28, జులై 2022, గురువారం

శ్రావణ మాసం

 🦚 *ఓం శ్రీ శరవణభవాయనమః*🦚


*రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం శ్రావణ మాస విశిష్టత*


శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లలనుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.

ఆధ్యాత్మిక దృష్టితో చూచినప్పుడు వర్షర్తువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.

వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి, బ్రహ్మ స్వరూపం ద్యోతకమవుతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది.

స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి, సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.

పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి, వారితో సోదర ప్రేమను పంచుకొంటూ, ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొండి హృదయ పూర్వకంగా ఆనందిస్తారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున, గృహిణులు ఆనందంగా ఉంటే ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.

ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణుడవతరించిన రోజు. కనుక కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమనాడు, బ్రహ్మచారులు గాని, గృహస్థులు గాని, శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ధారణ అనాదిగా ఆచారంగా వస్తున్నది.

ఇక కర్షకులు మెరుపులతో, గర్జనలతో కూడిన మేఘాలు వర్షధారలతో దేశమును చల్ల పరచునపుడు కృష్యాది కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం సర్వులకూ ఆనందాన్నిస్తుంది.


🦚🚩🕉️ *స్కందమయీ* 🕉️🚩🦚

ఆశలు మాత్రం వదలడు.

 Bhaja Govindam Slokam_ Adi Shankaracharya


17) Behold there lies the man who sits warming up his body with the fire in front and the sun at the back; at night he curls up the body to keep out of the cold; he eats his beggar’s food from the bowl of his hand and sleeps beneath the tree. Still in his heart, he is a wretched puppet at the hands of passions.


This Stanza attributed to Subodha.


శ్రీ ఆదిశంకర విరచిత భజగోవిందం శ్లోకం


అగ్రే వహ్నిః పృష్ఠేభానుః

రాత్రౌ చుబుకసమర్పితజానుః |

కరతలభిక్షస్తరుతలవాసః

తదపి న ముంచత్యాశాపాసః ||17||


భావం: ఎదురుగా చలిమంట పెట్టుకొని,  వీపుపై సూర్యుని కిరణాలు పడేలా కూర్చొని, రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డాన్ని ఆనించుకుని కూర్చుంటాడు; తిండి తినడానికి రెండు చేతులూ దొప్పలుగా చేసుకొని అందులో తింటాడు. చెట్టు నీడన ఉంటాడు. ఐనా ఆశలు మాత్రం వదలడు.

మాంచి మాట🌷

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

          *🌷మాంచి మాట🌷*                               

                    🌷🌷🌷

కృష్ణమాచార్యులు గారు అనే గురువుగారి  వద్ద బాలరాజు , శివమూర్తి  విద్యనభ్యసించారు. శిక్షణ పూర్తికాగానే వారిద్దరూ వేర్వేరుగా ఆశ్రమాలు స్థాపించారు .


బాలరాజు తన శిష్యులకు శాస్త్రం బోధించి నేర్పించేవాడు. వాళ్ళ సమయం వృథాకాకుండా తన సమక్షంలోనే చదివించేవాడు. ఏదైనా మార్పుచేస్తే సహించేవాడు కాదు తాను చెప్పిన శాస్త్రాన్ని వల్లె వేయించేవాడు. తాను చెప్పిందే తు.చ. తప్పకుండా చెప్పాలనేవాడు. 


శివమూర్తి తన శిష్యులను మిత్రుల వలే చూసేవాడు. వారు వారి పక్కవారిని అడిగి తెలుసుకొని, ఆ పైన సొంతంగా ఆలోచించి చదివేవారు. 


ఆ సంవత్సరం రాజస్థానంలో విద్యాసభలు జరిగాయి. 


బాలరాజు శిష్యులు శాస్త్రాన్ని పొల్లుపోకుండా చెప్పి అందరి మెప్పు పొందారు


శివమూర్తి శిష్యులు శాస్త్రాలలో ఉండే రహస్యాలూ, అనుపానులు అన్నీ చెప్పి లోపాలను ఎత్తి చూపారు .సవరణలు కూడా సూచించారు. 


రాజు వారి ప్రతిభకు ఆశ్చర్యపోయారు. రాజు వారికి కానుకలు బహుకరించాడు.


బాలరాజు వాళ్ళ గురువు గారి వద్దకు వెళ్ళి గురుదేవా! నేను మా శిష్యులకు బాగా పాఠం చెప్పి క్షణం వృథా కాకుండా శిక్షణనిచ్చాను. అయితే నా శిష్యులకన్నా శివమూర్తి శిష్యులకు మంచిపేరు ఎలా వచ్చింది? సెలవీయండి" అని అడిగాడు


దానికి ఆయన చిరునవ్వు నవ్వాడు. ""వత్సా! నీవు శిష్యులకు బాగా బోధించావు. కాదనటం లేదు. కాని, వాళ్ళ ఊహాశక్తికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి చిలుక పలుకుల్లా నీవు బోధించేదే వాళ్ళు అభ్యసించారు అలాకాక శివమూర్తి తాను బోధించి, ఆ తర్వాత వాళ్ళకు స్వేచ్ఛనిచ్చాడు. వాళ్ళు ఆలోచించి, అవగాహన చేసుకొన్నారు. యథేచ్ఛగా చర్చించుకొని శాస్త్రంలోని అంశాలు లోతుగా తెలుసుకొన్నారు. 

మళ్ళీ ప్రశ్నించి వాళ్ళు తెలుసుకొన్న దానికి తుది మెరుగులు దిద్దుతాడు గురువు.


దాంతో బాలరాజు  శిష్యులకు కేవలం బోధన చేయడమే కాకుండా వారిని స్వతంత్రం గా ఆలోచించనివ్వాలి అని తెలుసుకున్నాడు..



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


 ఆచార్యాత్ పాదమాదత్తే, పాదం శిష్యః స్వమేథయా ।

 పాదం సబ్రహ్మచారిభ్యః,

పాదం కాలక్రమేణ చ ॥


గురువు శిష్యునికి అందించే జ్ఞానము ఒక పావు భాగము మాత్రమే. శిష్యుడు సొంత తెలివి తేటలతో నేర్చుకొనేది మరో పావు భాగం. ఇక సమవయస్కులతో నేర్చుకొనేది మరొక పావు భాగం. మిగతా పావు భాగాన్ని కాలక్రమేణా అనుభవాలతో నేర్చుకొని పరిపూర్ణుడవుతాడు

*ఓం నమః శివాయ*


*సేకరణ: వాట్సాప్*

రామాయణానుభవం_ 113*

 🌹 *రామాయణానుభవం_ 113* 


*తతోరావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః* 

*ఇయేష పదమన్వేష్టుం। చారణా చరితేపథి* .


జాంబవంతుని ద్వారా స్తోత్రము చేయబడి, వానరులందరికి తన సామర్ధ్యాన్ని వివరించిన తరువాత శత్రుహంత అయిన హనుమచారణులనే దేవగాయకులు సంచరించే ఆకాశమార్గం ద్వారా వెళ్లి రావణుని చేత అపహరింపబడి, నిర్బంధింపబడిన సీతాదేవి ఉన్న స్థలాన్ని వెతుకాలని సంకల్పించాడు.


*దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః* చేయసాధ్యం కానిది, సాటిలేనిది అయిన సాహసానికి పూనుకున్నాడు.

అబోతు కోడెవలె ధైర్యం తో తల ఎత్తి నిలి చాడు....


సింహము వంటి ఆయన గంభీర రూపానికి భయపడి పక్షులు పారిపోయాయి, మృగాలు మరణించాయి. ఆయన మడుగులో స్వైర విహారం చేస్తున్న మత్త గజము వలె కనబడుతున్నాడు.


తాను నిర్వహించబోయే కార్యము సిద్ధించడానికి హనుమ సకలలోక సాక్షియైన సూర్యునికి, మూడు లోకాల ప్రభువైన మహేంద్రునికి, తన తండ్రి అయిన వాయుదేవునికి, సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి మనసారా ప్రణమిల్లాడు.


పర్వదినాలలో సముద్రము ఉప్పొంగినట్లు, రామకార్యసిద్ధి కొరకు హనుమ పొంగిపోతున్నాడు.


ఇక ఆ పర్వతం పై నుండి ఆకాశంలోకి ఎగురాలనుకొన్నాడు.

 ఆ కొండను తన కాళ్లతో చేతులతో బలంగా అదిమాడు. ఆ కొండ కొంత కదిలింది. ముందుగా చెట్ల పూలన్ని జలజల రాలాయి. ఏనుగు తొండాన్నుండి కారే మదధారలవలె ఆ కొండనుండి రంగు రంగుల ధారలు స్రవించసాగాయి.

 నల్లని మనశ్శిలలు కొండనుండి దొరలి క్రింద పడసాగాయి. 


హనుమ మరింత గట్టిగా కొండను నొక్కాడు. ఆ కొండ గుహలలోని జంతువులు ఆ ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణభయంతో బిగ్గరగా అరవసాగాయి.


 బిలాలలోని సర్పాలు విషాన్ని వెడలగ్రక్కుతూ ఆ పర్వత శిలలను కాటువేయసాగాయి. 


ఆ పర్వతముపై విద్యాధరులు తమ తరుణులతో విలాసంగా మధ్యపానం చేస్తున్నారు. ఆకస్మికంగా జంతువుల అరుపులు, పడిపోయే కొండ రాళ్లను చూచి ఆ పర్వతము బ్రద్దలవుతున్నదనే భయంతో ఎక్కడి వస్తువులను అక్కడే వదలి ఆకాశంపైకి ఎగిరి ఆశ్చర్యంతో చూడసాగారు.


ఆ మహాపర్వతం పైనున్న మహానుభావులైన మహర్షులు “రామ కార్యార్థమై హనుమ కొండంత శరీరంతో నూరు యోజనాల విశాలమైన సముద్రాన్ని దాటబోతున్నాడ”ని తెలిపారు.


హనుమ తన శరీరాన్ని యోగాభ్యాస వశం చేశాడు, చేతులను కదలకుండా బిగించి, నడుమును సన్నగా చేసి, మెడను సంకోచింప జేసి ఎగరడానికి వీలుగా పాదాలను ముడిచి యోగ నియమాలను పాటించాడు.......


** 

బయల్దేరడానికి సిద్ధమై వానరవీరులందరూ వినేలా ఇలా ప్రకటించాడు.


*యధా రాఘవనిర్ముక్తః శరః శ్వసనవిక్రమః* *గచ్ఛేత్తద్వద్గమిష్యామి లఙ్కాం* |*రావణపాలితామ్*


రామబాణంలా వాయువేగంతో రావణపాలితమైన లంకకు వెళ్ళి వెదుకుతాను. అక్కడ సీత కనబడకపోతే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళి వెదుకుతాను. అక్కడా సీత కనబడకపోతే. ఏమాత్రం అలసట లేకుండా లంకకు వచ్చి రావణుణ్ణి బంధించి, సీతతో సహా తెస్తాను. ఎలాగైనా సీతను తీసుకునే వస్తాను. ఆమె కనబడకపోతే రావణుడితో సహా లంకను పెల్లగించి. తీసుకు వస్తాను. అనుకున్న కార్యం సాధించి తీరాను." మనస్సునుంచి ఇతర ఆలోచనలు దూరం చేసాడు. సముద్రలంఘనం మీదనే బుద్ధి ఏకాగ్రం చేసి మహేంద్రపర్వతం నుంచి గాలిలోకి ఎగిరాడు.


ఆ మహాకపి తొడల వేగానికి పర్వతం మీద ఉన్న వృక్షాలు కూకటివేళ్ళతో భూమిని పెకలించుకుని బయటకు వచ్చి కొమ్మలన్నిటినీ కిందకు ముడిచి పెట్టుకుని, ఆయనవెంట గాలిలోకి ఎగిరాయి.


సారవంతమైన కొన్ని వృక్షాలు, రాజును సాగనంపే సైన్యంలా పరిమితదూరం ఎగిరి సముద్రంలో పడ్డాయి.


తేలికపాటి చెట్లు, ప్రియబంధువును సాగనంపేవారిలా చాలాదూరం ఎగిరి సముద్రంలో పడ్డాయి.


ఆ వృక్షాలకు ఉన్న పుష్పాలు రాలి, గాలికి పైకిలేచి హనుమంతుడి శరీరమంతా అలంకరించినట్లు అంటుకున్నాయి.


కుప్పించి ఎగిరిన పర్వతమంత మహాకపి, ఆ కపి వెనుక గాలిలోకి లేచిన విశాలమైన వృక్షసమూహాలు, వాటినుండి రాలి అయస్కాంతానికి తగులుకున్న ఇనుపరజనులా హనుమంతుడి శరీరానికి తగులుకున్న పుష్పాలు- అదో మహాద్భుతదృశ్యమై కనబడింది.


గుండ్రంగా, పచ్చగా ఉన్న ఆ మహాకపినేత్రాలు ఆకాశంలో సూర్యచంద్రులు ఏకకాలంలో, ఒకే కాంతితో ఉదయించినట్లున్నాయి. వృత్తాకారంలో ఉన్న తోకతో హనుమంతుడు ఆకాశంలో గూడుకట్టిన సూర్యుడిలా ఉన్నాడు.


ఆయన వేగానికి, బాహుమూలాలనుండి వస్తున్న గాలి చేసే చప్పుడు మేఘగర్జనలా ఉంది. మేఘమండలంలో ఉన్న మేఘాలను లాక్కుపోతున్నాడా అనిపించేలా నీలిమేఘాలన్నీ ఆయనను అనుసరించి కదిలాయి.....

*

[హనుమ తనను *యధా రాఘవ నిర్ముక్త శరః* 

రాముడు వదిలిన బాణం గా చెప్పుకొన్నాడు. ఇది కర్మయోగము యొక్క మూల సూత్రం. రాముని బాణం రాముని యొక్క పనిముట్టు.


రాముడు తన పనికై వినియోగించుకొనును. అపుడు రాముడు వేగముతో లాగి వదలగా రాముడు కల్పించిన వేగమే దాని వేగముగా ఆ బాణము పోవును; మధ్యలో ఆగదు. లక్ష్యమును చేరును.


 హనుమ తన్ను ఆ బాణముతో పోల్చుకొనుచున్నాడు. రాముని బాణము ఎట్లు సహజమగు వేగములేనిదో నేనును అంతే! రామునిపనిమీద రాముడు పంపగా రామునివేగము నా వేగమై పోవుదును గాని ఇది నా శక్తి కాదు. భగవత్పారతంత్ర్యమును భావించుకొనును....]

స్వచ్ఛమైన అశ్వగంధ

 అశ్వగంధ చూర్ణం ఉపయోగాలు - 


    కొంతకాలం క్రితం అశ్వగంధ గురించి కొన్ని వివరాలు మీకు అందించాను. ఈ మధ్యకాలంలో   అశ్వగంధ గురించి మరింత విలువైన సమాచారం తెలుసుకున్నాను . వీటిలో చాలా వరకు నేను నా పేషెంట్స్ కి ఇచ్చినప్పుడు కొన్ని ఇతర సమస్యలు తీరడం నా దృష్టికి వచ్చింది.  ఇప్పుడు నా స్వానుభావాలు మరియు కొన్ని అత్యంత పురాతన గ్రంథ పరిశోధనలో నాకు లభ్యమైనవి కూడా మీకు వివరిస్తాను . 


 స్వచ్ఛమైన అశ్వగంధ తయారీ విధానం - 


      మెట్టభూములు మరియు అడవులలో లభ్యమగు మంచి ముదురు పెన్నేరు గడ్డలను తెచ్చి మట్టి , ఇసుక , దుమ్ము వంటి వ్యర్థపదార్థాలు లేకుండా శుభ్రపరచుకొని నీడ యందు ఎండించవలెను . పూర్తిగా ఎండిన తరువాత  కత్తితో ముక్కలుగా కొట్టి ఒక గిన్నెలో వేసి అవి మునుగునంత వరకు దేశి ఆవుపాలు పోసి సన్నటిసెగపైన పాలు ఇగురునంత వరకు ఉడికించవలెను . అలా ఉడికించిన తరువాత గడ్డలను బాగుగా ఎండించవలెను . ఆ దుంపల యందు తడి పూర్తిగా ఆరిపోయేంత వరకు ఎండించవలెను . లేనిచో ఆ దుంపలకు బూజు పట్టును . ఇలా పూర్తిగా ఎండిన దుంపలను మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా మొత్తం 11 సార్లు చేసి ఆ తరువాత బాగుగా ఎండించి చూర్ణం చేసి వస్త్రగాలితం చేసుకుని వచ్చిన మెత్తటి చూర్ణాన్ని తడి తగలకుండా జాగ్రత్తగా నిలువచేసుకోవలెను . 


 మోతాదు - 


     2 నుంచి 3 గ్రాముల మోతాదులో ఉదయము మరియు సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఆయా సమస్యను బట్టి వైద్యులు సూచించిన అనుపానంతో వాడవలెను . 


       అశ్వగంధ 7 సార్లు శుద్ది చేయవలెను అని చెప్పుదురు . 11 సార్లు శుద్ది చేసిన ప్రశస్తముగా ఉండును . మరియు బలంగా పనిచేయును . 


  ఔషధోపయోగాలు  - 


 *  శరీరానికి అమితమైన బలాన్ని ఇచ్చును . శుష్కించు శరీరం కలవారు దీనిని వాడుట వలన శరీరానికి కండపట్టి బలంగా తయారగుదురు . 


 *  నిద్రలేమితో బాధపడువారికి ఈ అశ్వగంధ అత్యంతద్భుతముగా పనిచేయును . అశ్వగంధ ప్రధానముగా నరాల మీద పనిచేసి నరాలకు బలాన్ని చేకూర్చును . దీనిని వాడుట వలన ప్రశాంతమైన నిద్ర లభించును . 


 *  క్షయరోగముతో ఇబ్బంది పడువారికి ఇది అత్యంత బలవర్ధకమైనది . ఊపిరితిత్తులకు బలాన్ని చేకూర్చుటయే కాక శరీర రోగనిరోధక శక్తి పెంచుటలో అత్యంత వేగముగా పనిచేయును . 


 *  విరిగిన ఎముకలు త్వరగా కట్టుకొనుటకు ఈ అశ్వగంధ బాగుగా పనిచేయును . 


 *  స్త్రీలు మరియు పురుషలలో కలుగు వంద్యదోషాలను నివారించును . 


 *  రక్తము నందలి దోషములను పోగొట్టును . 


 *  కీళ్లనొప్పులు నుంచి ఉపశమనం కలిగించును . 


 *  నాడీవ్యవస్థ కు చెందిన వ్యాధుల పైన బాగుగా పనిచేయును . 


 *  పక్షవాతం మొదలగు వాతవ్యాధుల యందు దీని పనితీరు అద్బుతముగా ఉంటుంది . 


 *  మెదడులోని న్యూరాన్ల పైన దీని ప్రభావం ఉంటుంది. దీనిని వాడుట మూలన మెదడు చురుకుగా పనిచేయును . జ్ఞాపకశక్తి మెరుగుపడును . 


 * అగ్నిమాంద్యము , మలబద్దకం నివారించును .


 *  బాలింతలకు వచ్చు సూతికారోగము నివారించును . 


 *  శరీరంలోని టాక్సిన్స్ బయటకి పంపి శరీరాన్ని శుద్ది చేయును . 


 *  కఫ సంబంధ దోషములైన శ్వాస ( ఆయాసం ) , శోష మొదలైన వాటిని నివారించును . 


 *  గ్రంధి సంబంధ రోగాలు ఉదాహరణకి థైరాయిడ్ వంటి వాటిపై అమోఘముగా పనిచేయును . 


 *  గుండెసంబంధ సమస్యల కలవారు అశ్వగంధ వాడవలెను . 


 *  కొంతమంది పిల్లలు శారీరకంగా ఎండుకుపోయి ఉంటారు. అటువంటివారికి తేనె అనుపానంగా ఈ అశ్వగంధ చూర్ణమును ఇచ్చిన మంచి కండపట్టి పుష్టిగా తయారగుదురు . 


 *  వృద్ధాప్యము నందు వచ్చు సమస్యలను ఎదుర్కోవడానికి అశ్వగంధ నిత్యము సేవించవలెను . 


 *  స్త్రీల శారీరక బలహీనతని పోగొట్టును . ప్రదర రోగములను నివారించును . 


 *  మూర్చరోగులకు ఇది వరం వంటిది . 


 *  స్త్రీలలో కలుగు బహిష్టు సంబంధ సమస్యలను నివారించును . 


 *  స్త్రీ మరియు పురుషులలో హార్మోన్స్ మీద ఇది చాలా అద్బుతముగా పనిచేయును . 


      పైన చెప్పిన అనేక ఉపయోగాలు మాత్రమే కాకుండగా అనేకమంది HIV వ్యాధిగ్రస్తులకు ఇది నేను ఇవ్వడం జరిగింది. దీనిని ఉపయోగించిన తరువాత వారిలో CD4 కౌంట్ నందు మార్పు కనిపించింది. అంతకు ముందు ఉన్నటువంటి నీరసం , నిస్సత్తువ తగ్గిపోయాయి.  ఇలా మరెన్నో వ్యాధులపైన దీనిని ప్రయోగించాను . అద్బుతమైన ఫలితాలు వచ్చాయి . 


         కరోనా చికిత్సలో కూడా ఇది చాలా అద్బుతముగా పనిచేసింది . నేను ఎంతో మంది రోగులకు ఇచ్చాను . కరోనా నుంచి కోలుకొనిన తరువాత వచ్చే దుష్ప్రభావాలనుంచి కాపాడుకోవడానికి ఇది వాడుట అత్యుత్తమం . 


      మీకు ఇక్కడ మరొక్క ముఖ్యవిషయం చెప్పవలెను . నేను మామూలుగా ఆయుర్వేద షాపుల్లో దొరికే శుద్ధిచేయని మామూలు అశ్వగంధ చూర్ణము ఉపయోగించినప్పటికంటే నేను పాలల్లో ఉడకబెట్టి తయారుచేసిన అశ్వగంధ చూర్ణం వాడుట వలన ఫలితాలు అతి తక్కువ సమయములో వేగముగా ఫలితాలు వచ్చాయి . ఈ అశ్వగంధ చూర్ణం వాడువారు పాలు , పెరుగు , వెన్న , పప్పు తరచుగా వాడవలెను . తాంబూలం , మద్యము , కర్బుజా పండు , పనసపండు , చల్లనినీరు , చద్ది అన్నం నిషిద్దం . 


  

27, జులై 2022, బుధవారం

మంచిని గ్రహించండి!*

 XI. 9.1-5.270722-8.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


          *మంచిని గ్రహించండి!*

                  ➖➖➖✍️


*మంచిని గ్రహించండి! చెడుని వదలండి!!*

      …మీ చామర్తి మల్లికార్జున శర్మ 

                                   శ్రీకాకుళం.



* క్షమిస్తున్నారు కదా అని*

*మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ*

*కష్టపెట్టకు!*


*వాళ్ళు ఒక్క క్షణం*

*మంచితనాన్ని మర్చిపోయారంటే*

*వేరేలా మారడానికి*

*నిమిషం కూడా పట్టదు!*


*మనకు ఎన్ని పనులు ఉన్నా*

*ఉదయాన్నే మనసుకు నచ్చినవారిని* *పలకరించడంలో ఉండే ఆనందం*

*మాటల్లో చెప్పలేం!*


*విలువ లేని దుమ్ము కూడా,*

*ఒక్కోసారి నీ కంట్లో పడి,*

*నిన్ను విలవిలలాడేలా చేస్తుంది..!*


*అలాగే కొందరు విలువ లేని మనుషులు కూడా,*

*చాలాసార్లు వారి మాటలతో బాధపెడతారు,*


*ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తముల లక్షణం...!*


 *"నీ చుట్టూ ఉన్నవాళ్ళ స్థానం, స్థాయి మారితే*

*నిన్ను మర్చిపోతారేమో.*


*అయినా కూడా* 

*నువ్వు నీలానే ఉండాలి!* 

*స్థానం మారినా, స్థాయి మారినా!*

*అదే వ్యక్తిత్వం అంటే!"*



 *"ఏదీ శాశ్వతం కాదు!*

*నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు.*

*ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే*

*మారిపోక తప్పదు."*



 *కాలం ఎందరినో*

*పరిచయం చేస్తుంది.*

*కానీ కొందరినే*

*మనసుకు నచ్చిన వారిగా*

*మార్చుతుంది.*

*అది స్నేహమైనా, ప్రేమైనా..!!*


 *మనిషిని గెలుచుకోవడంలో*

*సంతోషం ఎన్నిరోజులు*

*ఉంటుందో తెలియదు కానీ...*

*మనసును గెలుచుకోవడంలో*

*ఉండే సంతోషం మాత్రం...*

*జీవితాంతం ఉంటుంది....!!*


 *మనం ఇతరులకి సాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి. చెట్టుకి ఇవ్వడమే తెలుసు. మంచి మనుషులు కూడా అంతే… ఇతరులకి సాయం చెయ్యడం తప్ప వారి స్వార్థం కోసం ఎప్పుడు ఏమీ ఆశించరు!*


 *మన కష్టంలో మనవాళ్లే*

*కలిసిరానప్పుడు*

*ఎవరో ఆదుకోవడానికి*

*రాలేదని బాధపడటం*

*అనవసరం.*


*ఎక్కువగా నమ్మటం,*

*ఎక్కువగా ప్రేమించటం,*

*ఎక్కువగా ఆశించటం..*

*ఫలితంగా వచ్చే బాధ కూడా*

*ఎక్కువగానే ఉంటుంది.*✍️


. 🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

                     

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

కవితా చమత్కారం

 శుభోదయం👏


కవితా  చమత్కారం!

-------------------------------- 


                  చ:  కలశ పయోధి  మీద  తరఁగల్  మరి 'హోయని'  మ్రోయ ,  వేయిభం


                        గుల  తలపాన్పు  పాము  బుసఁగొట్టఁగ ,  నేగతి  నిద్రఁ  జెందెదో ?


                        అలసత  తండ్రి !  చీమ చిటుకన్నను  నిద్దుర  రాదు  మాకు  , ఓ


                        బలవదరీ !  దరీకుహర  భాస్వదరీ !  యదరీ !  దరీ ! హరీ !


                          చాటుపద్యం-   అజ్ఙాత కర్తృకం ;


                          కవితా చమత్కారాలు  యెన్నిరీతులో?  ఒకొక్క  కవిది  ఒక్కొక్క  ఊహ! ఆవూహకు తగ్గ భావసంపద. దానిని ఆవిష్కరించే  చక్కని పద్యరచన!  అత్యద్భుత మనిపించక మానదు.


                          మనం నిద్ర పోతుంటే  అంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. ఏమాత్రం చిన్నశబ్దమైనా మెళకువ వచ్చి ప్రక్క వారిపై విసుగు ప్రదర్శిస్తాం. అదే లోకేశ్వరునకు  ఆపరిస్థితే వస్తే  ఆయన కెంత బాధ? కానీ యివేవీ పట్టించుకోకుండా  ఓదేవాది దేవుడు

నిద్రపోతున్నాడట. ఆయన నిద్రను జూచి యీకవి యబ్బురపడుతున్నాడు.  పదండి ఆసంగతేమిటో చూద్దాం;


                  "  పాల  సముద్రంలో   కెరటాలు  హోరుమని మోత పెడు తుండగా, వేయితలల నాగు  ఆదిశేషుడు  బుసలు కొడుతుండగా ,   లోకపాలనతో అంతగా అలసిపోయిన నీవు  యెలా నిదురించినావయా ? నాయనా?  మాకైతే  చీమచిటుకన్నా

నిద్దుర రాదే ,  అబ్బో నీవు చాలా గొప్పవాడివేనయ్యా!  అంటూ తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడీ కవి.


                     అంత భయంకరమైన  చప్పుడవుతున్నా  నిమ్మకు నీరెత్తినట్లు  నిశ్చలంగా నిదురించటం ఇక్కడ ఆశ్చర్య జనక మైన

చమత్కారం. దాన్ని కవి బహు చక్కగా వర్ణించాడు.


                   కడలో కెరటాలు అనంతం వాటి మ్రోతలు కూడా నిర్విరామమే! ఇక  ఆది శేషునకున్నపడగలా  వేయి. ఒక్క పాము బుసకొడితేనేమనం

హడలిపోతాం. అలాటిది వేయిపాములొక్కసారిగా బుసలు సారిస్తే  యెంత శబ్దమో ? ఆశబ్దం  కర్ణ కఠోరంగదా? మరి ఆరొదలో కదలకుండా నిద్రపోవటం మాటలా? మహ దిట్టతనమో, మొండి తనమోకావాలి. ఆరెండూ నీకున్నాయయ్యా! లేకపోతే  చీమచిటుకు

మన్నామాకు మెలకువ వస్తుందే ?మరి నీకెందుకురాదు? అనికవి ప్రశ్న?


 

                   బలవదరీ!  దరీకుహర భాస్వదరీ! యదరీ!  దరీ!  హరీ!  ------  దీనివరుసచూస్తే  ఇదేదో శతకానికి మకుటంలాగ ఉంది.

కవి చాలా ప్రౌఢుడు." దరీ " శబ్దాన్ని వృత్యనుప్రాసంగా ప్రయోగించి  యర్ధభేదం సాధించటమేగాదు. తానెంత ప్రతిభావంతుడో మనకు

తెలియజేశాడు. అహోబలనృసింహ స్వామిని యీ సంబోధనలతో కవి సంభావిస్తున్నాడు.


              బలవదరీ- బలవంతుడైన శత్రువు గలవాడా( హిరణ్య కస్యపుడు బలవంతుడేగదా) దరీకుహర- పర్వత గుహలో; భాస్వదరీ!- ప్రకాశించు  నృసింహాకారా! ; అదరీ- చక్రము; దరీ- శంఖము ధరించెడువాడా ;హరీ- స్వామీ  శ్రీహరీ!


             బలవంతుడైన హిరణ్యకస్యపుని సంహరించినవాడా! శంఖ చక్రధారీ! పర్వత బిలమందు ( అహోబిలము) నివసించు నృసింహ స్వామీ! యని సంబోధనము.


                   మొత్తానికి  పాలకడలిలో  విష్ణమూర్తి నిద్ర కూడా కవితా వస్తువైనది.


                       ఇదండీ    విషయం!


                                                                   స్వస్తి!

విష్ణు సహస్రనామం

 మనకు విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది! భీష్మపితామహ విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు, ధర్మరాజుతో సహా. కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?


అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తినీ అక్కడున్న వారినందిరినీ వుద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది" అని అడిగారు. 


ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?"


ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"  


స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"


మళ్ళీ నిశబ్దం.


స్వామివారు చెప్పడం మొదలుపెట్ట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, అందరూ కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని యుదిష్టురుడిగాడు. 


"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.  


శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.  


"అదేలా" అని అందరూ అడిగారు. 


శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. 


శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస మహర్షి వ్రాసిపెట్టాడు. 


ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.

-సేకరణ

శ్రావణమాసం

 శ్రావణమాసం అంటే ఏమిటి..?



శ్రావణమాసము:- ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. శ్రావణమాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రెగొరీయన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై, ఆగష్టు నెలల్లో వచ్చును. వర్షఋతువు మూలంగా విరివిగా వర్షాలు పడతాయి.


పంచాంగ ప్రకారంగా ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణానక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు.


శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో అనుకూలమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. గొప్ప పవిత్రమాసం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు ఉన్నాయి.

శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీశోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.


ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు వర్షఋతువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, ఈ సమయంలో వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.


వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి బ్రహ్మ స్వరూపం అర్ధమౌతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది. స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్ర నామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.


పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకొంటూ ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొంది హృదయానందాన్ని పొందుతారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున ఏ ఇంట్లో గృహిణులు ఆనందంగా ఉంటారో ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.


ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజు. కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమ రోజు బ్రహ్మచారులు గాని గృహస్థులు గాని శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ( జంధ్యం ) ధారణ అనేది అనాది ఆచారంగా వస్తున్నది. రైతులకు తమ వ్యవసాయ సాగుకు కావలసిన వర్షాలు విస్తారంగా కురిసి వాతవరణంలో మార్పు చెందడం వలన వ్యవసాయ సాగు కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు.

ఈ విధంగా శ్రావణ మాసం అందరికీ ఆనందాన్నిస్తుంది.


శ్రావణ మాసం లక్ష్మీ ప్రదమైనమాసం 

శ్రావణ మాసం.

స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణమాసం. అనేక రకములైన వ్రతములు, నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే “శ్రావణ మాసం“.

చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం లగాయత్తు చూస్తే, శ్రావణమాసం ఐదవ మాసం. పూర్ణిమనాదడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసంలో శ్రీమహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయి.


మంగళగౌరీ వ్రతం:


శ్రావణ మాసం మందు ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.


వరలక్ష్మీ వ్రతం:

శ్రావణ మాసం లో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.


శుక్లచవితి-నాగచతుర్థి:

దీపావళి తర్వాత జరుపుకొనే నాగులచవితి లాగ, మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలందు ఈరోజుని నాగులచవితి పండుగలా నాగాపుజలను చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి, నాగ దేవతను పూజిస్తారు. దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కుడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి.


శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి:

శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పుత్ర సంతానాన్ని కోరుకొనేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.


శ్రావణ పూర్ణిమ –  రాఖీపూర్ణిమ:

అన్న/తమ్ముని శ్రేయస్సుని కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ. సోదరునికి రాఖీ కట్టి, నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణ, క్షత్రియ & వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అనికూడా అంటారు.

పూర్ణిమ – హయగ్రీవ జయంతి:

ఈరోజునే శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొని, హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వ శ్రేష్టం.


కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి:

మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్రస్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలను చేస్తారు. అంతే కాదు. క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సర, శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంధాలలో పేర్కొనబడినది.

కృష్ణపక్ష అష్టమి – 


శ్రీకృష్ణాష్టమి:


శ్రీమహావిష్ణువు యోక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తోంది.

కృష్ణపక్ష ఏకాదశి – కామిక 


ఏకాదశి:

ఇక బహుళ పక్షంలో వచ్చే ఏకాదశే కామిక ఏకాదశి. ఈరోజున నవనీతమును(వెన్న) దానం చేయాలని పెద్దలు అంటారు. తద్వారా ఈతి బాధలు పోయి, కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.

కృష్ణపక్ష అమావాస్య – పోలాల అమావాస్య:

పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసములో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్లు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్తా, పోలేరు అమావాస్య గా మారి,  పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.


*ఆదిరాజు ప్రసాద్ శర్మ*

అవకాశం ఇస్తుంది

 *🙏🏻రెండు డైరీలు - భార్య❤️భర్త 👇🏻*



తమ వివాహ వార్షికోత్సవ  సందర్భాన, భార్యాభర్తలు ఇద్దరూ  కలిసి  కూర్చుని  కాఫీ తాగుతూ  కబుర్లు చెప్పుకుంటున్నారు.  ప్రపంచానికి, వారొక ఆదర్శమైన జంట.  నిజానికి  వారిద్దరి మధ్య చాలా ప్రేమ ఉండేది, కానీ కాలక్రమేణా వారిద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి.


వారి సంభాషణలో.......భార్య ఒక ప్రతిపాదన చేసింది, “నేను మీతో చాలా చెప్పాలి, కానీ మనకు ఒకరి కోసమొకరికి సమయం దొరకడం లేదు. అందుకే నేను రెండు డైరీలు కొన్నాను. ఈ సంవత్సరం  మొత్తం మన మనసులో ఒకరి మీద ఒకరికి  ఉన్న వాటిని వీటిలో రాద్దాం. 

వచ్చే ఏడాది పెళ్లి రోజున, మన లోపాలను తెలుసుకోవడం కోసం ఒకరి డైరీని మరొకరు చదువుదాం, వాటిని  సరిదిద్దుకోడానికి  కలిసి  ప్రయత్నిద్దాం,”  ఆలోచన నచ్చి భర్త వెంటనే దానికి అంగీకరించాడు. 


 ఇద్దరూ తమ తమ డైరీలు  తీసుకున్నారు.


 ఒక  సంవత్సరం వేగంగా  గడిచిపోయింది.  మరుసటి  సంవత్సరం  వివాహవార్షికోత్సవం  సందర్భంగా, భార్యాభర్తలిద్దరూ  ముందుగా నిర్ణయించుకున్న విధంగా  తమ  డైరీలను  మార్చుకున్నారు.

మొదట.......భార్య  తనను  ఉద్దేశించి  వ్రాసిన  డైరీని భర్త  చదవడం  ప్రారంభించాడు.


మొదటి పేజీలో, "ఈ రోజు మన వివాహ వార్షికోత్సవం.  మీరు  నాకు  మంచి బహుమతి ఇవ్వలేదు" అని,


రెండవ పేజీలో - "మీరు నన్ను భోజనానికి రెస్టారెంట్ కి తీసుకెళ్లలేదు."

మూడవ పేజీలో - "నన్ను సినిమాకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు, కానీ అలసిపోయానని చెప్పి చివరి క్షణంలో రద్దు చేసారు."


 " నా తరఫు బంధువులు వచ్చారు  కానీ మీరు వారితో సరిగ్గా మాట్లాడలేదు."


"చాలా ఏళ్ళ తర్వాత ఈరోజు మీరు నా కొక డ్రెస్ కొన్నారు, కానీ అది చాలా పాత ఫ్యాషన్ ది !"


 ఇలా భర్త మీద ఎన్నో పనికిమాలిన ఫిర్యాదులు  ఆమె తన డైరీలో రాసుకుంది. అది చదవడం పూర్తికాగానే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి.


 భర్త, “ఓ  ప్రియా, నన్ను క్షమించు!  ఇప్పటి వరకు నా తప్పుల గురించి నాకు తెలియదు.  భవిష్యత్తులో వాటిని పునరావృతం కాకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను.” అని చెప్పాడు.


 ఇప్పుడు తన కోసం భర్త రాసిన డైరీని చదివడం భార్య వంతు...........


 మొదటి పేజీ - ఖాళీ

 రెండవ పేజీ - ఖాళీ

 మూడవ పేజీ - ఖాళీ

 ... ఖాళీ


 భార్య 50-60 పేజీలు తిరిగేసింది, కానీ అన్నీ ఖాళీగానే ఉన్నాయి!  


భార్య కలత చెంది, “నా ఈ చిన్న కోరిక కూడా మీరు తీర్చలేరని నాకు తెలుసు.  నా మనసులో ఉన్నదంతా వ్రాయడానికి నేను చాలా కష్టపడ్డాను, ఈ సంవత్సర కాలంలో నేను పడిన బాధ అంతా మీకు తెలియాలని నేను కోరుకున్నాను, కానీ మీరు నా కోసం ఇంత కూడా చేయలేకపోయారు!" అని వాపోయింది.


భర్త చిరునవ్వు నవ్వి, “చివరి పేజీలో అంతా రాశాను ప్రియా” అన్నాడు.


 భార్య ఆత్రంగా చివరి పేజీ తెరిచింది. 

అందులో ఇలా ఉంది - “ ఎదురుగా ఉండి ఎంత  కసురుకున్నా, ఇన్నాళ్లూ నువ్వు నాకు, నా కుటుంబానికి అందించిన అపరిమితమైన ప్రేమ ముందు, ఈ డైరీలో వ్రాయడానికి నీలోని ఏ లోపాన్ని నేను గుర్తించలేకపోయాను.  


అలాగని నీలో ఏమి లేవని కాదు. కానీ నీప్రేమ, అంకితభావం, మా కోసం నీ త్యాగం ఆ బలహీనమైన లోపాలన్నింటినీ అధిగమించేలా చేశాయి.  


నాలో లెక్కలేనన్ని క్షమించరాని  తప్పులు  ఉన్నప్పటికీ, నా  జీవితంలోని  ప్రతి దశలో నాకు నీడలా  ఉన్నావు.  ఆ నీడలో లోపాన్ని ఎలా కనుగొనగలను?!" అని వ్రాసాడు.


అది చదివిన భార్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి.  ఆమె తన భర్త చేతిలో నుండి తన డైరీని తీసుకొని, రెండు డైరీల తో పాటు తన విభేదాలు , ఫిర్యాదులను మంటల్లో కాల్చివేసింది..  మళ్లీ వారి జీవితాలు కొత్తగా పెళ్లయిన జంటలా ప్రేమతో వికసించాయి!


 వివాహం మనందరికీ ఎదగడానికి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి, ప్రేమించడం నేర్చుకోడానికి అవకాశం ఇస్తుంది.  మనం ప్రమాణానికి కట్టుబడి ఉంటే, మరింత ఎక్కువగా ఇవ్వడం గురించి వివాహం మనకు నేర్పుతుంది. 🙏🙏🙏🙏

శ్రీరాఘవం

 శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

ఆపదామప హత్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం

*శ్రీసీతారామచంద్ర అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణా ఫలసిద్థిరస్తు*

*సౌమ్యవాసర శుభోదయః*
సర్వేజనాః సుఖినోభవంతు
లోకాఃసమస్తాః సుఖినోభవంతు 

అదృష్టం ఉంటేనే

 శ్లోకం:☝️

  *న దైవమపి సంచిన్త్య*

*త్యజేదుద్యోగమాత్మనః l*

  *అనుద్యోగేన తైలాని*

*తిలేభ్యో నాప్తుమర్హతి ll*


భావం: అదృష్టం ఉంటేనే కార్యసిద్ధి కలుగుతుందని ఆలోచిస్తూ .. తన అధీనమైన పురుష ప్రయత్నమును వదలకూడదు. అందుబాటులో ఉన్న నువ్వుల నుండి ఏ ప్రయత్నమూ లేకుండానే నూనె రాదు కదా!

26, జులై 2022, మంగళవారం

ఆదాయపు పన్ను వివరాలను

 మిత్రులందరికీ నమస్కారం.  జూలై నెల వచ్చిందనగానే సంపాదనపరులంతా చేయవలసిన ముఖ్యమైన పని "గడచిన ఆర్ధిక సంవత్సరానికి చెందిన మీ ఆదాయాలను, వాటికి మీరు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలను ఆదాయపు పన్ను శాఖ వారికి రిటర్ను రూపంలో దాఖలు చేయటం.  దానికి ఆఖరు తేది 31 జూలై.  ఇది అందరికీ తెలిసిన విషయమే.  అయితే ఈ సంవత్సరం ఆదాయపు పన్ను పోర్టల్లో "యాన్యువల్ ఇంఫర్మేషన్ స్టేటుమెంటు" అని ఒక డాక్యుమెంటును పెట్టారు.  గతంలో 26ఎ.ఎస్. అన్న స్టేటుమెంటు ఉండేది. దానిలో మీ జీతభత్యాలు, మీరు ఉద్యోగులు అయితే డి.డి.ఓ. చేత పేబిల్లుల ద్వారా చెల్లించిన పన్ను వివరాలు మాత్రమే ఉండేవి.  ఆ ఉద్యోగులు బయట బాంకుల్లో కానీ, యితర ఆర్ధిక సంస్థల్లో గాని కొన్ని డిపాజిట్లను గాని, షేర్లు వంటి వాటిలో గానీ పెట్టుబడి పెట్టి, దానిపై వడ్డీని పొందుతున్న వివరాలు బహిర్గతమయ్యేవి కావు.  ఈ సంవత్సరం నుంచి(1921-22) మీరు పోస్టాఫీసుల్లో గాని, బాంకుల్లో గాని దాచుకొన్న మొత్తాలు, వాటిపై మీకు వచ్చిన వడ్డీల వివరాలన్నీ ఈ ఏ.ఐ.ఎస్.(వార్షిక సమాచార నివేదిక)లో కనిపిస్తాయి.  ఉద్యోగస్తులు బాంకుల్లో గానీ, యితర ఆర్ధిక సంస్థల్లో గానీ తమ పేరు మీద పెద్ద మొత్తాలను డిపాజిట్లుగా దాచుకొని పొందే ఆదాయాల మీద కూడా పన్ను కట్టాలన్న విషయాన్ని సాధారణంగా పట్టించుకోరు. దానికి కారణం సాధారణంగా ఆ మొత్తాలు మన చేతికి రావు కానీ మన అక్కౌంట్లలో కలుస్తూ ఉంటాయి.  జీతాల్లో కట్టేసిన టాక్సు మాత్రమే లెక్కలోకి తీసుకొనే వాళ్ళకి, ఈ మొత్తాల మీద కూడా టాక్స్ కట్టాలని ఈ నివేదిక మీకు గుర్తుచేస్తుంది.  మీరు డిపాజిట్లు చేసినప్పుడు యిచ్చిన మీ ఆధార్ నంబర్ ప్రకారం ఆదాయపు పన్ను  విభాగం ఈ స్టేటుమెంటుని తయారుచేసి మీ రిటర్న్ ఫైలింగ్ పోర్టల్ లో ఉంచుతుంది.

మరొక విషయం ఏమిటంటే, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు గత సంవత్సరం తమకు బాంకు డిపాజిట్లపై వచ్చిన వడ్డీలపై టాక్స్ కట్టని వాళ్ళే ఎక్కువ ఉండొచ్చు.  వాళ్ళు రిటర్న్ ఫాం నింపేటప్పుడు, ఎలక్ట్రానికల్గా మీకు జీతంలో డి.డి.వో. పన్నుగా విరక్కోసిన మొత్తాలే గాక ఎక్కువ పన్ను బాకీ పడ్డట్లుగా కనిపిస్తుంది. ఆ తేడా ఏమిటన్నది తెలుసుకోవాలంటే మీరు ఈ "వార్షిక సమాచార నివేదిక (యాన్యువల్ ఇంఫర్మేషన్ స్టేటుమెంట్) ని చూడాల్సిందే!  ఇది ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఆదాయపు పన్ను శాఖ తయారుచేసిన పోర్టల్ లో కనిపిస్తుంది.  అది కనుక్కొనే విధానం : మీరు పోర్టల్ తెరవగానే "ఫైల్ యువర్ రిటర్న్" అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ పాన్ నంబర్, పాస్ వర్డ్ కొట్టితే   మీ పోర్టల్ తెరుచుకొంటుంది.  అప్పుడు మీకు పైన కొన్ని హెడ్డింగ్ లు వస్తాయి.  అందులో సర్వీసెస్ అన్న హెడ్డింగ్ ని క్లిక్ చేస్తే ఒక వరుసలో ఉన్న లిస్ట్ వస్తుంది.  దానిలో మధ్యలో ఈ ఎ.ఐ.ఎస్. కనిపిస్తుంది.  దాన్ని క్లిక్ చేసి, లోపల వచ్చిన ఎ.ఐ.ఎస్. (AIS) మీద క్లిక్ చేస్తే, 26 ఎ.ఎస్. మాదిరి ఒక స్టేటుమెంట్ వస్తుంది.  దానిలో మీకు జీతంలో కట్ అయిన టాక్స్ తో పాటు, పోపుల డబ్బాలో తప్ప, మీరు బయట దాచుకొన్న మొత్తాలు, ఎక్కడెక్కడ ఎంత దాచారో, దానిపై వచ్చిన వడ్డీలు వివరంగా కనిపిస్తాయి.  అది Income from other sources  (ఇతర మార్గాల ద్వారా ఆదాయాలు) అన్న హెడ్డింగ్ లో కనిపిస్తాయి.  దానితో పాటు ఎక్కడ దాచారో (దబాయించటానికి వీల్లేకుండ)ఆ సంస్థల పేర్లు కూడా వస్తాయి.  ఇది ఈ ఏడాదే పెట్టారు గనుక, చాలా మంది వాటిపై మార్చిలో పన్ను కట్టి ఉండరు. అందువల్ల మార్చిలో పన్ను కట్టని ఈ వడ్డీ మొత్తాల పన్నుపై ఆదాయపు పన్ను వారి రెండు సెక్షన్ల ప్రకారం వాటిపై 1%, 3% వడ్డీలు కూడా కట్టమని ఒక అంకె పేర్కొనబడుతుంది.  ఆ మొత్తాన్ని కూడా self assessment tax head(300) కింద పన్ను(in a challan) బాంకులో  చెల్లించి( బాంకులో  చలాను కాపీ తీసుకోవాలి., ) ఆపైన మీరు రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.  ఆ పన్నును కట్టకపోతే, తరువాత దానిపై పెనాల్టీ కూడా చెల్లించవలసి ఉంటుంది.  పాత పెన్షన్ పథకం కింద ఉన్న ఉద్యోగులకు జి.పి.ఎఫ్. అని ఆఫీసులోనే కొంత మొత్తం దాచుకొనే వీలు ఉంది.  కొత్త పెన్షన్ కింద ఉన్న ఉద్యోగులకు 10% జీతం విరక్కోస్తారు గనుక ఈ జి.పి.ఎఫ్. ఉండదు.  వాళ్ళు తప్పని సరిగా బయట బాంక్, పోస్టాఫీసుల్లో కొంత మొత్తాలను దాచుకొంటుంటారు.  వాటిపై వచ్చే వడ్డీని కూడా మార్చిలోగా ఈ నివేదిక ద్వారా తెలుసుకొని, మీ డి.డి.ఒ.కి యిస్తే, దాన్ని కూడా కలిపి వచ్చే ఏడాది మీ పన్నును లెక్క  కట్టి, జీతంలో విరక్కోస్తాడు.  లేదంటే మార్చి తరువాత మీరు పన్నును, పన్నుపై కొంత మొత్తంతో వడ్డీని కూడా కట్టవలసి ఉంటుంది.  అరవై ఏళ్ళ లోపు వారికి సేవింగ్స్ బాంక్ వడ్డీపై 80 టి.టి.ఎ.కింద కేవలం పది వేలు మాత్రమే రిబేటు ఉంటుంది. వారికి ఫిక్సెడ్ డిపాజిట్ల వడ్డీపై ఏమాత్రం రిబేటు ఉండదు. అరవై పై బడ్డ వారికి ఈ రిబేటు ఉండదు.  వారికి మొత్తం డిపాజిట్లపై వచ్చే వడ్డీపై(సేవింగ్స్, ఫిక్సెడ్ డిపాజిట్లపై కలగలిపి) 80 టి.టి.బి.కింద 50,000/- రిబేట్ యిస్తారు. ఈ విషయం స్నేహితులకు తెలియాలని వ్రాసాను.  గమనించగలరు.  రిటర్న్ వేయటానికి ఆఖరి రోజు జూలై 31 మాత్రమే.  ఈ ఏడాది పొడిగింపు లేదు.  గమనించగలరు.  మన పొదుపు మొత్తాలను ప్రభుత్వంతో అనుసంధానించేది  ఆథార్ కార్డ్.


(ఇది మిత్రుల సౌకర్యార్ధం దీనిని పెట్టాను)



* అగ్నౌ ప్రాస్తాహుతి స్సమ్యగాదిత్య ముపతిష్ఠతే 1. * ఆదిత్యా జ్జాయతే వృష్టిః వృష్టేరన్నం తతః ప్రజాః11


సమత్రకంగా అగ్ని లో సమర్పించిన ఆహుతులు ఆదిత్యున్ని చేరతాయి.... 'సూర్యుని వల్ల వర్షం కలుగుతుంది.... వర్షం వల్ల ఆహారం పుడుతుంది. ఆహారం తీసుకొని ప్రజలు వృద్ధి చెందుతున్నారు.....

GSTని

 🙏 

*GSTని ఎలా నివారించాలి ప్రభుత్వాన్ని తిట్టకండి.. బదులుగా మీ మనస్సుతో పని చేయండి మరియు GSTని నివారించండి.*

 1. *మీరు బయటకు వెళ్లినప్పుడల్లా ఇంటి నుంచి వాటర్ బాటిల్ తీసుకుని వెళ్లండి... బయటి షాపుల్లో ప్యాక్ చేసిన బాటిళ్లను కొనకండి.*

 2. *ప్రయాణంలో పరోటాలు, కూరగాయలు, అన్నం లేదా పులావ్‌లను మీతో తీసుకెళ్లండి, హోటళ్లు లేదా మాల్స్ నుండి బయట తినడం మానేయండి.*

 3. *మీరు ఇంటి కిచెన్ వస్తువులు, కూరగాయలు మరియు కూరగాయలు ఏవైనా కొనాలనుకున్నా, ఇంటి సమీపంలోని చిన్న దుకాణదారులు లేదా వీధి వ్యాపారుల నుండి కొనండి, సూపర్ మార్కెట్‌కు వెళ్లడం మానేయండి.*

 4. *శనివారం-ఆదివారాల్లో పెద్ద పెద్ద మాల్స్‌కు వెళ్లడం మానేయండి, స్నేహితులు మరియు బంధువుల ఇళ్లకు వెళ్లి, పరస్పర సంబంధాలను బలోపేతం చేసుకోండి.*

5. *పెద్ద మల్టీప్లెక్స్ ఐనాక్స్, పివిఆర్ సినిమాలకు బదులు సింగిల్ స్క్రీన్ సినిమాకి వెళ్లి చిత్రాన్ని చూడండి.. వాటిపై జిఎస్‌టి లేదు.*

 6. *ఉదయం, సాయంత్రం వ్యాయామం తర్వాత ఇంటికి వచ్చి టీ, కాఫీలు తాగండి.. హోటళ్లలో కాదు.*

 7- *ప్యాక్ చేసిన పాలు, పెరుగు, మజ్జిగ కొనుగోలు చేయడానికి బదులుగా, స్థానిక దుకాణం నుండి సమీపంలోని ఆవు, గేదె మరియు పెరుగు మరియు మజ్జిగ యొక్క తాజా పాలు కొనండి.*

 8- *ప్యాక్ చేసిన తృణధాన్యాలు కొనవద్దు. ధాన్యాలన్నీ మన ఇంటి చుట్టుపక్కల ఉన్న కిరాణా దుకాణాల్లో కూడా దొరుకుతాయి, వాడండి!*

 9. *ప్యాక్ చేసిన తృణధాన్యాలలో ప్రిజర్వేటివ్ మన ఆరోగ్యానికి హానికరం.*

 *మనమందరం మన పొరుగువారికి, స్నేహితులకు మరియు బంధువులకు మరియు చిన్న వ్యాపారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రభుత్వం దీన్ని చేసింది!*

*సానుకూలంగా ఆలోచించండి, సానుకూల ఆలోచనతో మీరు దేనినైనా మార్చవచ్చు!*