24, జనవరి 2023, మంగళవారం

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య

 1) 🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏


*గ్రంథం:* సర్వసమర్థుడు , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*చిన్న తప్పయిన తప్పే - శ్రీ స్వామివారి దివ్యబోధ*


మనం మహనీయులను హృదయపూర్వకంగా సేవిస్తుంటే వారు మన తప్పులనెలా సరిదిద్దుతారో తెల్పేవే శ్రీ డి.నాగేశ్వరరావు, దమ్మపేట వారి అనుభవాలు. 2005వ సంవత్సరంలో వారి స్వప్నంలో గొలగమూడి లోని శ్రీ బ్రహ్మంగారి మఠంలో నిత్యం జరిగే సత్సంగం కనిపిస్తుంది. ' *సద్గురు కృప పొందడం అనేది మానవుని జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది*. ఉదాహరణకు దమ్మపేట డి.నాగేశ్వరరావు గారి జీవిత విధానం వల్లనే వారంతగా గురు కృప పొందగల్గారు అని అక్కడ చెపుతున్నారు. 


వెంటనే మఠం యొక్క ఒక వైపు నుండి శ్రీ బాబాగారు, మరియొక వైపునుండి శ్రీ వెంకయ్య స్వామి వారు వచ్చి సెల్ ఫోన్ సైజులో ఉండే చిన్న పెట్టె అది. దానికి ఉండే చిన్న గుబ్బను త్రిప్పుతుంటే ఆ పెట్టెలోపల ఫిల్ము తిరుగుతూ బొమ్మలు కనిపిస్తాయి.. చిన్న పిల్లలు దానిలోని బొమ్మలు చూస్తుంటారు. శ్రీ స్వామివారు, శ్రీ బాబాగారు ఆ పెట్టెలో నాకు ఏడు బొమ్మలు చూపించారు. (1) చాక్పిసుల గుట్ట (2) తెల్ల కాగితాలు (3) కాకర కాయల గుట్ట (4) బిస్కెట్లు (5) కొబ్బరికాయలు (6) జున్నుపాలు (7) బియ్యము.


మెలకువ వచ్చి ఈ మహనీయులు స్వయంగా వచ్చి నాకెందుకీ ఏడు విషయాలు చూపారా అని యోచించాను. ఈ ఏడు విషయాలు. నేను చేసే తప్పులని తెలిసింది. నేను స్కూలు హెడ్మాష్టారును. (1) స్కూలు లోని చాక్ పీసులు తెచ్చి మందిరంలో నోటిస్ బోర్డు వాసేందుకు, ముగ్గులు వేసేందుకు ఇస్తుంటాను (2) స్కూలులోని తెల్లకాగితాలను నా ఇంటి అవసరాలకు వాడుతుంటాను (3) నేను హెడ్మాష్టరు నన్న అభిమానంతో ఎవరో వాళ్ళింట్లో కాచిన కాకరకాయలు ఇస్తే తీసుకున్నాను. అలాగే (4), (5), (6) బిస్కెట్లు, కొబ్బరికాయలు, జున్నుపాలు తీసుకున్నాను. (7) రేషన్ డీలరు బియ్యం తక్కువ ధరకిస్తే తీసుకున్నాను. *ఇవన్నీ చాలా స్వల్పమైనవే అయినా ఆ మహనీయుల దృష్టిలో పెద్ద తప్పులేనని ఆనాటినుండి పూర్తిగా మానేశాను.*


ఇంతలో సత్సంగం నుండి కొందరు ప్రశ్నిస్తున్నారు. వారి జీవిత విధానంలో ఇన్ని తప్పులున్నా సద్గురు కృప ఎందుకు కలుగుతుంది? అని. దాని సమాధానంగా - *వారు చేసే నిష్కామకర్మే కారణము - కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవడం, ధార్మిక విషయాలకు ఉదారంగా ఖర్చుపెట్టడం లాంటి పనుల వల్ల పుణ్యం జమ అయి సద్గురుకృప పొందగల్గుచున్నారు,* అని చెప్పారు. తప్పులు అని నాకు తెలియని విషయాలు కూడా తెల్పి నా ప్రవర్తన సరిచేసిన ఆ సద్గురుమూర్తుల రుణం ఎలా తీర్చాలో తెలియదు. ఇదే విధంగా నన్ను అన్ని వేళలా కాపాడమని ప్రార్ధిస్తున్నాను.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

2)🙏ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి నాధాయ నమః"

    శ్రీ సాయి లీలామృతం,శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, నిత్య పారాయణ గ్రంథం.రచన పూజ శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మహారాజ్

   '14 వ అధ్యాయం రెండో భాగం.'

       ఆయన అందరి పట్ల ఇలాంటి ధర్మనిరతి కలిగి ఉండేవారు ఒకసారి ఆయన ఇలా చెప్పారు "ఈ ప్రాంతంలోని పాటిల్ తరచూ నా వద్దకు వచ్చేవాడు. అతనికి 12 మంది భటులు ఉండేవారు. మరొకసారి అతనితో భేదాభిప్రాయం కలిగి అతనిపై పడ్డప్పుడు నేను అతనికి తోడ్పడ్డాను. ఒకసారి వాళ్లు అతనిని బలవంతంగా ఒక నగరానికి తీసుకుపోతే నేను జోక్యం చేసుకొని అతనిని విడిపించాను". మరొకప్పు డాయనిలా అన్నారు. "సోదరులు ఇద్దరం ఒక మార్గాన పోతున్నాం. నా సోదరుడు ముందు పోయి క్రూర జంతువుల పాలైనాడు. అయిదారుగురు వచ్చి 'నీ సోదరుడేడి' అన్నారు  జరిగినది చెప్పి అతని శరీరం మీద వస్త్రం కప్పానని కూడా చెప్పాను. వారు నా మాట నమ్మక, వారి సున్నా వినకుండా, నా సోదరుని కోసం వెళ్లి  జంతువుల పాలయ్యారు. తర్వాత స్థూలకాయరాలైన ఒక స్త్రీ కూడా నా సోదరుని వెతక పోయింది .ఆమెకు అదే గతి పట్టింది. ఆమె శరీరం మీద గుడ్డ కప్పి ముందుకు సాగిపోయాను" జ్ఞానం కావలసినవారు ముందుకు పోతారుగాని, ముందుకు పోవాలి! అని ఆరాటపడేవారు సిద్దుల కోసం ప్రాకలాడే వారని అర్థం అలాంటి సాధకులు ఎందరో సిద్దులని క్రూర మృగాలకు బలయ్యారు. ఆయన మాత్రం తొందరపడక భద్రంగా ముందుకు సాగిపోయారు వారు హెచ్చరించిన అసాధకుల వినలేదు!. ఇది పాలమార్థికమైన కథ.

      జన్మంతరాలలో సాధకావస్థలో ఆయన కూడా పొరబడి,తప్పులు చేసి, తర్వాత తమ తప్పు దిద్దుకున్నామని చెప్పారు. "నా తండ్రికి ధనపు రాసులు ఉండేవి. నేను వాటిలో ఒకదానిపై కూర్చొని పెద్ద పామునయ్యాను  కొంతకాలం తర్వాత ఆ ధనం విడిచిపెట్టి తిరిగి మానవరూపం పొందాను" అంటే అంతకుముందు జన్మలలో ఆయన సిరిసంపదలపై కోరికతో పుణ్యకార్యాలు చేసి మరల జన్మలో శ్రీమంతుడిగా పుట్టి వాటి మీద వ్యామోహం కలిగి ఉన్నారు. అదే ధనపురాశి మీద కూర్చోవడం అంటే అప్పుడు ధన వ్యామోహము, గర్వాల వలన సాటి వారికి ఎంతో హానికరంగా, పాములాగా అయ్యి కొన్ని జన్మలు హీన జన్మ లెత్తారు. పరమపద సోపాన పటంలో మన బలహీనత లను పాముల్లాగా చిత్రించేదిoదుకే అయినా చివరకు తన తప్పు గ్రహించి, ధనాన్ని త్యాజించారు: అంటే సిరిసంపదలను దాన ధర్మాలకు వినియోగించారు. "ఇటువంటి కథలు ఎన్నో శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు".

     సాయి భక్తులకు గత జన్మల వృత్తాంతాలు కూడా చెప్పేవారు  తమను బాబా జన్మజన్మల నుండి కాపాడుతున్నారని తెలిస్తే భక్తులు కృతజ్ఞతతో ఆయనకు మరింత సన్నిహితులు అవుతారు కదా! శ్రీమతి ప్రధానకు బాబు జన్మించడానికి సంవత్సరం ముందే భక్తులతో బాబా "ఆమె బాబుకు తల్లి" అనసాగారు ఈ 'బాబు' హరి వినాయక సాఠే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు ఒకసారి అతనికి బాబా సుప్రదర్శనమిచ్చి పిలవడం వలన అతడిల్లు విడిచి, కాలినడకన శిరిడీ చేరి, బాబాను దర్శించాడు తర్వాత ఇతడు కోపర్గాం మరియు యవలా గ్రామాలకు సర్వేయర్ అయ్యాడు. ఇతనిపై అధికారి లిమయే సాఠే కు క్రింది ఉద్యోగి. బాబు పూర్తిగా బాబా సేవలో ఉండి తమ ఉద్యోగ ధర్మాన్ని అశ్రద్ధ చేస్తుంటే, సాఠే, ఖేల్కర్లు బాబాకు ఫిర్యాదు చేశారు. బాబా "ఆ పనులన్నీ అలా ఉంచి నా సేవ చేసుకొనివ్వండి"అని అన్నారు. అప్పటినుండి వారు బాబుకు ఎక్కువ పనులు చెప్పేవారుగాదు. సాయి ఒక్కొక్కప్పుడు మంచి మంచి ప్రసాదాలన్ని అతనికి పెట్టేవారు. 1910 సంవత్సరంలో ఒకసారి ఆయన "బాబు విషయంలో జాగ్రత్త తీసుకో!" అని కేల్కర్ను హెచ్చరించారు. అతనికి ఏమీ అర్థం కాలేదు కొద్ది రోజులలో బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది ఒకరోజు ఖేల్కర్ తో బాబు ఇంకా జీవించే ఉన్నాడా? అన్నారు బాబా. కొద్ది రోజుల్లో బాబు షిరిడీ లోనే తన 22వ ఏటా చనిపోయాడు. అటు తర్వాత కూడా ఆయన తరచుగా అతనిని తలచుకుంటుండేవారు.

        పై కథలో బాబా చెప్పిన 'బాబే' ఖేల్కర్ బంధువైన ఈ బాబు. ఇతడు మరణించిన కొద్ది కాలానికి శ్రీమతి ప్రధాన్ కడుపున మరల జన్మించాడు. నాలుగు మాసాల ఆ బిడ్డని ఎత్తుకొని సాయి ఎంతో ప్రేమగా "బాబు! ఎక్కడికి వెళ్లావు? నేనంటే విసుగు పుట్టి వెళ్ళిపోయావా" అన్నారు. ఆయన చూస్తూనే ఆ బిడ్డ కిలకిలనవాడు.    

        మొదటిసారి షిరిడి దర్శించిన నార్కేను శ్యామ పరిచయం చేయబోతే సాయి "వీడిని నాకు పరిచయం చేయడమా? 30 జన్మల నుండి వీడు నాకు తెలుసు"! అన్నారు. అలాగే తమకు రఘువీరా పురం దరేతో ఏడు శతాబ్దాల నుండి సంబంధమున్నదని చెప్పి 'నేనితనిని ఎప్పుడు మర్చిపోను. ఇతడు 2000 మైళ్ళ దూరం ఉన్నా సరే ఇతడు లేకుండా నేనొక్క వెతకైన తినను" అన్నారు. బాబాను మనమంతగా గుర్తుంచుకోగలమా?

     14వ అధ్యాయం రెండో భాగం సంపూర్ణం.

         శుభం భవతు

             🙏🙏🙏

కామెంట్‌లు లేవు: