శ్రీమదాంధ్ర మహాభారతము
నన్నయభట్టుతో నయముగా మొదలయ్యు
నాంధ్ర భారతకావ్య మవని సాగె
యిరు పర్వ భాగమే పరిపూర్ణ మయ్యును
నంతలో యా కావ్య మాగిపోయె
సాగగ నిన్నూఱు సంవత్సరములకు
పుణ్యుడౌ తిక్కన పుడమి పుట్టి
పర్వంబు నాల్గుతో ప్రారంభ మొనరించి
పరిపూర్తి గావించె పదియునైదు
పిదపను నూఱేండ్లు సదమల కావ్యమ్ము
నుండెను కొరతతో నుర్వి పైన
నన్నయ్య వీడిన నవకంపు భాగమ్ము
పూరించె నెఱ్ఱన పూర్తిగాను
భవ్యమైనట్టి శ్రీయాంధ్ర భారతంబు
గడచి మున్నూఱు వత్సర కాల మరయ
కవులు ముగ్గురు రచియింప ఘనత కెక్కి
తెలుగు జాతికి లభియించె దివ్యముగను
✍️గోపాలుని మధుసూదనరావు 🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి