9, మార్చి 2021, మంగళవారం

అనంతావధానం

 * .

**************

*అనంతావధానం* 

- *డాక్టర్* *రాయారావు* *సూర్యప్రకాశ్* *రావు* 

9441046839

*************

వంటిల్లు అనంతావధానానికి మౌనసాక్షి

ఊయలలోని పాప ఏడుపు

అంతరార్థం కోసం అమ్మ అన్వేషణ

చీమ కుట్టిందో

దోమ కుట్టిందో

కల వచ్చిందో

కుల్లా కరిచిందో

పూరణానికి ఆ తల్లికో సమస్య 


పాలల్లో బూస్టు వద్దని ఒకరు

హార్లిక్సు సరిపడదని మరొకరు

నిషిద్ధాక్షరిని ప్రయోగించే

గడుగ్గాయి పిల్ల పృచ్ఛకులు

ఇంట్లో లేని కూరలనే వడ్డించమని

న్యస్తాక్షరి ప్రశ్నలా నిలుస్తారు మామగారు

నాలుగు పూటలా ఏమేం కావాలో

ఆదేశాలు జారీ చేస్తూ

దత్తపది అవతారమెత్తుతారు అత్తగారు

ఏదో ఒక విషయంపై కథ చెప్పమని

మారాం చేస్తూ

వర్ణన సమస్య ఇస్తారు పిల్లలు

 


జీతం రాకముందే

ఠంచనుగా ఫస్టుకు డబ్బులడిగే

పాలవాడికి ఆశుకథాశ్రవణం అందించవలసిందే

వంట మధ్యలో పిలిచి

కూర మాడేందుకు కారణమయ్యే పక్కింటి ఆంటీ

గొప్ప అప్రస్తుత ప్రసంగీకురాలు

సరిగ్గా ఊపిరి పీల్చేందుకు సమయం లేనప్పుడే

సీరియల్ కథలు వల్లె వేస్తుంది


పనిలో ఉన్నప్పుడే వచ్చే

పేపర్ బిల్లూ

కేబుల్ బిల్లూ

లాండ్రీ బిల్లూ

అప్రస్తుత ప్రసంగాలకు అంకెల రూపంగా కనబడతాయి 


అత్తమామలకు అర్థం కాకుండా

పక్కింటి ఆంటీ తోనూ భర్తతోనూ మాట్లాడే

‘క’ భాషో ‘గ’ భాషో 

ఛందోభాషణానికి ఉదాహరణ అవుతుంది


బ్యాగు సర్దావా?

బాక్సు పెట్టావా?

పుస్తకాలు అన్నీ ఉన్నాయా?

నీళ్ల సీసా ఉందా?

అన్నీ అవధాన ప్రశ్నలే


వంటిల్లు ఒక అవధాన క్షేత్రం

ఇల్లాలు అవధాన సరస్వతి

సంభాషణం సంస్కృతేన భవతి

 నమస్తే 


యత్ర యత్ర సంభాషణం సంస్కృతేన  భవతి 

తత్ర తత్ర వేదాః వికసంతి విలసంతి చ 


యత్ర యత్ర సంభాషణం సంస్కృతేన  భవతి 

తత్ర తత్ర వేదాఙ్గాని వికసంతి విలసంతి చ 


యత్ర యత్ర సంభాషణం సంస్కృతేన  భవతి 

తత్ర తత్ర ఉపనిషదః వికసంతి విలసంతి చ 


యత్ర యత్ర సంభాషణం సంస్కృతేన  భవతి 

తత్ర తత్ర రామాయణం మహాభారతం కావ్యాని చ వికసంతి విలసంతి చ 


యత్ర యత్ర సంభాషణం సంస్కృతేన  భవతి 

తత్ర తత్ర స్తోత్రాణి  వికసంతి విలసంతి చ 


యత్ర యత్ర సంభాషణం సంస్కృతేన  భవతి  

తత్ర తత్ర సంస్కృతభాషా రాజ్యేషు ద్వితీయ అధికారభాషారూపేణ రాష్ట్రస్య జాతీయవిశ్వభాషారూపేణ చ వికసతి విలసతి చ 


యత్ర యత్ర సంభాషణం సంస్కృతేన  భవతి 

తత్ర తత్ర హైందవసంస్కృతిః వికసతి విలసతి చ 


యత్ర యత్ర సంభాషణం సంస్కృతేన  భవతి  

తత్ర తత్ర సకలభారతీయ శస్త్రాణి శాస్త్రాణి చ వికసంతి విలసంతి చ 


యత్ర యత్ర సంభాషణం సంస్కృతేన  భవతి  

తత్ర తత్ర ఆత్మనిర్బర్ భారతస్య స్వప్నాః సాకారీభవంతి 


యత్ర యత్ర సంభాషణం సంస్కృతేన  భవతి  

తత్ర తత్ర బ్రహ్మ విష్ణు  మాహేశ్వర సరస్వతీ లక్ష్మీ పార్వతీ  మందిరాణి  వికసంతి విలసంతి చ 


యత్ర యత్ర సంభాషణం సంస్కృతేన  భవతి  

తత్ర తత్ర భారతీయహైందవసంస్కృతిశ్చ సుస్థిరా సుప్రతిష్ఠితా చ భవతి


యత్ర యత్ర సంభాషణం సంస్కృతేన  భవతి  

తత్ర తత్ర సంస్కృత అక్షరాణి పదాని వాక్యాని గద్యాని పద్యాని శ్లోకాః మంత్రాః చ  సుస్థిరాః సుప్రతిష్ఠితాః  చ భవన్తి 


యత్ర యత్ర నిత్యదైనందిన వ్యవహారాణి సకలవిధకార్యాణి సంభాషణం సంస్కృతేన  భవంతి  

తత్ర తత్ర సకలవిధదేవాః దేవతాశ్చ సంచరంతి భ్రమంతి విలసంతి వికసంతి రారాజంతే


యత్ర యత్ర సంభాషణం సంస్కృతేన  భవతి  

తత్ర తత్ర భారతభూమిః స్వర్గధామం భవతి 


సంస్కృతేన సంభాషణం నామ సకలదేవతానాం సుఖసంపదాం అష్టైశ్వార్యాణాం చ ఆహ్వానమేవ 


సంస్కృతేన సంభాషణం కురు 

జీవనస్య పరివర్తనం కురు 

యత్ర యత్ర గచ్ఛసి 

తత్ర పశ్య సంస్కృతమ్


సంభాషణ సంస్కృతమ్ (సమాచారపత్రికా)

మాఘ పురాణం*_🚩 🚩 _*23 వ అధ్యాయము*_🚩

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*23 వ అధ్యాయము*_🚩


     *శనివారం*

*మార్చి 6, 2021*


🕉️🌹🍁🍁🍁🍁🌹🕉️


*నారదుని దౌత్యము - దేవతల దైన్యము*


🕉️☘️☘️☘️☘️☘️☘️🕉️


గృత్నృమదమహర్షి జహ్నువుతో నిట్లనెను. పారిజాత పుష్పములకై వెళ్లిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని యింద్రుడుని విచారించెను. పారిజాత పుష్పముపై నున్న యిష్టము అధికమగుటచే, తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు, దేవతలను గూడ, తనతో తీసికొనివచ్చెను. సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి, యింద్రుడు, దేవతలు మహోత్సాహముతో, పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే, స్వర్గమునకు దీసికొని పోదలచిరి. ఆ మహోత్సాహములో, శ్రీహరి, పూజా నిర్మాల్యమును, పాదములతో, త్రొక్కిదాటిరి. ఫలితముగా, దివ్యశక్తులను గోల్పోయిరి. శక్తివిహీనులైరి, ఇంద్రాదులింకను రాలేదని, మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాతవృక్షమును పెకలింపదలచి   యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే, వారును, శక్తి హీనులై పడియుండిరి.


మరునాటి ఉదాట్యమున, సత్యజిత్తు, తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన యింద్రాదులను జూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును, విచారమును, చెందెను. వారికి నమస్కరించెను. "ఇంద్రాది దేవతలారా! మీరు మానవులమైన మాకంటె గొప్పవారు. ఇంతటి మీరు, స్వల్ప ప్రయోజనమునకై, యిట్టి అకార్యమునేల చేసితిరి. మీరు నాకు తెలియకుండ, పుష్పములను దొంగతనముగా తీసికొని పోదలచుట దోషము కాదా?" అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక, తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు, నేలపైనున్న మాంసమునకాశపడి, భూమిపై వానియవమానము నందినట్లు, మేమును, పారిజాత పుష్పముల కాశపడి, ధర్మమును తప్పి, దొంగలించి, యిట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితియేమిటో, యెట్టిదో, చెప్పుమని, యడిగిరి. సత్యజిత్తు వారికేమియు సమాధానమును చెప్పక, తన యాశ్రమమునకు పోయెను.


ఇంద్రుడు మొదలగువారు, ఆహారము లేక, దుఃఖపడుచు నచట పదునొకండు దినములుండిరి. వారికి ఆ కాలమున, అమృతాహారము లేదు. కామధేనువు యిచ్చు మధురక్షీరమును లేదు. కల్పవృక్షము, చింతామణి యిచ్చునట్టి, పుష్టికరములైన భక్ష్యభోజ్యములును లేవు. మిక్కిలి దీనులై యుండిరి. సత్యజిత్తును, దేవతల దురవస్థకు, విచారించెను. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును, తొలగించెను. తానేమి చేయవలెనో, దేవతల దుస్థితి తన వలన యేర్పడినది యెట్లు తొలగునో తెలియక, దీనులైయున్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని, యధాపూర్వకముగ పూజించుచు, తానును, భార్యయు, నిరాహారులై యుండిరి. ఈ విధముగా, సత్యజిత్తు కూడ, పదనొకండు దినములు, నిరాహారుడై, శ్రీహరి పూజను మానక, శ్రీమన్నారాయణుని తలచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడాకాశమున దిరుగుచు, దేవతల దురవస్థను, గమనించెను. వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థపోవునో, అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి, యిట్లు స్తుతించెను.


*నారదకృత విష్ణుస్తుతి*


ఆర్తత్రాణపరాయణాయభవతే నారాయణాయాత్మనే

గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చేశాయచ ||

మిత్రానేక హిమాంశుపావక మహాభాసాయ సాజ్యప్రదే

శ్రీమత్పంకజపత్ర మేత్ర నిలసత్ కృష్ణాయ తుభ్యం నమః ||

అచ్యుతాయాదిదేవాయ పురాణ పురుషాయచ

సర్వలోక నిధానాయ నమస్తే గరుడ ధ్వజ ||

నమో అనంతాయ హరయ క్షీరసాగరవాసినే

భోగీంద్ర తల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ ||

నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన

సర్వేశ సర్వగస్త్యంహి సర్వాధారస్సురేశ్వర ||

సర్వంత్వమేవ వృజసి నత్త్వ రూపస్త్యమవహి

పురుషాపి గుణాధ్యక్ష గుణాతీత స్స్నాతనః ||

పరబ్రహ్మసి విష్ణుస్త్యం బ్రహ్మసి భగవాన్ భవః

సృష్తిస్థితిలయాదీనాం కర్తాత్వం పురుషోత్తమ ||

త్రిగుణోసిగుణాధార స్త్రిమూర్తిస్త్యం త్రయీరమః

ఆ సీత్త్యన్మాయయా సర్వం జగత్ స్థావర జంగమం ||

త్వమేనైకార్ణవేజాతే జగత్యస్మిన్ జగత్పతే

జగత్ సహృత్యసకలం ప్రిత్వా భాబేహనే తు భాసకః ||

త్వమేవ సర్వలోకానాం మాతాత్వం నా పితా విభో

గురుస్త్యం సర్వభూతానాం శిక్షకస్పుదాయకః ||

ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం

ప్రసీదపాలయవిభో నమస్తే సురవల్లభ ||


నారదుని స్తుతిని విని, సర్వజ్ఞుడగు శ్రీహరి,యేమియు నెరుగనివానివలె, ''నారదా! స్వాగతము ఇప్పుడెందులకీస్తుతి? నీకేమి కావలయునో చెప్పుము. ఏమి చేసిన నీకు సుఖము అగునో, అది యెట్టిదైనను, దేవాదులు సాధింపజాలనిదైనను, నీకు సమకూర్చెదను" చెప్పుమని యడిగెను. నారదుడును, తలవంచి," ఇంద్రాదులు చెడుపనిని చేసి, ఆపదపాలైరి. భూమియందు పారిజాతమును వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని యందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతి దినము దొంగలించుచుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి యిష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై, యింద్రుడు, దేవతలతో బాటు వెళ్లి, ఆ పారిజాత వృక్షము వద్ద, అగ్ని సమీపమున, రెక్కలు కాలిపడిన మిడుతవలె, దేవతా గుణముతో పడియున్నాడు. అమృతాహారులైన యింద్రాది దేవతలు, పదునొకండు దినముల నుండి, నిరాహారులై, దీనులై పడియున్నారు. భగవాన్ శ్రీమన్నారాయణ మూర్తీ! నీవిప్పుడు, వారిని దయయుంచి రక్షింపవలయునని," నారదుడు కోరెనుl.


నారదుని మాటలను విని శ్రీహరి, 'నారదా! అమృతకలశము నుండి తొణికి పడిన రెండు బిందువుల అమృతమే, పారిజాత వృక్షముగను, తులసిగను అయినది. అనగా ఆ రెండును, అమృతము నుండి పుట్టినవి. రెండు మిక్కిలి పవిత్రములు, సత్యజిత్తనువాడు, ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అదియొక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను, తులసి దళములను అమ్మి, ఆ ధనముతో, దరిద్రులను ఆర్తులను పోషించి, తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను, ఇట్టి యుత్తమునికి, దీనులకును, జీవనాధారమగు పుష్పసంపదను, త్రిలోకాధిపతియగు నింద్రుడు, నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకాదీనుడగు సత్యజిత్తు, నన్నర్చించిన నిర్మాల్యమును, పుష్పవాటికలో జల్లగా, భోగలాలనుడగు నింద్రుడు, నా నిర్మాల్యమును గూడ దాటెను. త్రొక్కెను. ఇన్ని దోషములచే, త్రిలోకాధిపతియగు నింద్రుడు, వాని యనుచరులు, శక్తిహీనులై, తోటలో పడి యున్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును, తెలిసికాని, తెలియకకాని, దాటిన, తొక్కిన, యెంతటి వాడైనను, శక్తిని కోల్పోయి, దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు, యింద్రాదుల దైన్యమునకు బాధపడుచు, నేమి చేయవలెనో తెలియక, తానును, భార్యతో బాటు, నిరాహారుడై, నన్నర్చించుచు, నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు, నేటి వరకు, పదనొకండు  దినములు, దేవతలు అమృతపానము లేక, నిరాహారులైరి. సత్యజిత్తును, వారిని జూచి, భార్యతోబాటు, నిరాహారుడై యుండెను. దేవతల విముక్తికై, నన్ను ప్రతిదినము, నర్చించునే యున్నాడు. నేడు పదకొండవ దినము. అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు, నేడు కూడ, ఉపవాసముండి, నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు, జాగరణమొనర్చినచో, నేను ప్రసన్నుడై, అతడేది కోరినను వెంటనే యిచ్చెదను. అతడే కాదు. యెవరైనను, యేకాడశి నాడు, ఉపవాసముండి, జాగరణ చేసి, నా మంత్రమును జపించినచో, వారికిని, కోరిన దానినిచ్చెదను" అని, విష్ణువు సమాధానము ' నిచ్చెను. నారదుడును యేమియును మాటలాడలేక, తన దారిన బోయెను, అని గృత్నృమదమహాముని, జహ్నువునకు చెప్పెను.


*ఇరవైమూడవ అధ్యాయము*              

             *సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

సమయానుకూలంగా

 *సమయానుకూలంగా వెళ్దాం..  లేకపోతే ???*


 ``1998 లో, 1,70,000 మంది ఉద్యోగులు కోడాక్‌లో పనిచేశారు మరియు వారు ప్రపంచంలోని 85% ఫోటో పేపర్‌ను అమ్మారు.. కొన్ని సంవత్సరాలలో, డిజిటల్ ఫోటోగ్రఫీ వాటిని మార్కెట్ నుండి తరిమివేసింది .. కోడాక్ దివాళా తీసింది మరియు ఉద్యోగులందరూ రోడ్డుపై పడ్డారు


 HMT (watch)

 బజాజ్ (స్కూటర్)

 డయనోరా (టీవీ)

 మర్ఫీ (రేడియో)

 నోకియా (మొబైల్)

 రాజ్‌డూత్ (బైక్)

 అంబాసిడర్ (కార్)


 మిత్రులారా,

 వీటన్నిటి నాణ్యతలో కొరత లేదు, అయినప్పటికీ అవి మార్కెట్‌కు దూరంగా ఉన్నాయి !!


*కారణం ???*


 *కాలక్రమేణా అవి మారలేదు. !!*


 రాబోయే పదేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని, నేడు నడుస్తున్న 70 నుంచి 90% పరిశ్రమలు మూతపడతాయని మీకు తెలుసా..


*నాల్గవ పారిశ్రామిక విప్లవానికి స్వాగతం…*


 🔥ఉబెర్ కేవలం ఒక సాఫ్ట్‌వేర్.  సొంతంగా ఒక్క కారు కూడా లేనప్పటికీ, అది ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ సంస్థ.


 🔥సొంతంగా హోటల్ లేనప్పటికీ, ఎయిర్‌బిఎన్బి ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ సంస్థ.


 Paytm, ola cabs, oyo rooms వంటి అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి


 🔥యుఎస్‌లో యువ న్యాయవాదుల కోసం ఇప్పుడు ఎటువంటి పని లేదు, ఎందుకంటే ఐబిఎం వాట్సన్ సాఫ్ట్‌వేర్ క్షణంలో మంచి న్యాయ సలహా ఇస్తుంది.  రాబోయే పదేళ్లలో, 90% యుఎస్ న్యాయవాదులు నిరుద్యోగులు అవుతారు.. 


🔥వాట్సన్ అనే సాఫ్ట్‌వేర్ క్యాన్సర్ నిర్ధారణను మానవులకన్నా 4 రెట్లు కచ్చితంగా అంచనా వేస్తుంది. 

 2030 నాటికి కంప్యూటర్లు మనుషులకన్నా తెలివైనవి.


 రాబోయే పదేళ్లలో, 90% కార్లు ప్రపంచంలోని రోడ్ల నుండి అదృశ్యమవుతాయి.. ఎలక్ట్రిక్ కార్లు లేదా హైబ్రిడ్ కార్ లదే రాజ్యం.. రోడ్లు ఖాళీగా ఉంటాయి.


🔥 పెట్రోల్ వినియోగం 90% తగ్గుతుంది, అన్ని అరబ్ దేశాలు దివాళా తీస్తాయి 


 మీరు ఉబెర్ వంటి సాఫ్ట్‌వేర్ నుండి కారును పొందుతారు మరియు కొద్ది క్షణాల్లో డ్రైవర్‌లేని కారు మీ తలుపు వద్ద నిలబడుతుంది.. మీరు దానిని ఎవరితోనైనా పంచుకుంటే, ఆ రైడ్ మీ బైక్ కంటే చౌకగా ఉంటుంది.


 🔥కార్లు డ్రైవర్ లేని కారణంగా 99% ప్రమాదాలు ఆగిపోతాయి.. ఇది కార్ ఇన్సూరెన్స్ అనే వ్యాపారాన్ని మూసివేస్తుంది.


🔥 డ్రైవర్ వంటి ఉపాధి భూమిపై ఉండదు.  నగరాలు మరియు రోడ్ల నుండి 90% కార్లు అదృశ్యమైనప్పుడు, ట్రాఫిక్ మరియు పార్కింగ్ వంటి సమస్యలు అదృశ్యమవుతాయి ...


 20 సంవత్సరాల క్రితం పిసిఓ లేని చోటు లేదు.  మొబైల్ ఫోన్ శకం మొదలవగానే పిసిఓ లు మూసివేయడం ప్రారంభమైంది.. అప్పుడు ఆ పిసిఓ లలో ఫోన్ రీఛార్జ్ అమ్మడం ప్రారంభించారు. 


🔥 ఇప్పుడు రీఛార్జ్ కూడా ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. 


*మీరు ఎప్పుడైనా గమనించారా ..?*


 ఈ రోజుల్లో, మార్కెట్లో ప్రతి మూడవ దుకాణం మొబైల్ ఫోన్లదే..

 అమ్మకం, సేవ, రీఛార్జ్, ఉపకరణాలు, మరమ్మత్తు, నిర్వహణ.. జరుగుతోంది


 ఇప్పుడు అంతా పేటీఎమ్‌ జమానా.. ఇప్పుడు ప్రజలు తమ ఫోన్‌ల నుంచి రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు .. ఇప్పుడు డబ్బు లావాదేవీలు కూడా మారుతున్నాయి .. కరెన్సీ నోట్‌.. ప్లాస్టిక్ మనీ (డెబిట్) కార్డుగా మార్పుచెందింది.. ఇప్పుడు అది డిజిటల్‌గా మారింది.  


🔥 ప్రపంచం చాలా వేగంగా మారుతోంది .. కళ్ళు, చెవులు తెరిచి ఉంచండి, లేకపోతే మీరు వెనుకబడిపోతారు..


 కాలక్రమేణా మార్పు సహజం

 అందువల్ల ...

 ఒక వ్యక్తి తన వ్యాపారాన్ని మరియు అతని స్వభావాన్ని కాలక్రమేణా మారుస్తూ ఉండాలి.

 

*"టైమ్ టు టైమ్ అప్‌డేట్ & అప్‌గ్రేడ్"*


 సమయంతో కదిలి విజయం సాధించండి..

మాఘ పురాణం*_🚩 🚩 _*22 వ అధ్యాయము*_🚩

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*22 వ అధ్యాయము*_🚩


     *శుక్రవారం*

*మార్చి 5, 2021*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*క్షీరసాగరమధనము*


🕉️☘☘☘☘☘☘🕉️


గృత్నృమదమహాముని జహ్నుమునితో నిట్లనెను. జహ్నుమునివర్యా ! వినుము , అశ్వమేధయాగము చేసినవాడును , ఏకాదశి వ్రత నియమమును పాటించినవాడును , మాఘమాసవ్రతము నాచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధయాగము చేసిన వచ్చునట్టి పుణ్య ఫలమునంది తుదకు మోక్షమును గూడ పొందును. స్వర్గాధిపతియై ఇంద్ర పదవినందును. మాఘ ద్వాదశినాడు బ్రాహ్మణులతో గలసి పారణ చేయువాడు , అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను.


జహ్నుముని గృత్నృమదమహాముని ! తిధులనేకములుండగా ఏకాదశి అన్నిటికంటె శుభప్రదమైనది యెట్లయ్యెను ? అనేకాశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశీ వ్రతమొక్కటే ఇచ్చుటయేమి ? ఎవరైనను ఇట్లు చేసి ఇతటి పుణ్యమునందిరా చెప్పుము అని అడిగెను. గృత్నృమదమహాముని యిట్లనెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను , సంపదలను , పుత్రపౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగుగను , సర్పరాజువాసుకిని కవ్వపుత్రాడుగను చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు మూడువరుసలుగ జుట్టి దేవతొలొక వైపునను రాక్షసులు మరియొక వైపునను పట్తిరి.


వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువామెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్శ్రవమను అశ్వము , కామధేనువు , కల్పవృక్షము , అమృతకలశము మున్నగునవి సముద్రమునుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని ఇంద్రునకిచ్చెను. దేవదానవులు మరల సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు , రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరువద్దకు పోయి నమస్కరించి యిట్లు స్తుతించిరి.



*🌳దేవదానవులు చేసిన శివస్తుతి🌳*



*నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే*

*నమోగిరాం విదూరాయ నమస్తే గిరి ధన్వవే ||*

*నమశ్శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ*

*నమోనిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే ||*

*త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక*

*త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే ||*

*త్రయీధర్మైకసాధ్యాయ త్రిరూపాయోరురూపిణే*

*అరూపాయ సరూపాయ వేదవేద్యాయతే నమః ||*

*హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే*

*మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల ||*

*పాహ్యస్మాన్ కృపాయాశంభో విషాత్ వైస్వానరోసమాత్*


అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా విషమును మ్రింగి తన కంఠమును నిలిపెను. నల్లని విషము కంఠమున నిలువుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడను పేరు అప్పటినుండి యేర్పడినది. విషభయము తొలగిపోవుటచే నిశ్చంతులైన దేవ దానవులు సముద్రమును , ధనమును మాని అమృతపాత్రను స్వాధీనము చేసికొనవలయునని యత్నించిరి , ఒకరికి దక్కకుండ మరియొకరు అపహరింపవలెనని యత్నించిరి. ఏ విధముగా తీవ్రమైన గగ్గోలు యేర్పడినది.


