నేర్పు అలవడింది..శ్రోతలు మంత్ర ముగ్ధుల్లా వినేవారు..తనకు సందేహం వస్తే..గురువు దగ్గర వినయపూర్వకంగా అడిగి తెలుసుకునేవారు..చెరగని చిరునవ్వు తో ఉండటం..ఎటువంటి ప్రశ్నకైనా తడుముకోకుండా జవాబు చెప్పటం..గురువుల వద్ద వినయం తో ప్రవర్తించడం..తాను తెలుసుకున్న జ్ఞానాన్ని తోటి మిత్రులకు సులభ శైలిలో వివరించడం..మొదలైన గుణాల వలన అనతికాలంలోనే ఆశ్రమంలో ఒక ముఖ్య శిష్యుడిగా మారిపోయారు..


సరిగ్గా ఆ సమయం లోనే..కొంతమంది ఆశ్రమవాసులు తదుపరి శ్రీ స్వామివారిని బోధగురువు గా నియమిస్తే బాగుంటుందని తలపోయసాగారు..ఆశ్రమానికి కూడా ఈ యువకయోగి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని ఆలోచన చేయ సాగారు..ఈ ఆలోచన వారి మదిలో ఎందుకు కలిగిందో తెలీదు కానీ..ఆనాటి నుంచి, శ్రీ స్వామివారిని ఒక ప్రత్యేక వ్యక్తిగా పరిగణించసాగారు..ఈ మార్పు శ్రీ స్వామివారి మనసుకు తోచింది..మూలకారణం ఏమిటో అని ఆరా తీశారు..ఆశ్రమవాసుల్లో కొందరు శ్రీ స్వామివారికి అసలు విషయం చెప్పారు..


శ్రీ స్వామివారు ఎంతో పరిణితి తో ఆలోచన చేశారు..తన జీవిత లక్ష్యం మోక్ష సాధన..అంతేకానీ ఆశ్రమ నిర్వహణ కాదు..మానవుని ఆధ్యాత్మిక పయనంలో అనేక బంధాలు అడ్డుపడతాయి..కీర్తి తో వచ్చే బంధాలు ("ఆయన లాంటి గురువు దొరకడం కష్టం అండీ..అంటూ ఆకాశానికి ఎత్తేసే రకం..)  కొన్ని..పదవుల తో (ఆశ్రమ నిర్వహణ, గురు పీఠం ఇత్యాదులు) వచ్చే బంధాలు కొన్ని..ఇలా వీటిలో చిక్కుకొని తన మార్గాన్ని తానే తప్పడం సుతరామూ ఆయనకు ఇష్టం లేకుండా పోయింది..క్రమంగా ఆశ్రమ వాసుల లో శ్రీ స్వామివారి మీద బాధ్యతలు మోపాలనే ఆలోచన బలపడసాగింది..ఈ ధోరణి శ్రీ స్వామివారి ధ్యానానికి అవరోధంగా మారింది..ఇక ఇక్కడ వుంటే..తనమీద ఏదో ఒక బాధ్యత పడక తప్పదు అని శ్రీ స్వామివారికి తేటతెల్లంగా తెలిసిపోయింది..


శ్రీ స్వామివారు ఆలోచన చేశారు..ముందుగా కొన్నాళ్ల పాటు వేరే ప్రదేశాలకు వెళ్లి వస్తానని ఆశ్రమవాసులకు చెప్పుకుని, గురువుల అనుమతి తీసుకొని బైటకు వచ్చారు..అలా చిత్తూరు జిల్లాలో "పాపానాయుడుపేట" అనే గ్రామానికి చేరారు..ఆగ్రామంలో "బాలబ్రహ్మం" అనే సాధువు శ్రీ స్వామివారిని చూసి.."ఈతడు సామాన్యమానవుడు కాదే..ఇలా తిరుగుతున్నాడేమిటి?.." అని తనలో తానే తర్కించుకుని, శ్రీ స్వామివారిని చేరదీసి..వాకబు చేశారు..బాలబ్రహ్మం ఏ నిమిషంలో శ్రీ స్వామివారిని కలిసాడో..శ్రీ స్వామివారికి అంతర్వాణి "ఇతడే నీ గురువు.." అని ప్రబోధించింది..శ్రీ స్వామివారు సాష్టాంగ నమస్కారం చేసారు..


"లే నాయనా!..దారితప్పి, దిక్కుతోచక అల్లాడుతున్నావా?..ఇక నీకు భయం లేదు..నిత్యమూ, సత్యమూ అయిన సచ్చిదానంద స్వరూపాన్ని కనుక్కోవడానికి సాధన అవసరం..ముక్తి మార్గాన్ని తెలుసుకోవాలంటే ముందుగా నిన్ను నీవు శోధించుకోవాలి..పరమాత్మ తత్వాన్ని గ్రహించాలనే నీ తపన అర్ధమయింది..ఆత్మ ను గ్రహిస్తే..పరమాత్మ వశం అవుతాడు.." అని చెప్పి, తపస్సాధన చేయాల్సిన విధం చెప్పి..గురూపదేశం చేశారు..భగవన్నామ జపం చేసేటప్పుడు ప్రకృతి కల్పించే ఆటంకాలు, మాయా పరీక్షలు ఎలా ఎదుర్కోవాలో వివరంగా తెలియచేసారు..


బాలబ్రహ్మం గారు చేసిన ఉపదేశం, శ్రీ స్వామివారిలో కొండంత మానసిక స్తైర్యాన్ని నింపింది..కొన్నాళ్ల పాటు ఆయనకు శుశ్రూష చేసి..తిరిగి ఎర్రబల్లె చేరారు..ఇక తపోసాధనకు అనువైన ప్రదేశం కావాలి..మోక్ష సాధన..మోక్ష సాధన..ఇదొక్కటే ఆయన మదిలో సుడులు తిరుగుతున్న ఆలోచన!..ఇదే తపన!..


భక్తుడు ఆర్తిగా తపిస్తుంటే..భగవంతుడు చూస్తూ ఊరుకోడు.. తన దగ్గరకు పిలిపించుకుంటాడు..మాలకొండ లో వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనారసింహుడు,  శ్రీ స్వామి వారి మొర ఆలకించాడు..శ్రీ స్వామివారికి అంతర్వాణి రూపంలో ఆదేశం వచ్చింది..ఒక్కక్షణం ఆలస్యం చేయలేదు.. పరుగు పరుగున మాలకొండ చేరారు..


మాలకొండలో తపోసాధన..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

Paata


 

24, ఏప్రిల్ 2021, శనివారం

కరోనా రోగులు రుచి వాసన

 *కరోనా రోగులు రుచి వాసన ఎందుకు కోల్పోతారు?*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


కరోనా మన శరీరం లో ప్రవేశించాక, అది మన శరీరంలో ఉండే Proteins, Amino Acids లను వాడుకోని తన సైన్యం పెంచుకుంటుంది.  మన శరీరం లో Proteins, Amino Acids అనేవి, Glycin తయారీకి ఉపయెాగ పడతాయు.

 

Glycin వెన్నెముక నుంచి మెదడుకి సంకేతాలు పారడానికి ఉపయెాగ పడుతుంది.  అంటే కరొన మన శరీరంలో ఉండే Glycin ని మెుత్తం వాడుకొని తన సైన్యం పెంచుకుంటుంది.  అందువల్ల కరొన వచ్చిన వ్యక్తికి Glycin లేక మెదడుకు సంకేతాలు వెళ్ళక, రుచి వాసన కోల్పోతాడు. 


*కరోనా వచ్చిన వ్యక్తికి శ్వాస ఎందుకు ఆడదు?*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


శరీరంలో పుార్తగా Glycin అయిపోయిన తర్వాత Oxygen ని కూడా తీసుకోలేక చనిపోతున్నాడు. 


మనం శరీరంలోకి Glycin తయారీకి అవసరం అయిన Proteins, Amino Acids లను పంపక పోతే, కరోనా  చనిపోతుంది.  కాని, దానితో పాటు మనం కూడా చనిపోతాం.  కాబట్టి శరరంలో అవసరం కన్నా ఎక్కువ Glycin తయారు అవ్వడం ద్వారా మన శరీరం కరోనాతో  పోరాడ గలదు.


*అసలు Glycin ఎలా తయారవుతుంది? దానికి మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి?*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


Glycin తయారీకి ఉపయెాగపడే పదార్దాలు రోజుకి కనీసం 20 gm నుంచి 50 gm వరకు తీసుకోవాలి.


*Glycin తయారీకి ఉపయెాగ పడేవి:-*


1. తోటకూర

2. ఆవాలు

3. నువ్వులు

4. కరివేపాకు

5. మునగాకు


*"C" విటమిన్ కొరకు:*

6.  నిమ్మ

7.  ఉసిరి

కాశీఖండము

 శ్రీనాథుని కాశీఖండము లోని కొన్ని పద్యాలు: 


కం. ఒక వర్ష శతంబున నొం

డొక తీర్ధము నందు గల ప్రయోజన లాభము

బొక దివసంబున నానం

ద కాననము నందు సర్వదా సిద్ధించున్! 


తా. కాశీ కంటే వెరొక తీర్ధమునందు ఒక నూరు సంవత్సరములకు లభించెడి ప్రయోజనము ఆనందదాయకమైన కాశీ యందు ఒక్క దినమునందే యెల్లప్పుడూ సిద్ధించును.


కం. నేమంబున నొక ప్రాణా

యామంబున నరుడు పడయునట్టి ఫలశ్రీ

సామాగ్రి యొండెడ ముని

గ్రామణి ! సాష్టాంగయోగ గతి గనరు నరుల్! 


తా.కాశీ క్షేత్రములో ఒక్క ప్రాణా యామము వలన మనుష్యుడు పొందెడి సమగ్ర ఫలసమృద్ధిని అన్య క్షేత్రమునందు అష్టాంగసహిత యోగ మార్గమున కూడా పొందజాలరు.

మొగలిచెర్ల మోక్ష సాధన లో

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...  


*మోక్ష సాధన లో మొదటి మెట్టు..*


*(ఏడవ రోజు)*


శ్రీ స్వామి వారికి పదమూడు యేండ్లు వచ్చేసరికి కుటుంబసభ్యులకు ఆయన తత్వం అర్ధం కాసాగింది..ఈ బాలుడికి భక్తి మీద అనురక్తి వుందికానీ చదువు మీద ధ్యాస లేదని..ఆ వయసులోనే మాంసాహారం విడిచిపెట్టేసారు..కేవలం సాత్వికాహారం భుజించడం అలవాటు చేసుకున్నారు..కానీ..కాషాయం కట్టిన ప్రతి వారి దగ్గరా ఆధ్యాత్మిక బోధ చేయమని  అడగటం ప్రారంభించారు..అప్పుడు శ్రీ స్వామివారి పెద్దన్నయ్య గారు, దగ్గరకు పిలచి..కనపడ్డ ప్రతి వాడూ గురువు కాదనీ..ముందుగా దైవాన్ని ప్రార్ధించడం అలవాటు చేసుకోమని..మృదువుగా చెప్పారు..ఈ మాటలు శ్రీ స్వామివారి కి సూటిగా తగిలాయి..


ఎర్రబల్లె గ్రామం లోనే బాల్య వితంతువైన "యల్లకర లక్షమ్మ" అనే వృద్ధురాలు నిరంతర దైవ నామ స్మరణలో కాలం గడుపుతూ ఉండేది..ప్రతి నిత్యం నిష్ఠతో పూజ చేసేది..ఆధ్యాత్మిక గ్రంథాలలోని సారాన్ని గ్రహించిన లక్షమ్మ అహంకార రహితంగా  నిరాడంబరంగా జీవనం సాగించేది..ఆమె దృష్టిలో శ్రీ స్వామివారు పడ్డారు..మొదట కొంతకాలం పాటు శ్రద్ధగా ఈ బాలుడి గురించి పరిశీలించింది..ఆవిడకు ఈ బాలుడు సామాన్యుడు కాదనీ..సాక్షాత్తూ ఆ దత్తాత్రేయుడి అంశ ఇమిడినట్లుగా వున్న ఒకానొక దైవకళ ఇతనిలో ఉట్టిపడుతోందనీ గమనించింది..శ్రీ స్వామివారిని చేరదేసింది..శ్రీ స్వామివారికీ..తాను తల్లి ఒడిలోకి చేరినట్లు భావించారు..


మోక్ష సాధనకు ఆచరించవలసిన మార్గాలను లక్షమ్మ గారు శ్రద్ధతో శ్రీ స్వామివారికి బోధించింది..శ్రీ స్వామివారు తాను చెప్పిన విషయాలను ఆకళింపుచేసుకోవడమూ..ఒక్కమారు వినగానే హృదయస్తం చేసుకోవడమూ..తనకున్న అనుమానాలను వినయపూర్వకంగా అడిగి జవాబు తెలుసుకోవడమూ..చూసిన లక్షమ్మ గారికి..తన ఊహ సరైనదేనని..ఇక ఎక్కువ కాలం ఉపేక్షించుకుండా ఈ బాలుడిని సరైన ఆశ్రమం లో చేర్పించి..మరింతగా సాధన చేయిస్తే..అతను గురు స్థానం పొందుతాడనీ...అని నిర్ణయానికి వచ్చి..శ్రీ స్వామివారి కుటుంబ సభ్యులతో ఆమాటే చెప్పింది..


ఈ లోపల శ్రీ స్వామివారు రోజూ ధ్యానం చేయడం ప్రారంభించారు..తనకనువైన ప్రదేశం కనబడగానే..ధ్యానం లోకి వెళ్లిపోవడం మొదలెట్టారు..అది నిముషాలు కావొచ్చు..గంటలు కావొచ్చు..అలా నిశ్చలంగా కూర్చుండిపోయేవారు..ఎర్రబల్లె గ్రామస్థులలో కొందరు హేళన కూడా చేయసాగారు..శ్రీ స్వామివారు అవేమీ తనకు పట్టనట్టు వున్నా..కుటుంబసభ్యులకు మనస్తాపం కలుగుతుంది కదా..అప్పుడే లక్షమ్మ గారు, తన సలహాను శ్రీ స్వామివారి అన్నయ్యకు చెప్పారు..


చక్కటి రూపం తో ఉన్న తమ పిల్లవాడిని..సన్యాసిగా మార్చడం ఎవరికి ఇష్టం ఉంటుంది?..కానీ..ఈ బాలుడేమో అటు వ్యవసాయానికి..ఇటు చదువుకూ..రెండింటికీ పనికిరాకుండా పోతున్నాడు..సరే ఆఖరి ప్రయత్నంగా మెట్రీక్ పరీక్షకు కూర్చోబెడదామని..అది పాస్ అయితే..పై చదువులు చదివించి..తమ దారిలోకి తెచ్చుకుందామని అనుకుని..శ్రీ స్వామివారితో ఆమాటే చెప్పారు..తనకు ఈ లౌకిక చదువులమీద ఆసక్తి లేదనీ..తన మార్గం వేరనీ..తెగేసి చెప్పేసారు..లక్షమ్మ గారి సలహా ప్రకారం తానొక ఆశ్రమం లో చేరి..తన ఆధ్యాత్మిక సాధన ను మెరుగుపరచుకొని..మోక్ష మార్గాన్ని చూసుకుంటానని ఖరాఖండిగా తేల్చేసారు!..


ఇప్పటికిప్పుడు ఈ బాలుడిని అక్కున చేర్చుకునే ఆశ్రమం ఎక్కడ ఉంది?..ఈ ప్రశ్నకు కూడా లక్షమ్మ గారే జవాబు చూపించారు..శ్రీ కాళహస్తి సమీపంలోని "ఏర్పేడు" లోగల "వ్యాసాశ్రమం" లో చేర్చమని చెప్పారు..సరే నన్నారు..


వ్యాసాశ్రమంలో అడుగు పెట్టారు శ్రీ స్వామివారు..ఇంతకాలం ధ్యానం కోసం అటూ ఇటూ తిరిగిన శ్రీ స్వామివారికి..ఆ వ్యాసాశ్రమం తనకోసమే నిరీక్షిస్తున్నట్లు తోచింది..మనసులో తాను చేరవలసిన చోటుకే చేరాననే సంతోషం కలిగింది..ఇది తన ఆధ్యాత్మిక జీవన యానం లో మొదటి మజిలీ అని నిశ్చయనికొచ్చారు..తనకు ఈ మార్గం చూపిన లక్షమ్మ గారికి మనసారా నమస్కారం చేసుకున్నారు...


ఆశ్రమవాసం..ఆధ్యాత్మిక శిక్షణ!...రేపు...


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380. & 99089 73699).

చక్కటి భావ వ్యక్తీకరణ.

 శ్రీ మీఱం దన పెండ్లి వేళ నొడలం , జెన్నారు భూషామణి

స్తోమంబుం బొడగాంచి శైలసుతచే,తో వీథి గంపింపద

ద్భామా రత్నము కొప్పు బర్హమని యప్పాముల్డలల్వంపన

త్యామోదంబున నవ్వు శంభుడిడు మా కశ్రాంత సౌఖ్యోన్నతుల్


యీ పద్యము కూచిమంచి తిమ్మకవి విరచిత రసికజనమనోభిరామము అను కావ్యము  నుండి గైకొనబడినది.


భావం: 


పెండ్లి సమయములో ఈశ్వరుని ఒంటి మీద ఉన్న ఆభరణాలంకారములను గాంచి పార్వతి దేవి మనస్సు కంపింపగా ఆ కంపనకు తన కొప్పులు వీడిపోయి  నెమలి పింఛము  వోలే ఈశ్వరుని ఒంటిపై వున్న ఆభరణములోని పాములకు కనిపించగా అవి భయపడడం చూసి ఆ పరమేశ్వరుడు ఆనందభరితుడయ్యెనని భావం.


ఎంతటి చక్కటి భావ వ్యక్తీకరణ.

23, ఏప్రిల్ 2021, శుక్రవారం

శ్రీరమణీయం* *-(149)*_

 _*శ్రీరమణీయం* *-(149)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"మనసును నిశ్చలంగా ఎవరు ఉంచుకోగలుగుతారు ?"*_


_*అద్దంలో మంట కనిపించినా అది అద్దానికి గాని దాన్ని చూసే వారికిగానీ ఏ హాని చేయదు. జ్ఞానుల మనసు అలాగే ఉంటుంది. పరిపూర్ణ శాంతిని, భగవంతుని సాన్నిధ్యాన్ని , ఆత్మానుభవాన్ని పొందిన సద్గురువులు, యోగులు, జ్ఞానులు మనసును నిశ్చలంగా ఉంచుకుంటారు. కప్ప సహజంగానే తన నాలుకను పైకి మడిచి 'ఖేచరీ విద్య'తో ఆకలిదప్పులులేని స్థితిలో ఉంటుంది. యోగి కూడా ఈ లోకంలో అలా జీవిస్తాడు. అలాగే శ్రీరమణభగవాన్ వంటి జ్ఞానులు ఈ ప్రపంచంలో మనతోపాటు జీవిస్తున్నా ఏ విషయాలు వారి మనసును చలింపజేయలేవు. మనకి వారికి తేడా అంతా విషయాన్ని స్వీకరించే తీరులోనే ఉంటుంది. వాస్తవానికి ప్రాపంచిక విషయాలేవి మన మనసుకు కూడా అంటేవి కావు. కానీ మనకి ఆ విషయంలో అనుభవం లేదు. ఆ వివేకం కలిగిన రోజు మనం కూడా సాక్షిత్యంతో సాధనలో ముందుకు సాగుతాం !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'మనస్సు స్వస్వరూపమే దైవం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

కరోనాకు

 ప్రపంచాన్ని వణికిస్తున్న  కరోడా కరోనాకు షాక్ 

     Rs.50,000/-రివార్డ్                      

      ----------------

👉 ఒక్క రూపాయితో కరోనాకు మందు కనుగొన్న లయన్ రంగా వెంకటేశ్వరరావు "అల్లాఉద్దీన్ అద్భుత దీపం "చిట్కా 

--------------------------

నాసికా రంధ్రాల్లో (ముక్కులో )ఒకచుక్క నిమ్మరసం వేసుకొంటే ముక్కులో, గొంతులో,శ్వాస కోశాల్లో దాగి ఉన్న కరోనా వైరస్ అంతా శ్లేష్మ రూపంలో నోటిలోనికి వచ్చేస్తుంది .దాన్ని కాండ్రించి ఉమ్మివేయాలి. తదుపరి గోరువెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం కలిపి పుక్కిలించి ఉమ్మాలి. వెంటనే మనకు రిలీఫ్ గా ఉంటుంది. తర్వాత శుభ్రమైన కొబ్బరి నూనె లో వేలు ముంచి నాసికా రంధ్రాల్లో రాయాలి.


 ఈ విధంగా చేసిన తర్వాత మాకు రిలీఫ్ రాలేదని ఎవరైనా రుజువు చెసినచో వారికి రంగా వెంకటేశ్వరరావు గారిచే రూ. 50,000/-బహుమానం ఇవ్వబడుతుంది. అని ఛాలంజ్ చెయ్యడం జరిగింది.


👉 కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న విలన్ ఐతే,తేలికగా  నివారణ మందు కనుగొన్న ప్రపంచ హీరో మన సోదరుడు"రంగా వెంకటేశ్వరరావు  "నిమ్మరసం శానిటైజర్ కన్నా గొప్పగా పనిచేస్తుంది. నిమ్మరసం చేతులకు, శరీరానికి, తలకు,  గదుల్లోను,  వస్త్రములపై  ఉపయోగిస్తే కరోనా మన దరి చేరదని అమ్మ లాంటి నిమ్మ వల్ల అనేక లాభాలున్నాయని  చెబుతున్నారు మన రంగా వేంకటేశ్వరరావు గారు. భయం తో వణికిపోతున్న ప్రపంచ ప్రజలకు ఈ గొప్ప ఉపాయం కనుగొన్న వ్యక్తి నిడదవోలు పట్టణ" రంగా "వారి ముద్దుబిడ్డ శ్రీ రంగా సుబ్బారావు సత్యవతి పుణ్య దంపతుల కుమారుడు MJF Ln. రంగావెంకటేశ్వరరావు గారు పచ్ఛిమ గోదావరి జిల్లా, నిడదవోలు లయన్స్ క్లబ్ అధ్య్యక్షులుగా, జిల్లాసేవా కో-ఆర్డినేటర్ గా పనిజేసి, తను అధ్యక్షుడుగా ఉన్న  క్లబ్ నకే కాకుండా ఇతర క్లబ్ లకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి  జిల్లాలోనే ఉత్తమ అధ్యక్షులుగా ప్రధమ బహుమతి పొంది, ప్రస్తుతం కూడా జిల్లా సేవా కోఆర్డినేటర్ గా ఉండిరి. పైన చెప్పిన విధంగా వెంకటేశ్వరరావు గారు స్వయంగా ప్రయోగం చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత,  పలువురు కరోనా బాధితులైన రాజకీయ నాయకులకు, ఇతరులకు  సూచించి వారు కూడా  ఫలితం పొందిన తర్వాత వారినుండి  అభినందనలు పొందడం కూడాజరిగిందని మీకు తెలియజేయుచున్నాము. 

   ఒక సైనికులు సైనైడ్ చుక్క ప్రాణం తీస్తుంది.

 అమ్మ లాంటి ఒక నిమ్మరసం చుక్క ప్రాణాన్ని కాపాడుతుంది. సర్వేజనా సుఖినో భవంతు. 😷🙏😱

నోటంట మాట రాలేదు ....

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

*నాకు నచ్చిన శివరాం మోహన్ గారి మరో కథనం.*

              🌷🌷🌷

ప్రక్కన కూర్చున్నాయన్ని చూసి పలకరింపుగా నవ్వాను .... ఆయన కూడ ముందు కొంచెం ఆశ్చర్యపోయినా మొహమాటంగా నవ్వారు .... కాకినాడేనా సార్ ... అన్నాను మాట కలుపుతూ... నాన్ స్టాప్ దొరకలేదు ... ఈ వెధవ ఎర్ర బస్సు దొరికింది .... ఎప్పటికి తీసుకెళ్తాడో ఏంటో ... ఆయన విసుగ్గా అంటుంటే ... నేను నవ్వుతూ.... ఏదైనా అర్జన్టు పనుందా సార్ కాకినాడలో ... అన్నాను... అదేం లేదండి ....పాసింజర్ బస్సు అన్ని స్టాపుల్లో ఆగి వెళ్తుంటే చిరాకు ...అంటుంటే ...  ఎంత సార్ .... యానాం దాటితే తాళ్లరేవు తర్వాత రెండు దెబ్బల్లో జగన్నాధపురం ... ఇంక కాకినాడ ఊళ్ళో కెళ్లిన తర్వాత ఎర్రబస్ అయినా ఎక్సప్రెస్ అయినా ఒక్కటే... రాత్రయ్యేకొద్దీ బస్టాండ్ లో ఒంటరిగా కూర్చొని ఎక్సప్రెస్ గురించి ఎదురు చూట్టం కన్నా దొరికిన ఎర్ర బస్సు ఎక్కేస్తే .... జనాలు ఉంటారు ..జర్నీ తెమిలిపోద్ది .అన్నాను.. 

          ఆ పెద్దాయన ఈ సారి నా వంక తేరిపార చూశారు ... ఏం చేస్తుంటారు మీరు .... అన్నారు... కొంచెం ఆసక్తిగా .... నేను చెప్పాను .... అదేంటండి... మీకు వెహికల్ ఇస్తారేమో .. అన్నారు... అది ఇక్కడ ఉండిపోద్దండి... నన్ను కాకినాడ బస్సు ఎక్కించి... అన్నాను నవ్వుతూ ... ఆయన కూడా నవ్వుతూ మీరు భలే మాటాడుతున్నారే అంటుంటే .... 

                చెప్పానా ... అప్పుడే యానాం బ్రిడ్జి వచ్చేసింది చూశారా ....వృద్ధ గౌతమికి ఆఖరి మజిలీ ఇదే... సముద్రుడు ఎదురొచ్చి మరీ తీసుకుపోతాడు గోదారమ్మని ..... తాపం తట్టుకోలేక .... అంటుంటే...ఆ పెద్దాయన నవ్వుతూ .... నా భుజంమీద చరిచాడు...పావుగంట లోనే ఆయనకు చనువు పెరిగిందని నవ్వుకుంటూ .. ... ఈ బ్రిడ్జి కట్టాక సుఖంగా ఉంది గానీ ... రేవులు దాటి కాకినాడ వెళ్లాలంటే తల ప్రాణం తోకకు వచ్చేది ... రాత్రి పూటయితే ఇంక చెప్పక్కర్లేదు .. 

                     .అన్నంపల్లి దాకా బస్సు ....అక్కడ గోదారి పాయ దాటి మురమళ్ళ .... అక్కడ్నుంచి అద్దె సైకిల్ తీసుకుని ఎదుర్లంక రేవుకొచ్చి .... అద్దె సైకిల్ అక్కడ అప్పజెప్పేసి .... నావెక్కి యానాం చేరుకొని అక్కడ్నుంచి వీరభద్ర ట్రావెల్సోడి  కిక్కిరిసిపోయిన బస్సెక్కి పడతా లేస్తా కాకినాడ చేరేసరికి భోజనం టైం కూడా మించిపోయేది ... మనల్ని చూసి .... అదేంరా బాబు ఉత్తరం ముక్కయినా రాసావుకాదు ... అని ముక్కు చీదుకుంటూ పొయ్యేలిగించేవాళ్ళు అక్కలో మేనత్తలొ .... 

                 మనకు తెలీకుండానే చాపకింద నీరులా అభివృద్ధి కూడా జరిగింది ఈ అరవై డెబ్బై ఏళ్లలో .... దీనికి మన వయసు వాళ్లే ప్రత్యక్ష సాక్షులు ... ప్రతి దానికి బ్రిటీషోళ్ళని మెచ్చుకుంటారు మనోళ్లు కొందరు మన ప్రభుత్వాన్ని ఈసడిస్తూ ...అంకినకాడికి దోచుకుని పీల్చి పిప్పి జేసి అప్పగించి వెళ్లారని ఇంకా బతికున్న అప్పటి వాళ్ళని అడిగితే చెబుతారు...   . అభివృద్ధి చెందిన యూరప్ అమెరికాలతో పోల్చి ఎద్దేవా చేస్తుంటారు నవతరం .... ఆ దేశాలకు స్వతంత్రం వచ్చి వందల ఏళ్ళు గడిచాయని మాత్రం మర్చిపోతారు ....వాళ్ళు ఇతర దేశాల్ని దోపిడీ చేసి పెంచుకున్న సంగతి కూడా మర్చిపోయారు ... 1947 లో మన జనాభా 39 కోట్లు ... మరిప్పుడు 130 కోట్లు ...ఇది అతి పెద్ద ప్రజా స్వామ్య దేశం .... మన పల్లెటూర్లలో ఇప్పటికి కనిపించే ఉమ్మడి కుటుంభాల్లాంటిది ... ఎవర్నీ నొప్పించకుండా చక్కపెడుతూ వెళ్ళాలి ..... నియంతృత్వ దేశాల్లో ప్రజల భావోద్వేగాలను పట్టించుకోరు కాబట్టి అభివృద్ధి పెరుగుదల స్పీడ్ గా  ఉంటుంది .... మానవ సంబంధాలు మాత్రం మరోలా ఉంటాయి ... మనం అమెరికానో బ్రిటనో మన పిల్లల దగ్గరకెళ్ళి ఒక్క రెండు నెలలు ఉంటే .. కొత్తలో భలేగా ఉంది అనిపిస్తాది ....వారం రోజులకే  మాట్లాడేవాడు కనిపించక మన దేశమ్మీద బెంగొస్తాది ... అభివృద్ధి మెల్లగా జరిగినా పర్లేదు ... అభిమానాలు తగ్గకుండా ఉంటె అదే పదివేలు .... అనిపిస్తది .....

                       మాటల్లో పడి కాకినాడ కల్పనా సెంటర్ ఒచ్చేసింది ..... అదేంటి సార్ మీరెక్కడ దిగాలి .... అంటుంటే.... నేను జిల్లా పరిషద్ దగ్గిరే దిగాలి ... కానీ దిగబుద్ధి కాలేదు ... మీతో మాట్లాడుతుంటే ... మీరెక్కడ ... కాంప్లెక్స్ లో దిగాలా ... నేనూ అక్కడే దిగుతాను .... అక్కడ్నుంచి ఆటో ఎదో పట్టుకుని వెనక్కు వెళ్తాను ... ఆయన మనస్ఫూర్తిగా అలా అంటుంటే నాకు నోటంట మాట రాలేదు ....

                                                                                                                                                               *"సం"మోహనం*

వెలుగు వైపుగా

 

      *వెలుగు వైపుగా* 

                🌷🌷

నేను నా తల్లితండ్రులకు ఒక్కడే‌ కొడుకుని…. నాకు పన్నెండేళ్లు వయసులో, మా అమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతే, మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకోకుండా, చాలా కష్టపడి నన్ను పెంచాడు. మిగిలిన రైతులు పొలంలో వరి, జొన్న, మొక్కజొన్న లాంటి ఆహారధాన్యాలు పండిస్తే, మా నాన్న కూరగాయలు పండించేవాడు. ధాన్యం పండించటం కన్నా కూరగాయల పంటకు‌‌ ఎక్కువ శ్రమించవలసి ఉంటుంది కానీ వాటి మీద‌ ఆదాయం వెంట వెంటనే లభిస్తుంది, కనుక కూరగాయలే నయమనుకునేవాడు. ఇవే కాక మా పొలంలో కొన్ని కరివేపాకు, నిమ్మ వంటి ఆదాయాన్నిచ్చే‌ చెట్లు కూడా ఉండేవి. 


అలా పండించిన కూరలను నెత్తి మీద ‌బుట్ట పెట్టుకుని వారాంతపు సంతలలో తనే స్వయంగా అమ్మేవాడు. అవికాక వంటపనీ, మిగిలిన పనులూ కూడా ఆయనే చేసేవాడు. అంత కష్టపడి నా స్కూల్ ఫీజులకీ, యూనిఫార్మ్ లకూ, పుస్తకాలకూ‌ డబ్బులు ఖర్చుపెడుతుంటే, నేను బాధతో ఏడ్చేవాడిని. "చదువు వద్దూ, ఏం వద్దూ… నన్నూ నీతో పొలానికి తీసుకుపొమ్మని" గొడవ చేసేవాడిని.


ఆయన నా మాటలు పట్టించుకునేవాడు కాదు, పైగా "నువ్వు చదువుకోకపోతే ఇప్పుడు నేను పడే కష్టం అంతా వృధా అవుతుంది నాయనా! ఒక తరం బాగుపడాలంటే, ఒక తరం కొన్ని త్యాగాలు చేయక తప్పదయ్యా!" అనేవాడు. నాకు నాన్న మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా, ఆయన కోరిక మేరకు ‌చదువు కొనసాగించాను.


ఎస్ ఎస్ సి అయిన తరువాత ఇంటర్లో చేరాను. చాలామంది పాలిటెక్నిక్ డిప్లొమా చేయించమని మా నాన్నకు సలహా ఇచ్చారు, కానీ ఆయన వినలేదు. నేను ఇంటర్లో బయాలజీ తీసుకున్నాను. ఇక ఆ రెండేళ్లు స్నేహితులూ, సరదాలంటూ సమయం వృధా చేయకుండా, బాగా కష్టపడి మెడిసిన్ లో సీటు సంపాదించాను. సీటైతే వచ్చింది కానీ, మా కులానికి స్కాలర్షిప్ వచ్చే అవకాశం లేదు. సామాజిక అసమానతల పట్ల అవగాహన ఉన్నవాడిని కనుక నేను ప్రభుత్వ విధానాలని ఎన్నడూ తప్పు పట్టలేదు. మొత్తానికి మెడిసిన్ లో చేరాను కానీ డబ్బుకు ఇబ్బంది ఉండేది… అప్పట్లో మెడికల్ కాలేజ్ కి, అతి సామాన్యమైన బాటా చెప్పులతో వెళ్లింది బహుశా నేనొక్కడినే. నాకు అదేమీ అవమానంగా అనిపించేది కూడా‌ కాదు, ఎందుకంటే మా నాన్న అసలు చెప్పులే లేకుండా‌ తిరిగేవాడు, ఒకవేళ ఎప్పుడైనా వేసుకున్నా ఊర్లో చెప్పులు కుట్టే అతని దగ్గర కుట్టించిన గట్టి తోలుచెప్పులే.


నా మెడిసిన్ పూర్తి కావచ్చింది… హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడు, ఒక‌ ఫ్రొఫెసర్ కి నా కష్టపడే తత్వం, చదువు పట్ల ఉన్న శ్రద్ధ నచ్చాయి, ఆయనదీ, మాదీ ఒకే కులం. ఒకరోజు ఆయన వాళ్ల ఇంటికి ఆహ్వానించాడు. ఆ పిలవటం వెనకాల, వాళ్ళ కుటుంబ సభ్యులకు నన్ను పరిచయం చేయాలనే ఉద్దేశ్యం ఉందని నాకు తెలియదు. అతని భార్యకూ, కూతురికీ నన్ను పరిచయం చేసాడు. వారిని చూస్తే ఎంతో ఆధునికంగా, మాకన్నా ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని తెలుస్తోంది… జీవితం అంటే, విలువైన వస్తువులూ, నగలూ, సౌకర్యాలూ అమర్చుకోవటం, తరచూ రెస్టారెంట్లకూ, వెకేషన్స్ కోసం మంచి ప్రదేశాలకు వెళ్లడం, వెరసి విలాసవంతమైన జీవితం అనుభవించటంలోనే సంతోషం ఉంటుందనుకునే మనస్తత్వం వారిది. ఆ తరువాత కొన్నాళ్లకి ఆయన, మా ఊరికి వెళ్లి నాన్నను కలిసి, నాకు తన కూతురినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానని, ఆ పెళ్లి వలన నాకు మంచి జీవితం లభిస్తుందని చెప్పాడు… నాన్నకూ, మా పొరుగువారికీ‌ కూడా ఆ మాట నిజమనిపించింది, నా అదృష్టానికి మురిసిపోయారు.

మా నాన్న నన్ను ఇంటికి రమ్మని కబురు చేసాడు. అక్కడికి వెళ్లాక, మా బంధువులూ, పొరుగిళ్ల వాళ్లూ, "నేను మా ప్రొఫెసర్ గారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని" చెప్పారు. మా నాన్న మాత్రం కాసేపు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు… చివరికి "మా అబ్బాయికి ఏది సరైనదో అదే చేయవచ్చు, నేను చెప్పేదేమీ లేదు" అన్నాడు. నేను 'నిజంగా ఆమెను పెళ్లి చేసుకుంటే నాకు మంచి జరుగుతుందా? అసలు నేను ఆమెకు నచ్చిన జీవితం ఇవ్వగలనా?' అనే సందిగ్ధంలో ఉండిపోయాను. 


నా డాక్టర్ డిగ్రీ చూసి చాలామంది గొప్పగా అనుకుంటున్నారు కానీ నా బతుకేమిటో నాకు తెలుసు. నాకొచ్చే స్టైఫండ్ నా కనీస అవసరాలకు మాత్రమే సరిపోతుంది, అలాంటప్పుడు పెళ్లి చేసుకుని భార్యను పోషించాలంటే, అదీ ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని పోషించటం నాకు సాధ్యమేనా? మావాళ్లందరి మాటల్లో "ఒక అమ్మాయి తన భాగ్యాన్ని తనే వెంటపెట్టుకుని వస్తుంది… జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లుగా ఉండవు, కొన్ని కొన్ని విధి నిర్ణయాన్ననుసరించి జరుగుతాయి, అంతే" అన్నారు.


మొత్తానికి నా చేత "సరే" అనిపించారు. నా నిశ్చితార్థానికి మా నాన్న ఒక ముతక ధోవతి, తెల్ల‌చొక్కా, పై తుండు వేసుకుని వచ్చాడు.. అవే తోలు చెప్పులు. నా కాబోయే మామగారి స్నేహితులంతా డాక్టర్లు, పెద్ద ఉద్యోగస్తులు, వారందరినీ‌ చూసాక నాన్నకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది… చిరునవ్వు మినహా మాటలే లేవు. ఫంక్షన్ పూర్తవగానే నాన్న నన్ను ఆశీర్వదించి ఊరికి వెళ్ళిపోయాడు.


నిశ్చితార్థమయితే జరిగింది కానీ రేపు పెళ్లయ్యాక, నా భార్యను ఎక్కడికి తీసుకువెళ్లాలనే ప్రశ్న నా మనసులో తలెత్తింది.. నాకు ఉద్యోగం దొరికిన తరువాత,  అక్కడ ఇల్లు తీసుకొని ఉండచ్చు, కానీ అప్పటివరకూ ఎలా? ఊర్లో ఉన్న మా స్వంత ఇల్లు చాలావరకూ పాడయిపోయింది. అసలా ఇల్లెంతని? ఒక చిన్న హాలు, వంటగది, మరో రెండు గదులూ… వాటిలో ఒక గది నిండా వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పురుగుమందులూ, విత్తనాల వంటివి ఉంటాయి. మరొక గదిలో రెండు కాటన్ పరుపులూ, కొంత వంటింటి సామాను ఉంటాయి. బాత్రూమ్ ఉంది కానీ పేరుకే, దానిలో పట్నాల్లో ఉండే సౌకర్యాలేవీ ఉండవు. నాన్న కాలకృత్యాల కోసం ఉదయాన్నే దూరంగా పొలాల్లోకి వెళ్లిపోతాడు, వస్తూ వస్తూ పంట బోర్ల దగ్గరే స్నానం చేసి వస్తాడు. మా ఇద్దరికీ అన్నం, ఏదో ఒక పప్పు చేసేవాడు… తాజా కూరగాయలు కనుక‌ మామూలుగా వండినా, చాలా  రుచిగా అనిపించేవి. ఇంట్లో ఒక గేదె ఉంది... పాలు, పెరుగూ, నెయ్యి మా అవసరాలకు సరిపడా వచ్చేవి. అవే‌ కాక‌ కోళ్లు కూడా ఉండేవి, ఎప్పుడైనా‌ చికెన్, గుడ్లు వండుకునే వాళ్లం… కానీ అవి ఏవి పడితే అవి తింటాయని గమనించిన నాన్నకు, చికెన్ తినడం నచ్చేది కాదు. ఎప్పుడైనా మటన్ మాత్రం తినేవాడు. అది  ఇంట్లో వండాలంటే పనీ, ఖర్చూ కూడా ఎక్కువే కనుక ఎప్పుడైనా పార్టీల్లోనే తినేవాళ్లం.


ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నాతో, ఒక పట్నంలో పెరిగిన అమ్మాయి, కనీసం డైనింగ్ టేబుల్ కూడా లేని ఇంట్లో ఎలా సర్దుకోగలదు అని నా భయం. 


పెళ్లి మరో రెండువారాలుందనగా, మా కాబోయే అత్తగారు ఫోన్ చేసి "బాబూ! మా అమ్మాయి పూజ పెరిగిన జీవన విధానం వేరు, మీ ఇంట్లో తను సర్దుకోలేదేమో అనిపిస్తోంది. ఎటూ మీరు ఏదైనా ఉద్యోగంలో చేరాలంటే ఇక్కడే సిటీలో ఉండాలి కదా! పూజ చిన్నప్పుడు తన పేరు మీద ఒక ఫ్లాట్ కొన్నాం, అదిప్పుడు ఖాళీ అయింది.. ఇప్పుడు ఆ ఇల్లు బాగు చేయించి, కలర్స్ వేయించి, కొత్త ఫర్నిచర్ అమర్చి మీకు ఇవ్వాలనుకుంటున్నాం" అని చెప్పేసరికి నాకూ అదే మంచిదనిపించింది.


ఊరికి వెళ్లినప్పుడు ఈ సంగతి మా నాన్నతో చెప్తే ఆయన ఎప్పట్లానే "నీకు మంచిగనిపిస్తే చాలు" అన్నాడు.


ఆ రోజు రాత్రి ఎందుకో? అమ్మను‌ తలుచుకుని బాగా ఏడ్చాను. నాన్న నన్ను కాలేజికి పంపించకుండా ఉంటే బాగుండేదనిపించింది. ఆయనలాగా నేనూ వ్యవసాయం చేసుకుంటే, నా భార్య‌ కూడా మాతోపాటు ఇక్కడ ఉండి, మాకు వండిపెడుతూ, నాన్నను ఈ వయసులో జాగ్రత్తగా‌ చూసుకునేదేమో! ఇప్పుడు నాన్న ఆరోగ్యం బాలేదు, ఎప్పుడైనా తన గురించి శ్రద్ధ తీసుకుంటేగా? ఒక కంటి సమస్యకు కాని, ఫిజీషియన్ కానీ, సుగర్ కి కానీ ఏ డాక్టర్నీ కలవలేదు. తన విషయాలన్నీ కర్మ కొదిలేసి, నన్ను మాత్రం డాక్టర్ని చేసాడు. నేను ఆయన కోసం కొడుకుగా ఏం చేస్తున్నాను? 'భౌతికమైన వస్తువులూ, సుఖాలే జీవితమా? అసలు నా చదువే ఓ కొలిక్కి రాలేదు. ఈ రోజుల్లో ఉట్టి ఎమ్ బి బి ఎస్ సరిపోదు, రేపు నా భార్య, మామగారు నన్ను ఎవరికైనా పరిచయం చేయాలన్నా‌ చాలా చిన్నతనంగా భావిస్తారు. సమాజంలో సరైన గౌరవమూ, మంచి ప్రాక్టీస్ కావాలంటే నేను ఎమ్ డీ లేదా ఎమ్ ఎస్ చేయాలి. మా మామగారి సహకారం లేనిదే నేను ఇవేవీ సాధించలేను. 


నా ఆప్తమిత్రుడొకడు ఇంటర్, బిఏ అతి మామూలుగా చదివి పాసయి, తరువాత‌ ఎడ్వొకేట్ అయ్యాడు. ఇప్పుడు ఊళ్లోనే తల్లితండ్రులతో కలిసి ఉంటూ, తాలూకా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న  కోర్టుకు వెళ్లి వస్తూ ఉంటాడు. పొలాలు కూడా చూసుకోగలుగుతున్నాడు. మరొక స్నేహితుడు కూడా, స్కూల్ అసిస్టెంట్ గా చేస్తూ, తల్లితండ్రులతో కలిసి హాయిగా ఊళ్లోనే ఉంటున్నాడు. వాళ్ల జీవన విధానాన్ని కానీ, తల్లితండ్రులను కానీ వదులుకునే అవసరం లేకుండా, సంతోషంగా ఉంటున్నారు… మరి నేనేంటి, ఎమ్ బి బి ఎస్ లాంటి గొప్ప చదువు చదివీ, ఇంత బాధ పడుతున్నాను?


నా ప్రశ్నలకు జవాబులు దొరికేవరకూ కాలమాగదు కదా! అనుకున్న సమయానికి నా పెళ్లి పూజాతో జరిగిపోయింది… మా మామగారు వాళ్లు ఇచ్చిన ఫ్లాట్ లో ఉంటూ, వాళ్ల సపోర్ట్ తో నా చదువు కొనసాగించాను.

మా నాన్న ఊళ్లోనే ఉన్నాడు. నా పెళ్లయిన తరువాత మరీ ఒంటరి వాడయిపోయాడు. ఒకసారి నేనొక్కడినే ఆయన్ను చూడటానికి వెళ్లినప్పుడు నా దగ్గరకు రమ్మని అడిగాను… రెండు మోకాలి చిప్పలూ అరిగిపోయాయి, కర్ర సహాయంతో నడుస్తున్నాడు..షుగర్, బీపీ కూడా బాగా పెరిగాయి. వైద్యం చేయిస్తాను నాతో రమ్మని పిలిస్తే, ఆయన ఒప్పుకోలేదు. చేసేది లేక మందులు కొనిచ్చి, "ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొమ్మని‌‌ చెప్తే" ఎప్పట్లాగే ఓ నవ్వు నవ్వాడంతే. డబ్బులు తీసి ఇవ్వబోతే, వద్దన్నాడు. పొలానికి వెళ్లటం మానేసి ఒక చెట్టు కింద, కూరగాయలు పెట్టుకుని అమ్ముతున్నాడు… ఇతర కూరగాయల వ్యాపారస్తులు కూడా వాళ్ల కూరగాయలు నాన్ననే అమ్మి పెట్టమనేవారు. సాయంకాలం వచ్చి ఎవరి వాటా డబ్బులు వారు తీసుకునే వారు. నాన్నకూ తిండికీ, బట్టకూ లోటు లేకుండా జరిగిపోతోంది కనుక సంతోషంగానే ఉన్నాడు. ఆయనకొచ్చే వృద్ధాప్య పింఛన్ తో అవసరమైన సరుకులూ, వంట గాస్ లాంటి అవసరాలు తీరుతున్నాయి.


నా మనసులో మాత్రం మా నాన్నను దగ్గరుండి చూసుకోలేక పోతున్నాననే బాధ తొలిచేస్తోంది. తన జీవితం అంతా నాకోసమే కష్టపడ్డాడు, ఎన్నో సుఖాలు వదులుకున్నాడు… ఇప్పటికీ, ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లో, తన వంట తనే చేసుకోవలసి వస్తోంది. నేనూ, నా భార్యా ఆయన కోసం ఏమీ చేయలేకపోతున్నాం. నా భార్యకైతే అసలా ఊరూ, మా ఇల్లూ ఏవీ నచ్చవు. నేను మాత్రం ఆయన్నలా వదిలేయలేకపోతున్నాను.


క్రిందటి రోజు సాయంత్రం, నాన్నకు బాగాలేదని కబురు తెలిసి మా ఊరికి వెళ్లాను. రాత్రికి మా పొరుగింటి వాళ్లు అన్నమూ, కూరలూ తెచ్చి ఇచ్చారు. నాన్న మొహంలో నేను వచ్చానన్న సంతోషం కనపడింది. ఇద్దరమూ కలిసి భోజనం చేసాము. కొంతసేపటి తరువాత నా ఎడ్వొకేట్ మిత్రుడు వచ్చి, "మేజిస్ట్రేట్ అయ్యానని" శుభవార్త చెప్పాడు. చాలా సంతోషం వేసింది. ఊరివారందరూ కూడా అతడిని గౌరవంగా చూస్తున్నారు.. అతని తల్లితండ్రులు కొడుకు ఎదుగుదల చూసి  గర్వపడుతున్నారు. వాడు ఒకప్పుడు చదువు మీద‌ శ్రద్ధ లేకుండా ఆకతాయిగా తిరిగేవాడు, ఎలానో ఎల్ ఎల్ బీ పూర్తి చేసాడు… ఇప్పుడు మేజిస్ట్రేట్ అయినా, రేప్పొద్దున్న సెషన్స్ కోర్టుకీ, ఆ పైన హైకోర్టుకీ, చివరికి సుప్రీంకోర్టు జడ్డ్ కావాలన్నా అతని ఎల్ ఎల్ బీ అర్హత సరిపోతుంది. కానీ ఎమ్ బి బి ఎస్ అలా కాదు… నేను ఈ ఊరిలో చిన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నడపాలన్నా, ఏదో ఒక స్పెషలైజేషన్ ఉండాలి... అంతేకాదు ఎన్నో వస్తువులు సమకూర్చుకోవాలి. ఈ విద్యా విధానంలోనే ఏదో తేడా ఉంది. ఒక ఎమ్ బి బి ఎస్ డాక్టర్ పూర్తి స్థాయి సర్జరీలు చేసే వీలు లేనప్పుడు,  ఆ కోర్సులో ముందస్తుగా సర్జరీలు ఎందుకు నేర్పుతారు? రేపు నేను స్వంత ప్రాక్టీస్ పెట్టాలంటే, సిటీల్లో ఉండే పెద్ద ఆస్పత్రుల మీద ఆధారపడి, వాళ్ల కింద కమీషన్ ఏజంట్ లా పనిచేయాలి. నాకు చాలా దుఃఖంగా అనిపించింది. రాత్రి నాన్న పక్కన పడుకున్నప్పుడు, నాకు పన్నెండేళ్ల వయసులో, నాన్నను హత్తుకుని పడుకున్నట్లుగా అనిపించింది. నాన్న ఏడుస్తున్నాడని తెలుస్తోంది. ఆ క్షణంలో నేను నిర్ణయించుకున్నాను, నాన్నతోనే ఇక్కడే, ఉండిపోవాలని… బహుశా నేను పేరాసెటమాల్, యాంటిబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేసుకుంటూ, సాధారణ డాక్టర్ గా ఉండిపోతాను, అయినా పరవాలేదు... మేము కలిసి ఉన్నప్పుడు కూడా నా భార్య‌ సంతోషంగా ఏమీ లేదు… ఆమె దృష్టిలో నేను ఒక పల్లెటూరి బైతుని, నాగరికత, ఆధునికత తెలియని వాడిని.


ఇక ఈ మానసిక‌ సంఘర్షణ నుంచీ బయట పడటానికి ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను నా భార్యతో విడిపోయి ఈ పల్లెలోనే ఉండిపోతాను 'కలిసొచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్నాను' అనుకున్నా సరే. 

ఈ భౌతిక సుఖాలు శాశ్వతమని భావించి ఉంటే సిద్ధార్థుడు ఏనాటికీ బుద్ధుడిగా మారేవాడే కాదు. నా కనుల ముందు నిజమైన వెలుగు ఇప్పుడు కనిపిస్తోంది.


🌷🌷🌷🌷🌷🌷🌷


ఆంగ్ల రచన by Sri Prabhakar Dhoopati

FICTION

12 April 2021


స్వేచ్ఛానువాదం: రత్నశ్రీ వఠెం