14, జనవరి 2026, బుధవారం

షట్టిల ఏకాదశి

 షట్టిల ఏకాదశి అనేది హిందూ క్యాలెండర్‌లో మాఘ మాసం కృష్ణ పక్షంలో 11వ తిథి (ఏకాదశి)న జరుపుకునే పండుగ. ఇది భగవాన్ విష్ణువుకు అంకితం చేయబడినది. ఈ ఏకాదశి పాపాలను నాశనం చేసి, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు

షట్టిల అంటే 'షట్' (ఆరు) మరియు 'తిల' (తిలలు లేదా ఎల్లు గింజలు) అని అర్థం. ఈ రోజు ఎల్లు గింజలను ఆరు విధాలుగా ఉపయోగించడం ద్వారా పుణ్యం సంపాదిస్తారు. అవి:


తిల-స్నానం: స్నానం చేసేటప్పుడు నీటిలో ఎల్లు గింజలు కలిపి స్నానం చేయడం.

తిల-ఉబ్టన్: శరీరానికి ఎల్లు పేస్ట్ రాయడం.

తిల-హవన్: పవిత్ర అగ్నికి ఎల్లు గింజలు అర్పించడం.

తిల-తర్పణం: పితృదేవతలకు ఎల్లు గింజలు కలిపిన నీటిని అర్పించడం.

తిల-భోజనం: ఎల్లు గింజలతో చేసిన ఆహారం తినడం.

తిల-దానం: ఎల్లు గింజలను దానం చేయడం

ఈరోజు (జనవరి 13, 2026) సాయంత్రం 3:16 నుండి ఏకాదశి తిథి ప్రారంభమైంది, కానీ ఉదయ తిథి నియమం ప్రకారం, షట్టిల ఏకాదశి వ్రతం రేపు (జనవరి 14, 2026) జరుపుకోవాలి. ఈరోజు సాయంత్రం నుండి ఉపవాసం ప్రారంభించవచ్చు, కానీ ప్రధాన ఆచారాలు రేపు

షట్టిల ఏకాదశి రోజు ఏం చేయాలి:


బ్రహ్మ ముహూర్తంలో లేచి, ఎల్లు గింజలు కలిపిన నీటితో స్నానం చేయాలి.

విష్ణువుకు పూజ చేయాలి: ఎల్లు నూనెతో దీపం వెలిగించి, పూలు, తులసి, ఫలాలు సమర్పించాలి.

ఎల్లు మరియు బెల్లం (తిల-గుడ్)తో భోగం సమర్పించాలి.

విష్ణు సహస్రనామం లేదా 'ఓం నమో భగవతే వాసుదేవాయ' మంత్రం జపించాలి.

ఉపవాసం: ధాన్యాలు, పప్పులు తినకూడదు. ఫలాలు, పాలు, 

నట్స్ తినవచ్చు.

ఎల్లు గింజలు, బట్టలు, ఆహారం దానం చేయాలి.

వ్రత కథ వినాలి లేదా చదవాలి.

షట్టిల ఏకాదశి వ్రత కథ:

చాలా కాలం క్రితం జరిగిన ఘటన. దాదాపుగా ద్వాపర యుగంలో ఈ సంఘటన జరిగినట్లుగా చెబుతారు. ఒక ఊరిలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ఆమె తన సంపదను దానధర్మాలకు వెచ్చించింది. అడిగినవారికి కోరినంత ధనం, ఆభరణాలు ఇలా విలువైన వస్తువులను ఎన్నింటినో దానం చేసిన ఆమెకు ఎందుకో అన్నదానం చేయడం ఇష్టం ఉండేది కాదు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న అని చెబుతారు కదా. ఈ విషయమై అందరూ ఆమెకు ఎంతో నచ్చ చెప్పాలని చూసినా ఫలితం లేకపోయింది. ఆమె ఆహారం మినహా ప్రజలు కోరుకునే ఏదైనా దానం చేసేది.

ఇదిలా ఉండగా ఒకనాడు శ్రీకృష్ణుడు ఆ శ్రీమంతురాలికి అన్నదానం గొప్పతనాన్ని తెలియజేయాలని అనుకున్నాడు. కృష్ణుడు బిచ్చగాడి రూపాన్ని ధరించి, శ్రీమంతురాలి వద్దకు వెళ్లి ఆహారం అర్ధించాడు. కానీ ఆ స్త్రీ బిచ్చగాడికి భిక్షలో ఆహారం ఇవ్వడానికి నిరాకరించి అతనిని తరిమికొట్టింది. పట్టువదలని ఆ భిక్షకుడు తిరిగి వచ్చి మళ్లీ ఆహారం కోసం అడుగగా, ఆమె అతని భిక్షా పాత్రలో మట్టిని వేసి అవమానించింది. ఆశ్చర్యకరంగా ఆ భిక్షకుడు ఆమెకు కృతజ్ఞతలు తెలిపి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

భిక్షకుని వెళ్లగొట్టి శ్రీమంతురాలు తిరిగి ఇంట్లోకి వెళ్లేసరికి ఆమె ఇంట్లో వండిన ఆహారమంతా మట్టిగా మారడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అంతేకాదు ఆమె తినడం కోసం ఏది కొన్నా అది మట్టిగా మారిపోతుండేది. అంత సంపద ఉన్నప్పటికీ, ఆమె తినడానికి కొన్నవి కొన్నట్లు మట్టిగా మారిపోతుండడం వల్ల ఆమెకు ఆహారం కరువైంది. ఇంట్లో సకల సంపదలు ఉన్నా ఆమె తినడానికి మాత్రం ఏమి ఉండేది కాదు. ఆ విధంగా ఆకలితో శ్రీమంతురాలి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడం ప్రారంభించింది.

ఆకలితో ప్రాణం పోయే స్థితిలో ఆమె తన ఇష్ట దైవమైన శ్రీకృష్ణుని రక్షించమని ప్రార్థించింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు కలలో కనిపించి, భిక్షకుని పాత్రలో మట్టి వేసి అవమానించినందున, ఆమెకు ఈ గతి పట్టిందని పేదలకు అన్నదానం చేయమని అలాగే షట్తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని ఆమెకు ఉపదేశించాడు.

శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఆ శ్రీమంతురాలు ఆనాటి నుంచి పేదలకు, అన్నార్తులకు అన్నదానం చేయడం వల్ల ఆమె కోల్పోయినదంతా తిరిగి వచ్చింది. అలాగే ఆమె భక్తిశ్రద్ధలతో షట్తిల ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరించి ఇహలోకంలో సకల భోగాలు అనుభవించి మరణాంతరం మోక్షాన్ని పొందింది

కామెంట్‌లు లేవు: