28, జనవరి 2026, బుధవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

* 634వ రోజు*

అనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము

సుమిత్రుడు

సమస్తదేవతలకు ఆలవాలమైన ఆవు గురించి ఈ సందర్భంలో నీకు ఒక ఇతిహాసము చెప్తాను. త్రిశిఖరము అనే కొండ ఉండేది. ఆ కొండప్రాంతంలో భృగువంశంలో పుట్టిన కొంత మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నారు. వారిలో సుమిత్రుడు ఒకడు. ఒకరోజు అంగీరసుడు అనే బ్రాహ్మణుడు గోశర్కర అనే తీగను సుమిత్రుడికి ఇచ్చాడు. సుమిత్రుడు దానిని తన గోవులకు ఆహారంగా ఇచ్చాడు. ఆ ఓషధిని తిన్న ఆవులు ఏపుగా పెరిగి ఆ గోవులకు తామర తంపరగా సంతానం పెరిగింది. అలా ఆ గోవుల సంతతి పెరిగి మందగా ఏర్పడ్డాయి. సుమిత్రుడు ఆ ఆవుల మందను చూసి బాగా మురిసి పోయాడు. ఆ ఆవు దూడలు తల్లుల పాలు త్రాగుతుంటే వాటి నుండి వచ్చే నురగను తాను సేవించసాగాడు. అప్పటి నుండి అతడికి ఫేనుడు చూసి అక్కడే స్నానం చేస్తున్న గోవులు " మీరు ఎవరు ? ఇక్కడ ఏమి చేస్తున్నారు ? మీకీ రూపములు ఎలా వచ్చాయి " అని అడిగాయి. అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న గోవులు " మేము బ్రాహ్మణులకు సేవ చేస్తాము. యజ్ఞములకు, పితృకార్యములకు, అతిథి సత్కారములకు, బ్రాహ్మణులకు ఆహారంగా ఉపయోగపడే పాలు ఇస్తాము. బ్రాహ్మణుల పొలములో పని చేయడానికి మా పిల్లలను పంపుతాము. మేము చేసే మంచి పనుల వలన మాకు గోలోక ప్రాప్తి కలిగింది. కాని మీరు మంచి పని చేసే వారిని చూసి అసూయ చెందుతారు. కనుక మీకు మీ దూడలకు ఈ దుర్గతి పట్టింది " అని పలికాయి. మిగిలిన గోవులు తమ తప్పు తెలుసుకుని తమకు తరుణోపాయము చూపమని కాంతల రూపంలో ఉన్న గోవులను అడిగాయి.

రంతిదేవుని యజ్ఞము

ఆ గోవులు " రంతిదేవుడు ఒక యజ్ఞము చేస్తున్నాడు. మీరు అక్కడకు వెళ్ళండి. ఆయన మిమ్మల్ని ఆయజ్ఞములో బలి ఇస్తాడు. మీకు గోలోకప్రాప్తి కలుగుతుంది " అని పలికాయి. వెంటనే ఆ ఆవులన్ని రంతిదేవుడి వద్దకు వెళ్ళడానికి సిద్ధం అయ్యాయి. కాని అందులో ఒక గోవు సందేహం వెలిబుచ్చింది. " మనం మన యజమాని సుమిత్రుని అడిగి కదా వెళ్ళాలి అని అంది. కొన్ని ఆవులు " సుమిత్రుడు మనము వెళ్ళడానికి సుమిత్రుడు అనుమతి ఇవ్వడు. కనుక మనం అతడిని చంపుదాము అప్పుడు అతడు కూడా గోలోకముకు వస్తాడు " అన్నాయి. కాని కొన్ని ఆవులు సుమిత్రుడిని చంపలేక పోయాయి. కొన్ని కపిలగోవులు మాత్రం " మేము సుమిత్రుడిని చంపుతాము. దానికి బదులుగా మీరు మాకు ఏమి ఇస్తారు " అని అడిగాయి. మిగిలిన ఆవులు కపిలగోవులతో " ఈ రోజు నుండి అన్ని రంగుల ఆవులలో ఎర్రని గోవులు శ్రేష్టమైనవిగా పరిగణించబడతాయి " అని వరం ఇచ్చాయి. వెంటనే ఆ ఆవులు మారురూపంలో తమ యజమాని సుమిత్రుడి వద్దకు వెళ్ళి " అయ్యా ! ఇప్పటి వరకు మీరు గోపూజ చేసారు. మేము ఎంతో సంతోషించాము. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి " అని అడిగాయి. అందుకు సుమిత్రుడు " నాకు ఇప్పటి వలె ఎప్పటికి ఆవుల అందు భక్తి, శ్రద్ధ ఉండేలా అనుగ్రహించండి " అని కోరుకున్నాడు. ఆ ఆవులు " అలాగే అనుగ్రహిస్తాము మేము గోలోకము వెడుతున్నాము. మీరు కూడా మాతో రండి " అన్నాయి. సుమిత్రుడు " నేను నా గోవులను విడిచి ఎక్కడకు రాను " అన్నాడు.p మారు వేషములో ఉన్న గోవులు అతడి శరీరమును తమ కొమ్ములతో ఎత్తి కింద పడవేసాయి. సుమిత్రుడు ప్రాణాలు వదిలాడు. అతడి శరీరం మాత్రం కింద పడింది. ఆత్మమాత్రం గోలోకం పోయింది. అక్కడ ఉన్న గోమాతలు సుమిత్రుడిని ఆదరించి మర్యాదలు చేసి అతడికి జరిగినది చెప్పి నీకు మేలే జరిగింది కాని నిన్నిలా దారుణంగా చంపిన ఎర్రని ఆవులకు మాత్రం ముఖం నల్లగా మాడి పోతుంది " అని శాపం పెట్టాయి.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: