10, జులై 2020, శుక్రవారం

*చిట్టి తంత్రాలు*

👉 ఎప్పుడైనా మీకు అకారణంగా భయం కలిగినప్పుడు శనివారం రోజు బ్రాహ్మణుడికి కిలోంపావు దోసకాయలు దానం చేయాలి త్వరగా వాటి నుంచి బయట పడవచ్చు.

👉 రాత్రి వేళల్లో తరుచుగా పీడకలలు వస్తూ ఉంటే రావి ఆకు మీద మధ్యలో సింధూరం తో బొట్టు పెట్టి తొమ్మిది రోజుల పాటు పారుతున్న నీటిలో విడిచిపెట్టాలి ... పీడకలలు రావు .. వచ్చిన కూడా అవి ఫలించవు .

👉 *స్ర్తీలు కుటుంబ పరంగా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటే కొంతకాలం పాటు మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయం ఉన్నా సాయంత్రం పూట కసువు ఊడ్చీ కళ్ళాపు చల్లి 21 చుక్కలతో ముగ్గును వేయడం అలవాటు చేసుకోవాలి అన్నీ విధాలా కుటుంబ సమస్యలు సర్దుకోగలవు .

👉 *సంతానం లేని స్త్రీ* ఆకుపచ్చ , ఎరుపు కలిసిన దుస్తులు గానీ , గాజులు గానీ , హేయిర్ బ్యాండ్స్ గానీ ధరించకండి .. ఇందువల్ల సంతానం కలగటం ఆలస్యం అవుతుంది .

👉 రెండు పేర్లు కలిసి ఒక పేరుగా ఉన్న స్ర్తీ గానీ పురుషులు గానీ స్వార్థ స్వభావం కలిగి ఉంటారు ..అదే విధంగా లోకవ్యవహార జ్ఞానం కలిగి ఉంటారు ... దీనితోపాటు ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించే స్వభావం వీరిలో కాస్త ఎక్కువగా ఉంటుంది.

👉 గృహ బలం సంపూర్ణంగా ఉండాలంటే వాస్తు దోషాలను సరిచేసుకోవడంతోపాటు జాతకరీత్యా ఉన్న గ్రహ దోషములకు పరిహారాలు చేయించుకోవడం ఉత్తమం .

👉స్ర్తీలు ప్రతీ నిత్యం కుంకుమను ధరించి సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని పఠించడం వల్ల చిరకాలం సౌభాగ్యం తో వర్థిల్లుతారు .

*శ్లో* *మంగళం మంగళాధారే*
*మాంగళ్యే మంగళప్రదేః*
*మంగళార్థం మంగళకేశి*
*మాంగళ్యం దేహిమే సదా*

👉 ఒక మండలము పాటు ఏకభుక్తం స్వీకరిస్తూ ప్రవాహ నీటిలో మెడ వరకు నీళ్ళలో ఉండి అఘమార్ష సూక్తం పఠిస్తూ ఉంటే సకల దోషాలు , పాపాలు నాశనం అవుతాయి .

👉 వేదపండితునికి శాస్త్రోక్తంగా కపిల గోవును దానం చేస్తే సకల దోషాలు నాశనం అవుతాయి , ఈతి బాధలు తొలగిపోతాయి .

👉 ఏ దేవతా ఉపాసన చేసే వారు అయినా ఆ దేవతకు ప్రీతికరం కానీ భక్ష్యాలను విడిచి పెట్టడం వల్ల అత్యంత తొందరగా ఆ దేవత అనుగ్రహం పొందగలుగుతారు .

👉 స్ర్తీలు వంటికి నలుగు పెట్టుకొని స్నానం ఆచరించేటప్పడు చిన్న ముద్దను చేసి ప్రక్కన పెట్టి స్నానం చేయడం పూర్తయిన తర్వాత ఆ ఉండను పచ్చని చెట్ల మెదలులో వేసి నమస్కరించి ఒక గ్లాసు నీళ్ళు పోయడం శుభకరం . *సౌభాగ్యం* *విఘ్ననాశనం*  *అభయం* *ఐశ్వర్యం* పొందుతారు .

👉 ప్రతీ రోజూ ఈ క్రింది తైలాలను కలుపుకుని పూజామందిరము లో సింహాద్వారం దగ్గర దీపారాధన చేయడం వలన సకల దోషాలు నాశనం అయి ఐశ్వర్యం కలుగుతుంది .

🤘వెపనూనె 
🤘 చందనపు తైలం 
🤘 ఇప్పనూనె 
🤘 సంపెంగ నూనె
🤘నువ్వులనూనే 
🤘మల్లెనూనె 
ఈ తైలాలను సమభాగాలుగా కలిపి ఆరువత్తులు వెసి దీపారాధన చేయడం శుభప్రదం.

శుభం 
రా శర్మ .
9666496357

కామెంట్‌లు లేవు: