10, జులై 2020, శుక్రవారం

సర్ప దోషము

ప్రియ బంధువులారా, సర్ప దోషమును  గురించి చర్చిస్తూ ఉన్నాము, కురు వంశము పై రాహుకేతువుల ప్రభావం, ధర్మరాజు పై రాహుకేతువుల ప్రభావం చర్చించాము, భారత దేశము రాహుకేతువుల ప్రభావం, నిన్ననే తెలియజేశాను, ఈరోజు పాండవ మధ్యముడు, అర్జున్ పై రాహుకేతువుల ప్రభావము తెలుసుకుందాము,. అందరూ పోస్ట్ చదవండి, పోస్ట్ మీద అభిప్రాయం కూడా చెప్పండి, మీకు ఎంత అర్థం అయిందో నాకు తెలియాలి, 

 పాండవ మధ్యముడు అర్జునుడిపై, 
 రాహు కేతువు ల ప్రభావం, 

 ఉత్తర ఫల్గుణి నక్షత్రము నందు జన్మించిన పాండవ మధ్యముడు అర్జునుడు, మహా పరాక్రమవంతుడు, సవ్యసాచి గా ప్రసిద్ధి చెందాడు. ఇట్టి మహావీరుని జాతక నందు కేతువుఅవ. యోగకారకుడు, మరణ దుఃఖ కారకుడు, బహు పుత్ర కారకుడైన రాహువు కూడా అవే యోగకారకుడు, అభిమన్యుని వీరమరణం వల్ల, గర్భశోకం అనుభవించాడు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా మీకు తెలియని అనేక రహస్యాలు ఉన్నాయి, ఇప్పుడు వాటిని వివరిస్తాను చూడండి, 

 అభిమన్యుని కుమారుడైన పరిక్షిత్తు. తక్షకుడు అనే సర్పం వల్ల మరణించాడు. రాహుకేతువుల అవయోగం స్థితి కారణంగానే, అర్జునుడు కూడా సర్ప ఆ గ్రహానికి గురయ్యాడు, 
 ఖాండవ వన దహన సమయంలో సమస్త జీవులు నిహతం కాగా, ఖాండవ వన దహన అగ్ని జ్వాలలకు, అశ్వసేనుడుఅను  సర్పము, తన తల్లి వడిని పట్టుకుని భయకంపితులై నాడు, అశ్వ సేనుని రక్షించే ప్రయత్నంలో, ఆ సర్పం మాత అశ్వసేనుని తో సహా ఆకాశములో, పారి పోవుచుండగా అర్జునుడు తన అ స్త్రముతో, సర్ప మాత, రెక్కలను ముక్కలు చేసి, శరీరమును  ఖండితము చేయగా, సర్ప మాతా ఖాండవ దహన, జ్వాలలో, కూలి నది, అర్జునుడి శరాఘాతములు బాధింప గా, అశ్వసేనుడు తప్పించుకొని, అర్జున నీ పై పగ సాధించుటకు వేచి ఉన్నాడు, ( గ్రహం -సర్పం- గ్రహం భవేత్) సర్పమునకు రూపాంతరం చెందే  శక్తి కలదు, ఇది సంశయము లేక నిశ్చయమైన అంశము, అస్త్రంగా మారిన, అశ్వ సేనుడు, కర్ణుని అంబులపొది లో, అర్జునుని కొరకు  వేచి ఉన్నాడు, గ్రహములకుల  నిర్ణయంలో. రాహుకేతువులు తక్కువ కులస్తులుగా నిర్ణయింపబడినారు. తక్కువ కులస్తుల తోటే, అర్జునునకు వైరము- పోటి- అవమానం జరిగినాయి, (ఉదాహరణకు ఏకలవ్యునితో ) కేతువు నపుంసక గ్రహం, మధ్యంతర నపుంస కత్వం  కలిగిన, అర్జునిని జాతకమునందు కేతువు తిరుగులేని నియంత్రణ కలిగి ఉన్నాడు, ( బృహన్నల)  నపుంసకత్వము పరిస్థితుల ప్రభావం వల్ల, వరంగా కూడా మారవచ్చు, ఉదాహరణకు తీసుకున్నట్లయితే, కరోనా సమయము నందు, ఎందరో పేదలకు సహాయం చేశారు, ఇది కూడా వరంగానే భావించవచ్చు, అది వేరు సంగతి, గ్రహం ఇచ్చేటువంటి కారకత్వము మాత్రమే ఇక్కడ ప్రస్తావన, ఇట్టి మధ్యంతర నపుంసకత్వం వచ్చిన సమయము నందు, మహావీరుడైన టువంటి అర్జునుడు ఉత్తర కుమారునికి, సారధి గా మారి నాడు, ఇది ఒక చారిత్రాత్మక అంశము, 

 కురుక్షేత్ర సంగ్రామము నందు, అతి ముఖ్య ఘట్టం లలో ఒకటి కర్ణ అర్జున యుద్ధం, కౌరవ పక్షంలోని ఎందరో మహావీరులు, అర్జునుడి పై ఎన్నో అస్త్రాలను ప్రయోగించారు. కర్ణుడు మహా పరాక్రమవంతుడై, విజృంభించి, అనేకములైన, దివ్య అస్త్రములు అర్జునుడిపై సంధించాడు, ప్రయోగించాడు, బ్రహ్మాస్త్రము, ఆగ్నేయాస్త్రం, వారునాస్త్రము, ప్రయోగించినా ఫలితము శూన్యము, అశ్వత్థామ ప్రయోగించిన, నారాయణాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, కూడా అర్జునుని  ఏమీ చేయలేకపోయాయి, కానీ ఇట్టి సమయమున, కర్ణుడు ప్రయోగించిన నాగాస్త్రం, అర్జునుని మృత్యుముఖం వరకు తీసుకువెళ్లిన ది, బ్రహ్మ వరప్రసాదంగా, దేవేంద్రుని ద్వారా సంప్రాప్త మైన, అత్యుత్తమ కిరీటం ధరించి కిరిటీగా  పేరుగాంచిన, అర్జునుడు కిరీటము కోల్పోయినాడు ఇది అవమానమే, సాక్షాత్తూ దేవదేవుడైన పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్ముడు పూనుకొని, రధాన్ని భూమిలోకి కుంగ  కొట్టడం వల్ల. నాగాస్త్ర ప్రభావం కిరీటం వరకు పరిమితమైనది, నాగాస్త్ర ప్రభావముతో, అర్జునుని  పని అయిపోయింది అని కర్ణుని తో సహా అందరూ అనుకున్నారు,, గర్భవిచ్ఛిత్తి గర్భస్రావానికిహేతువైన  గ్రహము కేతువు, ఉత్తర గర్భము నందున్న పిండమును అశ్వద్ధామ బ్రహ్మశిరోనామకాస్త్రం తో విచ్ఛిన్నం చేయగా, శ్రీ కృష్ణ పరమాత్మ మరల  గర్భస్థ పిండమును జీవము పోసి నాడు, అతడే పరీక్షిత్తు మహారాజు- పరిపాలన సాగిస్తూ తక్షకుడు ను సర్పం వల్ల మరణించాడు, రాహు కేతువు ల ప్రభావం, సర్ప దోషము వంశానుగత మైనదని మరోసారి మనవి చేస్తున్నాను, అర్జున్ నేను దంతము చూసినా ఈ విషయం తేటతెల్లమైంది పోవుచున్నది, మాతా మహా,  పితామహ, సంబంధాలు saaranga ఫలితాలు జాతకునికి సంప్రాప్తిస్తాయి, ఇది కాదనలేని సత్యం, 

 రాహు కేతువుల వల్ల, సంప్రాప్త మైన, అవ్వ యోగాలను శ్రీ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల, అర్జునుడు అధిగమించాడు, అంతటి ప్రత్యక్ష నారాయణుడి అనుగ్రహం అందరికీ లభించునా, అంతటి మహోన్నతమైన భాగ్యశాలి మహావీరుని ముప్పతిప్పలు పెట్టిన, రాహుకేతువుల దుర్యో యోగము అధిగమించుట సామాన్యులకు సాధ్యం ఆలోచించండి, శ్రీ కృష్ణ పరమాత్మ అండదండలు లేని సమయము నందు అర్జునుడు, సాధారణ రాహు గ్రహ కారకత్వం అయిన అడవి దొంగల చేతిలో అర్జునుడు, శృంగభంగం చెందాడు, శ్రీ కృష్ణ పరమాత్మ అండదండల మాత్రమే,  అర్జునిని రక్షించాయి, రాహు కేతువు ల బారిన పడ్డాను తప్పించుకోగలిగారు, అంతటి ప్రత్యేక నారాయణుని అండదండలు, అనుగ్రహం నిరంతరం ఉండే గ్రహస్థితి జాతకంలో ఉన్న ఎడల, రాహుకేతువుల అవయోగం నుండి బయట పడవచ్చు, రాహుకేతువుల దుర్వినియోగం లో ఉన్న ప్రతి వారు,  అర్జునుని అంతటి అదృష్టవంతులు కాగలరా. అది ఆ పరమేశ్వరునికే ఎరుక, 
 నా జాతకము విషయమునకు వస్తే, సర్ప దోషము నుండి తప్పించులేకపోయినాను... 

 మరి సర్ప దోష పరిహారములు, ఎలా ఏవిధంగా నివారించుకోవచ్చు ను, రేపటినుండి తెలియజేస్తాను, 

 సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు, 

 మీకోసం మీ ప్రత్తిపాటి,  రామలింగ వరప్రసాద్, 
 ఖమ్మంలో నివాసము, 
 ఫోన్ నెంబర్, 9966456118.

కామెంట్‌లు లేవు: