*శ్లోకము 5:*
*నృపాళి మౌళి వ్రజ రత్న కాంతి*
సరిద్విరాజత్ ఝష కన్యకాభ్యామ్
*నృపత్వదాభ్యామ్ నత లోక పంక్తే*
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యామ్
*భావము :*
అనేకమంది రాజుల కిరీటాలను ఒకచోట చేర్చగా, వాటిలో వున్న రత్నాల వెలుగంతా ఒక నదిగా మారితే, అంతటి వెలుగులో కూడా మెరిసే చేపల వంటివి గురు పాదుకలు. అంటే, ఎంతటి సిరులూ, అధికారమూ వున్నా అవి గురువుగారి చెప్పుల పాటి కూడా చెయ్యవు. అటువంటి గురువు పాదుకలకు నమస్కారం చేసినవారికి, అనేక లోకాల ఆధిపత్యం ప్రసాదించగల శక్తి ఆ పాదుకలకు వుంది. అటువంటి గురుపాదుకలకు నమస్కారము.
రచన : *జగద్గురు ఆదిశంకరాచార్యులు**
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి