12, జులై 2023, బుధవారం

ముగ్గురే ప్రియురాల్లు

 నాకు ముగ్గురే ప్రియురాల్లు వారెవరో చెప్పుకోండి చూద్దాం.

................................................................

శ్లోకము.


(1) 

వాసుదేవ జరా కష్టం, కష్టం నిర్ధనజీవనం,

పుత్రశోకం మహత్ కష్టం, కష్టాత్ కష్టతరం క్షుధా ! 


బాల్య కౌమర యవ్వన వృద్ధాప్యాలలో ముసలితనం కష్టతరమైంది.హిత బంధు మిత్రులు సరిగా చూడకపోతే నరకం ఇక్కడే వారికి కనబడుతుంది.

ముసలితనముకన్నా ధనములేని జీవితము మహా దుర్భరమైనది.

కాని ఈ రెండింటికన్నా పుత్రశోకము  మహాదు:ఖకరమైనది.

కాని వాసుదేవా పై మూడు బాధలకన్నా ఆకలి బాధ చాలా గొప్పది. ఆకలి దేనికైనా ఎంతకైనా తెగించమంటుంది.


శ్లోకము


(2)  క్షుతుడాశా: కుటుంబిన్యః మయి జీవితి నాన్యగా:,

తాసా మాశా మహాసాధ్వీ, కదాచి న్మాం న ముంచతి. 


నాకు ముగ్గురు ప్రియురాల్లున్నారు, వారెవరంటే ఆకలి, దప్పిక, ఆశ, ఈ ముగ్గురు ఎప్పుడు నన్ను వదలక నా ముందే  ఎంతో సఖ్యంగా వుంటున్నారు. వాసుదేవా ! ఆశ అనే చిన్న ప్రియురాలుందే అది చాలా గడుగ్గాయి  తుంటరి నన్ను ఎప్పుడూ వీడిపోక నాతోనే వుంటుంది.


శ్లోకము


(3) 


 దాతా దరిద్రః కృపణో ధనాఢ్యః, పాపీ చిరాయుః సుకృతీ గతాయు, రాజా కులీనః సుకులీ చ భృత్యః, కలౌ యుగే షడ్గుణ మాశ్రయంతి.


కృష్ణా! కలియుగంలో దాత దరిద్రుడైతాడు,లోభి ధనికుడైపోతాడు.పుణ్యాత్ములు అల్పాయుష్కులైతారు, పాపులు చిరాయువుగా బ్రతుకుతారు.మూర్ఖులు స్వార్థపరులు అజ్ఞానులు విద్యలేనివారు  రాజులై రాజ్యాలేలుతారు.


/ సేకరణ /

కామెంట్‌లు లేవు: