2, ఏప్రిల్ 2022, శనివారం

ఉగాది పండుగ శుభాకాంక్షలు

 శుభం...


తెలుగు ప్రాంత ముంగిటన

మేలుకొల్పేను సూర్యోదయ

శ్రీ శుభకృతు సంవత్సర

నవ కాంతులు రాక తోడ..


గడచిన తంతు జ్ఞాపకం

కదిలేను నవ గమనం

ఆశా జనకపు పయనం

భావ వీచికల సమయం.


షడ్రచులతో సమ్మేళనం

జీవన సాగర మధనం

పాత జ్ఞాపకాల పదిలం

భవష్యత్ సుఖమయం.


ఆరోగ్యం అంత్యంత శ్రేయం

గౌరవ,అవమాన తూకం

లక్ష్మీ కటాక్షం మేలుకరం

యశస్సు జేయును కీర్తనం.


వసంతపు కాల తరుణం

ధరణి పర్చు పచ్చదనం

చిగురేయు మానుకు జీవం

లోకానికి కల్గును శుభం.


ఉగాది పండుగ శుభాకాంక్షలు.


అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

9391456575.

 శ్రీరస్తు!


శుభకృత నామ సంవత్సరంలో మీ ఇంట కొత్త వెలుగులు నిండాలనీ, అష్టఐశ్వరాలు మీ సొంతం కావాలని ఆకాంక్షిస్తు మీకు మీ కుటుంబ సభ్యులకు


శ్రీ శుభకృత నామ సంవత్సర


ఉగాది


శుభాకాంక్షలు


బంధుమిత్రులందఱికీ...


హృదయపూర్వకంగా "మీ .శ్రీశర్మద


శ్రీలను చాల నిచ్చుత! సుచేలము లిచ్చుత! భాగ్యమిచ్చుతన్! ప్రాలు సమృద్ధి నిచ్చుతయు! భాషలు భూషలు సౌఖ్య మిచ్చుతన్! వేళకు తగ్గ బుద్ది సుమపేశల మానస మిచ్చు హెచ్చుగన్! కీలిత శ్రీలదాత శుభకృత్ హిత వత్సర మిచ్చు తేజమున్!


శుభమస్తు!

శుభాకాంక్షలు

 ప్రభ నింపుచు జగములకును

'శుభకృతు' వర్షమ్ము వచ్చె శోభన మిడుచు

న్నిభవరదుడు సర్వేశుడు

నభయము తా నిచ్చు గాక యనయము మీకున్


తమకు 

తమ కుటుంబము నకు శుభకృతు

ఉగాది శుభాకాంక్షలు.. వందనములు 🙏


జ్ఞానమనెడు

 🕉️🕉️ *సుభాషితమ్* 🕉️🕉️

--------------------------------------------


శ్లోకం:

*మనోధావతి సర్వత్ర మదోన్మత్త గజేంద్రవత్ l*

*జ్ఞానాంకుశ సమాబుద్ధిస్తస్య నిశ్చలతే మనః ll*

                 ~సుభాషితరత్నావళి


తాత్పర్యం:

మదముచే మదించిన ఏనుగు వలె మనస్సు పరి పరి విధముల పరుగెత్తును. జ్ఞానమనెడు అంకుశముతో సమానమగు బుద్ధియే ఆ మనస్సును నిశ్చలము చేయగలదు.


కాలం*

 *ॐ    శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు* 


*కాలం*  


"కాలః కలయతామహం" - "కాలములో కూడిక నేను" అంటారు పరమాత్మ. 

    మన 

  - మనస్సుతో చేసే ప్రతి ఆలోచన, 

  - నోటితో పలికే ప్రతి మాట, 

  - శరీరాంగాలతో చేసే ప్రతి పనీ లెక్కించబడుతూంటుంది. 


ఉదా॥ 

    హిరణ్యకశిపుని చర్యలన్నీ లెక్కించబడ్డాయి. 

    ప్రహ్లాదునివీ లెక్కించబడ్డాయి. 

    ఇవి విడివిడిగా కూడబడి కాలంలో ఎవరి ఫలాలు వారికి  అందించబడ్డాయి. 

         

    ఎక్కడెక్కడవి - ఎవరెవరితో - ఎప్పుడెప్పుడు - ఏఏ విధంగా కలపాలో సంకల్పించి నిర్ణయించేది  "కాలములో కూడిక" అయిన పరమాత్మయే. 


*కాలం - మనం*


మనం 

  - భూతకాలానికి తిరిగి వెళ్ళలేము. 

  - భవిష్యత్కాలము తెలియదు. 

  - కేవలం వర్తమానంలోనే జీవించగలం. 


*కాలం - పరమాత్మ* 


    పరమాత్మ కాలానికి అతీతుడు. 

    కాలాన్ని అధీనంలో ఉంచుకున్నవాడు. 

    ఆయన కాలస్వరూపుడు కూడా. 


*కాలం - కొలబద్దలు* 


    ఆ కాలాన్ని మనం అనేక మానాలలో కొలుస్తాము. 

    సౌర - చాంద్ర - బార్హస్పత్య - నక్షత్ర - హవన మొదలైనవి భారతీయ కాలమానాలు. 

    అందులో చాంద్రమానాన్ని మనం పాటిస్తాం. 

    ఆ చాంద్రమాన సంవత్సరాదే యుగాది. 


*ఉగాది - యుగాది* 


     యుగాది అంటే యుగానికి ఆది అని అర్థం. 

     ఉగము అంటే సంవత్సరమనే అర్థంలో "ఉగాది" అంటే "సంవత్సరాది" అని అర్థం. 

 

*సంవత్సర - జలస్థానాలు* 


    కాలాన్ని సంవత్సరాలలో కొలుస్తాం. ప్రవాహంతో పోలుస్తాం. 

    ఇక్కడ విశేషం ఏమిటంటే, 

    "సంవత్సరోవా  అపామాయతనం ----" 

    సంవత్సర స్థానమే జలముది. 

    జల స్థానమే సంవత్సరముది. 

    పరస్పరం సంవత్సర(కాల) జల(నారాయణ) స్థానాలు ఒకటే. 

      అదే పరమాత్మ కాలస్వరూపుడని తెలుపుతోంది. 


*శుభాకాంక్ష*  


    కాబట్టి భగవంతుని స్వరూపమైన కాలంయొక్క ప్రమాణంలో, 

    ఈ శుభకృత్ నామ సంవత్సరం అందరి 

  - మనస్సులూ 

  - వాక్కులూ 

  - చేతలూ దైవానుగ్రహంతో త్రికరణ శుద్ధిగా అందఱికీ సుఖశాంతులను ఇచ్చి ఆనందపరచుగాక! అని సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సమేత శ్రీరామచంద్రస్వామిని ప్రార్థిస్తూ 

      అందఱికీ మరొకసారి శుభాకాంక్షలు. 


  - బట్టేలంక శ్రీశ్రీశ్రీ కృష్ణానంద స్వామిచే వి.హిం.ప. పెద్దల సమక్షంలో "రామాయణం శర్మ"గా ప్రారంభించబడి, దాదాపుగా మూడు దశాబ్దాలుగా అందఱిచేతా ఆ పేరుతో పిలువబడుతున్న 


    బొడ్డపాటి శ్రీరామ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ 

                       భద్రాచలం

యౌవనం

 శుభోదయమ్-సుభాషితమ్||-_ ॐ卐*💎

శ్లో𝕝𝕝 వసంత యౌవనా వృక్షాః

పురుషా ధన యౌవనాః|

సౌభాగ్య యౌవనా నార్యో

యువానో బుద్ధి యౌవనాః||

*--- నీతి శాస్త్రం ---*

తా𝕝𝕝 *వృక్షములకు వసంత కాలమే యౌవనం*..... 

*పురుషులకు ధనమే యౌవనం*..... 

*స్త్రీలకు సౌభాగ్యమే యౌవనం*.... 

*ఉత్తములకు బుద్ధియే యౌవనం*....

*చైత్ర మాసం విశిష్టత*




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



*చైత్ర మాసం విశిష్టత*


*“ఋతూనాం కుసుమాకరాం”* అని భగవానుడు స్వయంగా తానే వసంతఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి ఉగాది , శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు , దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం , యజ్ఞ వరాహమూర్తి జయంతి , సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక , అనేక ఆధ్యాత్మిక , పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.


చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది.

ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది. చెట్లూ , చేమలే కాదు , పశుపక్ష్యాదులు కూడా వసంతాగమనాన్ని స్వాగతిస్తాయి. సంవత్సరమునకు యుగము అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది , ఉగాది అయింది. చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక , సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుండీ సంవత్సరాదిని జరుపుకుంటారు. ఉగాది నాడు కొన్ని పనులను చేయాలని పెద్దలు చెప్పారు. అవి ఏమిటంటే , ఉగాది నాడు తైలాభ్యంగన స్నానం చేసి , నూతన వస్త్రాలు ధరించాలి. ప్రతీ గృహమునందు ధ్వజారోహణం , లేదా జయకేతనం ఎగురవేయాలి. సృష్టి మొదలు అయిన రోజున (యుగాది) సృష్టిని చేసిన బ్రహ్మగారిని పూజించాలి. ఉగాది నాడు షడ్రుచులతో కూడిన పచ్చడిసేవనం(నింబకుసుమ భక్షణం), పంచాంగ శ్రవణం , తెలుగు వారికే ప్రత్యేకమైన అవధానం , వంటివి పండుగకే శోభనిస్తాయి.


ఉగాది పచ్చడి సేవనం వెనుక అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వేపపువ్వు , కొత్త బెల్లం , కొత్త చింతపండు , మామిడి , చెరకు వంటివాటితో చేసిన పచ్చడిని తినటంవల్ల ప్రకృతిలో వచ్చే మార్పులకు మన శరీరం సిద్ధపడుతుంది. వేపపువ్వు , బెల్లం ఈనాటినుండీ పదిహేనురోజుల పాటు రోజూ ఉదయాన్నే స్వీకరించడం వల్ల ఆరోగ్యం చక్కబడుతుంది.


పంచాంగ శ్రవణం – పంచాంగాన్ని పూజించి , తిథి , వార , నక్షత్ర , యోగం , కరణాలతో కూడిన పంచాంగాన్ని చదివి , విని , రాబోయే సంవత్సరంలో గ్రహాల గతుల ఆధారంగా ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయో తెలుసుకుని , తదనుగుణంగా తమ నిర్ణయాలను తీసుకోవడం , శుభ ఫలితాల కోసం భగవంతుని పూజించడం వంటివి చేస్తారు. ఇక కవిసమ్మేళనాలు , అవధానాలు , సాంస్కృతిక కార్యక్రమాలతో కాలాన్ని ఆనందంగా గడుపుతారు.


చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి వరకూ వసంత నవరాత్రులు

సంవత్సరంలో మనం మూడు సార్లు నవరాత్రులు జరుపుకుంటాము. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు , రెండవది భాద్రపదమాసంలో వచ్చే గణపతి నవరాత్రులు , మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులూ రామాయణాన్ని పారాయణ చేసి , నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి , చూసి తరిస్తారు. రామాయణానికి ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం వుంది. రామాయణం లోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి. రాముడు జన్మించినది మొదలు , వనవాసానికి వెళ్ళటం , దశరథుని మరణం , సీతాపహరణం , రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం , శ్రీరామపట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి. 


చైత్ర శుద్ధ విదియ నాడు బాలచంద్రుడిని బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలుపోగు అని విదియ నాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగు అని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకీ నూలుపోగు సమర్పించి , మనకి జ్ఞానాన్నిమ్మని కోరుతారు.


చైత్ర శుద్ధ తదియ – డోలాగౌరీ వ్రతం(సౌభాగ్య గౌరీ వ్రతం), సౌభాగ్య శయన వ్రతం , ఆ రోజున పార్వతీపరమేశ్వరులను దమనంతో పూజించి , డోలోత్సవం నిర్వహిస్తారు. చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవం చేస్తారు. పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందటం కోసం తపస్సు చేసినప్పుడు , చైత్ర శుద్ధ తదియ నాడు ఆ తపస్సు ఫలించింది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. సౌభాగ్యాన్ని , పుత్రపౌత్రాదులను , భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈ రోజు మత్స్య జయంతి కూడా. – శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి , వేదాలను రక్షించిన రోజు.


చైత్ర శుద్ధ పంచమి – లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈ రోజు 

పూజించాలి. అనంత , వాసుకి , తక్షక , కర్కోటక , శంఖ , కుళిక , పద్మ , మహాపద్మ అనే మహానాగులను పూజించి , పాలు , నెయ్యి నివేదించాలి.

అశ్వములను కూడా ఈ రోజు పూజించాలి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవావతారం కూడా ఒకటి. ఈ రోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు. శ్రీరామ పట్టాభిషేకము చేయించిన మంచిది. ఒకవేళ చేయలేకపోయినా , శ్రీరామాయణంలో రామపట్టాభిషేకము ఘట్టము పారాయణము చేయడం మంచిది.


చైత్ర శుద్ధ అష్టమి – భవానిదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు. ఆరోజు భవాని మాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి , అశోకవృక్షం చిగురుని సేవిస్తే గర్భ శోకం కలుగదు అని శాస్త్రము చెప్పింది.


చైత్ర శుద్ధ నవమి – శ్రీరామనవమి . శ్రీమహావిష్ణువు తన పూర్ణావతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు. ఈ రోజు ఊరూరా , వాడవాడలా శ్రీసీతారాముల కళ్యాణం చేస్తారు. నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విళంబినామ సంవత్సరం.


చైత్ర శుద్ధ ఏకాదశి – వరూధిన్యేకాదశి , కామద ఏకాదశి అని అంటారు.


చైత్ర శుద్ధ పౌర్ణమి – స్త్రీలు చిత్రవర్ణాలు గల (రక రకాల రంగులు) వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈ రోజు చిత్రగుప్తుని వ్రతం చేసిన మంచిది. ఉత్తర భారతదేశంలోని వారు హనుమజ్జయంతిని జరుపుకుంటారు.


చైత్ర బహుళ త్రయోదశి – యజ్ఞవరాహ జయంతి. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు.

ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు , ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్ర మాసం. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు. మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకుని , రామాయణ సారాన్ని గ్రహించి , సీతారాముల కళ్యాణం చూసి తరించి , సనాతన ధర్మాచరణకై పాటుపడదాము.

సనాతన ధర్మం

 హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. జన్మం మీద కాదు. 


(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 


1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.


2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.


3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..


4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.


5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 


6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.


7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. 


వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 


8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.


9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.


ఇంకా ..


1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.


2.  ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)


3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.


ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు


1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.


2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..


3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 


4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.


5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.


6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)


7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది  ( విష్ణుపురాణం 4.1.13). 


8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).


9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).


10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.


*ఈ సందేశాన్ని కూడా మీ బంధువులకు స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి*


*తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టాన్ని వారికి అందించటంలో సహాయపడండి*

ఇదే మన సనాతన ధర్మం యెుక్క గోప్పతనం🙏🏻🌷💐💐

శ్రీ అంబా పంచరత్న స్తోత్రమ్*

 *శ్రీ ఆది శంకరాచార్య విరచితం శ్రీ అంబా పంచరత్న స్తోత్రమ్*

🕉🕉️ *శ్రీమాత్రే నమః* 🕉️🕉️



*1) అంబా శంబరవైరితాత భగినీ శ్రీచంద్ర బింబాననా|*


*బింబోష్ఠీ స్మితభాషిణీ శుభకరీ కాదంబవాట్యాశ్రితా |*


*హ్రీంకారాక్షరమంత్రమధ్యసుభగా శ్రోణీనితంబాంకితా|*


*మామంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు ||* 




*2) కల్యాణీ కమనీయసుందరవపుః కాత్యాయనీ కాలికా|*


*కాలా శ్యామల మేచకద్యుతిమతీ కాదిత్రిపంచాక్షరీ |*


*కామాక్షీ కరుణానిధిః కలిమలారణ్యాతిదావానలా|*


*మామంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు ||* 




*3) కాంచీకంకణ హారకుండలవతీ కోటీకిరీటాన్వితా|*


*కందర్పద్యుతికోటికోటిసదనా పీయూష కుంభస్తనా |*


*కౌసుంభారుణకాంచనాంబరవృతా కైలాసవాసప్రియా|*


*మామంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు ||* 




*4) యా సా శుంభ నిశుంభ దైత్యశమనీ యా రక్తబీజాశనీ|*


*యా శ్రీ విష్ణు సరోజ నేత్రభవనా యా బ్రహ్మవిద్యాఽఽసనీ |*


*యా దేవీ మధుకైటభా సురరిపుర్యా మాహిష ధ్వంసినీ|*


*మామంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు ||*




*5) శ్రీవిద్యా పరదేవతాఽఽదిజననీ దుర్గా జయాచండికా|*


*బాలా శ్రీత్రిపురేశ్వరీ శివసతీ శ్రీరాజరాజేశ్వరీ |*


*శ్రీరాజ్ఞీ శివదూతికా శ్రుతినుతా శృంగార చూడామణిః|*


*మామంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు ||* 



*6) అంబాపంచక మద్భుతం పఠతి చేద్యో వా ప్రభాతేఽనిశం|*


*దివ్యైశ్వర్యశతాయురుత్తమమతిం విద్యాం శ్రియం శాశ్వతమ్ |*


*లబ్ధ్వా భూమితలే స్వధర్మనిరతాం శ్రీసుందరీం భామినీం|*


*అంతే స్వర్గఫలం లభేత్స విబుధైః సంస్తూయమానో నరః ||*



*ఇతి శ్రీ ఆది శంకరాచార్య విరచితం శ్రీ అంబా పంచరత్న స్తోత్రమ్ ||*


🕉🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

ఉగాది

 ఉగాది.


ఉర్వి పల్కు ఉషోదయము

మామిడి ఆకుల తోరణం

శుభకృత్ నామవత్సరం

తొలి పండుగ సంబరము.


తెలుగు ప్రాంత పర్వదినం

షడ్రుచుల జీవన సారం

ఉగాది పండుగ సమయం

కోయిల పాటల సంగీతం.


సంవత్సరాదిన పంచాంగం

భవిష్యత్ ఆశాజనకం

గతమంతా యుద్ద ప్రభావం

రాబోవు శాంతి ఆశా చిత్రం.


తెలుగు ప్రాంత వికాసము

మేలు హెచ్చుగా మేల్కొనుము

తెలుగు నాట నవోదయం

శుభకృత్ కాల గమనం.


ఉగాది పండుగ శుభాకాంక్షలతో...


అశోక్ చక్రవర్తి.నీలకంఠం.

బడంగపేట, తెలంగాణ.

9391456575.

ఆకలితో బాధపడే పరిస్తితి

 *_ఈ తీర్పును ఎలా తీసుకుందాం_*


అమెరికా దేశం లో .. 

ఓ పదిహేనేళ్ళ కుర్రవాడు ఓ షాప్ లో బ్రెడ్-బటర్ ప్యాకెట్ దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. కాపలాదారు పట్టుకున్నాడు. ఆ కుర్రవాడు వదిలించుకుని పారిపోయే క్రమంలో షాప్ కు సంబంధించిన షెల్ఫ్ పగిలిపోయింది. 

కుర్రవాన్ని న్యాయాధికారి ముందుకు ప్రవేశపెట్టారు. 

“నువ్వు బ్రెడ్-బటర్ ప్యాకెట్ దొంగిలిస్తూ పట్టుబడ్డావా?” ప్రశ్నించాడు జడ్జ్. 

“అవును” నేల చూపులు చూస్తూ చెప్పాడు కుర్రవాడు. 

“ఎందుకు?”

“అవసరం పడింది”

“కొనుక్కోవచ్చుగా”

“డబ్బులు లేవు”

“మీ ఇంట్లోంచి తెచ్చుకోవాల్సింది” అన్నాడు జడ్జ్. 

“ఇంట్లో అమ్మ ఒక్కతే  ఉంటుంది. ఏ పనీ చేయలేదు. జబ్బు మనిషి. ఈ బ్రెడ్-బటర్ ప్యాకెట్ ఆమె కోసమే” నిదానంగా చెప్పాడు. 

“నువ్వేం పనిచేయవా?

“కార్లు కడిగి ఏ రోజు కా రోజు డబ్బు సంపాదించేవాడిని. నిన్న అమ్మ ఆరోగ్యం అసలేమీ బాగా లేకపోతే ఆమెను చూసుకుంటూ ఇంట్లో ఉన్నందుకు పని లోంచి తీసేశారు.” బదులిచ్చాడు కుర్రవాడు. 

“ఎవరి సహాయమైనా తీసుకోకపోయావా” జడ్జ్ స్వరం లో జాలి కనిపించింది. 

“పొద్దున్నే ఇంట్లోంచి బయలుదేరి కనీసం ఓ యాభై మందిని సహాయం కోసం అర్థించాను. ఎవరూ కనికరించలేదు. చివరికి బ్రెడ్-బటర్ ప్యాకెట్ దొంగతనం చేయవలసి వచ్చింది. 

జడ్జ్ దీర్ఘంగా నిట్టూర్చాడు. తన తీర్పు వెల్లడించాడు. 

“కేవలం ఒక బ్రెడ్-బటర్ కోసం దొంగతనం చేయవలసి రావడం చాలా సిగ్గు పడాల్సిన నేరం. దీనికి ఆ కుర్రవాడు ఏమాత్రం బాధ్యుడు కాడు. ఈ కోర్టు లో ఉన్న నాతో సహా మిగిలినవారందరూ బాధ్యులే.. నేరస్తులే. అందుకే నాతో సహా ఈ కోర్టు లో ఉన్న ప్రతి ఒక్కరికీ తలా పది డాలర్ల చొప్పున జరిమానా చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరిస్తున్నాను. పది డాలర్లు చెల్లించకుండా ఎవరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు.”

జడ్జ్ తన తీర్పు చదవడం ఆపాడు. తన పర్స్ లోంచి పది డాలర్ల తీసి టేబల్ పై ఉంచాడు. మళ్ళీ తన తీర్పును కొనసాగించాడు.

“అంతేకాకుండా ఆకలితో ఉన్న కుర్రవాడి మీద కనీస దయ చూపకుండా పోలీసులకు పట్టించినందుకు షాప్ యాజమాన్యానికి వెయ్యి డాలర్ల జరిమానా విధిస్తున్నాను. ఇరవై నాలుగు గంటల్లో జరిమానా కోర్టు కు చెల్లించక పోతే షాప్ మూసివేసి తాళం వేయవలసిందిగా కోర్టు ఆదేశాలిస్తుంది.”

కోర్టు లో జరిమానా గా వసూలు చేసిన డబ్బును కుర్రవాడికి అందించారు. 

ఆకలితో బాధపడే పరిస్తితి కుర్రవాడికి కలిగించినందుకు సమాజాన్ని మన్నించవలసిందిగా అతడిని కోరుతూ తీర్పును ముగించాడు న్యాయాధికారి. 

ఈ తీర్పు విన్న కోర్టు లోని ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. కుర్రవాడు వెక్కి వెక్కి  ఏడుస్తూ జడ్జ్ వంక చూశాడు. ఆయన కూడా ఉబికి వచ్చే తన కన్నీటిని అదుపు చేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. 

మన సమాజం, వ్యవస్థ, కోర్టు లు ఈ తరహా తీర్పులకు /నిర్ణయాలకు సిద్ధంగా ఉన్నాయా???

“ఆకలి తో ఉన్న వ్యక్తి తిండికోసం దొంగతనానికి వొడిగడితే ఆ సమాజం, దేశం, ప్రజలు సిగ్గు పడాలి” అని చాణక్యుడు ఏనాడో చెప్పాడు. 

ఒకవేళ ఈ కథనం మీ హృదయాన్ని తాకి చెమరింప జేస్తే.. మరి కొందరికి కూడా పంచండి. 

-బాలగంగాధరరావు.



1, ఏప్రిల్ 2022, శుక్రవారం

ఉగాది

 *ఉగాది*

( - 02-04-2022 *శుభకృత్ నామ సంవత్సర* ఉగాది సందర్భంగా.....)

🍃🌿🍃🎋🌿🍃🎋🌿🍃🎋🌿🍃


*ఉగస్య ఆది ఉగాదిః*


🎋 *"ఉగ"* అనగా నక్షత్ర గమనం. *నక్షత్ర గమనానికి 'ఆది' 'ఉగాది',  అంటే సృష్టి ఆరంభమైన దినమే "ఉగాది".* 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము• ఉత్తరాయణ, దక్షిణాయనములు అనబడే *"ఆయన ద్వయ సంయుతం యుగం"* (సంవత్సరం) కాగా,  ఆ యుగానికి ఆది (సంవత్సరాది) *యుగాది* అయింది• యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది•


🎋 *తత్ర చైత్ర శుక్ల ప్రతిపది సంవత్సరారంభః:* 🎋


🎋 *చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది' గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు•*


🎋 *ఉగాది పుట్టుపూర్వోత్తరాలు* 🎋


🎋 వేదాలను హరించిన సోమకుని వధించి మత్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి•


🎋 చైత్రశుక్ల పాడ్యమి నాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను• కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచున్నదని కూడా చెప్పబడుచున్నది•


🎋 శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం•


🎋 *ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'•*


🎋 *"ఉగాది" ఆచరణ విధానం* 🎋


🎋 ఉగాది పర్వాచరణ విధానాన్ని 'ధర్మసింధు' కారులు *'పంచవిధుల సమన్వితం'* గా ఇలా సూచించియున్నారు•


*తైలాభ్యంగం సంకల్పాదవు నూతన వత్సర నామకీర్త నాద్యారంభం...*

*ప్రతిగృహం ధ్వజారోహణం, నింబపత్రాశనం వత్సరాది ఫలశ్రవణం...*


✅ *ఉగాది రోజున:*


👉 *తైలాభ్యంగనం* 

👉 *నూతన సంవత్సరాది స్తోత్రం* 

👉 *నింబకుసుమ భక్షణం* (ఉగాది పచ్చడి సేవనం)

👉 *ధ్వజారోహణం* (పూర్ణకుంభదానం)

👉 *పంచాంగ శ్రవణం* 


మున్నగు *'పంచకృత్య నిర్వహణ'* గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం•


🎋 *(1) తైలాభ్యంగనం:* 


🎋 *తైలాభ్యంగనం* అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి• ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి• కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసినట్లైతే లక్ష్మి, గంగా మాతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు•


*"అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం"*


(అభ్యంగన స్నానం అన్ని అవయవాలకూ పుష్టిదాయకం) అనే ఆయుర్వేదోక్తి దృష్ట్యా అభ్యంగనం ఆరోగ్యం కూడా• ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికి ఈబరీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది•


🎋  *(2) నూతన సంవత్సర స్తోత్రం* 🎋


🎋 అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి, పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది రసాయనాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను•


🎋  *(3) నింబకుసుమ భక్షణం* *(ఉగాడి పచ్చడి సేవనం* 


🎋 ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది•


🎋 వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడ్రుచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!


*అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌*

*భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌*


అని ధర్మ సింధుగ్రంధం చెబుతున్నది•


🎋 ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం• పలురుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! 


👌 *"తీపి వెనుక చేదు, పులుపూ ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు"•*  అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి•


🎋 అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం•


🎋  *(4) పూర్ణ కుంభదానం:* 


ఉగాది నాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజారోహణం• ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది•


*ఏష ధర్మఘటోదత్తో బ్రహ్మ విష్ణు శివాత్మకః*

*అస్య ప్రదవాత్సకలం మమః సంతు మనోరధాః*


🎋 యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం ఉంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానం ఇచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి•


🎋  *(5) పంచాంగ శ్రవణం* 


*"తిధిర్వారంచనక్షత్రం యోగః కరణమేవచ పంచాంగమ్‌"*


తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పంచాంగం•


🎋 ఉగాది నాడు దేవాలయంలో గాని, గ్రామకూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాంతుల సమక్షంలో కందాయఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది•


*"పంచాంగస్య ఫలం శృణ్వన్‌ గంగాస్నానఫలం ఖిలేత్"*


🎋 ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది•


*"సూర్యశ్శౌర్య మధేందురింద్రపదవీం"* 


🎋 అనే పంచాంగ శ్రవణ ఫలశృతి శ్లోకం ప్రకారం,  *ఉగాది నాడు పంచాంగశ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది•*


           ✡️ >>><♾🔘♾><<<🔯


 *శ్లో.* 


*శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ*

*సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం*


ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడి ని తీసుకోవాలి•


🎋 'బ్రహ్మ ప్రళయం' పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని 'బ్రహ్మకల్పం' అంటారు• ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయమును "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ 'ఉగాది' పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.


🎋 లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి• జీవునకు చైతన్యం కలిగించేది కాలం• ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి•


*తృట్యైనమః, నిమేషాయనమః, కాలాయనమః* 


🎋‌ అంటూ ప్రకృతిని, ప్రకృతికి కారణమైన శక్తిని ఆరాధిస్తాము• ఉగాదినాటి పంచాంగం పూజ, పంచాంగం శ్రవణం కాలస్వరూప నామార్చనకు ప్రతీకం• పంచాంగ పూజ, దేవి పూజ సదృశమైంది• అంతం, ముసలితనం, మరణం లేనిది కాలస్వరూపం• అదే దేవిస్వరూపం• అందుకే పంచాంగం పూజ, పంచాంగ శ్రవణం, దేవిపూజ ఫలాన్ని ప్రసాదిస్తుంది• విక్రమార్కుడు పట్టాభిషిక్తుడైన శుభదినం చైత్రశుద్ధపాడ్యమి. ఆనాడే విక్రమార్క శకం ప్రారంభమైంది•


🎋 శకులపై శాలివాహనులు సాధించిన ఘన విజయం ఉగాది పచ్చడిలోని తీపికి, యుద్ధంలో కలిగిన కష్టనష్టాలు చేదుకు, శత్రువులను తమలో ఒకరుగా కలుపుకోవడంలో వచ్చిన మంచి చెడ్డలు పులుపునకు చిహ్నంగా మన పూర్వీకులు భావించి స్వీకరించారు• ఈ మూడింటి కలయికకు గుర్తుగా ఆనవాలుగా విక్రమాదిత్యుని కాలంలో శాలివాహన శకారంభం నుండి ఉగాది పచ్చడి ఆస్వాదించడం ఆచారమైందని చారిత్రకుల నిర్ణయం•


🎋 ఈ పండగ ప్రత్యేకత 'ఉగాది పచ్చడి'. ఈ పచ్చడిలో చేరే పదార్ధాలలో వేప పువ్వు ముఖ్యమైనది• బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడి ముక్కలు, కొన్ని ప్రాంతాలలో అరటిపళ్ళ గుజ్జు కూడా చేర్చి పచ్చడిగా తయారుచేస్తారు• తీపి, ఉప్పు, పులుపు, చేదు, వగరు, కారం అనే షడ్రుచుల సమ్మేళనంగా జీవితంలో కష్టసుఖాలు ఆనంద విషాదాలుగా కలగలిసి ఉంటాయని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరూ సేవిస్తారు• ఆరోగ్యానికి ఇది మంచిది• అంతేకాకుండా అంతర్గతంగా ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందని తెలుపుతోంది•


🎋 మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం•


🎋 ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి•


🎋 పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు•


🎋 మనకు తెలుగు సంవత్సరాలు *'ప్రభవ'* తో మొదలుపెట్టి *'అక్షయ'* నామ సంవత్సరము వరకు గల 60 సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి *'షష్టిపూర్తి'* ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.


🕉️ *పంచాంగ శ్రవణం* 🕉️


🎋 నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్‌ క్యాలెండరు" ను ఉపయోగిస్తూ వున్నా... శుభకార్యాలు, పూజాపునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి

"పంచాంగము" ను ఉపయోగించడం మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం• ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది• అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి• అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాధి విధుల్లో ఒకటి• ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము• కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి• ఇలా పూర్వం లభించేవికాదు• తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి• కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు•


🎋 ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం•


🎋 *"పంచాంగం"* అంటే అయిదు అంగములు అని అర్ధం. *తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం* అనేవి ఆ అయిదు అంగాలు. పాడ్యమి మొదలుకొని 15 తిధులు, 7వారాలు, అశ్వని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రములు, విష్కభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగములు, బవ మొదలుకొని కింస్తుఘ్నం వరకు, 11 కరణములు వున్నాయి. వీటన్నిటినీ తెలిపేదే "పంచాంగం".


🎋 పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం• పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు• అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు• సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవనాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.




🍃🍃🌿🌿🎋🎋🌿🌿🍃🍃🌿🎋

దేవాలయాల కమిటీల నిర్ణయంతో

 హిజాబ్ కోసం వాళ్ళు చేసిన రబస వాళ్ళ జిహా.దీల మెడకే ఉచ్చులా మారింది...

ఉడిపిలోని హిందూ దేవాలయాల దగ్గర వార్షిక జాతరల వద్ద ముస్లింస్  వ్యాపారం చేయరాదని దేవాలయాల కమిటీల నిర్ణయంతో ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయిన ముస్లిం వ్యాపారులు మార్చి 30 బుధవారం పెజావర్ మఠంలోని శ్రీరామ విట్టల సభావనంలో పెజావర్ మఠం అధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీని కలుసుకుని తమను దేవాలయాల వద్ద జరిగే జాతరలలో గతంలో లాగానే హిందూ జాతరలలో ఆలయాల దగ్గర వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతించాలని స్వామీజీని వేడుకున్నారు..

దీనిపై స్పందించిన పరమపూజ్య శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ సమాజంలో శాంతియుత జీవనానికి  అనుకూలమైన వాతావరణం ఉండాలంటే శాంతి మరియు సామరస్య సహజీవనం చాలా అవసరమని చెప్తూ.. ఈ శాంతి బాధ్యత కేవలం ఒక సమాజానికి భారం కాదని అలాగే  కేవలం ఒక సమాజం వల్ల శాంతిని సాధించలేమని అన్నారు..

హిందువులమైన మేము  చాలా కాలంగా బాధను, వేదననూ అనుభవించాము ఇంకా అనుభవిస్తున్నాము కూడా..

అనేక చేదు అనుభవాల కారణంగా హిందూ సమాజం వేదనలో కూరుకుపోతోంది..

ఇంత గంభీరమైన విషయాన్ని  కొంతమంది మత పెద్దల మధ్య పరస్పర చర్చలతో ఈ సమస్యను పరిష్కరించలేము.. 

అట్టడుగు స్థాయిలో శాశ్వత పరిష్కారం కనుగొనాలి.. 

ఒక మత సమూహం నిరంతరం అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు దానిలో  నిరాశ మరియు కోపం కట్టలు తెంచుకుంటుంది..తీవ్రమైన ఆవేదన చెందిన హిందూ సమాజం మీ యొక్క అన్యాయాలతో విసిగిపోయింది.. 

మనం వేదికపై కూర్చుని ఈ పరిస్థితికి కారణాలను చర్చించాలి.

హిందూ సమాజం నిరంతరం మతపరమైన వివక్ష మరియు హింసకు గురికాకుంటే మళ్లీ సామరస్యం నెలకొంటుందని ఆశ ఉంది..

మీవారు చేసిన ఒక దారుణాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను..

ఒక హిందూ వితంతువు పశువుల కొట్టంలోని ఆవులన్నీ దొంగిలించబడ్డాయి..చంపివేయబడ్డాయి ..ఆమె జీవనోపాధి ఛిన్నాభిన్నమైంది దానివలన ఆవిడ ఉపాధి కోల్పోయి వీధుల్లోకి నెట్టబడింది..అంతేకాదు ఆవిడ తాను పైకి చెప్పుకోలేని అవమానానికి గురైంది దీనికి కారణం మీ వర్గమే.. 

ఇటువంటి మరియు మరెన్నో క్రూరమైన సంఘటనలు హిందువులలో చాలా బాధను కలిగించాయి.. ఇటువంటి పరిస్తితిలో కేవలం మాటలు రూపంలో పైకి నటిస్తూ చెప్పే  శాంతి సహజీవనం మాటలతో ' శాంతిని సాధించలేము అలాగే సహజీవనం ' కూడా  సాధ్యం కాదు..

మీరు మనఃస్పూర్తిగా నోటితో చెప్పేది చేతలలో చూపిస్తే  మూడవ వ్యక్తి మధ్యవర్తిత్వం అవసరం లేదు..

మీరు చేసిన హిజాబ్ పోరాటం ఫలితంగా మాత్రమే ముస్లిం వ్యాపారుల ఆర్థిక బహిష్కరణ జరిగిందని భావించకండి..

హిందూ సమాజం పరమపావన స్థానాలుగా భావించే మఠాలు..దేవాలయాల దగ్గర మీరు హిజాబ్ కు అనుకూలంగా మీరు చేసే వ్యాపారాలు మూసివేశారు..దీనివలన హిందూ సమాజం మరింతగా కోపోద్రిక్తురాలయింది..దీనివలన మీకు జరిగిన నష్టంతో పోలిస్తే హిందూ సమాజం ఎదుర్కొన్న ఇబ్బందులే ఎక్కువ..

ఒక ధర్మనిష్ట కలిగిన హిందూ కార్యకర్తను కూడా హిందూ సమాజం కోల్పోయింది..

నిజానికి నేను మీకు ఇచ్చే సలహా!! మీరు ఏదైతే సమస్యను ఎదుర్కుంటున్నాము అని భావిస్తున్నారో ఆ సమస్య యొక్క మూల కారణాన్ని పరిష్కరించాలని నేను భావిస్తున్నాను..

మీ సమాజం తప్పు చేసిన వారిని ముందు శిక్షించనివ్వండి..అలాగే మీరు  ఇతరులకు చేసిన తప్పులను పరిష్కరించండి..మీవారిలో తప్పు చేసిన సభ్యులపై నిరసన తెలియజేయండి..వాళ్ళను ఈసారి ఇదే తప్పు చేయకుండా ఆపండి..

ఒకరు చేసే తప్పుడు పనులు మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తాయి..తప్పులు చేసేవారిని మీ సమాజం అడ్డుకొని ఉంటే హిందూ సమాజానికి ఇంత బాధ ఉండదు..కనుక ముందుగా మీరు మీ సమాజంలో ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దుకొని సమస్యను పరిష్కరించుకొండని స్వామీజీ వాళ్ళకు మృధువుగానే కఠినంగా తెలియచేసారు..

వాహ్!! ఇలాంటి హిందూ స్వామీజీలు కదా మనకు కావాలి..

స్వామీజీ తీసుకున్న తన దృఢమైన స్టాండ్ కోసం వారికి పాదాభివందనం..

ఇదే కేరళలోనో..ఆంధ్రాలోనో..తెలంగాణలోనో..తమిళనాడులోనో  జరిగి ఉంటే, హిందువులుగా మరియు జాతీయవాదులుగా చెప్పుకునే కొందరు మూర్ఖులు వెంటనే జిహా.దీలను కౌగిలించుకొని...వాస్తవానికి వాళ్ళు బాగున్నారు... అది వాళ్ళ మతం..వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటించుకుంటే తప్పేంటి అని మిగిలిన హిందువులందరినీ హోల్ సేల్ గా పిచ్చోల్లని చేవారు..

ఈ యుద్ధంలో ఎలా పోరాడాలో తెలిసిన స్వామీజీ లు ఉన్నారని కన్నడిగులు నిరూపించారు..

కన్నడ సోదరులకూ పరమపూజ్య స్వామీజీ శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్ధుల వారికి సాష్టాంగ ప్రణామం...🙏🙏🙏🙏..

సరదాకందం

 సరదాకందం


చీమకు లిప్స్టిక్ రాయుట,

దోమకు ఇంజక్షనిడుట, తొడపయినేన్గున్

ప్రేమ నిడుకొనుట, సతికౌ

రా! మది నచ్చంగ జెప్పుటవికష్టములౌ ||

వృద్ధులూ

 🕉️ *సుభాషితమ్* 🕉️


శ్లో.

*వయోవృద్ధాస్తపోవృద్ధాః*

*జ్ఞానవృద్ధా బహుశ్రుతాః।*

*ఇత్యేతే ధనవృద్ధస్య*

*ద్వారే తిష్ఠన్తి కిఙ్కరాః॥*

                --- సూక్తిసుధానిధిః


తా.

*వయస్సుచేత* వృద్ధులూ, *తపస్సుచేత* వృద్ధులు, బాగా *చదువు కొని జ్ఞానంచేత వృద్ధులైనవారు*, ఇలాంటి వారందరూ కూడ *ధనంచేత వృద్ధుడైన వాని ద్వారం దగ్గర కింకరులై పడి ఉంటారు*....[ఉండవలసి వస్తుంది] 

              ( *ధనమూలమిదంజగత్* )