24, ఏప్రిల్ 2021, శనివారం

చక్కటి భావ వ్యక్తీకరణ.

 శ్రీ మీఱం దన పెండ్లి వేళ నొడలం , జెన్నారు భూషామణి

స్తోమంబుం బొడగాంచి శైలసుతచే,తో వీథి గంపింపద

ద్భామా రత్నము కొప్పు బర్హమని యప్పాముల్డలల్వంపన

త్యామోదంబున నవ్వు శంభుడిడు మా కశ్రాంత సౌఖ్యోన్నతుల్


యీ పద్యము కూచిమంచి తిమ్మకవి విరచిత రసికజనమనోభిరామము అను కావ్యము  నుండి గైకొనబడినది.


భావం: 


పెండ్లి సమయములో ఈశ్వరుని ఒంటి మీద ఉన్న ఆభరణాలంకారములను గాంచి పార్వతి దేవి మనస్సు కంపింపగా ఆ కంపనకు తన కొప్పులు వీడిపోయి  నెమలి పింఛము  వోలే ఈశ్వరుని ఒంటిపై వున్న ఆభరణములోని పాములకు కనిపించగా అవి భయపడడం చూసి ఆ పరమేశ్వరుడు ఆనందభరితుడయ్యెనని భావం.


ఎంతటి చక్కటి భావ వ్యక్తీకరణ.

కామెంట్‌లు లేవు: