22, సెప్టెంబర్ 2023, శుక్రవారం



 *ఏసీబీ జడ్జి* :  గారి పేరు బొక్కా సత్య వెంకట హిమబిందు గారు, వయస్సు 50 సంవత్సరాలు. సొంత ఊరు బొక్కా వారి పాలెం, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా. Cast: గౌడ సామాజిక వర్గం, Sub Cast: శెట్టి బలిజ(కల్లు గీత కార్మిక కులం). తండ్రి చంద్రశేఖర్ Lawer వృత్తి. న్యాయవాద వృత్తిలో కంటే కూడా Notary Work లో చాలా Busy గా ఉంటాడు.

ఈ కుటుంబం రాజకీయాలకు చాలా ఆమడ దూరంలో ఉంటుంది. ఆ ఊరిలో పెద్ద మనుషులు గా అందరి మన్ననలు పొందే కుటుంబం. హిమబిందు గారు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఆంధ్ర యూనివర్సిటీ నుంచి లా(Law) పట్ట పొందారు. 1996లో హైకోర్టు బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నారు. జడ్జి ఎంట్రన్స్ టెస్ట్ లో పాస్ అయ్యి 2016లో అమలాపురంలో అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జిగా పోస్టింగ్ తీసుకున్నారు. అక్కడి నుంచి వైజాగ్ కి ట్రాన్స్ఫర్ అయి CBI Court lo Pricipal Special Judge గా Work చేసారు. 18-04-23 లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వారు ఆమె ను Vijayawada కి ట్రాన్స్ఫర్ చేసి ఆమెకు మూడు పదవి బాధ్యతలు అప్పగించారు (1) CBI Court Judge (సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారాలకు సంబంధించిన) (2) ACB Court Judge(రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహారాలకు సంబంధించి అవినీతి నిరోధక చట్టాన్ని అమలు చేయడం) (3) 3వ  Additional District And Sessions Judge గా  నియమించారు. ఆమె ఎవరి ప్రలోభాలకు గురికాకుండా న్యాయ దేవత పుత్రికగా తన తీర్పులు ఇస్తుంది. విజయవాడలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన న్యాయవాదులు హిమబిందు గారి ఇంటికి వెళ్లి కొంచెం రచ్చలు చేశారు. హౌస్ మోషన్ వెయ్యమని డిమాండ్ చేశారు. ఆమె వారికి ఒక్కటే మాట చెప్పింది. రిమాండ్ రిపోర్ట్ లేకుండా హౌస్ మోషన్ వెయ్యను అని చెప్పింది. రిమాండ్ రిపోర్ట్ వచ్చిన మరుక్షణమే మీరు హౌస్ మోషన్ కి అప్లై చేసుకోవచ్చు అని నిజాయితీగా చెప్పింది. చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూద్ర వారి న్యాయవాదులు 15 మంది కంటే ఎక్కువ ఉండరాదు, అలాగే ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కి సంబంధించిన న్యాయవాదులు 15 మంది కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పి... న్యాయ దేవతను నమ్మే నల్ల కోటు ధరించే మనము పోలీసులతో చెప్పించు కునే పని ఉండకూడదు అని గౌరవంగా విన్నవించి ఆ విధంగా మిగతా వారందరినీ కోర్ట్ హాల్ నుంచి బయటికి పంపించి వేసింది. ఆమె నిజాయితీగా నిక్కచ్చిగా కఠి నాతి కఠినంగా తీర్పులు చెప్పే మనస్తత్వం కలిగిన వ్యక్తి. తెలుగుదేశం నాయకులు అవగాహన రాహిత్యం తో ఆమె జగన్ మాటలు వింటుంది అని ప్రచారం చేశారు. కానీ ఆమెకు సంబంధించిన ప్రమోషన్ లు, బదిలీలు ఇంక్రి మెంట్లు, ఉద్యోగ నియామకాలు అన్ని హైకోర్టుకు సంబంధించి ఉంటాయి. ఆమె ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆమె ను Judge గా విజయవాడ కు మార్చారు.  చంద్రబాబునాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గాని నియమించలేదు. ఆమె చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3వ  Additional District And Sessions Judge గా పని చేసారు. ఆమె చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రత్యేక గా న్యాయ దేవత ముద్దు బిడ్డగా మన్నన లు పొందిన వ్యక్తి. ఆమెను చూసి తెలుగువారు గర్వపడాలి ఎటువంటి రాగద్వేషాలకు గురికాకుండా తీర్పులు చెప్పింది. ఎవ్వరి ప్రలోభాలకు ఎప్పుడూ గురి కాలేదు. చట్టాన్ని రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు ధర్మాన్ని పాటించింది. నిర్భయంగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా దేశ చరిత్రలో ఒక సంచలనాత్మకమైన తీర్పును ఇచ్చిన ఒక వీర వనితగా చరిత్ర కు ఎక్కింది.  ఆమె ఇచ్చిన తీర్పులను తర్వాత కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అణువణువునా పరిశీలిస్తారు. చట్టంలో ఉండే సెక్షన్ల ను రాజ్యాంగంలో ఉండే అధికరణాలు ను అలాగే అవినీతి నిరోధక శాఖ కు సంబంధించిన చట్టాలు, నియమాలు కు లోబడి ఆమె తీర్పులు ఉంటాయి. ఈ రోజున సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టు హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు ఆమె ఇచ్చిన తీర్పును అభినందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండవచ్చు 14 సంవత్సరాలు పని చేసి ఉండవచ్చు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో సంవత్సరాలు పని చేసి ఉండవచ్చు, NDA Convener గా దేశ రాజకీయాలను చక్రం తిప్పి ఉండవచ్చు కానీ చట్టం న్యాయం ధర్మం సెక్షన్ల ప్రకారం ఆమె తీర్పు ఇచ్చినందుకు భారతదేశ ప్రజలందరూ గర్వపడుతున్నారు. భర్త ఆంధ్రప్రదేశ్లో గెజిటెడ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. చెల్లెలు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి హైదరాబాదులో మంచి Software కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అక్క చెల్లెలు ఇద్దరు మాత్రమే.

కామెంట్‌లు లేవు: