29, జనవరి 2026, గురువారం

సాధన చతుష్టయ సంపత్తి. 40 .

 సాధన చతుష్టయ సంపత్తి. 40 .      

( మహావాక్యముల విచారణ )


మనం వేదాన్త విషయాలు చదువుతున్నప్పుడు, ' అసలు కొరుకుడు పడడం లేదు, కొద్దిగా కష్టంగా, విషయం అయితే అర్ధమైనట్లే వుంటున్నది కానీ, పూర్తిగా చదివిన తరువాత, చదివినది నిలబడడం లేదు, ఇది మనకు సంబంధించినది కాదేమో అనిపిస్తుంది. ' అని ఇలాంటి స్పందనలు తరుచుగా వింటూ ఉంటాము.


దీనికి సంబంధించిన వివరణ, ఆదిశంకరులు, ' వివేక చూడామణి ' లో విశదంగా చెప్పడం జరిగింది, సంస్కృత శ్లోకాల ద్వారా. వీటిని మన సౌలభ్యం కోసం, సులభమైన శైలి లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ఓం శ్రీగురుభ్యోమ్ నమ :


ఆత్మ తత్వాన్ని గురించి, జగద్గురువులు చెబుతున్నారు.


* * *

శ్లో.  

అంతభేదమనపాస్త లక్షణం నిస్తరంగ జలరాశి నిశ్చలం /

      నిత్యముక్తమవిభక్తమూర్తి యద్బ్రహ్మ తత్వమసి భావయాత్మని // 260 .


శిష్యా ! భేదములను పోగొట్టగలదీ, సచ్చిదానంద స్వరూప లక్షణము కలది, అలలు లేని సముద్రము వలే నిశ్చలంగా వున్నదీ, బంధ రహిత స్వరూపమైనట్టిది అయిన అఖండ తత్వముగల ఏబ్రహ్మము వున్నదో, ‘ అది నీవే ‘ అనే నిశ్చయమైన విచారణలో వుండుము. 


* * *

ఆత్మకు, జీవుడు - ఈశ్వరుడు, జగత్తు - బ్రహ్మము, జ్ఞానము - అజ్ఞానము, సుఖము - దుఃఖము, నీవు - నేను అనే భేదభావనలు వుండవు.    


సముద్రములో అనేక కెరటాల తాకిడివున్నా, కెరటాలు లేక నిశ్చలంగావున్నా, సముద్ర అంతరంగం ఏ అలజడి లేకుండా నిశ్చలంగా, గంభీరంగా, అపారంగా ఎలా కనబడుతున్నదో అదేవిధంగా, అజ్ఞానంచే మొదట అంత : కరణము అలజడులకు గురి అయినా, జగత్తు నానావిధమైన రూపాలతో కనబడుతున్నా, జ్ఞానదృష్టితో చూడడం మొదలుపెట్టినవానికి, కల్లోలరహితంగా కనిపిస్తుంది.  


అదే ‘ బంధరహిత స్థితి. ముక్తస్వరూపము. అవిభక్త స్వరూపము. ‘ అట్టి పరబ్రహ్మమే నీవు అయివున్నావు, అనే భావన వదలకుము. ఇదే పరమ విజ్ఞానపదము.  


* * *

శ్లో.  

ఏకమేవ సదనేక కారణం కారణాంతరనిరాస్య కారణం /

      కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మతత్వమసి భావయాత్మని // 261 .


పరబ్రహ్మము ఒక్కటే, అన్నికారణములకు మూలమైవున్నది. ఒకే పరబ్రహ్మము సత్వగుణ ప్రధానంగా నిమిత్త కారణం గానూ, తమోగుణ ప్రధానంగా ఉపాదాన కారణంగానూ వున్నది.    


శ్రుతులు చెప్పినట్లు పరబ్రహ్మమునకు, వేరొక కారణవస్తువు లేదు. తనకు తానే కారణం. ఆమాటకు వస్తే, పరమాత్మ తత్త్వం తెలియ జేయడానికి విజ్ఞులు కార్యకారణ సూత్రమును పరబ్రహ్మమునకు ఆపాదిoచారు కానీ, నిరుపాధికమగు పరబ్రహ్మము కార్యకారణ విలక్షణము. 


బ్రహ్మము స్వయం ప్రకాశకము. ఆ బ్రహ్మమే నీవు అయితివి. నేను ఫలానా నామధేయము కలవాడిననే జ్ఞానం మానవునకు ఎలా నిరపేక్షికమైనదో, సంశయ రహితమైనదో, అదే విధంగా, ‘ బ్రహ్మజ్ఞానికి, నేను బ్రహ్మమును అనే భావన సందిగ్ధము లేనిది. అనగా నిశ్చయమైనది. ‘


* * *

ఏ పరబ్రహ్మము సంకల్ప, వికల్ప రహితమో, మహా గొప్పదో, నాశ రహితమో, నశించే వాటికీ లౌకిక విషయాలకు వేరుగా వుంటుందో, ఏది శ్రేష్టమో, ఏది శాశ్వతమో, ఏది అపార సుఖమో, నిర్లిప్తమో, మాయారహితమో,అట్టి పరబ్రహ్మము నీవే అయి వున్నావు. ఈ విధంగా నిరంతరమూ నీ హృదయంలో భావించు.  


ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక మహర్షి తన కుమారుడు శ్వేతకేతువునకు, తొమ్మిదిసార్లు ‘ తత్వమసి ’ మహావాక్యాన్ని బోధించాడు.   


అదే విధంగా జగద్గురువులు, తమ శిష్యగణంపై ప్రీతితో, అంతకన్నా ఎక్కువసార్లు ఆ వాక్యార్ధాన్ని వివరిస్తున్నారు.


* * *

స్వస్తి.  

ఆదిశంకరుల అనుగ్రహంతో మరికొంత రేపు. 

ప్రేమతో,

గండవరపు ప్రభాకర్.


* * *

About Sri Anandamayi Ma (1896-1982)

Sri Anandamayi Ma was one of the greatest spiritual figures of the 20th century, widely revered as a saint, a guru, and an incarnation of God. 


Her devotees ranged from prime ministers and great saints down to the simplest villagers. People came to India from all over the world to simply see her and sit in her presence. Though virtually she was not having formal education,, she spoke with the authority of direct experience and captivated all with her sweetness and power. 


Although she never gave a lecture or established an institution, many Ashrams and Schools were set up in her name throughout India. To this day, all those who turn to her, feel both her presence and her guidance. Her life and teachings are an inspiration to all who feel drawn to the spiritual path.


* * *

Born into a prestigious but poor Brahmin family in rural Bengal on August 30, 1896, Ma was given the name, Nirmala Sundari Devi, the Goddess of Taintless Beauty. Her father, Shri Bipin Bhattacharya, spent most of his time absorbed in worship and devotional chanting while her mother, Mokshada Sundari Devi, was the epitome of dignity and devotion to her family’s welfare. 


Nirmala’s birth was preceded by many miraculous signs and visions and she exhibited perfect awareness and consciousness from the day she was born. 


She never uttered a cry, but was peaceful and radiant, surprising people who were present at the time of her birth.


At each stage of life, ‘ Ma ‘ spontaneously manifested an example of perfection in fulfilling her particular role. Even as a toddler, Nirmala was often seen in states of spiritual ecstasy, especially during kirtan, or devotional singing.  


As a small girl, she was the embodiment of sweetness and beauty, manifesting no desire of her own, but living to serve others, seeing only the One in All. 


* * *

The traits of absolute obedience, and perfect purity manifested in all her behaviour, along with the mystical quality of absorption in inner yogic states and visions. Her irresistibly cheerful and loving nature made her a favourite among Muslim and Hindu villagers alike and she delighted everyone by fulfilling their desires.


On occasion, while playing with her friends, she would become immobile, and with her face shining with inner effulgence and divine mantras would issue from her lips in flawless accents. 


When listening to kirtan, she would enter into a deep inner state with tears streaming down her face. She took complete joy in nature, always happiest when she was outside where she could commune with animals, plants, and trees as her intimate friends.


💐🙏💐

శ్రీదత్త పురాణము (27)

 శ్రీదత్త పురాణము (27)


పతంగం : యదువల్లభా ! పతంగమంటే తెలుసుగా, మిడత. ఇది నాకు మరోరకం పాఠం చెప్పింది. దీనికి మంటలు కనబడితే చాలు ఒళ్ళు తెలియదు. మాడిపోతామని తెలిసీ నిగ్రహించుకోలేదు. ఆనందంగా ఎగురుకుంటూ వెళ్ళి మసి అయిపోతుంది. ప్రపంచంలో కనిపించే రకరకాల యోషిత్ (స్త్రీ) హిరణ్య అంబరాది ఆకర్షణలకి మానవుడు లోనై అలాగ బలైపోతున్నాడు. వట్టి తోలుతిత్తి అని తెలిసికూడా సౌందర్యాలకు మోహపడి ప్రలోభాలకు ఆశపడి జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటున్నాడు. అహంకరించి మసి అయిపోతున్నాడు. ఈ సందేశం అందించింది కనుక మిడత నాకు మరో గురువు.


మధుకరం : మధుకరం అంటే తేనెటీగ. ఇది పాఠాలు నేర్పింది. పువ్వు పువ్వుకి వెళ్ళి పువ్వుకి నొప్పి కలగకుండా బొట్టు బొట్టుగా మకరందం గ్రహించి పొట్టనింపు కుంటుంది తేనెటీగ. యోగి కూడా ఇలాగే ఇల్లిల్లు తిరిగి ఇంటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఇంటికొక ముద్దగా ఆహారం స్వీకరించి పొట్టపోసుకోవాలి. ఏ పువ్వు దగ్గర మకరందాన్ని ఆ పువ్వు దగ్గరే గ్రోలినట్లు ఏ గుమ్మం దగ్గర ముద్దను ఆ గుమ్మం దగ్గరే ఆరగించాలి. కడుపునిండిన తక్షణం ఆ పూటకు మధూకర వృత్తిని మానుకోవాలి. మనకు రకరకాల శాస్త్రాలున్నాయి. వాటిలోని విజ్ఞాన సారాన్ని గ్రహించడంలో కూడా యోగి ఇదే మధూకర వృత్తిని ఆవలంభించాలి. తేనెటీగలు మకరందాన్ని కూడబెట్టి తేనె పట్టులు కడితే చివరికి అవి ఆ తేనెను అపహరించేవారి చేతిలో మృతి చెందుతున్నాయి. కాబట్టి యోగి ఆహారాన్ని కూడ బెట్టకూడదు. ఈ రెండు పాఠాలు నేర్చుకున్నాను మధుకరాల నుంచి.


ఏనుగు : నువ్వు రాజువి కాబట్టి, అడవిలో స్వేచ్ఛగా సంచరించే మదపుటేనుగుల్ని ఎలా బంధిస్తారో ఎరుగుదువు. ఒక పెద్ద గొయ్యి తవ్వి, దాని మీద సన్నని కర్రలు వేసి, వాటి మీద గడ్డి పరచి, దాని మీద మధ్యలో ఒక పెద్ద ఆడ ఏనుగు బొమ్మను నిలబెట్టి, మీ రాజుభటులు చుట్టు పక్కల పొదలలో దాగి, పొంచి ఉంటారు. అటువైపు వచ్చిన మదపు టేనుగు ఒంటరిగా ఒక ఆడ ఏనుగు దొరికిందని పరుగు పరుగున వచ్చి గోతిలో పడుతుంది. ఇది కాక నిజమైన ఆడ ఏనుగే దొరికి ఒక మదపుటేనుగు దాని వెంట పడితే మరికొన్ని మదపుటేనుగులు ఎగబడి, పరస్పరం పోరాడుకొని మరణిస్తాయి. పురుషుడికి స్త్రీ వ్యామోహం ఎంతటి వినాశానికి దారితీస్తుందో ఈ గజ వృత్తాంతం తెలియజేస్తోంది.

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*గురువారం 29 జనవరి 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                    1️⃣1️⃣9️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


      *సంపూర్ణ మహాభారతము*       

     

                  *119 వ రోజు*                    

*వన పర్వము పంచమాశ్వాసము*


*కౌశికుడు ధర్మవ్యాధుని అనునయించుట*```


కౌశికుడు ధర్మవ్యాధునితో “అయ్యా! నీవు వ్యాధుని జన్మ ఎత్తిననూ బ్రాహ్మణుని వలె ప్రవర్తిస్తున్నావు. నీవు నిజంగా బ్రాహ్మణుడివే. ఎందుకనగా పుట్టుకతో బ్రాహ్మణుడైనా శూద్రుని వలె ప్రవర్తించిన అతడు శూద్రుని కంటే నీచుడు ఔతాడు. జన్మతః శూద్రుడైనా సత్యమూ, శౌచమూ, ధర్మము అవలంబించిన అతడు సద్బ్రాహ్మణునితో సమానమని పెద్దలు చెప్పారు కదా! నీ కర్మల వలన శూద్రుడిగా జన్మించినందుకు బాధపడ వలదు. మనం చేసే కర్మల వలన సుఖదుఃఖాలు ఏర్పడతాయి. ప్రాజ్ఞులు రెండింటిని సమానంగా చూస్తారు. సత్కర్మలచే పాపాన్ని పోగొట్టుకుంటారు. మూఢులు అప్రియానికి కలత చెంది, ప్రియములు జరిగినప్పుడు ఆనందిస్తారు. అందువలన హృదయతాపం హెచ్చుతుందే కాని తగ్గదు. ధీరులు రెండింటినీ సమ దృష్టితో చూస్తారు. జరిగిన దానికి జరగబోవుదానికి దుఃఖించక అన్నిటినీ సమదృష్టితో చూడటం ప్రాజ్ఞుల ధర్మం. దుఃఖము వలన విచక్షణ కోల్పోతారు. కనుక అన్నింటినీ సమదృష్టితో చూసి శుభములు పొంది ఆనందంగా ఉండుము. అన్ని భూతములందు సమత్వము కలిగి ధీరుడవై ఉండుము నీకు మేలు జరుగుతుంది” అని అనునయ వాక్యాలు చెప్పాడు. 


ధర్మవ్యాధుడు “మహానుభావా! తమరు చెప్పినట్లే నేను దు॰ఖమును వదిలినాను. నాకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను” అన్నాడు. 


కౌశికుడు “మహాత్మా! నీవు పుణ్యమూర్తివి. నీ దర్శనంతో నాకు ఎన్నో ధర్మాలు తెలిసాయి నా జన్మ ధన్యం అయింది. ఇక నాకు శలవు ప్రసాదించండి” అని అడిగాడు. 


ఆ తరువాత కౌశికుడు తన తల్లితండ్రులను చేరుకుని వారిని సేవించి తరించాడు. కనుక ధర్మరాజా! నీవు అడిగినట్లు పతివ్రతా ధర్మము, మాతాపితల శుశ్రూష, హీనకులములో పుట్టినా ఎలా ధర్మాత్ముడు కాగలడో వివరించాను 

కదా” అన్నాడు మార్కండేయ మహర్షి.

```

      *అగ్నిదేవుని తపసు*```


ధర్మరాజు “మహర్షీ! నీ దయవలన ఎన్నో విషయములు తెలుసుకున్నాను. పూర్వము అగ్ని దేవుడు ఎందుకు తపస్సు చేసాడు? అంగీరసుడు అగ్నిగా మారటానికి కారణం ఏమిటి? అగ్నులు ఎన్ని విధాలు? వివరిస్తారా?” అని అడిగాడు. 


మార్కండేయ మహర్షి “ధర్మనందనా! అగ్ని దేవుడు హవ్యవాహనుడు. యజ్ఞ యాగాదులలో వేసే హోమద్రవ్యాలను అగ్ని దేవుడు దేవతలకు చేరుస్తాడు. ఇలా చేసి విసుగు చెందిన అగ్ని దేవుడు హవిస్సులను అందించడం మాని అడవులకు వెళ్ళి తపస్సు చేయనారంభించాడు. అతని దేహం కృశించి పోయింది. అగ్ని మనసులో “నేను ఇలా నా విధులను విడిచి తపసు చేసుకుంటున్నాను ఏమిటి? నేను లేకపోతే లోకం స్థబించదు కదా! అలా స్తంభించిన బ్రహ్మదేవుడు వేరొకరిని నా పదవిలో పెట్టడా! ఇక నేను ఇక్కడ ఉండక వెంటనే పోవలయును” అని తలచి తపము చాలించి తన స్వస్థలముకు వెళ్ళుచుండగా బ్రహ్మదేవుడు తన పదవిలో నియమించిన అంగీరసుడనే అగ్ని మూడు లోకాలలో అగ్ని కార్యములు నిర్వర్తించడం చూసి భయపడ్డాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

29జనవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌷గురువారం🌷*

 *🌹29జనవరి2026🌹*      

   *దృగ్గణిత పంచాంగం* 

               

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - శుక్ల పక్షం*


*తిథి  : ఏకాదశి* ‌మ 01.55 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం   : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : రోహిణి* ఉ 07.31 *మృగశిర* (30) తె 05.29 వరకు 

*యోగం : ఐంద్ర* రా 08.27 వరకు ఉపరి *వైధృతి*

*కరణం  : భద్ర* మ 01.55 *బవ* రా 12.32 ఉపరి *బాలువ*


*సాధారణ శుభ సమయాలు*

          *- ఈరోజు లేవు -*

అమృత కాలం  : *రా 09.26 - 10.54*

అభిజిత్ కాలం  : *ప 11.58 - 12.43*

*వర్జ్యం    : రా 12.39 - 02.07*

*దుర్ముహూర్తం  : ఉ 10.27 - 11.12 మ 03.00 - 03.46*

*రాహు కాలం   : మ 01.46 - 03.11*

గుళికకాళం      : *ఉ 09.30 - 10.55*

యమగండం    : *ఉ 06.39 - 08.04*

సూర్యరాశి : *మకరం*                        

చంద్రరాశి : *వృషభం/మిధునం*

సూర్యోదయం :*ఉ 06.49*

సూర్యాస్తమయం :*సా 06.10*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.39 - 08.56*

సంగవ కాలం         :     *08.56 - 11.12*

మధ్యాహ్న కాలం    :    *11.12 - 01.29*

అపరాహ్న కాలం    : *మ 01.29 - 03.46*

*ఆబ్ధికం తిధి        : తిథి ద్వయం ఏకాదశి/ద్వాదశి*

సాయంకాలం      :*సా 03.46 - 06.02*

ప్రదోష కాలం       :*సా 06.02 - 08.34*

రాత్రి కాలం         :*రా 08.34 - 11.55*

నిశీధి కాలం       :*రా 11.55 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.58-05.48*

******************************

        *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*!!.ఓం శ్రీ సద్గరుభ్యో నమః!!*


*త్సర్వశ్రుతిశిరోరత్న*

*విరాజిత పదాంబుజః*

*వేదాంతాంబుజసూర్యోయః* 

*తస్మై శ్రీగురవే నమః*


*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

మాఘ పురాణం - 11వ*

  🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷గురువారం 29 జనవరి 2026🌷*

_*మాఘ పురాణం - 11వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *29వ తేదీ గురువారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు*

``

మాఘ పురాణం లోని పదకొండవ అధ్యాయం, బలవంతుడైన భీముడి గర్వం మరియు అతని మార్పు గురించి చెబుతుంది. గర్వంతో ఇతరులతో గొప్పలు చెప్పుకునే భీముడు, ముని సలహా మేరకు ఏకాదశి వ్రతం పాటించి, వినయం, సంయమం పెంచుకుంటాడు. వ్రతం అతని గర్వాన్ని తగ్గించి, వినయంతో నింపి, ఇతరులకు సహాయం చేసేలా మార్చేస్తుంది. 

ఈ కథ, గర్వం హానికరమని, వినయం, సంయమం మన జీవితాలను మెరుగుపరుస్తాయని బోధిస్తుంది


*భీముని ఏకాదశి వ్రతము*```


సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘ మాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని, నదిలేని చోట తటాకమందు గాని, తటాకము కూడా అందుబాటులో లేని యెడల నూతివద్దగానీ స్నానము చేసినచో పాపములన్నియు హరించిపోవును. 

పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీతీరమందున్న అగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులు అందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొందినవారై యున్నారు.


అతడు చిన్నతనములో గడుసరి, పెంకివాడు, అతడు తల్లితండ్రుల భయ భక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొను చుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్దుడయ్యెను, తనకున్న ధనమును తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోవునపుడిట్లు ఆలోచించెను. “అయ్యో! నేనెంతటి పాత్ముడనైతిని ధనము, శరీర బలము వున్నదను మనో గర్వముతో జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేక పోయినానుగదా” అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయెను. 


అన్ని రోజులు ఒకే విధముగా నుండవు కదా! ఆ నాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనమూ, బంగారమూ యెత్తుకొని పోయిరి.

అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా, అతని సంపద అంతయూ అపహరింపబడినది అన్యాయముగా ఆర్జించిన ధనము. అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘ మాసము నడచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీస్నాన ఫలముదక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబిగసి పోవుచూ ‘నారాయణా’ అని ప్రాణములు విడచినాడు. దివ్యమైన యమునా నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములు అన్నియూ నశించిపోయి వైకుంఠ వాసుడయ్యెను, అని వశిష్టుడు తెలియజేసెను.


పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి యేమాత్రమూ ఆగలేనివాడు బండెడు అన్నము అయినా చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది. కాని ఒక విషయములో బెంగతో ఉండెను. అదేమందువా “ఏకాదశీ నాడు భోజనము చేయకూడదు కదా! భోజనము చేసినచో ఫలము దక్కదుకదా! అని విచారించి, తన పురోహితుని కడకు బోయి, ఓయీ పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనెదరుగదా దాని విశిష్టత యేమి”, అని భీముడు అడిగెను.


అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు “అవును భీమసేనా! ఆరోజు అన్ని దినములకంటెను ప్రశస్తమైనది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. కనుక, అన్ని జాతులవారును ఏకాదశీ వ్రతము చేయవచ్చును” అని పలికెను. 


సరే నేను అటులనే చేయుదును. గాని, “విప్రోత్తమా! నేను భోజన ప్రియుడునన్న సంగతి జగద్విదితమే గదా! ఒక ఘడియ ఆలస్యమైననూ నేను ఆకలికి తాళజాలను, కనుక, ఏకాదశినాడు ఉపవాసం ఉండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి యెక్కువగా నుండును. కావున ఆకలి దాహము తీరులాగున, ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహానీయుము”, అని భీముడు పలికెను.


భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి “రాజా! ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు, కాన, నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ద ఏకాదశి మహా శ్రేష్ఠమైనది, దానిని మించిన పర్వదినము మరి ఒక్కటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదై యుండును. అటువంటి ఏకాదశీ సమాన మగునది మరి ఏమియులేదు. సంవత్సరము నందు వచ్చు ఇరువది నాలుగు ఏకాదశి లలో  మాఘశుద్ద ఏకాదశి మహా పర్వదినము కావున, ఆ దినము ఏకాదశీ వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు యేమాత్రమును సంశయములేదు. కాన, ఓ భీమ సేనా! నీవు తప్పక మాఘశుద్ద ఏకాదశి వ్రతము నాచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము, దీక్షతోనున్న యెడల ఆకలి యేమాత్రమునూ కలుగదు, నియమము తప్పకూడదు” అని వివరించెను.  


ధౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాససం ఉండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని “భీమ ఏకాదశి” అని పిలుతురు. అంతియే గాక, ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాస మందే వచ్చును. కాన మహా శివరాత్రి మహత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళువువై ఆలకింపుము అని వశిష్టులవారు దిలీప మహారాజుతో నిటులపలికిరి..

ఏకాదశి మహా విష్ణువునకు యెటుల ప్రీతికరమైన దినమో, అదే విధముగా మాఘ చతుర్దశి అనగా, శివచతుర్దశి. దీనినే “శివరాత్రీ” యని అందురు. అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము. మాఘమాసమందలి అమావాస్యకు ముందు రోజున వచ్చెడి చతుర్దశి దీనినే “మహాశివరాత్రి” అని అందరూ పిలిచెదరు. 

ఇది మాఘ మాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. 

ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణపక్షములో వచ్చు మహా శివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. 

ఆ రోజు నదిలోగాని, తటాకమందుగాని లేక నూతి వద్దగాని స్నానము చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్ఠోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలయును. అటుల పూజించి, అమావాస్య స్నానము కూడా చేసినయెడల యెంతటి పాపములు కలిగియున్ననూ, అవన్నియు వెంటనే హరించిపోయి, కైలాస ప్రాప్తి కలుగును. 

శివపూజా విధానములో శివరాత్రి కంటె మించినది మరియొకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కావున  శివరాత్రి దినమున ప్రతిఒక్కరూ అనగా జాతి భేదముతో నిమిత్తము లేక, అందరూ శివరాత్రి వ్రతమును ఆచరించి  జాగరణ చేయవలయును.

మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి, వాటిని కాల్చి, తాను తిని, తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరి ఏదియూ తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు క్రూర మృగములు సైతం ఆ బోయ వానిని చూచి భయపడి పారిపోయేడివి, అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు. ప్రతి దినము వలె ఒక నాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులు ఏమియూ కంట పడలేదు. సాయంకాలం అగుచున్నది. వట్టి చేతులతో యింటికి వెళ్ళుటకు మనస్సంగీకరించనందున ప్రొద్దు కృంగిపోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు యెదురు చూచుచుండెను.

తెల్లవారుతున్నకొలదీ చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న యెండుటాకులు రాలి చెట్టుక్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండితినక రాత్రంతా జాగరణతో వున్నాడు. తనకు తెలియక పోయిననూ మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట, తిండిలేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.

జరామరణములకు హెచ్చుతగ్గులుగాని, శిశు వృద్ధ భేదములుగాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములనుబట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే, మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసికొనిపోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునదిలేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు – పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువుతీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి, ఉచిత ఆసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణం ఏమని ప్రశ్నించెను. అంతట యముడు, “మహేశా! చాలా దినములకు మీ దర్శనభాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను.

మీ దర్శన కారణమేమనగా, ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి వున్నాడు. ఒక దినమున అనగా మహా శివరాత్రినాడు తాను యాదృచ్చికముగా జంతువులు దొరకనందున తిండితినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి యంతయు మెలకువగానున్నాడేగాని, చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంతమాత్రమున అతనికి కైవల్యము దొరకునా” అని యముడు విన్నవించుకున్నాడు. 


“యమధర్మరాజా! నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమునందు  బిల్వపత్రములు నాపై వేసి తిండి తినక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాప ముక్తుడు కాగలడు.ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక, ఈ బోయవాడు పాపాత్ముడైనను, ఆనాటి శివరాత్రి మహిమవలన నా సాయుజ్యము ప్రాప్తమైనది” అని పరమేశ్వరుదు వివరించెను.```


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷```


*మాఘపురాణం పదకొండవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*గురువారం 29 జనవరి 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                    1️⃣1️⃣9️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


      *సంపూర్ణ మహాభారతము*       

     

                  *119 వ రోజు*                    

*వన పర్వము పంచమాశ్వాసము*


*కౌశికుడు ధర్మవ్యాధుని అనునయించుట*```


కౌశికుడు ధర్మవ్యాధునితో “అయ్యా! నీవు వ్యాధుని జన్మ ఎత్తిననూ బ్రాహ్మణుని వలె ప్రవర్తిస్తున్నావు. నీవు నిజంగా బ్రాహ్మణుడివే. ఎందుకనగా పుట్టుకతో బ్రాహ్మణుడైనా శూద్రుని వలె ప్రవర్తించిన అతడు శూద్రుని కంటే నీచుడు ఔతాడు. జన్మతః శూద్రుడైనా సత్యమూ, శౌచమూ, ధర్మము అవలంబించిన అతడు సద్బ్రాహ్మణునితో సమానమని పెద్దలు చెప్పారు కదా! నీ కర్మల వలన శూద్రుడిగా జన్మించినందుకు బాధపడ వలదు. మనం చేసే కర్మల వలన సుఖదుఃఖాలు ఏర్పడతాయి. ప్రాజ్ఞులు రెండింటిని సమానంగా చూస్తారు. సత్కర్మలచే పాపాన్ని పోగొట్టుకుంటారు. మూఢులు అప్రియానికి కలత చెంది, ప్రియములు జరిగినప్పుడు ఆనందిస్తారు. అందువలన హృదయతాపం హెచ్చుతుందే కాని తగ్గదు. ధీరులు రెండింటినీ సమ దృష్టితో చూస్తారు. జరిగిన దానికి జరగబోవుదానికి దుఃఖించక అన్నిటినీ సమదృష్టితో చూడటం ప్రాజ్ఞుల ధర్మం. దుఃఖము వలన విచక్షణ కోల్పోతారు. కనుక అన్నింటినీ సమదృష్టితో చూసి శుభములు పొంది ఆనందంగా ఉండుము. అన్ని భూతములందు సమత్వము కలిగి ధీరుడవై ఉండుము నీకు మేలు జరుగుతుంది” అని అనునయ వాక్యాలు చెప్పాడు. 


ధర్మవ్యాధుడు “మహానుభావా! తమరు చెప్పినట్లే నేను దు॰ఖమును వదిలినాను. నాకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను” అన్నాడు. 


కౌశికుడు “మహాత్మా! నీవు పుణ్యమూర్తివి. నీ దర్శనంతో నాకు ఎన్నో ధర్మాలు తెలిసాయి నా జన్మ ధన్యం అయింది. ఇక నాకు శలవు ప్రసాదించండి” అని అడిగాడు. 


ఆ తరువాత కౌశికుడు తన తల్లితండ్రులను చేరుకుని వారిని సేవించి తరించాడు. కనుక ధర్మరాజా! నీవు అడిగినట్లు పతివ్రతా ధర్మము, మాతాపితల శుశ్రూష, హీనకులములో పుట్టినా ఎలా ధర్మాత్ముడు కాగలడో వివరించాను 

కదా” అన్నాడు మార్కండేయ మహర్షి.

```

      *అగ్నిదేవుని తపసు*```


ధర్మరాజు “మహర్షీ! నీ దయవలన ఎన్నో విషయములు తెలుసుకున్నాను. పూర్వము అగ్ని దేవుడు ఎందుకు తపస్సు చేసాడు? అంగీరసుడు అగ్నిగా మారటానికి కారణం ఏమిటి? అగ్నులు ఎన్ని విధాలు? వివరిస్తారా?” అని అడిగాడు. 


మార్కండేయ మహర్షి “ధర్మనందనా! అగ్ని దేవుడు హవ్యవాహనుడు. యజ్ఞ యాగాదులలో వేసే హోమద్రవ్యాలను అగ్ని దేవుడు దేవతలకు చేరుస్తాడు. ఇలా చేసి విసుగు చెందిన అగ్ని దేవుడు హవిస్సులను అందించడం మాని అడవులకు వెళ్ళి తపస్సు చేయనారంభించాడు. అతని దేహం కృశించి పోయింది. అగ్ని మనసులో “నేను ఇలా నా విధులను విడిచి తపసు చేసుకుంటున్నాను ఏమిటి? నేను లేకపోతే లోకం స్థబించదు కదా! అలా స్తంభించిన బ్రహ్మదేవుడు వేరొకరిని నా పదవిలో పెట్టడా! ఇక నేను ఇక్కడ ఉండక వెంటనే పోవలయును” అని తలచి తపము చాలించి తన స్వస్థలముకు వెళ్ళుచుండగా బ్రహ్మదేవుడు తన పదవిలో నియమించిన అంగీరసుడనే అగ్ని మూడు లోకాలలో అగ్ని కార్యములు నిర్వర్తించడం చూసి భయపడ్డాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

28, జనవరి 2026, బుధవారం

గురు పాదుకలు

  

 

    *శ్లోకము 5:*


*నృపాళి మౌళి వ్రజ రత్న కాంతి*

సరిద్విరాజత్ ఝష కన్యకాభ్యామ్

*నృపత్వదాభ్యామ్ నత లోక పంక్తే*

నమో నమః శ్రీ గురు పాదుకాభ్యామ్


    *భావము :*

        అనేకమంది రాజుల కిరీటాలను ఒకచోట చేర్చగా, వాటిలో వున్న రత్నాల వెలుగంతా ఒక నదిగా మారితే, అంతటి వెలుగులో కూడా మెరిసే చేపల వంటివి గురు పాదుకలు. అంటే, ఎంతటి సిరులూ, అధికారమూ వున్నా అవి గురువుగారి చెప్పుల పాటి కూడా చెయ్యవు. అటువంటి గురువు పాదుకలకు నమస్కారం చేసినవారికి, అనేక లోకాల ఆధిపత్యం ప్రసాదించగల శక్తి ఆ పాదుకలకు వుంది. అటువంటి గురుపాదుకలకు నమస్కారము.


    రచన : *జగద్గురు ఆదిశంకరాచార్యులు** 

29జనవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌷గురువారం🌷*

 *🌹29జనవరి2026🌹*      

   *దృగ్గణిత పంచాంగం* 

               

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - శుక్ల పక్షం*


*తిథి  : ఏకాదశి* ‌మ 01.55 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం   : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : రోహిణి* ఉ 07.31 *మృగశిర* (30) తె 05.29 వరకు 

*యోగం : ఐంద్ర* రా 08.27 వరకు ఉపరి *వైధృతి*

*కరణం  : భద్ర* మ 01.55 *బవ* రా 12.32 ఉపరి *బాలువ*


*సాధారణ శుభ సమయాలు*

          *- ఈరోజు లేవు -*

అమృత కాలం  : *రా 09.26 - 10.54*

అభిజిత్ కాలం  : *ప 11.58 - 12.43*

*వర్జ్యం    : రా 12.39 - 02.07*

*దుర్ముహూర్తం  : ఉ 10.27 - 11.12 మ 03.00 - 03.46*

*రాహు కాలం   : మ 01.46 - 03.11*

గుళికకాళం      : *ఉ 09.30 - 10.55*

యమగండం    : *ఉ 06.39 - 08.04*

సూర్యరాశి : *మకరం*                        

చంద్రరాశి : *వృషభం/మిధునం*

సూర్యోదయం :*ఉ 06.49*

సూర్యాస్తమయం :*సా 06.10*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.39 - 08.56*

సంగవ కాలం         :     *08.56 - 11.12*

మధ్యాహ్న కాలం    :    *11.12 - 01.29*

అపరాహ్న కాలం    : *మ 01.29 - 03.46*

*ఆబ్ధికం తిధి        : తిథి ద్వయం ఏకాదశి/ద్వాదశి*

సాయంకాలం      :*సా 03.46 - 06.02*

ప్రదోష కాలం       :*సా 06.02 - 08.34*

రాత్రి కాలం         :*రా 08.34 - 11.55*

నిశీధి కాలం       :*రా 11.55 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.58-05.48*

******************************

        *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*!!.ఓం శ్రీ సద్గరుభ్యో నమః!!*


*త్సర్వశ్రుతిశిరోరత్న*

*విరాజిత పదాంబుజః*

*వేదాంతాంబుజసూర్యోయః* 

*తస్మై శ్రీగురవే నమః*


*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*మాఘ పురాణం - 11వ*

  🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷గురువారం 29 జనవరి 2026🌷*

_*మాఘ పురాణం - 11వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *29వ తేదీ గురువారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు*

``

మాఘ పురాణం లోని పదకొండవ అధ్యాయం, బలవంతుడైన భీముడి గర్వం మరియు అతని మార్పు గురించి చెబుతుంది. గర్వంతో ఇతరులతో గొప్పలు చెప్పుకునే భీముడు, ముని సలహా మేరకు ఏకాదశి వ్రతం పాటించి, వినయం, సంయమం పెంచుకుంటాడు. వ్రతం అతని గర్వాన్ని తగ్గించి, వినయంతో నింపి, ఇతరులకు సహాయం చేసేలా మార్చేస్తుంది. 

ఈ కథ, గర్వం హానికరమని, వినయం, సంయమం మన జీవితాలను మెరుగుపరుస్తాయని బోధిస్తుంది


*భీముని ఏకాదశి వ్రతము*```


సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘ మాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని, నదిలేని చోట తటాకమందు గాని, తటాకము కూడా అందుబాటులో లేని యెడల నూతివద్దగానీ స్నానము చేసినచో పాపములన్నియు హరించిపోవును. 

పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీతీరమందున్న అగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులు అందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొందినవారై యున్నారు.


అతడు చిన్నతనములో గడుసరి, పెంకివాడు, అతడు తల్లితండ్రుల భయ భక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొను చుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్దుడయ్యెను, తనకున్న ధనమును తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోవునపుడిట్లు ఆలోచించెను. “అయ్యో! నేనెంతటి పాత్ముడనైతిని ధనము, శరీర బలము వున్నదను మనో గర్వముతో జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేక పోయినానుగదా” అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయెను. 


అన్ని రోజులు ఒకే విధముగా నుండవు కదా! ఆ నాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనమూ, బంగారమూ యెత్తుకొని పోయిరి.

అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా, అతని సంపద అంతయూ అపహరింపబడినది అన్యాయముగా ఆర్జించిన ధనము. అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘ మాసము నడచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీస్నాన ఫలముదక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబిగసి పోవుచూ ‘నారాయణా’ అని ప్రాణములు విడచినాడు. దివ్యమైన యమునా నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములు అన్నియూ నశించిపోయి వైకుంఠ వాసుడయ్యెను, అని వశిష్టుడు తెలియజేసెను.


పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి యేమాత్రమూ ఆగలేనివాడు బండెడు అన్నము అయినా చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది. కాని ఒక విషయములో బెంగతో ఉండెను. అదేమందువా “ఏకాదశీ నాడు భోజనము చేయకూడదు కదా! భోజనము చేసినచో ఫలము దక్కదుకదా! అని విచారించి, తన పురోహితుని కడకు బోయి, ఓయీ పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనెదరుగదా దాని విశిష్టత యేమి”, అని భీముడు అడిగెను.


అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు “అవును భీమసేనా! ఆరోజు అన్ని దినములకంటెను ప్రశస్తమైనది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. కనుక, అన్ని జాతులవారును ఏకాదశీ వ్రతము చేయవచ్చును” అని పలికెను. 


సరే నేను అటులనే చేయుదును. గాని, “విప్రోత్తమా! నేను భోజన ప్రియుడునన్న సంగతి జగద్విదితమే గదా! ఒక ఘడియ ఆలస్యమైననూ నేను ఆకలికి తాళజాలను, కనుక, ఏకాదశినాడు ఉపవాసం ఉండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి యెక్కువగా నుండును. కావున ఆకలి దాహము తీరులాగున, ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహానీయుము”, అని భీముడు పలికెను.


భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి “రాజా! ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు, కాన, నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ద ఏకాదశి మహా శ్రేష్ఠమైనది, దానిని మించిన పర్వదినము మరి ఒక్కటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదై యుండును. అటువంటి ఏకాదశీ సమాన మగునది మరి ఏమియులేదు. సంవత్సరము నందు వచ్చు ఇరువది నాలుగు ఏకాదశి లలో  మాఘశుద్ద ఏకాదశి మహా పర్వదినము కావున, ఆ దినము ఏకాదశీ వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు యేమాత్రమును సంశయములేదు. కాన, ఓ భీమ సేనా! నీవు తప్పక మాఘశుద్ద ఏకాదశి వ్రతము నాచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము, దీక్షతోనున్న యెడల ఆకలి యేమాత్రమునూ కలుగదు, నియమము తప్పకూడదు” అని వివరించెను.  


ధౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాససం ఉండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని “భీమ ఏకాదశి” అని పిలుతురు. అంతియే గాక, ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాస మందే వచ్చును. కాన మహా శివరాత్రి మహత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళువువై ఆలకింపుము అని వశిష్టులవారు దిలీప మహారాజుతో నిటులపలికిరి..

ఏకాదశి మహా విష్ణువునకు యెటుల ప్రీతికరమైన దినమో, అదే విధముగా మాఘ చతుర్దశి అనగా, శివచతుర్దశి. దీనినే “శివరాత్రీ” యని అందురు. అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము. మాఘమాసమందలి అమావాస్యకు ముందు రోజున వచ్చెడి చతుర్దశి దీనినే “మహాశివరాత్రి” అని అందరూ పిలిచెదరు. 

ఇది మాఘ మాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. 

ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణపక్షములో వచ్చు మహా శివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. 

ఆ రోజు నదిలోగాని, తటాకమందుగాని లేక నూతి వద్దగాని స్నానము చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్ఠోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలయును. అటుల పూజించి, అమావాస్య స్నానము కూడా చేసినయెడల యెంతటి పాపములు కలిగియున్ననూ, అవన్నియు వెంటనే హరించిపోయి, కైలాస ప్రాప్తి కలుగును. 

శివపూజా విధానములో శివరాత్రి కంటె మించినది మరియొకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కావున  శివరాత్రి దినమున ప్రతిఒక్కరూ అనగా జాతి భేదముతో నిమిత్తము లేక, అందరూ శివరాత్రి వ్రతమును ఆచరించి  జాగరణ చేయవలయును.

మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి, వాటిని కాల్చి, తాను తిని, తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరి ఏదియూ తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు క్రూర మృగములు సైతం ఆ బోయ వానిని చూచి భయపడి పారిపోయేడివి, అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు. ప్రతి దినము వలె ఒక నాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులు ఏమియూ కంట పడలేదు. సాయంకాలం అగుచున్నది. వట్టి చేతులతో యింటికి వెళ్ళుటకు మనస్సంగీకరించనందున ప్రొద్దు కృంగిపోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు యెదురు చూచుచుండెను.

తెల్లవారుతున్నకొలదీ చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న యెండుటాకులు రాలి చెట్టుక్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండితినక రాత్రంతా జాగరణతో వున్నాడు. తనకు తెలియక పోయిననూ మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట, తిండిలేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.

జరామరణములకు హెచ్చుతగ్గులుగాని, శిశు వృద్ధ భేదములుగాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములనుబట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే, మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసికొనిపోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునదిలేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు – పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువుతీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి, ఉచిత ఆసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణం ఏమని ప్రశ్నించెను. అంతట యముడు, “మహేశా! చాలా దినములకు మీ దర్శనభాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను.

మీ దర్శన కారణమేమనగా, ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి వున్నాడు. ఒక దినమున అనగా మహా శివరాత్రినాడు తాను యాదృచ్చికముగా జంతువులు దొరకనందున తిండితినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి యంతయు మెలకువగానున్నాడేగాని, చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంతమాత్రమున అతనికి కైవల్యము దొరకునా” అని యముడు విన్నవించుకున్నాడు. 


“యమధర్మరాజా! నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమునందు  బిల్వపత్రములు నాపై వేసి తిండి తినక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాప ముక్తుడు కాగలడు.ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక, ఈ బోయవాడు పాపాత్ముడైనను, ఆనాటి శివరాత్రి మహిమవలన నా సాయుజ్యము ప్రాప్తమైనది” అని పరమేశ్వరుదు వివరించెను.```


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷```


*మాఘపురాణం పదకొండవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 28 జనవరి 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                   1️⃣1️⃣8️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*        

    

                    *118 వ రోజు*                   

*వన పర్వము పంచమాశ్వాసము*


*మాతాపితలను సేవించడం*```


ధర్మవ్యాధుడు “మహర్షీ! నేను సర్వజ్ఞుడిని కావడానికి మూలమైన ధర్మం నీకు తెలుపుతాను” అన్నాడు. అతనిని గృహాంతర్భాగానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ సుఖాశీనులై ఉన్న తల్లి తండ్రులకు నమస్కరించి కుశలం అడిగాడు. వారు “కుమారా! నీవంటి కొడుకు ఉండగా మాక్షేమమునకు లోటు ఏమి? నీ ధర్మం నీకు తోడుగా ఉండి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయి. నీ వలన మన వంశం పవిత్రమైనది. నీవు మనుష్య జన్మ ఎత్తిన దేవతామూర్తివి. త్రికరణ శుద్ధిగా తల్లితండ్రులను సేవించే నీవు పరశురాముని కన్నా గొప్పవాడివి" అన్నారు. 


అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికుని తల్లి తండ్రులకు పరిచయం చేయగా వారు కౌశికుని కుశలం అడిగారు. ధర్మవ్యాధుడు కౌశికునితో “వీరు నా జననీ జనకులు. వీరిని సేవించి నేను ఇంత జ్ఞానం సంపాదించాను. నేను ఇతర దేవుళ్ళను ఎరుగను, తల్లితండ్రులే నా దైవాలు. నేను వీరికి పండ్లు, ఆహారం, వస్త్రములు ఇచ్చి వీరిని సేవిస్తుంటాను. నా భార్యా బిడ్డలు వీరికి సేవ చేస్తుంటారు. యజ్ఞాలు, క్రతువులూ, వేదాలూ అన్నీ వీరే అని భావిస్తాను. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ ఈ అయిదిటిని ఎవరు పూజిస్తారో వారే మహాత్ములు. అయ్యా! పతివ్రత పంపగా ధర్మ సూక్ష్మం తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చారు. ఆమె అనుగ్రహంతో నేను నీకు చెప్పగలిగాను. నీ వంటే నాకు అప్రియంగా ఉంది. అందుకు కారణం నీవు నీ తల్లి తండ్రుల అనుమతి లేకుండా వేదాధ్యయనానికి వెళ్ళి వారిని వ్యాకులతకు గురి చేసావు. వారి పట్ల కృూరంగా ప్రవర్తించావు. నీవు వేదజ్ఞానం సంపాదించినా నీ తల్లి తండ్రులను బాధించినందుకు నాకు నీ ఎడల అప్రియం కలిగినది. నీ తల్లితండ్రులు నీ కొరకు రోదించి గుడ్డి వాళ్ళు అయ్యారు. ఆ సంగతి నీకు తెలుసా? ఇకనైనా వారి వద్దకు వెళ్ళి వారి శోకమును చల్లార్చు. నీ జ్ఞానం పుణ్యం తల్లి తండ్రులను బాధించడం వలన నిష్ఫలం ఔతాయి. నేను చెప్పినది విని వారిని సేవించి తరించు” అని ధర్మవ్యాధుడు చెప్పాడు. 


కౌశికుడు “మహాత్మా! నీవు చెప్పినట్లే వెళ్ళి నా తల్లితండ్రులను సేవించుకుంటాను. నేను చేసిన పాపం నుండి నీ బోధనలతో విముక్తుడని అయ్యాను. నా భాగ్యవశమున నీ పరిచయ భాగ్యం కలిగినది. నా మనసు ఆహ్లాదం అయింది. నీవు నాకు దైవ సమానుడవు. నీ వలె ధర్మమార్గాన సంచేరించే వాడు అరుదు. వేలకొలది మానవులలో ఏ ఒక్కరో నీ వంటి వాడు ఉంటాడు. నేను నిన్ను శూద్రునిగా తలచడంలేదు. భూత, భవిష్యత్తు, వర్తమానాలను ఎరిగిన నీవు ఏల ఈ శూద్ర జన్మను ఎత్తావో చెప్పు” అన్నాడు.```


*ధర్మవ్యాధుని పూర్వ జన్మ వృత్తాంతం*```


“అయ్యా మీరడిగినది చెప్పడం నాధర్మం. నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడను. వేదవేదాంగాలు చదువుకున్నాను. నాకు ఒక రాజకుమారునితో మైత్రి కలిగిన కారణంగా విలువిద్య కూడా నేర్చుకున్నాను. ఒకరోజు నేను రాజకుమారునితో వేటకు వెళ్ళి అనేక మృగములను చంపాను. నే విడిచిన ఒక బాణం పొదల మాటున గడ్డిచాటున ఉన్న మునీశ్వరునికి తగిలింది. నేను మునీశ్వరుని వద్దకు వెళ్ళి బాధతో నేలమీద దొర్లుతున్న ఆయనతో అనునయ వాక్యాలు పలికాను. ఆయన బ్రాహ్మణుడుగా పుట్టి శూద్రునిలా మృగములను చంపావు కనుక మృగములను చంపు వ్యాధుడిగా జన్మించు” అని శపించాడు. 


ఎరుగక తప్పు చేసిన నన్ను మన్నించి శాపవిమోచనం కలిగించమని ఆయనను వేడుకున్నాను. ఆ ముని కరుణించి “నా శాపానికి తిరుగు లేదు వ్యాధుడిగా జన్మించినా నీకు ధర్మసూక్ష్మములు తెలియగలవు. నీవు తల్లితండ్రులను సేవించినంత కాలం పూర్వ జన్మ స్ఫురణ ఉంటుంది. సత్కర్మాచరణము వలన నీవు తిరిగి బ్రాహ్మణ జన్మ పొందగలవు” అని పలికాడు. 

నేను ఆ ముని శరీరం నుండి బాణం బయటకు తీసి ఆయనను ఆశ్రమానికి చేర్చి గాయానికి మందు వేసి బ్రతికించాను. కానీ నాకు ఈ వ్యాధుని జన్మ తప్పలేదు” అన్నాడు.```



 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 28 జనవరి 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                   1️⃣1️⃣8️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*        

    

                    *118 వ రోజు*                   

*వన పర్వము పంచమాశ్వాసము*


*మాతాపితలను సేవించడం*```


ధర్మవ్యాధుడు “మహర్షీ! నేను సర్వజ్ఞుడిని కావడానికి మూలమైన ధర్మం నీకు తెలుపుతాను” అన్నాడు. అతనిని గృహాంతర్భాగానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ సుఖాశీనులై ఉన్న తల్లి తండ్రులకు నమస్కరించి కుశలం అడిగాడు. వారు “కుమారా! నీవంటి కొడుకు ఉండగా మాక్షేమమునకు లోటు ఏమి? నీ ధర్మం నీకు తోడుగా ఉండి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయి. నీ వలన మన వంశం పవిత్రమైనది. నీవు మనుష్య జన్మ ఎత్తిన దేవతామూర్తివి. త్రికరణ శుద్ధిగా తల్లితండ్రులను సేవించే నీవు పరశురాముని కన్నా గొప్పవాడివి" అన్నారు. 


అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికుని తల్లి తండ్రులకు పరిచయం చేయగా వారు కౌశికుని కుశలం అడిగారు. ధర్మవ్యాధుడు కౌశికునితో “వీరు నా జననీ జనకులు. వీరిని సేవించి నేను ఇంత జ్ఞానం సంపాదించాను. నేను ఇతర దేవుళ్ళను ఎరుగను, తల్లితండ్రులే నా దైవాలు. నేను వీరికి పండ్లు, ఆహారం, వస్త్రములు ఇచ్చి వీరిని సేవిస్తుంటాను. నా భార్యా బిడ్డలు వీరికి సేవ చేస్తుంటారు. యజ్ఞాలు, క్రతువులూ, వేదాలూ అన్నీ వీరే అని భావిస్తాను. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ ఈ అయిదిటిని ఎవరు పూజిస్తారో వారే మహాత్ములు. అయ్యా! పతివ్రత పంపగా ధర్మ సూక్ష్మం తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చారు. ఆమె అనుగ్రహంతో నేను నీకు చెప్పగలిగాను. నీ వంటే నాకు అప్రియంగా ఉంది. అందుకు కారణం నీవు నీ తల్లి తండ్రుల అనుమతి లేకుండా వేదాధ్యయనానికి వెళ్ళి వారిని వ్యాకులతకు గురి చేసావు. వారి పట్ల కృూరంగా ప్రవర్తించావు. నీవు వేదజ్ఞానం సంపాదించినా నీ తల్లి తండ్రులను బాధించినందుకు నాకు నీ ఎడల అప్రియం కలిగినది. నీ తల్లితండ్రులు నీ కొరకు రోదించి గుడ్డి వాళ్ళు అయ్యారు. ఆ సంగతి నీకు తెలుసా? ఇకనైనా వారి వద్దకు వెళ్ళి వారి శోకమును చల్లార్చు. నీ జ్ఞానం పుణ్యం తల్లి తండ్రులను బాధించడం వలన నిష్ఫలం ఔతాయి. నేను చెప్పినది విని వారిని సేవించి తరించు” అని ధర్మవ్యాధుడు చెప్పాడు. 


కౌశికుడు “మహాత్మా! నీవు చెప్పినట్లే వెళ్ళి నా తల్లితండ్రులను సేవించుకుంటాను. నేను చేసిన పాపం నుండి నీ బోధనలతో విముక్తుడని అయ్యాను. నా భాగ్యవశమున నీ పరిచయ భాగ్యం కలిగినది. నా మనసు ఆహ్లాదం అయింది. నీవు నాకు దైవ సమానుడవు. నీ వలె ధర్మమార్గాన సంచేరించే వాడు అరుదు. వేలకొలది మానవులలో ఏ ఒక్కరో నీ వంటి వాడు ఉంటాడు. నేను నిన్ను శూద్రునిగా తలచడంలేదు. భూత, భవిష్యత్తు, వర్తమానాలను ఎరిగిన నీవు ఏల ఈ శూద్ర జన్మను ఎత్తావో చెప్పు” అన్నాడు.```


*ధర్మవ్యాధుని పూర్వ జన్మ వృత్తాంతం*```


“అయ్యా మీరడిగినది చెప్పడం నాధర్మం. నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడను. వేదవేదాంగాలు చదువుకున్నాను. నాకు ఒక రాజకుమారునితో మైత్రి కలిగిన కారణంగా విలువిద్య కూడా నేర్చుకున్నాను. ఒకరోజు నేను రాజకుమారునితో వేటకు వెళ్ళి అనేక మృగములను చంపాను. నే విడిచిన ఒక బాణం పొదల మాటున గడ్డిచాటున ఉన్న మునీశ్వరునికి తగిలింది. నేను మునీశ్వరుని వద్దకు వెళ్ళి బాధతో నేలమీద దొర్లుతున్న ఆయనతో అనునయ వాక్యాలు పలికాను. ఆయన బ్రాహ్మణుడుగా పుట్టి శూద్రునిలా మృగములను చంపావు కనుక మృగములను చంపు వ్యాధుడిగా జన్మించు” అని శపించాడు. 


ఎరుగక తప్పు చేసిన నన్ను మన్నించి శాపవిమోచనం కలిగించమని ఆయనను వేడుకున్నాను. ఆ ముని కరుణించి “నా శాపానికి తిరుగు లేదు వ్యాధుడిగా జన్మించినా నీకు ధర్మసూక్ష్మములు తెలియగలవు. నీవు తల్లితండ్రులను సేవించినంత కాలం పూర్వ జన్మ స్ఫురణ ఉంటుంది. సత్కర్మాచరణము వలన నీవు తిరిగి బ్రాహ్మణ జన్మ పొందగలవు” అని పలికాడు. 

నేను ఆ ముని శరీరం నుండి బాణం బయటకు తీసి ఆయనను ఆశ్రమానికి చేర్చి గాయానికి మందు వేసి బ్రతికించాను. కానీ నాకు ఈ వ్యాధుని జన్మ తప్పలేదు” అన్నాడు.```



 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

సుభాషితమ్

  శివస్తుతి🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 పద్యం : *దర్పణంబు లేక తన మోము గానరాదు* 

              *దాననైన వెన్ను గాన రాదు* 

              *కన్ను లొప్ప నెంత గన నోపు జెప్పుడా* 

              *యెరుక చూరకాంచు నెల్ల యవియు* 


అర్థము: *కేవలము కన్నులు సర్వాన్నీ చూడ లేవు. మన ఆలోచనతో కొంత తెలుసుకోవాలి. కళ్ళు చూసినదే సత్యమనుకో రాదనీ మన వెన్ను మనకు కనపడనట్లే కొన్ని సత్యాలు తరచి చూస్తే గాని కనపడవు అని కవి భావము.*


✍️💐🌹🌸🙏

శివస్తుతి

  *మాఘమాస శివస్తుతి

         28/1/26 (15)

 కం . 

 పరమేశ్వరు పరమాత్మగ

 శరణనిభక్తాళి శివుని సన్నుతి జేయన్

వరమాత్మపాప హరణా

 ధరపైపూజించమిమ్ము దరిశన మిడుమా|| (15)

కం. 

రజతాచలవాసశివా

గజచర్మపు వస్త్రధారి గంగాధరు డా

ప్రజలకు సద్గతినిడుమా

భజియించెడు భక్తుకెపుడు భా గ్యం బిడుమా|| (16)


డా|| శేషం వేణుగోపాల శర్మ 

       స్కూల్ అసిస్టెంట్ తెలుగు 

              కరీణ్ణగరమ్

భాగవతం

 *భాగవతం వింటే బాగవుతాం*

శ్రీ పోతన భాగవత మధురిమలు.


(6-121-క)

డెందంబు పుత్రు వలనం

జెందిన దని తలఁప వలదు శ్రీపతి పే రే

చందమున నైనఁ బలికిన

నందకధరుఁ డందుఁ గలఁడు నాథుం డగుచున్


*భావము:-* ఇతడు “నారాయణా!” అని పిలిచినప్పుడు ఇతని మనస్సు కుమారుని మీద ఆసక్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు. భగవంతుని పేరును ఏ విధంగా పలికినా శ్రీహరి రక్షకుడై అందులోనే ఉంటాడు.

(అజామిళోపాఖ్యానం)


ఏదో ఒక విధంగా నామ స్మరణ చేస్తూ ఉండాలి.

ఫోన్ చేసినప్పుడు, రిసీవ్ చేసుకున్నప్పుడు 'హలో' చెప్పడానికి బదులు *'జై శ్రీ రామ్'* అలవాటు చేసుకోవాలి. ...... *జై శ్రీ రామ్* 


శ్రీ శంకరాచార్య కృత *శ్రీ గణేశ పంచరత్న* కీర్తనతో శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

బుధవారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

28-01-2026 బుధవారం రాశి ఫలితాలు


మేషం


సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

---------------------------------------


వృషభం


చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

---------------------------------------


మిధునం


దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి.

---------------------------------------


కర్కాటకం


చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నలోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------


సింహం


చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు మిత్రులతో చర్చలు చేస్తారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడతారు. 

---------------------------------------


కన్య


కుటుంబ సమస్యల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------


తుల


కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------


వృశ్చికం


నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి.

---------------------------------------


ధనస్సు


సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయట పడతారు. 

---------------------------------------


మకరం


వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణప్రయత్నాలు కలసిరావు. 

---------------------------------------


కుంభం


ఇంట బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


మీనం


వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

---------------------------------------