11, ఫిబ్రవరి 2025, మంగళవారం

RSS అంటే

 RSS అంటే ఏమిటి???

ఇందులోనే ఎందుకు చేరాలి🤔???



ఆర్ఎస్ఎస్ అంటే నవభారత నిర్మాణానికి పునాది వేసి, విదేశీ శక్తులకు లొంగకుండా, స్వధర్మాన్ని అవలంబిస్తు, అంతర్గత శత్రువులను అధిగమిస్తు, ప్రపంచానికి భారతదేశ శక్తిని పరిచయం చేస్తు, దేశ గౌరవ ప్రతిష్టలకు రక్షణగా నిలబడుతు... 100 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న ఏకైక స్వచ్ఛంద సంస్థ.


👉 ఒక ఏడాది పాటు ప్రతిరోజు శాఖకు వెళితే... 👇 ఈ క్రింది విషయాలు (లక్షణాలు) మీకు పుష్కలంగా లభిస్తాయి.


1. ఆదర్శవంతమైన వ్యక్తులను పరిచయం చేస్తుంది.

2. అద్భుతమైన స్నేహితులను అందిస్తుంది.

3. భయం & బిడియం పోతాయి.

4. ఉత్తమ క్రమశిక్షణ ప్రారంభించబడుతుంది.

5. అందర్నీ కలుపుకుపోయే స్వభావం ఏర్పడుతుంది.

6. నిస్వార్ధమైన సేవ అలవడుతుంది.

7. దేశభక్తి పెంపొందుతుంది.

8. "నాది" అని కాకుండా "మనది" అనే స్వభావం ఏర్పడుతుంది.

9. జాతీయ భావాలను పెంపొందిస్తుంది.

10. నాయకత్వ లక్షణాలను ఇనుమడింపజేస్తుంది.

11. నీ బలం ఏమిటో.. నీకు ప్రతిబింబిస్తుంది.

12. ఆదర్శవంతమైన నిజ చరిత్రను తెలియజేస్తుంది.

13. సమాజానికి నీ అవసరం ఏమిటో గుర్తిస్తుంది.

14. నీకు బలాన్నిస్తూ.. సమాజంలో శక్తిగా ఎదగడానికి దోహదపడుతుంది.

15. అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.

16. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలమైన ఆలోచనలు స్పురిస్తాయి.

17. ఓర్పు, నేర్పుతో పాటు పట్టుదల అలవడతాయి.

18. సంవత్సరం తర్వాత నిన్ను నీకు పరిచయం చేస్తుంది.

19. నిన్ను,  "నీవేమిటో" నిరూపించుకోగలిగే సరియైన వేదిక ఆర్ ఎస్ ఎస్

20. చివరగా ఈ జన్మకు సార్ధకత ఏమిటో అవకతమవుతుంది.


ముఖ్య గమనిక:


👉 ప్రస్తుత సమాజంలో.. ఒక ఉన్నతమైన, ఆదర్శమైన వ్యక్తిగా ఎదగడానికి ☝️ పై లక్షణాలు... ఇక్కడ తప్ప., మార్కెట్లో ఎక్కడ లభ్యం కావు... గుర్తుంచుకోండి ఆత్మ స్వరూపులార!🙏🏻!!


సర్వేజనా సుఖినోభవంతు,

ఓం శాంతి శాంతి శాంతిః,

భారత్ మాతాకీ జై,

జైహింద్.🚩

శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం

 శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం

సాంఖ్యయోగం: శ్రీభగవానువాచ


అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే

గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః (11)


న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః 

న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ (12)


అర్జునా.. దుఃఖించనవసరం లేనివాళ్ళకోసం దుఃఖిస్తున్నావు. పైగా మహావివేకిలాగా మాట్లాడుతునావు. చచ్చిపోయినవాళ్ళ గురించికాని, బ్రతికున్నవాళ్ళ గురించి కాని వివేకులు శోకించరు. నీవూ నేనూ వీళ్ళంతా గతంలోనూ వున్నాము. భవిష్యత్తులో కూడా వుంటాము.

🏵️ఆపదకి సంపద నచ్చదు..

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏            🏵️ఆపదకి సంపద నచ్చదు..సంపదకు బంధం నచ్చదు..బందానికి బాధ నచ్చదు.. బాధకు బ్రతుకు నచ్చదు.. బ్రతుకుకి చావు నచ్చదు.. చావుకి పుట్టుక నచ్చదు.. కానీ మనిషి అయిన తరువాత అన్నీ అనుభవించాలి🏵️ఏ ప్రాణిని చంపకూడదు..ఆ ప్రాణి లోని దుర్గుణాన్ని మాత్రమే చంపాలి.. అలాగే దుర్గుణాన్ని నిర్మూలిస్తే ప్రతీ మనిషి మంచివాడే..మన మనసులో అత్యంత విలువైన స్థానాన్ని మనమే జీవితం అనుకునే వాళ్లకు మాత్రమే ఇవ్వాలి.. లేకపోతే ఆది విలువ లేనిదై పోతుంది🏵️విలువ లేని దుమ్ము కణం కూడా ఒక్కోసారి నీ కంటిలో పడి విలవిల లాడేలా చేస్తుంది.. అలాగే కొందరు విలువ లేని మనుషులు కూడా చాలా సార్లు వారి మాటలతో బాధ పెడతారు..సంబంధాలను కొనసాగించడానికి కొన్ని సార్లు అంధులుగా,కొన్ని సార్లు చెవిటిగా, మరికొన్ని సార్లు మూగగా ఉండవలసి వస్తుంది🏵️🏵️మీ  *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్  D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర. స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయిన వారు రాలేని వారు కొత్తవారికి మందులు కొరియర్ కొరియర్ ద్వారా పంపబడును 9440893593 9182075510* 🙏🙏🙏

శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానం..

 🎻🌹🙏శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానం.. చిత్తూరు జిల్లా..!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿 శ్రీరాముని ప్రధమభక్తుడైన ఆంజనేయ స్వామికి పురాణములతో ముడిపడిన పురాతన మరియు ప్రశస్తమైన ఆలయములలో అర్ధగిరి ఆంజనేయుని ఆలయం ప్రధమంగా చెప్పబడుతునది. 


🌸ఈ ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన కాణిపాకం స్వయంభూః వరసిద్ధి వినాయకుడు ఆలయం నుండి 13 కి.మీ దూరంలో ఉంది. అరగొండ అను గ్రామమువద్ద కొండపై అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది  


🌹పురాణ కథ చరిత్ర 🌹


🌿 ఈ అర్థగిరి క్షేత్ర ఆవిర్భావం వెనక కమనీయమైన, రసరమణీయమైన రామాయణగాథ చరిత్రగా చెప్పబడుతుంది. అదేమిటంటే త్రేతాయుగ కాలంలో రామ-రావణుల మధ్య సంగ్రామం జరుగుతుండగా, రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు మూర్చబోతాడు. 


🌸లక్ష్మణుడిని మేలుకొలపడానికి సంజీవిని అనే ఔషధం  అవసరమైంది. 

అంతే, సంజీవిని తీసుకురావడానికి శ్రీరామభక్తుడైన  ఆంజనేయుడు 'జైశ్రీరామ్' అంటూ వాయు వేగంతో ఆకాశంలోకి లంఘించాడు. 


🌿సంజీవని ఆ పర్వతంపై ఎక్కడుందో కనుగొనలేక పర్వతాన్నే ఏకంగా పెకలించి, తన అరచేతులపై తీసుకుని వస్తుండగా, ఔషదులతో కూడిన ద్రోణగిరి పర్వతమును తీసుకొనివచ్చు ఆంజనేయుని చూచిన శ్రీరాముని సోదరుడైన భరతుడు చీకటిసమయం ఆగుటవలన తమకు హానిచేయుటకు రాక్షసులు పర్వతము తెచ్చుచున్నారని భావించి హనుమంతునిపై బాణము వేయగా ద్రోణగిరి పర్వతములో  సగభాగం విరిగి పెళ పెళరావంతో నేలమీద పడింది.


🌸ఆ కొండ పడిన ప్రాంతమే అర్థగిరి. 

ఆ ప్రాంతంలో ఒక గ్రామం వెలసింది.

ఆ గ్రామమే అరకొండగా, కాలక్రమేణా అరగొండగా రూపాంతరం చెందిందని ఎందరో భాగవతుల కథనం, స్థలపురాణం.


🌿ఇక్కడ స్వామి  ప్రసన్నాంజనేయునిగా ప్రసిద్ధి చెందారు. మిగతా ఆలయములలో వలె కాక ఈ ఆలయములో విలక్షణముగా హనుమంతుని విగ్రహం ఉత్తరంవైపు ఉంటుంది.. ఆలయప్రాంగణంలో కల కోనేటినీటిలో దివ్యఔషధగుణాలు ఉన్నాయని విశ్వాసం.


🌸అందువలన ఈ కోనేటిని  సంజీవరాయ పుష్కరిణి అని పిలుస్తారు. కోనేటినందలి నీటిని తమ శరీర రుగ్మతలు తగ్గించుకోవడానికి భక్తితో స్వీకరిస్తారు. దక్షిణ భారతదేశంలోని ఆంజనేయస్వామి దేవాలయాలలో అతి ముఖ్యమైనదిగా పరిగణించబడు ఈపురాతన ఆలయానికి ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామిని భక్తితో ప్రార్థిస్తారు.


🌿పౌర్ణమిరోజు ఆంజనేయుడు మరింత శక్తివంతంగా ఉంటాడని నమ్ముతారు. అందువలన పౌర్ణమిరోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆంజనేయుడు సౌమ్యుడు. భక్తులు తమలపాకులు మరియు తులసిదళములతో కూర్చిన దండలను స్వామికి అలంకరించడానికి సమర్పించవచ్చు. 


🌸ఆంజనేయుడు 'శ్రీరామ జయం' అనే పవిత్ర పదాలతో కూర్చినదండతో అమిత ఆనందం పొందుతాడు. భక్తులు ఆంజనేయుడు ఇష్టపడే శ్రీరామనామం జపించడంద్వారా శ్రీరాముని మరియు ఆంజనేయుని ఒకేసారి తృప్తిపరచవచ్చు.  


🌿ఆలయము ఉదయం 5 గం నుండి మధ్యాహ్నం 1-30 వరకు తిరిగి 2 గం.నుండి 8-00 వరకు తెరచిఉంటుంది.


🌹 మహిమాన్వితమైన  “సంజీవరాయ పుష్కరిణీ” (కొలను) : 


 🌸ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన పుష్కరిణి  ఇటీవలి కాలంలో విశేష ప్రాచుర్యాన్ని పొందుతూ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి. క్షేత్రం, పుష్కరిణీలు త్రేతాయుగం నాటివైనా, గుడి మాత్రం చోళరాజుల కాలంలో నిర్మించబడిందనే ఆధారాలున్న ఈ క్షేత్రంలో ఎందరో యోగులూ, మహర్షులు తపస్సు చేసిన గుహలు మనకు విస్మయాన్ని కలిగిస్తాయి. 


🌿వనమూలికల ప్రభావంచే సహజంగా ఉద్భవించిన సంజీవరాయ పుష్కరిణీ తీర్థాన్ని సేవిస్తే వ్యాధులు నయమవడమే కాక మనో వాంఛలు కూడా నెరవేరుతున్నాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. 


🌸ప్రతి నెలా పవిత్రమైన పౌర్ణమి రోజున విశేష పూజలు, భజనలు, హరికథలతో క్షేత్ర, భక్తి పారవశ్యంతో హోరెత్తుతూ భక్తాదులను విశేషంగా ఆలరిస్తోంది.


🌿ఇప్పటికినీ సుదూర ప్రాంతములనుండి భక్తులు ఇచటగల కొనేరునుండి ఔషదగుణములున్న నీరు సేకరించుటకు వచ్చేదరు. ఈప్రాంతం పరిసరములలోని ఇతర ప్రదేశాలన్నిటిలోనూ ఈ కొలనునందు మాత్రమే నీరు తీయగాఉంటుంది. 

ఈ పర్వతంనందలి మట్టి అనేక ఔషధగుణములు కలిగి అన్ని రకాల చర్మ రుగ్మతలను పోగొడుతుందని నమ్మకం. 


🌸కొలనులోని నీరు పర్వతమునందలి వివిధ మార్గములనుండి అనేక ఔషదమొక్కలను తాకుచూ ప్రవహించి ఈకొలనును చేరుతుంది.  మృతసంజీవనీ ఔషధపుమొక్క ఇచ్ఛటి కొనేరునందు పడినదని ఈ కోనేటికి చేరునీరు వేలసంవత్సరాలు గడచినను,ఇప్పటికీ మానవజాతికి సంక్రమించు దాదాపు అన్ని వ్యాధులను నయం చేయగల ఔషధ నాణ్యతను కలిగి ఉంది అని నమ్మకం. 


🌿టి.బి., ఆస్తమా, క్యాన్సర్ మరియు  కీళ్లనొప్పులు వంటి తీవ్రమైన వ్యాధులను నయంచేసే శక్తి దీనికి ఉందని ప్రసిద్ధి. ఈ నీరు బద్ధకం, అలసట మరియు శారీరక రుగ్మతలు పోగొట్టి  శరీరానికి సామర్థ్యాన్ని కలిగిస్తుంది అని నమ్మకం .


🌸పుష్కరిణిలోని నీటిని భక్తులు 40 రోజులపాటు సేవించి, పక్కనే ఉన్న ఆంజనేయస్వామిని దర్శిస్తే అన్ని వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం... స్వస్తి..🌞🙏🌹🎻


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

మాఘ పురాణం🏞️ - 13 వ అధ్యాయము*_

 _*🔱మాఘ పురాణం🏞️ - 13 వ అధ్యాయము*_ 


🌅🏞️🌅🌊🌅🏞️🌅

*🙏ఓం నమో భగవతే నారాయణాయ*


*🌅🛕📚TVBC📚🛕🌅*

************************

🕉️📚🕉️📚🕉️📚🕉️📚


*రాజా ! మాఘమాసస్నానము వలన వైకుంఠప్రాప్తిని యెట్టి వానికైనను కలిగించును. దీనిని తెలుపు మరి యొక కథను వినుము. పూర్వము గోదావరీ తీరమున సుశీలుడను కర్మిష్ఠి అయిన వేదపండితుడు కలదు. అతనొకనాడు ప్రయాణము చేయుచు త్రోవ దప్పి భయంకరారణ్యమును ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోను , ఉన్నతములగు వృక్షములతోను , పులి మొదలగు భయంకర జంతువులతోను కూడియుండెను. అతడా అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెదుకుచు అటు నిటు తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్రచెట్టు వలెనున్నవి. పాదములు మాత్రము చెట్టుగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగియుండెను. అచటి కొమ్మలు ముళ్లు గాలికి కదలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదలునట్టి అవకాశములేదు. ఆహారపానీయాదులను తీసికొను అవకాశములేదు. ఇట్టి దురావస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములను చదువనారంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను.*


కొంత సేపటికి సుశీలుడు స్తిమితపడెను. ఓయీ ! నీవెవరవు ? నీకీ పరిస్థితియేమి ? చెప్పుమని అడిగెను. అప్పుడా రాక్షసుడు మహాత్మా ! నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నియు పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగనుంటిని. అందరితో అన్ని విషయములను మాటలాడెడి వాడను , ఎవనికిని యేపనియు చేసెడి వాడనుకాను. అసత్యములు పలికెడివాడను పరులసొమ్ము నపహరించుచుండువాడను. ఎంతయో ధనమును కూడబెట్టితిని. ఎవరికిని యేమియు నీయలేదు. స్నాన , దాన పూజాదికములను వేనిని ఆచరింపలేదు. దైవపూజయన నేమోయెరుగను. ఇట్లందరిని బాదించుచు చివరకు మరణించితిని. నరకములో చిరకాలముంటిని తరువాత కుక్క , గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలందితిని. ప్రస్తుతము నా పాదములు చండ్రచెట్టుగా దాని ముళ్ల కొమ్మలు భాధింపగా ఎచటికి కదలలేని యీ జన్మలోనుంటిని. నీవంటి పుణ్యాత్ముని చూచుట వలన , నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు యీ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయును అని సుశీలుని బహువిధములుగ ప్రార్థించెను.


సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచెను. ఓయీ ! యిచట సమీపమున నీరున్నదాయని అడిగెను. పన్నెండు యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదాయని సుశీలుడడిగెను. అప్పుడా రాక్షసుడు అయ్యా ! నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటివారే , వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగ నున్నాడని చెప్పెను. సుశీలుడు ఓయీ ధైర్యముగ నుండుము. నేను నీ వంశము వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వానిని భాష్కలుడను వానిని వెదకుచుపోయెను.


సుశీలుడను రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయెను. వానికి తాను చూచిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను. అతడును రాక్షస రూపమున నున్న నా పూర్వీకునకు రాక్షసరూపము పోవలెనున్న యేమి చేయవలయునో చెప్పునని అడిగెను. అప్పుడు ఓయీ ! నీవు మాఘమాసమున నదీస్నాన చేయుము. శివునిగాని , కేశవునికాని నీ యిష్టదైవమును పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక , పూర్వులైన నీ పితృదేవతలును పాపక్షయము నొంది పుణ్యలోకముల నందుదురు. 


స్నానము యేడు విధములు. అవి ,


*🏞️మంత్రములను చదువుచు చేయు స్నానము , మంత్రస్నానము.*


*🏞️మట్టిని రాచుకొని చేయు స్నానము , మృత్తికాస్నానము.*


*🏞️భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము , ఆగ్నేయస్నానము.*


*🏞️గోవులు నడుచునప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునటుల చేసిన స్నానము , వాయవ్యస్నానము.*


*🏞️నదులు , చెరువులు మున్నగువానిలో చేయు స్నానము , వరుణ స్నానము.*


*🏞️ఎండగనున్నప్పుడు వానలో చేయు స్నానము , దివ్యస్నానము.*


*🏞️మనస్సులో శ్రీహరిని స్మరించుచు చేయు స్నానము , మానసస్నానము.*


*🏞️ప్రాతః కాలమున స్నానము చేయలేని అశక్తులు , వృద్ధులు , రోగిష్ఠివారు మున్నగువారు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేయ వచ్చును , జుట్టుముడి వేసికొని స్నానము చేయవలెను.*


*🏞️స్నానము చేయునప్పుడు కౌపీనము(గోచి)ఉండవలయును. తుమ్ము , ఉమ్ము , ఆవలింత , మాలిన్యము దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరీయినచో ఆచమనము చేయవలయును. భగవంతుని స్మరించుచు కుడిచెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానముత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్రస్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని , పసుపు , కుంకుమ , ఫలములు , పుష్పములు నదిలో లేదా చెరువులో నుంచవలెను. శ్రీహరిని లేదా యిష్టదైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో నుంచవలయును. బొడ్డులోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట , జపతర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి , ఒడ్డునకు చేరి మూడు దోసిళ్ల నీటిని తీరమున నుంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలెను , ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను , నదీ స్నానము చేసిన పిమ్మట తడివస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును , పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యము నిచ్చును.*


*🏞️స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారు యిష్టదైవమును స్మరించుచు నీటిలో మరల మునగవలయును. సూర్యుని , గంగను , దేవతలను తలచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా , యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలెను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరము పై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్థమి , ఏకాదశి , శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడ తలచుకొని నమస్కరింపవలయును.*


 అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానములను వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను , దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిన పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానమును , పూజాదులను నిర్వహించెను.


 *🏞️స్నానాంతమున రాక్షసరూపము నన్ను పూర్వుని ఉద్ధేశించి తర్పణము కూడ చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపమున ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వము పోయి పుణ్యలోకములు కలిగెను.*

*-❀꧁❀-TVBC❀-꧂❀-*


🟨🟥🟨🟥🟨🟥🟨🟥

*🙏స్వస్తి 🙏*

📚🕉️📚🕉️📚🕉️

*FOR MORE DAILY "DEVOTIONAL UPDATES"  & SPIRITUAL INFORMATION 📖 WATCH 🪀 AND SUBSCRIBE TO TVBC ON YOUTUBE.🤳*


*🌈స్వస్తి ప్రజాభ్యః పరిపాలయాంతాం న్యాయ్యేన మార్గేణ మహీంమహీశాః*

     *🌎గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం *🪐లోకాఃసమస్తాఃసుఖినోభవంతు*||*

🕉️🌎🕉️🌎🕉️🌎🕉️

*🌈సర్వేజనాః సుఖినోభవంతు*

🙏🌼🙏🌼🙏🌼🙏

*శుభమ్ భూయాత్*

తిరువంచికులం మహదేవ ఆలయం

 🕉 మన గుడి : నెం 1017


⚜ కేరళ  : కొడంగల్లూర్‌ - త్రిస్సూర్


⚜ తిరువంచికులం మహదేవ ఆలయం



💠 భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాలో కొడంగల్లూర్‌లో ఉన్న ఒక హిందూ దేవాలయంలో  శివుడునీ మహాదేవుడిగానూ, అతని భార్య పార్వతిని ఉమాదేవిగానూ పూజిస్తారు. ఈ ఆలయంలో 33 ఉప దేవతలు ఉన్నాయి


💠 కేరళ సంప్రదాయ పురాణ రాజు చేరమాన్ పెరుమాళ్ ఈ ఆలయ ప్రాంగణం నుండి తన సహచరుడైన శైవ సన్యాసి సుందరమూర్తి నాయనార్‌తో కలిసి 'కైలాసానికి' వెళ్లినట్లు నమ్ముతారు. 


💠 ఈ దేవాలయం పండుగ రోజులలో మినహా అన్ని రోజులలో ఉదయం 4 నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4- నుండి 8:30 వరకు తెరిచి ఉంటుంది. 

ఆలయంలో 4 రోజువారీ ఆచారాలు మరియు 3 వార్షిక ఉత్సవాలు జరుగుతాయి, వీటిలో 8 రోజుల మహాశివరాత్రి ఉత్సవాలు మలయాళ నెల కుంభం ( ఫిబ్రవరి - మార్చి ) అత్యంత ప్రముఖమైనవి. 


🔆 చరిత్ర


💠 కేరళలో ఉన్న ఏకైక తేవారం పాదల్ పెట్ర శివస్థలం ఇదే. నలుగురు శైవ ఆచార్యులలో ఒకరైన సుందర మూర్తి నాయనార్ (తమిళంలో సుందరార్ అని కూడా పిలుస్తారు) పాడిన తేవారం శ్లోకాలలో ఈ ఆలయం చరిత్రలో పురాతన ప్రస్తావనను కలిగి ఉంది . ఆలయ ప్రాంగణంలో సుందర మూర్తి నాయనార్ మరియు చేరమాన్ పెరుమాళ్ నాయనార్ చిత్రాలను కూడా చూడవచ్చు. 


💠 ఇది దక్షిణ భారతదేశంలోని పురాతన శివాలయాలలో ఒకటి , ఇక్కడ శివుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడని చెబుతారు. 

ఇక్కడ నుండి, సుందర మూర్తి నాయనార్ ఆది స్వాతి రోజున (జూలై/ఆగస్టు) శివుడు పంపిన తెల్ల ఏనుగుపై కూర్చొని కైలాసానికి చేరుకున్నారు. అతనిని సెరమాన్ పెరుమాళ్ నాయనార్ గుర్రంపై అనుసరించారు. కైలాసానికి వెళ్ళేటప్పుడు, సుందర మూర్తి నాయనార్ ఒక పాధిగం పాడారు, దానిని అతని అభ్యర్థన మేరకు తిరువంచికులం తిరిగి పంపారు. ఈ ఆలయం తమిళనాడులోని చిదంబరం దేవాలయంతో ముడిపడి ఉంది .


💠 విష్ణువు యొక్క అవతారమైన పరశురాముడు తన తల్లి రేణుకను చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానికి శివుడిని పూజించిన ఆలయం ఇది అని నమ్ముతారు 


💠 తిరువంచికుళం శివాలయం అనేక దండయాత్రలను చూసింది. 

మైసూర్ టిప్పు సుల్తాన్ సైన్యం మరియు డచ్ వారి దండయాత్ర సమయంలో ఇది పూర్తిగా ధ్వంసమైంది.

టిప్పు సుల్తాన్ మైసూర్‌ను దక్షిణ దిశగా విస్తరిస్తున్నప్పుడు తిరువంచికులం శివాలయానికి తీవ్ర నష్టం కలిగించాడు. అతని సైనికులు 18వ శతాబ్దం ప్రారంభంలో ఆలయం నుండి విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించారు మరియు దాని శిల్పాలను ధ్వంసం చేశారు.


💠 చేరా వంశానికి చెందిన గొప్ప రాజు చేరమాన్ పెరుమాళ్ తిరువంచికులం శివాలయాన్ని నిర్మించి 1801లో పునరుద్ధరించాడు.


💠 ప్రధాన పూజా విగ్రహం, శివలింగం, దక్షిణ భారతదేశంలోని శివునికి అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటైన చిదంబరం ఆలయం నుండి తీసుకురాబడిందని నమ్ముతారు.


💠 తిరువంచికుళం శివాలయం యొక్క వాస్తుశిల్పం మూడు అంతస్తుల ద్వార గోపురం తిరువంచికుళం శివాలయానికి తూర్పు వైపున, ఆలయానికి భక్తుల ప్రవేశ ద్వారం. 

సందర్శకులు ఆలయ ప్రవేశ ద్వారం ఎడమ వైపున శివుడు మరియు పార్వతి రాతి చెక్కడం చూడవచ్చు. 


💠 గర్భగుడి, ముఖ మండపం మరియు నమస్కార మండపం రాగి రేకుతో కప్పబడి ఉంటాయి.

 16 స్తంభాలతో కూడిన నమస్కార మండపం ఆలయానికి ప్రధాన ఆకర్షణ. ఇది గర్భగుడి ముందు ఉన్నది.


💠 గర్భగుడిలో తూర్పు దిశలో స్వయంభూ లింగం ఉంది. 

ఇది 4 అంగుళాల పొడవు, 12 అంగుళాల వ్యాసం మరియు అర్ధ వృత్తాకార రూపంలో ఉంటుంది.


💠 తిరువంచికులం శివాలయంలో కేరళలో అత్యధిక సంఖ్యలో ఉప దేవతలు ఉన్నారు. 

మహాదేవుడు ఇక్కడ వివిధ రూపాలలో వర్ణించబడ్డాడు.

అరుదైన ఈ ఆలయంలో శివపార్వతుల విగ్రహాలను వేర్వేరుగా వేర్వేరు గర్భాలయాల్లో ఉంచారు.


💠 వినాయకుడు, చేరమాన్ పెరుమాళ్, సుందరమూర్తి నాయనార్, అయ్యప్ప, సతీదేవి, దుర్గాదేవి, సప్తమాతృక్కల్, నంది, హనుమాన్, నాగరాజ, నాగయక్షి, విష్ణువులకు ఇక్కడ ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. భక్తులు నందిని (శివుని వాహనం) తాకడానికి అనుమతించబడరు మరియు పూజారులు దానిని శుభ్రపరచడానికి మాత్రమే తాకగలరు. 


💠 ఆలయ పూజారులు పండుగల సమయంలో మరియు రోజువారీగా పూజ (ఆచారాలు) నిర్వహిస్తారు. ఆలయ ఆచారాలు రోజుకు నాలుగు సార్లు జరుగుతాయి; ఉదయం 8:00 గంటలకు కాళశాంతి , 12:00 గంటలకు ఉచ్చికాలం మరియు సాయంత్రం 6:00 గంటలకు సాయరక్షాయ్ సోమవారం మరియు శుక్రవారం వంటి వారోత్సవాలు, ప్రదోషం వంటి పక్షం ఆచారాలు మరియు అమావాస్య వంటి మాస పండుగలు ఉన్నాయి. , కిరుతిగై , పౌర్ణమి మరియు శతుర్థి . 

మలయాళ నెల ఎడవం (మే - జూన్)లో జరిగే బ్రహ్మోత్సవం ఈ దేవాలయంలో జరిగే అతి ముఖ్యమైన పండుగ.


💠 ఈ నగరం కొచ్చి (35 కి.మీ), త్రిస్సూర్ (38 కి.మీ) మరియు గురువాయూర్ (45 కి.మీ)


రచన

©️ Santosh Kumar

13-23-గీతా మకరందము

 13-23-గీతా మకరందము

           క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


ఉపద్రష్టానుమన్తా  చ 

భర్తా భోక్తా మహేశ్వరః | 

పరమాత్మేతి చాప్యుక్తో 

దేహేఽస్మిన్ పురుషః పరః || 


తాత్పర్యము:- పురుషుడు (ఆత్మ) ఈ శరీరమందున్నప్పటికిని శరీరముకంటె వేఱైనవాడును, సాక్షి భూతుడును, అనుమతించువాడును, భరించువాడును, అనుభవించువాడును, పరమేశ్వరుడును (గొప్పప్రభువు, నియామకుడును), పరమాత్మయు అని చెప్పబడుచున్నాడు.


వ్యాఖ్య:- 'ఉపద్రష్టా’ యజ్ఞమునందు 'ఉపద్రష్ట’ అనువాడు సాక్షిమాత్రుడుగ నుండును. అట్లే ఆత్మ శరీరమందున్నను 'పరః’ - శరీరముకంటె వేఱుగ, పరముగనున్నవాడై దేహేంద్రియాదులకు సాక్షిగ వెలయుచున్నాడు. కావున జీవుడు తాను వాస్తవముగ అట్టి పరమాత్మస్వరూపుడే యనియు దేహేంద్రియాదులుకాదనియు లెస్సగ భావనచేయవలెను.

‘మహేశ్వరః, పరమాత్మా దేహేఽస్మిన్’ - అని చెప్పబడినందువలన జగన్నాథుడైన పరమేశ్వరుడు, పరమాత్మ ఈ దేహమందే వర్తించుచున్నాడని స్పష్టమగుచున్నది. ఈ ప్రకారముగ భగవానుడు జీవునకు అతిసమీపమున నుండుటవలన ప్రయత్నముచే సులభముగ పొందగలడు. వారికై దూరదూరములందు ప్రయాసపడి వెతుకనక్కఱ లేదు. మఱియు శిక్షించువాడు, శాసించువాడు, (ఈశ్వరుడు) చెంతనేయుండుట వలన పాపులివ్విషయమును గమనించి పాపకృత్యము లెవ్వియు చేయకనుండవలెను.


'పరః' - అని చెప్పుటవలన ఆత్మ దేహముతో, ఉపాధితో, సంబంధములేక దానికి పరముగా వేఱుగ, అతీతముగ నున్నదని తెలియుచున్నది.

 ‘పరః పురుషః’ - అను పదములకు పరమపురుషుడు, పరమాత్మ అనియు అర్థము చెప్పవచ్చును.


ప్రశ్న:- పరమాత్మ యెట్టివాడు?

ఉత్తరము:- (1) శరీరమందున్నను, శరీరముకంటె వేఱుగనున్నవాడును, (2) సాక్షిభూతుడును, (3)అనుమతించువాడును, (4) భరించువాడును, (5) అనుభవించువాడును, (6) గొప్పనియామకుడును, (పరమేశ్వరుడును) అయియున్నాడు.

తిరుమల సర్వస్వం-146*

 తిరుమల సర్వస్వం-146* 

   

           *తొండమాన్ చక్రవర్తి -1*


 *తొండమాన్ చక్రవర్తి* 


 మనం వివిధ ప్రకరణాలలో ఇంతవరకూ ఆకాశరాజు తమ్ముడైన తొండమానుడు పద్మావతీపరిణయం లో ముఖ్య భూమిక వహించటం; శ్రీనివాసుని ఆనతిపై ఆనందనిలయం నిర్మాణం కావించి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు శాశ్వతంగా తిరుమల క్షేత్రం మీద కొలువై ఉండటానికి కారణభూతుడు అవ్వటం గురించి మాత్రమే తెలుసుకున్నాం. అయితే, ఈ భక్తశిఖామణికి ఎంతో విశిష్టమైన వృత్తాంతం ఉంది.


 *శ్రీతీర్థం – భూతీర్థం* 


 కృతయుగంలో ముల్లోక పర్యటనలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతుడై భూలోకానికేతెంచిన శ్రీమహావిష్ణువు, ఆనాడు క్రీడాద్రిగా పిలువబడే, నేటి వెంకటాద్రి పర్వతం పైనున్న ప్రకృతి సోయగానికి ముగ్ధుడై కొంతకాలం అక్కడే విహరిస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువుకు కావలసిన భోజనాదుల నిమిత్తం, ఆ పర్వతశిఖరంపై దేవేరులిద్దరూ చెరొక తీర్థాన్ని (బావులను) ఏర్పాటు చేశారు. శ్రీదేవి ఏర్పరచిన తీర్థం *'శ్రీతీర్థం"* గానూ, అలాగే భూదేవి ద్వారా ఏర్పాటు చేయబడ్డ తీర్థం *"భూతీర్థం"* గానూ ప్రసిద్ధికెక్కాయి. కాలాంతరాన, కలియుగారంభం నాటికి ఈ రెండు తీర్థాలు శిథిలమై పోయాయి. తన ప్రియసఖుల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ తీర్థాలను ఎంతగానో ఇష్టపడే విష్ణుమూర్తి, వాటిని ఎలాగైనా పునరుద్ధరింప చేయాలని సంకల్పించి తగిన సమయం కోసం వేచి చూస్తున్నాడు.


 *సద్భాహ్మణుడు - శూద్ర భక్తుడు* 


 ఇదిలా ఉండగా, కలియుగారంభం నందు చోళరాజ్యంలోని హరిద్రానదీ తీరాన ఉన్న కృష్ణ క్షేత్రమనే గ్రామంలో, శ్రీకృష్ణునికి పరమభక్తుడైన వైఖానసుడనే సద్ర్బహ్మణుడు భగవత్సాక్షాత్కారం కోసం కఠోరమైన తపమాచరించాడు. అతని నిష్ఠాగరిష్టతకు ప్రీతి చెందిన శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుని రూపంలో ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోవలసిందిగా ఆదేశించాడు. అందుకు వైఖానసుడు భౌతిక సంపదలను కోరుకోకుండా; తనకు మోక్షాన్ని ప్రసాదించమని, ఎల్లవేళల శ్రీకృష్ణుని రూపంలో తన పూజలు స్వీకరించమని కోరుకున్నాడు. 


‌ అతని నిస్వార్థభక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు, తాను వెంకటాద్రి పర్వతంపై శ్రీనివాసునిగా స్వయంవ్యక్తమై ఉన్నానని; అతను కోరుకున్నట్లే నిత్యము ఆ శ్రీనివాసుణ్ణి సేవించి తరించవచ్చునని వరమిచ్చాడు. అంతే గాకుండా ఇకనుండి వైఖానసుడే *"గోపీనాథుని"* గా ప్రసిద్ధి కెక్కుతాడని; అతనికి *"రంగదాసు"* అనే శూద్రభక్తునితో పరిచయం ఏర్పడుతుందని; కృతయుగంలో వేంకటాద్రిపై *"శంఖరాజు"* అనే భక్తునిచే నిర్మించబడిన విమానగోపురం కలిగిన తన ఆలయం శిథిలమవ్వగా, అందున్న విగ్రహం సమీపంలోనే ఉన్న ఒక చింతచెట్టు క్రింద ఉన్నట్టి పుట్టలో పడిఉన్నదని; వారిరువురూ (వైఖానసుడు, రంగదాసు) కలసి ఆ విగ్రహాన్ని పుట్టలో నుండి బయటకు తెచ్చి, ఒక వైభవోపేతమైన దేవాలయాన్ని నిర్మించి, అందులో విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి, నిత్యము పూజాదికాలు జరుపవలసిందని కూడా శెలవిచ్చాడు. 


‌ తదనంతరం, భగవదాజ్ఞ మేరకు వెంకటాద్రి పర్వతానికి బయలుదేరిన గోపీనాథునికి మార్గమధ్యంలో రంగదాసు కలువగా; ఇరువురూ కలసి సువర్ణముఖీ నదిలో స్నానమాచరించి, సమీపంలోనే ఉన్న శుకపురి (నేటి తిరుచానూరు) అనే పుణ్యక్షేత్రం లోని శ్రీకృష్ణ బలరాముల ఆలయాన్ని దర్శించుకుని, వేంకటాచలానికి తరలి వెళ్ళారు.


 *శ్రీనివాసుని సేవలో భక్తద్వయం* 


‌ శ్రీవారి ఆనతి మేరకు వెంకట పర్వతాన్ని చేరుకున్న భక్తులిరువురు స్వామి పుష్కరిణియందు స్నానమాచరించి; పుష్కరిణికి దక్షిణాన ఉన్న చింతచెట్టు క్రింది పుట్టను త్రవ్వి, అందులో నిక్షిప్తమైయున్న, దివ్య తేజస్సు ఉట్టిపడే, సాలగ్రామశిలా నిర్మితమైన స్వామివారి మూర్తిని వెలికి తీసి; ఎంతో కాలంగా పుట్టకు నీడనిచ్చిన చింతచెట్టును, శ్రీమహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన చంపక వృక్షాన్ని మాత్రమే ఉంచి; ఇతర వృక్షాలను, తుప్పలను, బండరాళ్లను తొలగించి; ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. విగ్రహం చుట్టూ అందుబాటులో ఉన్న బండశిలలతో కుడ్యాలను నిర్మించి, రెల్లుగడ్డితో పైకప్పు నేర్పరచి శ్రీవారికి తాత్కాలిక వసతి కల్పించారు.


 ప్రతిరోజూ శ్రీనివాసునికి గోపీనాథుడు పూజాదికాలు సమర్పించుకునేవాడు. పూజకు కావలసిన పుష్పాలను సమయానికి సమకూర్చే బాధ్యతను వహించిన రంగదాసు, పూదోటను పెంచటం కోసం ఆ సమీపంలోనే రెండు బావులను కూడా నిర్మించాడు. భగవత్సంకల్పంతో ఆ బావులు నిర్మించబడ్డ ప్రదేశంలోనే శ్రీదేవి భూదేవిలచే ఎప్పుడో నిర్మించబడి శిథిలమై పోయిన శ్రీతీర్థం, భూతీర్థం బహిర్గత మయ్యాయి. శ్రీతీర్థం నందలి పవిత్ర జలాలను గోపీనాథుడు శ్రీవారి వంటలకు, అభిషేకార్చనాదుల నిమిత్తం ఉపయోగించేవాడు. అదే నేడు విమానప్రదక్షిణ ప్రాకారంలో ఉన్న *"బంగారుబావి".*


[ రేపటి భాగంలో... *రంగదాసు మరుజన్మ* గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

పద్యానువాదము

 🪷 శుభోదయం 🪷

     శ్లోకానికి పద్యానువాదము 


> శ్లో॥ ఇంద్రియాణాంహి చరతాం యన్మనోఽనువిధీయతే!

> తదస్యహరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి!! 


> భావం: ఎలాగైతే బలమైన వీచేగాలి నీటిలో నావను దాని దిశనుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏఒక్క ఇంద్రియముపైన గాని మనస్సు కేంద్రీకృతమయినచో అది బుద్ధిని హరించివేస్తుంది. **గీత02:67**

=======================

అనువాదపద్యం:

*ఇంద్రియములపైన నిష్టమ్ము గలిగిన*

*మనసుకూడ నట్లె మారిపోవు* 

*ప్రతిభ క్షయమునంది పరిఢవిల్లగబోదు*

*నౌక గాలివెంట నడచినట్లు*

~"కవితాభారతి" 

*~శ్రీశర్మద*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం  - చతుర్ధశి - పుష్యమి -‌‌ భౌమ వాసరే* (11.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

10, ఫిబ్రవరి 2025, సోమవారం

Panchaag


 

అష్టోత్తర శతనామావళి- భావం*

 *లలితా అష్టోత్తర శతనామావళి- భావం* 


 *(పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు )* 


 ⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️


 *Part - 14* 


 *౪౨.* *సనకాదిసమారాధ్యపాదుకాయై నమో నమః! –* 


సనకాదులచేత పూజింపబడుతున్న దివ్యపాదుకలు గల తల్లి. శుభాగమ పంచకం ద్వారా ఆరాధింపబడే తల్లి. 


ఇక్కడి నుంచి వరుసగా మూడు నామములు అమ్మవారి ఉపాసకుల గురించి తెలియజేస్తున్నాయి. అమ్మవారి పాదుకలను సనకసనందాదులు సంపూర్ణంగా, సమగ్రంగా, సంతోషంగా ఆరాధన చేస్తూ ఉంటారు. పుట్టుకతోనే బహ్మవేత్తలైనటువంటి వారు వాళ్ళు. నారాయణుని అంశావతారం అని చెప్తున్నది భాగవతం. అటువంటి సనకసనందాదులు నిరంతరం ఆరాధించే పాదుకలు అమ్మవారివి. 


శ్రీవిద్యలో పాదుకా దీక్ష అని ఒకటి ఉంది. అది పరిపూర్ణమైన దీక్ష. ఆ పాదుకలు బ్రహ్మజ్ఞానానికి సంకేతం. సమస్త విశ్వానికీ మూలమైన పరబ్రహ్మ, పరబ్రహ్మయొక్క శక్తిని తెలియజేస్తున్నది. పరబ్రహ్మము తప్ప అన్యము లేదు ఈ జగత్తులో. అన్యంగా జగత్తు కనబడడం కేవలం మిథ్య మాత్రమే. పరమాత్మ తత్త్వమే ఉన్నది అనే స్థితియే నిజమైన పాదుకాదీక్ష. ఆ స్థితి బ్రహ్మవేత్తలకి ఉంటుంది. అటువంటి వారు పరతత్త్వ స్వరూపిణియైన అమ్మవారి యొక్క భావనలోనే నిరంతరం ఉంటారు అదే సమారాధన అంటే అర్థం. సమారాధన అంటే కేవలం బాహ్యపూజ మాత్రమే కాదు. నిరంతరం మనస్సు అనుసంధానింపబడడమే సమారాధన. 


అమ్మవారి ఉపాసనా సంప్రదాయంలో శుభాగమ పంచకము అని వైదికమైన సంప్రదాయంతో కూడిన తాత్త్వికమైన ఉపాసనా విధానాలున్నాయి. అవి సనక, సనంద, వశిష్ఠ, శుక, ఆదిగురువైన దక్షిణామూర్తి ఇత్యాదులు.. వీరినుంచి వచ్చినటువంటి వచ్చిన ఆచారాన్ని సమయాచారం, దక్షిణాచారం అంటారు. ఇవి శుభాగమములు అని చెప్పబడుతున్నాయి. ఇవి సనక మొదలైన వారి చేత ఏర్పడ్డాయి గనుక శుభాగమ పంచకం ద్వారా ఆరాధింపబడే తల్లి.


అమ్మవారి పాదుకాధ్యానం జరిగే చోటు సహస్రార కమలం. అమ్మవారి పాదచిహ్నములు భాసిస్తున్న చోటు సహస్రారం. పాదుకా స్మరణ చేసేటప్పుడు -


“వందే గురుపదద్వంద్వం అవాఙ్మానస గోచరం!  

రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహత్‌!!  - 


త్రిపుర యొక్క కాంతి సమూహము పాదములుగా భాసిస్తున్నది. ఆ పాదముల వద్దకు చేరుకోవడమే పాదుకాదీక్ష. సహస్రార కమలం వద్దకు చేరుకొని అక్కడ శివశక్తుల ఏకత్వాన్ని గ్రహించగలిగితే అది పాదుకాదీక్ష. అది సనకసనందాదులు బ్రహ్మానుభవం ద్వారా పొంది ఉన్నారు గనుక ‘సనకాదిసమారాధ్యపాదుకాయై నమోనమః’. 


 *౪౩.* *దేవర్షిభిస్స్తూయమానవైభవాయై నమో నమః! –* 


౧. మనలో ఉన్న ఆలోచనలు ఋషులు, ఇంద్రియశక్తులు దేవతలు. ఇంద్రియములతో అమ్మవారిని స్తుతిస్తూ, అర్చిస్తూ ఆలోచనలో అమ్మవారిని భావిస్తూ, ధ్యానిస్తూ, స్మరిస్తూ ఉంటే అదే ‘దేవర్షిభిస్స్తూయమానాత్మవైభవా’. 


౨. దేవతలు, ఋషులచేత స్తుతింపబడుతున్న తల్లి. 


అమ్మవారి వైభవాన్ని దేవతలు, ఋషులు స్తుతిస్తున్నారు. వైభవం – గొప్ప భావం, విశేషమైన భూతి, విభుత్వము అదే వైభవము. భూతి అనగా ఐశ్వర్యం. అమ్మవారి ఐశ్వర్యము, గుణము, లీల, మహిమ, తత్త్వము – ఇవన్నీ వైభవాలే. ఎక్కడా లేనంత సొగసు, గొప్పతనము, శోభ అమ్మవారి రూపనామగుణలీలాతత్త్వాలలో ఉన్నాయి. ఈ అయిదింటినీ కలిపి వైభవం అనాలి. అలా అమ్మవారి  రూపనామగుణలీలాతత్త్వమహిమా వైభవాలను నిరంతరం గానం చేసేవారు ఋషులు. వారిచేత నిరంతరం గానం చేయబడు తల్లి. 


ఎందుకంటే గొప్పతనాన్ని గొప్పవారే గుర్తించగలరు. మానవ ప్రజ్ఞకి అమ్మవారి వైభవం అందదు. అమ్మవారి వైభవాన్ని కీర్తించాలి అంటే రెండు రకాల ప్రజ్ఞ ఉండాలి. ఆ ప్రజ్ఞాస్థాయికి చేరిన వాళ్ళే అమ్మవారిని కీర్తించగలరు. తర్కవితర్కాలతో కూడిన మానవప్రజ్ఞ అమ్మవారి వైభవాన్ని గుర్తించలేదు, కీర్తించలేదు. తర్కవితర్కాలకు అతీతమైన దేవతా ప్రజ్ఞ, ఋషి ప్రజ్ఞ ఉండాలి. దివ్యమైన ప్రజ్ఞ దేవతా ప్రజ్ఞ, అలౌకికమైనది. అతీంద్రియమైన దర్శనశక్తి కలవాడు ఋషి. అతీంద్రియమైన జీవనము, ఉపాధి కలవారు దేవతలు. అలాంటి దేవతలు, ఋషుల చేత మాత్రమే గానం చేయబడగలిగినటువంటి వైభవం అమ్మవారిది. 


మన శరీరంలో ఇంద్రియశక్తులను దేవతలు అంటారు. కంటికి సూర్యుడు, చేతికి ఇంద్రుడు, చెవులకి దిగ్దేవతలు, నాసికకి వాయువు,  పాదములకు విష్ణువు – ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. ఋషులు అనగా ఆలోచనాపరులు. తపస్సంపన్నులు. మనలో ఉన్న ఆలోచనలు ఋషులు, ఇంద్రియశక్తులు దేవతలు. ఈ ఇంద్రియములతో అమ్మవారిని స్తుతిస్తూ, అర్చిస్తూ ఆలోచనలో అమ్మవారిని భావిస్తూ, ధ్యానిస్తూ, స్మరిస్తూ ఉంటే అదే ‘దేవర్షిభిస్స్తూయమానాత్మవైభవా’. ఇలాంటి మాటే ‘దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవా’ అని సహస్రనామాలలో ఉంది.


 *శ్రీమాత్రే నమః* 🙏🏻


⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

సభ్యత - సంస్కారాలు

 కుటుంబంలోని సభ్యత - సంస్కారాలు


ప్రతి ఆలోచనా పరుని యొక్క దృష్టి, ధ్యాస కుటుంబ నిర్మాణం వైపు ఆకర్షింపబడటం అవసరం. దీని ఉపయోగం ఎంతో ఉంది. వ్యక్తిత్వ వికాసం పొందినవాడే తన కుటుంబ శ్రేయస్సు గురించి కన్న కలలను సాకారం చేసుకోగలుగు తాడు. ఈ వికాస క్రమాన్ని కుటుంబ పాఠశాలలో మాత్రమే అధ్యయనం చేయడం జరుగుతుంది. అర్ధం చేసుకోవడానికి ప్రయోగశాల కూడా కుటుంబమే. కుటుంబంలోని సుసంస్కా రాల సంపద కుబేరుని సంపద కంటే ఎన్నో రెట్లు విలువైనది. అనేక రకాల నిర్మాణాలు ఉన్నాయి - సొంత ఇల్లు కట్టుకోవడం, కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకోవడం, నగర నిర్మాణం, ధర్మ శాలలు, పాఠశాలలు మున్నగునవి. తెలివైనవాడు, సమర్థుడు ఇటువంటి పనులను ఆనందంతో పూర్తి చేస్తాడు.


సాహిత్యకారులు, శాస్త్రవేత్తలు, కళాకారులు ఇంకా ఎన్నో సాధించిన వాళ్ళు ఉంటారు. చివరకు వాళ్లు అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోతారు. మరణించిన తరువాత కూడా వారు ప్రజల మనస్సుల్లో గుర్తుండిపోతారు. ఇటువంటి విజయాలు అసాధారణమైన ప్రతిభ మరియు నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. కోరిక ఉన్నంత మాత్రాన, ప్రతివాడు ఇటువంటి విజయాన్ని పొందలేడు. కుటుంబ నిర్మాణం వీటన్నిటికంటే ఎంతో మహత్వపూర్ణమైనది మరియు సరళమైనది కూడా. కుటుంబ శ్రేయస్సు కొరకు పాటుపడిన వ్యక్తి గురించి వార్తా పత్రికల్లో ప్రచురించకపోవచ్చు. కానీ పోలిస్తే నిజానికా పని అసాధారణమైనది మరియు సాటి లేనిది.


సంత్ వినోబా తల్లి గారి కుటుంబ సంరచన ఏ స్థాయిలో ఉందంటే, దాని ఫలితంగా మానవాళికి గొప్ప విజయాలను సాధించే అవకాశం లభించింది. శివాజీ, నెపోలియన్ మొదలగు ఎంతోమంది మహామనీషులు తమ తల్లుల ద్వారానే


సార్థకులైనారు. కౌసల్య, కుంతీ, మదాలస, శకుంతల, సీత మొదలైన వారు జన్మనివ్వటమే కాక వ్యక్తిత్వ నిర్మాణం కూడా చేశారు. గురు గోవిందసింగ్ వంటి ఎందరో యుగపురుషుల కథలు చరిత్రలు వింటే వారి కుటుంబం యొక్క ఉన్నత లక్షణాల ప్రభావం కూడా మనకి తెలుస్తుంది. కుటుంబ పరిస్థితులే భగత్సింగ్కి స్ఫూర్తిని అందించాయి. ప్రపంచ చరిత్రలో ఈరోజు వరకు కూడా, ఇటువంటి అనేక సంఘటన లను మనము చూస్తూనే ఉన్నాము. కుటుంబ సంరచనా ప్రయత్నశీలులందరూ గొప్ప సృజన కారుల వలె ప్రపంచం యొక్క గొప్ప సేవా సాధనా సంపన్నులైనారు.


కుటుంబ నిర్మాణం ఒక ప్రత్యేక స్థాయి సాధన. దీనికి యోగి వలె ప్రజ్ఞను, తపస్వి వలే ప్రతిభను కలిగి ఉండాలి. కళాకారుడు తనను తాను సాధించుకుంటాడు. కానీ కుటుంబ నిర్మాత విభిన్న స్వభావాలు మరియు స్థితులు గల సభ్యులందరి వ్యక్తిత్వ నిర్మాణం చేయాలి. ఈ పని ఎంతో ఆత్మీయత, సరైన దూరదృష్టి మరియు సమర్థవంతమైన సంసిద్ధతతో మాత్రమే సంభవము. ఇందు కొరకు భూమాతలా ఓర్పును, పర్వతంలా ధైర్యాన్ని, సూర్యునిలా తీక్షణతను కలిగి ఉండాలి. లేకపోతే గొప్ప సుఖసౌకర్యములను సమకూర్చి, అవసరాలను తీర్చినప్పటికి కూడా, కుటుంబం విఫలమవుతుంది. కుసంస్కారవంతులుగా తయారై, తమ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే స్థితిలో ఉంటారు. కుటుంబ నిర్మాణం కోసం తాను చేసిన సేవలకు, ఎన్నో రెట్ల అధిక లాభాన్ని వ్యక్తి ఆత్మ నిర్మాణ రూపంలో పొందుతాడు. ఇలా ప్రత్యక్ష లాభాలు రెండు. మూడవది పరోక్షము, సంస్కారిత కుటుంబాలను అందించటం ద్వారా ప్రపంచానికి, సమాజానికి సుఖకరమైన పురోభివృద్ధికి ఎంతో తోడ్పడిన వాళ్ళవుతారు.


Yug shakti Gayatri 2025 Feb 

https://chat.whatsapp.com/J8tGzFrz7zj2gq587yTnZM

*శ్రీ మల్లికార్జున ప్రపత్తి*_

 _*శ్రీ మల్లికార్జున ప్రపత్తి*_

⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️


_*కైలాసవాస కమలోద్భవనారదాది*_

_*మౌనీంద్రసంస్తుత మహోత్తమ దివ్యతేజ:*_

_*పాపాద్రిభేదనపవే పరమోపకారిన్*_

_*శ్రీ మల్లినాథ పరిపాలయ మామనాథం*_


_*భావము :*_ 🔱 


💐 కైలాసవాసా! బ్రహ్మ,నారదుడు మొదలైన మనీంద్రులచే స్తుతింపబడువాడా! ఉత్కృష్టమును, దివ్యమునైన తేజస్సు కలవాడా! పాపములనెడి పర్వతములను భేదించుట యందు వజ్రాయుధము వంటి వాడా! మిక్కలి ఉపకారము చేయువాడా! శ్రీమల్లికార్జున స్వామీ! అనాధుడనైన నన్ను పాలింపుము.


_*భూరిప్రపంచ పరిపాలన చిత్తవృత్తే*_

_*గౌరీ ముఖాంబుజ మనోహర సప్తసప్తే*_

_*దారిద్య్రదు:ఖ విపినోత్కట వీతిహోత్రా*_

_*శ్రీ మల్లినాథ పరిపాలయ మామనాథం*_


_*భావము :*_ 🔱


💐 విస్తారమైన ప్రపంచమును పరిపాలించు మన:ప్రవృత్తి కలవాడా! పార్వతీ దేవి యొక్క ముఖారవిందమునకు సుందరుడైన సూర్యుడా! దారిద్య్ర, దు:ఖమనెడి అడవికి గొప్ప అగ్నిహోత్రుడా! శ్రీమల్లికార్జున స్వామీ! అనాధుడనైన నన్ను పాలింపుము.


_*శ్రుత్వాత్వదీయచరితం భువనప్రసిద్ధం*_

_*వాణీముదంబునిధి మజ్జనమాతనోతి*_

_*సృష్ట్యాదిదేవ జగదీశ్వర దీనబంధో*_

_*శ్రీ మల్లినాథ పరిపాలయ మామనాథం*_


_*భావము :*_ 🔱  


💐 సృష్టికి ఆదిదేవుడా! జగత్ప్రభూ! దీనబంధూ! జగత్ప్రసిద్ధమైన నీ చరిత్రను విని సరస్వతీదేవి సంతోషమనెడి సముద్రము నందు ఓలలాడు చున్నది. శ్రీమల్లికార్జున స్వామీ! అనాధుడనైన నన్ను పాలింపుము.


_*జగతాం జనకం నమతాం సుఖదం*_

_*గిరి రాజసుతా ధవమీశమహం*_

_*నతపాప హరం జితమారశరం*_

_*ప్రణమామి హరం జగదేకసురం*_


_*భావము :*_ 🔱


💐 సర్వలోకములకు తండ్రియైన వాడును, నమస్కరించు వారికి సుఖము నిచ్చు వాడును, పార్వతీభర్తయు, భక్తుల పాపముల హరించు వాడును, జయింపబడిన మన్మథుని బాణములు కలవాడును, హరుడును, జగత్తునకేకైక దేవుడును అగు నీశ్వరునికి నమస్కారము చేయుచున్నాను.


_*గురుదేవ గణాధిప సాంబశివం*_

_*ద్విపదా నవఖండన చండభవం*_

_*జనతా మునితా వనబద్ధకరం*_

_*ప్రణమామి హరం జగదేకసురం*_


_*భావము :*_ 🔱


💐 గురుదేవుడును, గణాధిపుడును, అంబయైన పార్వతితో కూడిన వాడును, గజాసురుని సంహరించుట యందు భయంకరుడును, జనులను మునులను రక్షించుట యందు బద్ధహస్తుడును, జగత్తునకేకైక దేవుడునైన ఈశ్వరునికి నమస్కారము చేయుచున్నాను.


_*అఘనాశకరం గజచర్మధరం*_

_*ఫణిరాజవిరాజిత భవ్యతనుం*_

_*మధురాకృతి మందరచాపధరం*_

_*ప్రణమామి హరం జగదేకసురం*_


_*భావము :*_ 🔱


💐 పాపములను నాశనము చేయు వాడును, ఏనుగు చర్మమును ధరించిన వాడును, సర్పరాజులచే ప్రకాశించు ఉత్తమమైన శరీరము కలవాడును, మధురమైన ఆకారము కలవాడును, మందర పర్వతమును ధనుస్సుగా ధరించిన వాడును, జగత్తునేకైక దేవుడు నైన ఈశ్వరునికి నమస్కారము చేయుచున్నాను.


_*శివశంకరకింకర కల్పతరుం*_

_*భవబంధన భంజన మేరుఘనం*_

_*భువనత్రయరక్షణ భారవహం*_

_*ప్రణమామి హరం జగదేకసురం*_


_*భావము :*_ 🔱 


💐 సేవకులకు కల్పవృక్షము వంటివాడును, సంసార బంధములను భగ్నము చేయట యందు మేరువు వలె గొప్పవాడును, ముల్లోకములను రక్షించు భారమును వహించినవాడును, జగత్తునేకైక దేవుడునైన ఈశ్వరునికి నమస్కారము చేయుచున్నాను.


_*మహేశ్వరం మంజుల వాగ్విలాసం*_

_*గంగాధరం చంద్రకళావతంసం*_

_*గౌరీవరం శ్రీనిధిశైలవాసం*_

_*శ్రీమల్లినాధం శిరసానమామి*_


_*భావము :*_ 🔱


💐 మహేశ్వరుడును, మృదువైన వాగ్విలాసము కలవాడును, గంగను ధరించు వాడును, చంద్రకళ శిరోభూషణముగ కలవాడును, పార్వతీ భర్తయు, సంపదకు నిధియైన పర్వతము నివాసముగా కలవాడునైన శ్రీమల్లికార్జున స్వామికి శిరస్సుతో నమస్కరించుచున్నాను.


_*వినామల్లినాథం నదేవో నదేవ:*_

_*సదామల్లినాథం భజేహం భజేహం*_

_*కదామే పవర్గం ముదాయచ్ఛసిత్వం*_

_*నజానే నజానే గురోశ్రీగిరీశ*_


_*భావము :*_ 🔱


💐 మల్లికార్జున స్వామి తప్ప వేరే దేవుడు లేడు. మల్లికార్జున స్వామినే నేను పూజించెదను, భజించెదను. ఓ గురూ! శ్రీశైలాధీశ్వరా! నీవు నాకు సంతోషముతో మోక్షము నెప్పుడు ప్రసాదించెదవో ఎరుగను.


⚜️ _*హరహర మహాదేవ శంభో శంకర*_ 🔱


❀┉┅━❀🕉️❀┉┅━❀

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 

🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*

🚩 *హిందువునని గర్వించు*

🚩 *హిందువుగా జీవించు*


*సేకరణ:* ఆధ్యాత్మిక భక్తిప్రపంచం - ఈ సమూహంలో చేరడానికి *జైశ్రీరామ్* అని 7013672193 కి WhatsApp చేయండి.

⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️

హైదరాబాద్‌లోని ప్రాంతాలు*

 *హైదరాబాద్‌లోని ప్రాంతాలు*


ఆరో నిజాం కాలంలో అల్‌ బర్ట్ అబిద్ అనే యూదుడు ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా అబిడ్స్ గా మారిపోయింది.


గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ఖానాకాలక్రమేణా లంగర్‌ హౌజ్‌ మారింది. గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.


చిచ్‌లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో చెంచల్‌ గూడగా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.


 ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు కార్వాన్ అని పిలుస్తున్నారు.కోహినూర్ వజ్రాన్ని సానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు. వజ్రాలు, ముత్యాల వ్యాపారస్థుల సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్.


 ట్యాంక్ బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడీల గూడెం అని పిలిచేవారు.. క్రమంగా ఆ ఏరియా కవాడిగూడగా మారింది.


దోమలగూడ అసలు పేరు దో మల్ గూడ! పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారిపేరుమీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది దోమలగూడగా మారింది.


ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగంకు ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది.


హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో బేగం బజారుగా నిలిచిపోయింది.


ఐదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్ గంజ్ గా మారింది.

ఏడవ నిజామ్ పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ పేరుతో హిమాయత్ నగర్ గా స్థిరపడింది.

మొదటి తాలుఖ్ దార్( జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో హైదర్ గూడ ఏర్పడింది.

గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా వద్ద పనిచేసే మాలిక్ యాకూబ్ ఇంటి పరిసరాలు ఆయన పేరుతో మలక్ పేట్ గా మారింది.


తార్నాక అసలు పేరు తార్ నాకా! తార్ అంటే ముళ్లకంచె.. నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది తార్నాకగా మారింది.


శాలిబండ అసలు పేరు షా-అలీ-బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ నివసించేవాడు. ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు..కాలక్రమంలో అది శాలిబండగా మారింది.


నిజాం అశ్వికదళంలో అస్బీనియన్స్ అనే నీగ్రోజాతి ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్లు. అస్బీనియన్స్ ఉండేవాళ్లు కాబట్టి ఆ ఏరియాను హబ్సిగూడ పిలుస్తున్నారు.


ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనంవల్ల ఈ ప్రాంతానికి మదీనా అనే పేరు వచ్చింది.


చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లోతు బురద ఉండేది! బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడ్పల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో చిక్కడపల్లిగా మారిపోయింది.


అడిక్‌మెట్ అసలు పేరు అధికమెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు. కాలక్రమంలో అడిక్ మెట్ గా మారిపోయింది.


నిజాం కాలంలో నౌబత్ పహాడ్‌పై నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి నౌబత్

పహాడ్ అని పేరొచ్చింది.


గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్షా మార్నింగ్ వాక్ చేయడానికి టాంక్ బండ్ పరీవాహక ప్రాంతంలో  పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. బాగ్ ఉండటం వల్ల ఆ ఏరియాను బాగ్‌లింగంపల్లి అంటున్నారు.


సికిందర్ ఝా హయాంలో పనిచేసిన మీర్ ఆలం అనే మంత్రి స్మారకార్ధం తవ్వించిందే మీరాలం చెరువు. అక్కడే కూరగాయలతోట కూడా ఉండేది. దాన్ని మీరాలంమండి అనేవారు. ఇప్పటికీ మీరాలంమండి మార్కెట్ ఫేమస్!


నిజాం సైన్యంలో అరేబియన్‌ పటాలం ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా చాంద్రాయణగుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకుని ఉండేవారు. ఆ ఏరియానే ఇప్పడు బార్కాస్అని పిలుస్తున్నారు.


 తాడబండ్ అసలు పేరు తాడ్- బన్! తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అలా పిలిచేవారు. కాలక్రమంలో తాడ్‌ బండ్‌గా మారిపోయింది.


ఇర్రంమంజిల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం ఎర్రమంజిల్‌ గా స్థిరపడింది.


ఆరో నిజాం కాలంలో ఆ ప్యాలెస్‌ని రాయల్ బాంక్వెట్ హాల్‌ గా వాడేవారు.


కచ్ అనే తెగ నివసించే ఏరియా కాబట్టి కాచిగూడ అనే పేరొచ్చింది


మహ్మద్ ఖులీకుతుబ్ షా భాగమతిలకు మగసంతానం లేకపోవడంతో కూతురు హయత్ భక్షీ బేగంను గారాబంగా పెంచారు. ఆమెను ముద్దుగా లాడ్లీ అని పిలిచేవారు. చార్మినార్ పక్కన లాడ్‌ బజార్ లాడ్లీ అనే పేరుమీదనే స్థిరపడింది.


హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీ-రుల్-ముల్క్ అనే నవాబ్ కు రెండో నిజామ్ కానుకగా ఇచ్చాడు. 1785లో ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్, గార్డెన్ నిర్మించాడు. ముషీ-రుల్-ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం ముషీరాబాద్ గా స్థిరపడిపోయింది.


ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఒకచోట బస చేశాడు. ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు. ఫతే అంటే విజయం, మైదాన్ అంటే గ్రౌండ్! ఇప్పుడక్కడ ఎల్బీ స్టేడియం నిర్మించారు.


పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడుబాగ్-ఏ-ఆమ్ అని పిలిచేవారు: బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు! ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్-ఏ-ఆమ్ అన్నారు. ఇంగ్లీష్‌లో పోష్‌గా పబ్లిక్ గార్డెన్స్ అని పిలుస్తున్నారు.


మూసీ నుంచి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పై నుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట. అందుకే ఆ ఏరియాకు చాదర్ ఘాట్ అని పేరొచ్చింది.


1887-92 వరకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన నవాబ్ ఆస్మాన్ ఝా బహద్దూర్  పేరు మీద ఆస్మాన్ గఢ్ ఏర్పడింది.


నవాబ్ నిజాం ఆలీ ఖాన్ తల్లి ఉమ్దా బేగం పేరు మీద ఉమ్దా బజార్ ఏర్పడింది. హుస్సేని ఆలంకు ఒక మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది. ఆసఫ్ జాహీల కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్గా ప్రసిద్ధిగాంచింది.


గౌలీ అంటే గొర్రెల కాపరి! వాళ్లంతా ఎక్కువగా ఉండేవాళ్లు కాబట్టి ఆ ప్రాంతం గౌలిగూడగా స్థిరపడిపోయింది.


రెండో నిజాం నవాబ్ అలీ ఖాన్ తన భార్య తహ్నియత్ ఉన్నిసా బేగం కోసం మౌలాలీ సమీపంలో ఒక ప్యాలెస్, ఉద్యానవనాన్ని నిర్మించాడు. లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లల్లాగూడ అని పిలిచారు. తర్వాత కాలంలో లాలాగూడగా మారింది. 


1933కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడేచౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం ఆధికారంలోకి వచ్చాక, ఆ ఏరియాని సుల్తాన్ బజార్ అని మార్చేశారు.


రెండో అసఫ్ జాహీ తన కూతురు బషీర్- ఉల్- నిసా బేగంకు కట్నం కింద 1796లో కొంత జాగీర్ రాసిచ్చాడు. బేగంపేట ఏరియా ఆమె పేరుమీదనే స్థిరపడింది. 


1853లో నవాబ్ నసీరుద్దౌలా హయాంలో పండిట్ సోనాజీ అనే రెవెన్యూ ఉద్యోగి ఉండేవాడు. ఆయన ఇల్లు ఆ రాజప్రాసాదాన్ని తలపించేది! లాండ్ మార్కుగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని మొదట్లో సోనాజీగూడ అని పిలిచేవారు. తర్వాత సోమాజీగూడ అయింది.


రికాబ్ గంజ్ ని మొదట్లో గంజ్ రికాబ్ అని పిలిచేవారు. తర్వాతి క్రమంలో రికాబ్ గంజ్‌గా మారింది. రికాబ్ అనేది ఒక కంపెనీ పేరు. గంజ్ అంటే హోల్ సేల్ షాపింగ్ కాంప్లెక్స్! మొఘలుల కాలంలో ఆ ఏరియాలో మిలటరీ ఆఫీసర్లు ఉండేవారు.


రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధాని పనిచేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి చార్మినార్‌కు 4 మైళ్ల దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం సరూర్ నగర్ అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరుమీదనే స్థిరపడింది.


నిజాం కాలంలో మినిస్టర్ల క్వార్టర్లన్నీ డబిర్ పురాలో ఉండేవి! డబీర్ అంటే పండితుడు అని అర్ధం. ఇంటెలెక్చువల్స్ అంతా ఉండే ఏరియా కాబట్టి దానికా పేరొచ్చింది.


అంబర్ అంటే ఉర్దూలో మేఘాలు అని అర్ధం. పేట అంటే కాలనీ. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆ ఏరియా ఎప్పుడూ మేఘావృతమై ఉండేది. దాంతో అది అంబర్‌ పేటగా స్థిరపడిపోయింది.


చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది చాంద్రాయణగుట్టగా మారిపోయింది.


చిలకలు ఎక్కువగా ఉండేవి కాబట్టి చిలకలగూడకు ఆ పేరొచ్చింది. సాయంత్రం కాగానే పక్కనే ఉన్న సీతాఫల్ మండి మార్కెట్ మీద గుంపులుగుంపులుగా వచ్చి వాలి పళ్లు తిని వెళ్లేవి!


మంగళ్ హాట్ అసలు పేరు మంగళ్‌ హత్! మంగళ్ అంటే మంగళవారం. హత్ అంటే సంత. ప్రతి మంగళవారం అక్కడ సంత జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మంగళ్ హత్ అనే పిలిచేవారు. కాలక్రమంలో మంగళ్‌హాట్‌గా మారిపోయింది.


నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్అనే దివాన్‌కు నెఖ్‌ నామ్‌ ఖాన్  అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెఖ్- నామ్- పల్లిగా పిలిచేవారు. ఇప్పుడది నాంపల్లిగా మారిపోయింది.


1591లో గోల్కొండ రాజ్యానికి ప్రధానిగా చేసిన సయ్యద్ మీర్ మోమిన్ పేరుమీద సైదాబాద్ ఏర్పడిందని ప్రచారంలో ఉంది. మొదట్లో సయ్యదాబాద్ అనేవారు. తర్వాత సైదాబాద్ అని పిలుస్తున్నారు.


టప్పా అంటే ఉర్దూలో ఉత్తరం అని అర్ధం. చబుత్ర అంటే గ్రామం. నిజాం కాలంలో ఆ ఏరియాలో పోస్టాఫీసులుండేవి. అక్కడి నుంచే సిటీ అంతా బట్వాడా జరిగేది. అందుకే ఆ ఏరియాని టప్పాచబుత్ర అని పిలుస్తున్నారు.


లాలాగూడ స్టేషన్ దాటిన తర్వాత ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర తుకారాం అనే గేట్ కీపర్ పనిచేసేవాడు. ఈస్ట్ మారేడుపల్లి, అడ్డగుట్ట నుంచి వచ్చేవాళ్లంతా గేట్ కీపర్ తుకారాం పేరునే లాండ్ మార్కుగా వాడుకునేవారు. అలా ఆ ప్రాంతం తుకారాంగేట్ గా మారిపోయింది.


హైదరాబాద్ కు చార్మినార్ గుండెకాయ అయితే, పాతబస్తీకి యాఖుత్పురా గుండెకాయ. యాఖుత్ అంటే నీలంరంగు రత్నం అని అర్ధం. నిజాం రాజుకి పచ్చలంటే వల్లమాలిన అభిమానం. అందుకే ఆ ఏరియాకు యాఖుత్ పురా అని నవాబే నామకరణం చేశాడు.