మాయావియగు శ్రీమహావిష్ణువు మోహిని రూపము నందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములగు నామె స్తనములు , జఘవములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వువలె నుండెను. నేత్రములు మనోహరములై విశాలములైయుండెను. మృదువైన బాహువులు , పొడవైన కేశములు , తీగవంటి శరీరము కలిగి సర్వాభరణభూషితయై పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగ సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారాయని మధురస్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులామె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి.


ఆమె దేవదానవులను జూచి దేవతలారా , దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినైయుండి యీ అమృతకలశములోని అమృతమును మీ రెండు వర్గముల వారికిని సమానముగ పంచెదను. దేవతల వర్గమొక వైపునను , రాక్షసుల వర్గము మరియొక వైపునను కూర్చుండిరి. ఈమె యెవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండ అమృతమును సమానముగ పంచునని తలచెను.


అందరిని మోహవ్యాప్త పరచుచున్న ఆ జగన్మోహిని అమృతపాత్రను చేత బట్టెను. ఆమె ఆ అమృతపాత్రను రెండు భాగములు చేసెను. ఒకవైపున అమృతమును మరియొకవైపున సురను(కల్లు) ఉంచెను. రాక్షసులున్నవైపున కల్లును , దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచునెవరికిని అనుమానము రాకుండ అటునిటు దిరుగుచునుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి చెవులకింపుగ ధ్వనించుచున్న పాదములయెందెల రవళితోను , హస్తకంకణముల సుమధుర నాదములతోను , ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగ మనోహర , మధురముగ దిరుగుచు అమృతమును దేవతలకును , సురను దానవులకును కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగ చేసి కొన్నవారై త్రాగుచుండిరి.



*🌳రాహుకేతువుల వివరణ🌳*



రాక్షసులపంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవతల ముఖముల యందు అమృతపానముచే కళాకాంతులు తేజస్సువర్చస్సు పెరుగుట తమవారందరును సముద్ర మధనజనిత శ్రమనింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి. అనుమానము వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతలవరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకొని వారి చేతులయందు అమృతమును గరిటతో పోసెను. రాక్షసులు ఆత్రముగ దానిని త్రాగుటతో నామెకనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహినీ రూపముననున్న జగన్మోహనుదు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. వారు తాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు కాని కంఠము దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలోనుండిరి. చంద్రుడు మొదలగువారు త్వరత్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిపెను. తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగనే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలోనుండిరి. వారు ఇంతశ్రమయిట్లు అయ్యెని విచారము దుఃఖమునంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో నిద్దరు తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను.


చక్రముచే నరుకబడి చావుబ్రతుకు లేవి అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవా చావును బ్రతుకును కాని ఈ స్థితి మాకు దర్భరముగనున్నది. మాగతియేమి మాకాహారమేదియని దీనముగ శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతోగాని , అమావాస్యతోగాని కల సంధికాలములయందు సూర్యుని , చద్రుని భక్షింపుడు అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి.


ఇంద్రుడు మొదలగు దేవతలు అమృతకలశమును తీసికొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్రతీరమున అమృత కలశముంచినప్పుడు రెండు అమృతబిందువులు నేలపై బడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగను మరియొక బిందువు తులసి మొక్కగను అయినది. కొంత కాలము గడిచెను. సత్యజిత్తను సూద్రుడొకడా మొక్కలకు నీరు పోసి కుదుళ్లు కట్టి ఆ రెండిటిని సంరక్షించెను. ఆ రెండు మొక్కలున్నచోట మనోహరమైన పూలతోటగామారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరుపోసి పెంచుచు పారిజాతపుష్పములను తులసీదళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్పసమృద్ధమై నయనానందకరముగ నుండెను. తులసి కోమలములైన దళములతో అందముగ నుండెను.


ఇంద్రుడొకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకీయవలయునని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు దీసికొని వెళ్ళెను. శచీదేవిమున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములగు యీ పుష్పములు మాకు నిత్యము కావలయునని కోరిరి. ఇంద్రుడును గుహ్యకుని(యక్షుని) పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్షయజమాని నడుగ కుండ వానికి తెలియకుండ దొంగతనముగ తెప్పించుచుండెను.


పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలచెను. తోటలో రాత్రియందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొనయత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండ ఆకాశమున కెగిరిపోయెను. సత్యజిత్తు యెంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యముకాకుండెను. దేవేద్రుడును *'నీవు యక్షుడవు , ఆకాశగమన శక్తికలవాడవు. మానవులకు దొరకవు. కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెనూ. పుష్పములు ప్రతిదినము పోవుచునే యున్నది. సత్యజిత్తునకేమి చేయవలెనో తోచలేదు. పుష్పచోరుని ఉపాయముచే పట్టుకొనవలెనని తలచెను. శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల లోపల అంతటను చల్లెను.


యక్షుడు యధాపూర్వముగ పారిజాతపుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడా పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయపోవుచు శ్రీమనన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగ వాని దివ్యశక్తులతో పాటు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై గూడ సరిగా నడువలేక కుంటుచుండెను. యక్షుడును యెంత ప్రయత్నించినను అచటినుండి పోలేకపోయెను జరిగినదానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని *'ఓరీ నీవెవరవు ఎవరు నిన్ను పంపిరి , మా పుష్పములను ప్రతిదినము యెందుకని అపహరించుచుంటివని చెప్పమని గర్జించెనూ యక్షుడును *'నేను యక్షుడను ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పముల నపహరించి ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని యాజ్ఞచేత నిట్లు చేసితిని. కాని బుధ్ధిసాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు యేమియు మాటలాడక ఇంటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు మూడు దినముల బందీ అయి ఆ తోటలో నుండెను.


*ఇరవై రెండవ అధ్యాయము* 

             *సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

🚩 _*మాఘ పురాణం*_🚩 🚩 _*21 వ అధ్యాయము

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*21 వ అధ్యాయము*_🚩


        *గురువారం*

    *మార్చి 4, 2021*



🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹


*శివస్తుతి*


🕉️☘️☘️☘️☘️☘️☘️🕉️


*శ్రీమహావిష్ణువు చేసిన శివ ప్రశంస - నారదుని శివస్తుతి.*


గృత్నృమదమహర్షి జహ్నుమునితో, మరియు నిట్లనెను. విష్ణువు శివుని జూచి యిట్లనెను. శంకరా! నీవు నాతో సమానుడవు. మన యిద్దరికిని భేదము లేదు. నావలెనే సర్వ పూజ్యుడవు. సర్వవ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడవు సుమా! అని యిట్లు స్తుతించెను.


*విష్ణుకృత శివస్తుతి*


శంభో భవానర్కహిమాంశు నహ్నివేత్రత్రయస్తే ఖిలలోక కర్తా

తధాసమస్తామర పూజితాంఘ్రీః సంసేవ్యమానస్పురయోగిబందైః ||

వచాస్తికించిత్తవ మిత్ర భేదస్తే హంచ్వహం త్వం సురనాధసత్యం

వేదాంద వేద ప్రముఖా నిశం ర్వాంసన్యాసినస్వృర్గ విముక్తి హేతుం

వదంతి తద్వత్ సుభజంతిశంభో ప్రయాంతి ముక్తించ తివ ప్రసదం ||

సర్వభేదవినిర్ముక్తః సర్వభేదాశ్రయోభవాన్

త్వంత్వరిష్ఠాయలోకేస్మిన్ మహాదేవో మహేశ్వరః ||

త్వమేవ పరమానందస్త్వమే వాభయదాయకః

త్వమక్గరం పరంబ్రహ్మ త్వమేవహినిరంజనః ||

శివస్స్ర్వగతః సూక్ష్మః ప్రబ్రహ్మవిదామసి

ఋషీణాంచ వశిష్ఠస్త్వం వ్యాసోవేదనిదామసి ||

సాంఖ్యానాంకపిలోదేవః రుద్రాణామపి శంకరః

ఆదిత్యానాముపేంద్రప్త్యం వసూనాం చ హిపొవకః ||

వేదానాంసామవేదస్త్యం సావిత్రి చందసామపి

ఆధ్యాత్మ విద్యావిద్యానాం గతీనాం పరమాగతిః ||

మాయాత్వం సర్వశక్తీనాం కాలకలయతామపి

ఓంకారస్సర్వగుహ్యానాం వర్ణానాం చ ద్విజోత్తమః ||

ఆశ్రమాణాం చ గార్హ్యస్థ్యం ఏశ్వరాణాం మహేశ్వరః

పుంసాంత్వమేకుపురుషః సర్వభూతహృదిస్థితః ||

సర్వోపనిషదాంచేవ గుహ్యోపనిషదుచ్యతే

కల్పానాంచమహాకల్పః యుగానాంకృత మేవచ

ఆదిత్యః సర్వమారాణాం వాచాందేవి సరస్వతీ ||

ర్వం లక్ష్మీశ్చారురూపాణాం విష్ణుర్మాయావినామసి

సూక్తాణాం పౌరుషంసూక్తం బ్రహ్మసిబ్రహ్మవేదినాం ||

సావిత్రీచాసి జాహ్యిరాం యజుషాం శతరుద్రీయః

పర్వతానాం మహామేరుః అనంతోయోగినామపి ||

సర్వేషాం పరబ్రహ్మచ్వన్మయం సర్వమేనహి

యరైవాహం త్వంహి సర్వముఖ్యోషు శంకర ||


శంకరా! నీకు నాకును భేదమే లేదు. వేదాంతవేత్తలకిది స్పష్టముగ తెలియును. నేను నారదునకు, నీ మహిమను చెప్పగా, నతడు నీయనుగ్రహమునకై తపమాచరించెను. నిన్ను దర్శింపనెంచెను. నీవాతని ననుగ్రహించితివి. అతడు నిన్నెట్లు స్తుతించెనో గుర్తున్నదా?


కూపంతనాశేష కధాభిగుప్తం అగోచరం నిర్మలమేకరూపం

అనాదిమధ్యాంత మనంతమాద్యం నమామి దేవంతమనః పరస్తాత్ ||

ర్వాందేకపస్యంతి జగతృసూతిం వేదాంత సునిశ్చితార్థాః

ఆనందమాత్రం ప్రణనాభిధానం చతేవరూపం శరణం ప్రపధ్యే ||

ఆశేషభూతాంతర సన్నివిష్టం ప్రభావతాయోని వియోగహేతుం

తేజోమయం జన్మవినాశహీనం ప్రాణాభిధానం ప్రణతోస్మిరూపం ||

ఆద్యంత హీనం జగదాత్మభూతం విభిన్న సంస్థం ప్రకృతేపరస్తాత్

కూటస్థమవ్యక్తవపు స్తదైవ నమామిరూపం పురుషాభిదానం ||

సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వతనం సర్వతమ ప్రవిష్టం

సూక్ష్మంవిచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మిలే రూపములుస్త భేధం ||

ఆద్యం మహత్త్వే పురుషార్త్మరూపం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజం

ఐశ్వర్య విజ్ఞాన విరాగధర్మైస్పమన్వితం దేవనతోస్మిరూపం ||

ద్వీసప్తలోకాత్మకమంబు సంస్థం విచిత్ర భేదం పురుషైకరాధం

అనంత భూతైరధివాసితంతే వతోస్మ్యహం తజ్జ గదంద స్థంస్థం ||

అశేష దేవాత్మక మేకమాద్యం స్వతేజసారూపితలోక భేదం

త్రికాలహేతుం పరమార్జరూపం నమామ్యహం త్వాం రవి మండలస్థం ||

సహస్రమూర్థానమనంత శక్తీం సహస్రబాహుం పురుషం పురాణం

శయానమంతస్పంలే తదైవ నారాయణాఖ్యం ప్రణతోస్మినిత్యం ||

దంష్ట్రాకరాళం త్రిదశాదినంద్యం యుగాంత కాలావల కాలరూపం

అశేషరూపాండ వినాశహేతుం నమామి రూపం తవకాల సంజ్ఞం ||

ఫణా సహస్రేణ విరాజమానం భోగీంద్రముఖ్యైరభీ పూజ్యమానం

జనార్దన ప్రీతి మహత్కరం త్వాం సతోస్మిరూపంతవ శేష సంజ్ఞం ||

అన్యాహతైస్వర్యమయుగ్మ నేత్రం బ్రహ్మమృతానంద రవజ్ఞమేకం

యుగాంతశేషం దివిసృత్యమానం నతోస్మ్యహంత్వామె తిరుద్ర సంజ్ఞం ||

ప్రక్షీణశోకం విమలం పవిత్రం సురాసురైర్చిత పాదయుగ్మం

మకోమలం హింద్ర సుశుభ్రదేవాం నమామ్యహాం త్వామఖిలాభినాధం ||

చతుర్భుజం శూలమృగాగ్నిపాణీం ప్రయత్నతో భక్తవర ప్రదానం

వృషధ్వజం త్వాం గిరిజారదేహం వతోస్మ్యహందేవ కృపాకరేశం ||


శంకరా! నారదుడు చేసిన,  అమోఘమైన యీ స్తుతిని విని, నీవు నిక్కిలి సంతోషించితివి . మునులందరు, స్తోత్రమును చదువుచు, నిన్ను సేవించిరి కదా. కావున, నీకును నాకును, బ్రహ్మకును, భేదమును లేదు. మనకు భేదమున్నదని తల్చు మూఢులు, నరకమున బడుదురు సుమా! అని శ్రీమన్నారాయణుడంతర్థానము నందెను.


జహ్నుమునీ! విష్ణు ఈ  విధముగ, రజస్తమోగుణ భేదము వలన వివాదపడిన బ్రహ్మను శివుని శాంతపరచి, లోకములకి విషయము నీ విధముగ తెలిపెను. వస్తుతః, ముగ్గురికి భేదములేకున్నను, భేదమున్నదని తలచివాదించు, అహంకార పండితులకొరకీ సంఘటన జరిగినది. మాఘ మాసవ్రతము నాచరించు వారీ విషయమును, తప్పక గ్రహింపవలయును. అజ్ఞానముచే నాలోచించి, దోషమునకు ఒడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై, సర్వాత్మకుడైన, విష్ణువునే భావించి, జ్ఞానులై,

ముక్తినందవలెను. అజ్ఞానులు మాఘమాసవ్రతము నాచరించి, జ్ఞానులై యిహపరముల యందు సుఖింపవలయును సుమా! వృధాపదములు, బుద్ధిహీనులకే గాని, బుద్ధిమంతులకుగాదని తెలుపుటే, యీ సంఘటన జరిగినది. లెనిచో సర్వాధికులు, సర్వాధారులు సర్వోత్తములునగు, త్రిమూర్తులకు కలహమేమి? యెక్కువ తక్కువలేమి? మూర్ఖుడైనను, భక్తితో మాఘమాసవ్రతము నాచరించిన, జ్ఞానియై సుఖించునుl.


అహంకారము దుఃఖమును కలిగించునని, అది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని, దీని భావము. గర్వమని, అశక్తుడైన వాని నాక్షేపింతురు. సర్వసమర్థుడైన వానికేది అయినను, వానిశక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారమెట్లుండును? ఉండదు. ఏదియును అయనను మించినది లేదుకదా. జ్ఞానము కలుగలలెనని, భగవంతుడే యిట్టి సంఘటన నేర్పరచి, మనవంటి మూఢులకు, అహంకూడదని తెలిపెను. కావున గర్వమును, సిగ్గును, అభిమానమును విడిచి, బుద్ధిమంతుడు మాఘమాసవ్రతము నాచరించి, విష్ణుకథలను విని, తరింపవలెను. యధాశక్తి దానములాచరించి, సాటివారియందు ప్రేమనుచూపుచు, సర్వాత్మకుని దయా విశేషము నందవలయును, అని, గృత్నృమదమహర్షి, జహ్నుమునికి, మాఘమాస మహత్త్యమును, భగన్మహిమను బోధించెను.


*ఇరవై ఒకటవ అధ్యాయము* 

             *సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

మాఘ పురాణం

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*20 వ అధ్యాయము*_🚩


        *బుధవారం*

    *మార్చి 3, 2021*


🕉🌞🕉️🌞🕉️🌞🕉️🌞


*శివ బ్రహ్మల వివాదము*


🕉️☘☘☘☘☘☘🕉️


గృత్నృమద మహర్షి మరల యిట్లు పలికెను. శ్రీమహవిష్ణువు తత్త్వమును మహత్త్యమును వివరించు మరియొక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరు ఒకప్పుడు యెవరికివారు తానే ప్రధానుడనని యనుకొనిరి. సర్వలోకకర్తను, దేవతల కిష్తుడైన యధిపతిని నేనే మరియొకరు నాకంటే ఉత్తములు లేరని యెవరికి వారే తలచిరి. ఎంతకాలము గడచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడచుచునేయున్నది వివాదము పెరుగుచునేయున్నది.


ఇట్లుండగా వారి యెదుటనొక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యులకాంతి కలిగి తేజోమయమై యుండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమైయుండెను. దివ్యము మనోహరము అనంతమునగు ఆ రూపము శ్రీమహవిష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందేవారు చూచిరి. బ్రహ్మ, శివుడు ఆ రూపము చెవులలోనుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును జూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదలచిరి. ఆ రూపము యొక్క ఆద్యంతములు నెరిగిన వారే తమ యిద్దరిలో నుత్తములని తలచిరి, ప్రయాణమైరి, నాలుగుదిక్కుల క్రిందను, పైనను చిరకాలము సంచరించిరి. ఆరూపమును మొదలునుగాని, చివరనుగాని చూదలేకపోయిరి, తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడారూపము నిట్లు తలచిరి.


ఈ పురుషుడే జగత్కర సృష్టిస్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు. గుణాధికుదు. గురువు రక్షించువాడు సర్వేశ్వరుడు, స్వయంప్రకాశుడు, సర్వప్రాణులయందు నివసించువాడు, సర్వప్రాణులను తనయందే నిలుపుకొనువాడు, మనము వీనికంటె అధికులముకాము. మన వలన నేమియు జరుగుట లేదు. ఇట్టి యధార్థ పరిజ్ఞానము కలిగి శ్రీమహావిష్ణువు నిట్లు స్తుతించిరి.


*🌳బ్రహ్మ శివకృత విష్ణు స్తుతి🌳*


అనంతమూర్తీ! సర్వాద్యమూ, సర్వాధారమూ, అనంత ప్రకాశమూ సర్వమనోహరమూ అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్సమనట్లు చేయుము. సర్వాత్మకా! సర్వేశ్వరా! సర్వప్రాణి నమస్కృతా!  అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు నీ తేజమనంతము, నీవందరికిని అన్నిటికిని యిచ్చువాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్తరూపుడవు అనుచునిట్లనిరి.


*హేవిషోవంతమూర్తే తవఘవ* *విఖిలాకారమాద్య స్వరూపం*

*సర్వాధారం సురేశందినపతి హత భుక్కోటి సూర్యప్రకాశం |*

*అవాభ్యమత్రి దృష్టం సకలముని మనోవాసమబ్జాయతాక్షం*

*చిమ్రావేం స్వాత్మశక్త్యాకురు నిఖిలగురో సర్వరూపంత్విదానం ||*

*నమస్తే విశ్వాత్మన్ విధిహరసురేంద్రాది విబురై*

*త్రయీ శాత్త్రాలాపైః విగదితన వ్యాంఘ్ర్యంబుజయుగం |*

*పరంమత్రంయంత్రం పరమపద బీజం జ్వలతియః*

*ససాక్షాత్పారూప్యం వ్రజతి తవదేవేశసతతం ||*

*త్రిలోక కర్తా భివదస్యభర్తా హరే మహద్రూపమనేక తేజాః*

*గురుర్గుర్ణాం నరదోవరాణాం మహార్ణవాంబూపల జస్త్వమేర |*

*త్రిదేవ దేవాసుర రాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే వినిష్ట*

*దృష్టామృతాస్వాద్యమిరాశు పాణిః సురాసురాణామఖిలేశ్వరరస్త్వం ||*

*లక్ష్మీపతి స్త్వంతు సుగుహ్యగోప్తా గుహాశయః పంకజ పత్రనేత్ర*

*త్వంపంచ వక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేశో భగవన్నమస్తేః* 


*సృష్టించ విశాలాం సృజసిత్వమేవ చైశ్వర్యవాన్* *సర్వగుణశ్చదేవ*

*త్వమేవ భూర్భూరికృత* *ప్రవేశః తధాద్య భూతం విదధాసియత్తత్ ||*

*త్వమగ్ని సూర్యౌ పవనస్త్యమేవ* *యమోభవాన్ వైశ్రవణస్త్వమేవ*

*త్వమేవశక్ర స్పురలోకనాధః* *నాధాబిమస్త్వం భగవన్ నమస్తే ||*

*పరమం పరాణాం పరమంపవిత్రం పురాణ కర్తారమనం తమాశ్రయం*

*త్వాం వేదమోహుః కవయః సుబుద్ద్వా నమోస్తుతే పన్నగవైరి కేతో ||*

*వేదాశ్చవేద్యశ్చ దిగంతరాళం యష్ఠాసురసానమపి త్వమేవ*

*కర్మాణ్యనంతాని సుఖప్రదాని ఋదశ్చవాతో నిగమాశ్చసర్వే ||*

*నదీషు గంగాహిమవాన్ నగేషు మృగేషు సింహో భుజగోష్వంతః*

*రత్నేషు వజ్రంజలజేషు చంద్రః క్షీరోదధశ్చాపి యధాతథాత్వం ||*

*అహం ప్రభు స్తద్వరహం ప్రభుశ్చ సంస్పర్ద మానౌ బహువర్ణానాం*

*తస్నాదదావీం పరిహర్తు మేవం స్వయం ప్రభుస్త్యం కరుణైకరాసి ||*

*తేనాత్రతే దర్శనబుద్ది రాసీత్ కృపాలో* *భగవన్నమస్తే*

*తూర్ణం జగనాథ* *మహత్స్వరూపం భూత్వాపున స్చామ్య వపుఃప్రసీద ||*


ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీమహా విష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికిట్లనెను. బ్రహ్మేశ్వరులారా! మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను యిట్టి విరాట్రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింప నశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంతబుద్దులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదము నెవరును పరిష్కరింపలేరు. సత్వరజస్తమోగుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడినవారికి యదార్థము తెలియదు. స్త్త్వగుణము నిర్మలము స్వయంప్రకాశకము అనామయము. సుఖసంగముచే దేహినిబంధించును. పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆశక్తిచే ప్రబలమగును. జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూపజ్ఞానమును కప్పి, యిహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనులయందు ప్రవర్తింపజేయును. తమోగుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసినదానిని మరచుట ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్దసరిగా లేకపోవుట, శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్రయనగా నీ యజ్ఞానముచే, చేయవలసిన దానిని వీడి నిద్రించుట, కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జీవితములు జీవగుణ త్రయబద్దుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని. దీనిని పొందగలను, నేను చేయగలను నాకెవరును సాటి ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమోగుణముల ప్రభావము.


మీకును యీగుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదట నంతయు చీకటిగ నుండినది పంచభూతములప్పటి కేర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలెనుంటిని. తరువాత నవయవము లేర్పడినవి. తరువాత మన ముగ్గురము యేర్పడితిమి. మనము ముగ్గురము సృష్టిస్థితిలయములకు కర్తలమైతిమి. బ్రహ్మసృష్టికర్తగను, నేను పోషకునిగను, శివుదు లయకర్తగను మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దానినుండి వచ్చిన మనకు మొదట భేదములేదుకదా!


అని బ్రహ్మకు శివునికి శ్రీమహావిష్ణువు తత్త్వమును స్మృతికి తెచ్చెను, మరియు బ్రహ్మతో నిట్లనెను, బ్రహ్మ! నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. సర్వప్రాణులను సృషించినవాడవు. దేవతలకు ప్రభువువు. వేదములకు స్థానము అన్ని యజ్ఞములకును అధిపతిని. సర్వలోకములకు సంపదనిచ్చువాడవు. స్వశక్తితోడనే పరమాత్మయోగమునందినవాడవు. సర్వ రక్షకుడవు. నా నాభి కమలమందు బాలార్కునివలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు, ఏకత్వములో నున్న నేనే అనేకత్వము నందితిని.మనమిద్ధరమొకటే. నీవును నా వలెనే సమస్త దేవతలకు పూజనీయుడవు. అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగ తత్త్వమును బోధించెను. అని గృద్నృమదమహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను.



*ఇరవై అధ్యాయము* 

             *సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

పర్యాయ పదములివి


స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదములివి. దాదాపుగా ఒక పదమునకు ఇన్ని పర్యాయ పదములు గల ఘనత మరే భాషలో ఉండవేమో ...!!!*

1. అంగన

2. అంచయాన

3. అంబుజాలోచన

4. అంబుజవదన

5. అంబుజాక్షి

6. అంబుజనయన

7. అంబురుహాక్షి

8. అక్క

9. అతివ

10. అన్ను

11. అన్నువ

12. అన్నువు

13. అబల

14. అబ్జనయన

15. అబ్జముఖి

16. అలరుబోడి

17. అలివేణి

18. అవ్వ

19. ఆటది

20. ఆడది

21. ఆడగూతూరు

22. ఆడుబుట్టువు

23. ఇంచుబోడి

24. ఇంతి

25. ఇదీవరాక్షి

26. ఇందునిభాష్య

27. ఇందుముఖి

28. ఇందువదన

29. ఇగురాకుబోణి

30. ఇగురాకుబోడి

31. ఇభయాన

32. ఉగ్మలి

33. ఉజ్జ్వలాంగి

34. ఉవిధ

35. ఎలతీగబోడి

36. ఎలనాగ

37. ఏతుల

38. కంజముఖి

39. కంబుకంఠ

40. కంబుగ్రీవ

41. కనకాంగి

42. కన్నులకలికి

43. కప్పురగంధి

44. కమలాక్షి

45. కరబోరువు

46. కర్పూరగంది

47. కలకంఠి

48. కలశస్తిని

49. కలికి

50. కలువకంటి

51. కళింగ

52. కాంత

53. కించిద్విలగ్న

54. కిన్నెరకంఠి

55. కురంగానయన

56. కురంగాక్షి

57. కువలయాక్షి

58. కూచి

59. కృషమధ్యమ

60. కేశిని

61. కొమ

62. కొమరాలు

63. కొమిరె

64. కొమ్మ

65. కోమ

66. కోమలాంగి

67. కొమలి

68. క్రాలుగంటి

69. గజయాన

70. గరిత

71. గర్త

72. గుబ్బలాడి

73. గుబ్బెత

74. గుమ్మ

75. గోతి

76. గోల

77. చంచరీకచికుర

78. చంచలాక్షి

79. చంద్రముఖి

80. చంద్రవదన

81. చక్కనమ్మ

82. చక్కెరబొమ్మ

83. చక్కెర

84. ముద్దుగుమ్మ

85. చాన

86. చామ

87. చారులోన

88. చిగురుంటాకుబోడి

89. చిగురుబోడి

90. చిలుకలకొలోకి

91. చెలి

92. చెలియ

93. చెలువ

94. చేడి(డియ)

95. చోఱుబుడత

96. జక్కవచంటి

97. జని

98. జలజనేత్ర

99. జోటి

100. ఝషలోచన

101. తనుమధ్య

102. తన్వంగి

103. తన్వి

104. తమ్మికింటి

105. తరళలోచన

106. తరళేక్షణ

107. తరుణి

108. తలిరుబోడి

109. తలోదరి

110. తాటంకావతి

111. తాటంకిని

112. తామరకంటి

113. తామరసనేత్ర

114. తియ్యబోడి

115. తీగ(వ)బోడి

116. తెఱువ

117. తెలిగంటి

118. తొగవకంటి

119. తొయ్యలి

120. తోయజలోచన

121. తోయజాక్షి

122. తోయలి

123. దుండి

124. ధవలాక్షి

125. ననబోడి

126. నళినలోచన

127. నళినాక్షి

128. నవల(లా)

129. నాంచారు

130. నాచారు

131. నాచి

132. నాతి

133. నాతుక

134. నారి

135. నితంబవతి

136. నితంబిని

137. నీరజాక్షి

138. నీలవేణి

139. నెచ్చెలి

140. నెలత

141. నెలతుక

142. పంకజాక్షి

143. పడతి

144. పడతుక

145. పద్మముఖి

146. పద్మాక్షి

147. పర్వందుముఖి

148. పల్లవాధర

149. పల్లవోష్ఠి

150. పాటలగంధి

151. పుచ్చడిక

152. పుత్తడిబొమ్మ

153. పువు(వ్వు)బోడి

154. పువ్వారుబోడి

155. పుష్కరాక్షి

156. పూబోడి

157. పైదలి

158. పొల్తి(లతి)

159. పొల్తు(లతు)క

160. త్రీదర్శిని

161. ప్రమద

162. ప్రియ

163. ప్రోడ

164. ప్రోయాలు

165. బంగారుకోడి

166. బాగరి

167. బాగులాడి

168. బింబాధర

169. బింబోష్ఠి

170. బోటి

171. భగిని

172. భామ

173. భామిని

174. భావిని

175. భీరువు

176. మండయంతి

177. మగువ

178. మచ్చెకంటి

179. మడతి

180. మడతుక

181. మత్తకాశిని

182. మదిరనయన

183. మదిరాక్షి

184. మసలాడి

185. మహిళ

186. మానవతి

187. మానిని

188. మించుగంటి

189. మించుబోడి

190.మీనసేత్రి

191. మీనాక్షి

192. ముగుద

193. ముదిత

194. ముదిర

195. ముద్దరాలు

196. ముద్దియ

197. ముద్దుగుమ్మ

198. ముద్దులగుమ్మ

199. ముద్దులాడి

200. ముష్ఠిమధ్య

201. మృగలోచన

202. మృగాక్షి

203. మృగీవిలోకన

204. మెచ్చులాడి

205. మెఱుగారుబోడి

206. మెఱుగుబోడి(ణి)

207. మెలుత

208. మెళ్త(లత)మెల్లు(లతు)

209. యోష

210. యోషిత

211. యోషిత్తు

212. రమణి

213. రామ

214. రుచిరాంగి

215. రూపరి

216. రూపసి

217. రోచన

218. లతకూన

219.లతాంగి

220. లతాతన్వి

తెలుగు భాషలో ఒక్క స్త్రీ అనే పదానికి మాత్రమే ఇన్ని పర్యాయ పదాలున్నాయంటే - తెలుగు నా మాతృభాష అని చెప్పడం గర్వకారణం కదా.

దేశభాషలందు తెలుగు లెస్స! 

పేర్లు రాయండి

 *ఈ రాజు లెవరో పేర్లు రాయండి* 


1. పది తలల రాజు ఎవరు?

2.  దిన రాజు ఎవరు?

3.  రారాజు ఎవరు?

4. వలరాజు ఎవరు?

5. నాగరాజు ఎవరు?

6. ఖగరాజు ఎవరు?

7. గో సేవ చేసి సంతానాన్ని పొందిన రాజు ఎవరు? 

8. ముని శాపవశాత్తూ పుత్రశోకంతో మరణించిన రాజు ఎవరు?

9. నెలరాజు ఎవరు?

10. మృగరాజు ఎవరు?

11. దేవతల రాజు ఎవరు?

12. బొందితో కైలాసానికి చేరాలనుకున్న రాజు ఎవరు?

13. సత్యం కోసం సతినే అమ్మిన రాజు ఎవరు?

14. జూదం లో ఆలిని ఓడిన రాజు ఎవరు?

15. కుమారునిపై ప్రేమతో కానిపనిని కాదనలేకపోయిన గుడ్డి రాజు ఎవరు?

16 .భాగవతం విని మోక్షం పొందిన రాజు ఎవరు?

17. భార్య ఇచ్చిన మాట కోసం ఏడుగురు పుత్రులను పోగొట్టుకున్న రాజు ఎవరు?

18. అష్టదిగ్గజాలనేలిన

రాజు ఎవరు?

19. భారతాంధ్రీకరణకు పురికొల్పిన రాజు ఎవరు?

20.  ఒకే మాట ఒకే బాణం ఒకే భామ అన్న రాజు ఎవరు?

గ్రామచూర్ణం

 *గ్రామచూర్ణం*


ఒకసారి కృష్ణదేవరాయలవారి ఆస్థానానికి ఒక సంస్కృత పండితుడు వచ్చాడు. ఆయనతో పాటు ఒక బండి నిండా పత్రాలు ఉన్నై. "సంస్కృతంలో నన్ను మించినవాడు లేడు. అనేక దేశాల సంస్కృత పండితులు నాతో ఓడి, నాకు ఈ విజయపత్రాలను అందించారు. మీ రాజ్యపు పండితులతో శాస్త్ర చర్చ చేద్దామని వచ్చాను. మీ రాజ్యంలో ఎవరైనా పండితుడన్నవాడు ఉంటే నాతో తలపడమనండి. లేదూ, వారెవ్వరూ నాతో శాస్త్ర చర్చకు ముందుకు రాలేమంటే, మరి విజయపత్రాలను ఇప్పించండి" అన్నాడు గొప్పగా.

రాయలవారు సభలోని కవుల కేసి చూసారు. వాళ్లంతా కొంచెం ఇరుకున పడ్డారు. ఏమంటే "ఆస్థానంలో ఉన్న సంస్కృత పండితులు అందరూ ఆ సమయానికి వేరే దేశానికి వెళ్ళి ఉన్నారు- రాజ్యంలో ఉన్నదల్లా తెలుగు కవులు మాత్రమే. ఈ సంస్కృత కవి తీరు చూస్తే మామూలు వాడిలాగా లేడు. ఊరికే చర్చించేదెందుకు, ఓడేదెందుకు, రాజ్యాన్నంతా ఓటమి పాలు చేసిన అపకీర్తిని మూటగట్టుకునేదెందుకు?"

రాయలవారు వారి సంశయాన్ని గుర్తించారు. సభలో కూర్చున్న తెనాలి రామకృష్ణుడికేసి చూసారు. రామకృష్ణుడు ఇకిలించాడు. రాయలవారు తల పంకించారు. "అయ్యా! పండితులవారూ! మా సంస్కృత కవులందరూ విదేశ యాత్రలో ఉన్నారు. వారి శిష్యులైన పామరులు మాత్రం కొందరు ఇప్పుడు అందుబాటులో ఉంటారు. తమరి రాకను వారికి తెలియజేస్తాం. రేపు మధ్యాహ్నంగా శాస్త్రచర్చ ఏర్పాటు చేసుకుందాం. అంతవరకూ తమరు మా ఆతిథ్యం స్వీకరించండి" అని పండితులవారికి తుంగభద్రా నదీ తీరాన వున్న ఒక భవంతిలో విడిది ఏర్పాటు చేసారు.

పండితులవారు అటు పోగానే ఇటు రాయలవారు "రామకృష్ణా!" అన్నారు.

"ప్రభువులవారు ఈ పని నాకు వదిలెయ్యండి!" అన్నాడు రామకృష్ణుడు నవ్వుతూ.


మరునాడు తెల్లవారే సరికి రామకృష్ణుడు చాకలివాడి వేషం‌ వేసుకున్నాడు. తన భార్యకు చాకలమ్మ వేషం వేసాడు. ఏం చెయ్యాలో అంతా ఆమెకు చెప్పి వుంచాడు. ఓ బట్టల మూటనెత్తుకొని తను తుంగభద్రా నదీ తీరం చేరుకున్నాడు. నదిలో బట్టలు ఉతుకుతున్నట్లు నటించటం మొదలు పెట్టాడు. 

అనుకున్నట్లే ఆ రేవు దగ్గరికి వచ్చాడు సంస్కృత పండితుడు. నదిలోకి దిగి స్నానం చేస్తున్నాడు. చాకలి ఆయన తీరును చూస్తూ తన జోరు పెంచాడు.

అంతలోకే చాకలమ్మ వచ్చింది మరో చిన్న బట్టల మూట పట్టుకొని. రామకృష్ణుడిని అడిగింది గట్టిగా, దగ్గర్లోనే ఉన్న పండితుడికి వినబడేట్లు- "యివ్వాళ అన్నం లోకి సాధకం ఏమి చెయ్య మంటావు మామా ?" అని.

చాకలివాడు కొంచెం‌ ఆలోచించాడు:

"మత్కుణం నది సంయుక్తం, విచార ఫల మేవచ, గోపత్నీ సమాయుక్తం, 

గ్రామచూర్ణం చ వ్యంజనం" అని జవాబి-చ్చాడు.

ఆమె కనబడీ కనబడనట్లు నవ్వింది. "సరే అలాగే- 'తథైవ అస్తు' " అని చెప్పి, ఉతికిన బట్టలు పట్టుకొని వెళ్ళిపోయింది.

నదిలో సంధ్యావందనం చేసుకుంటున్న పండితుడికి తల తిరిగినట్లైంది. "ఈ దేశంలో ఒక సాధారణ చాకలి, చాకలమ్మ సంస్కృతంలో మాట్లాడుకున్నారు! ఇంతగొప్ప సంస్కృత పండితుడైన తనకు ఆ శ్లోకం అర్థం కాలేదు!"

"ఇంతకీ 'మత్కుణం' అంటే ఏంటి? 'మత్కుణం' అంటే సంస్కృతంలో 'నల్లి' అని అర్థం.

'నది సంయుక్తం' అంటే 'నదితో కలిసినది'- నల్లి నదితో కలవటమేమిటి? తెలీదు!

"విచార ఫలం" అన్నాడు- విచారిస్తే ఫలితం ఏముంటుంది? కన్నీళ్ళు వస్తాయి.. అయితేనేమి?

ఇక "గో పత్ని- ఆవు భార్య" అంటున్నాడు. ఆవే ఆడది కదా, ఇక ఆవుకు భార్య ఎక్కడినుండి వస్తుంది?

అంతా చేసి "గ్రామ చూర్ణం" కావా-లంటున్నాడు! అదేంటి?

"పోనీ 'దీనికంతా అర్థం లేదు' అనుకుందామంటే అట్లానూ లేదే, చాకలమ్మ "సరే సరే" అని పోయింది. అంటే ఆమెకు అర్థమైనట్లే కదా!" ఆలోచించీ ఆలోచించీ అతనికి మతి పోయింది-

"ఈ రాజ్యపు చాకలివాడి శ్లోకమే తనకు అర్థం కాలేదు- చాకలమ్మకు అర్థమయినంత నాకు అర్థం కాలేదు. యింక రాజుగారి దగ్గర పనిచేసే పండితులతో నేనెక్కడ గెలువగలను?" అనుకున్నాడాయన. రామకృష్ణుడు చూస్తుండగానే ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా బయలుదేరి భవనానికి వెళ్లి, మూటా ముల్లె సర్దుకొని, నగరం విడిచి పారిపోయాడు.

మరునాడు సభలో రాయలవారు అడిగారు- "ఏడీ!‌ పండితుడు?!" అని.


"విడిది పరిసరాల్లో ఎక్కడా లేడు" చెప్పారు భటులు. "వేరే నగరానికి వెళ్తున్నానని చెప్పి ఉదయాన్నే వెళ్ళాడాయన!" వింటున్న రామకృష్ణుడు నవ్వాడు. రాయలవారు "నువ్వే ఏదో చేసినట్లున్నావు?!" అన్నారు మర్మగర్భంగా

"లేదు- నేను కాదు, ఇదంతా చేసింది మత్కుణం" అని కథంతా చెప్పాడు రామకృష్ణుడు.

రాయలవారు నవ్వి, ఇంతకీ ఈ శ్లోకం మాక్కూడా అర్థం కాలేదు- ఏంటి, దీని కథ?" అన్నారు.

అప్పుడు రామకృష్ణుడు ఇలా అర్థం చెప్పాడు:

"మత్కుణం అంటే నల్లి; నది అంటే ఏరు. నల్లి, ఏరు కలిసి 'నల్లేరు' అయ్యింది.

విచారం అంటే చింత; ఫలం అంటే పండు- కలిసి చింతపండు అయ్యింది.

గోవు అంటే ఆవు; పత్ని అంటే భార్య- ఆలు. ఆవు,ఆలు కలిస్తే అయ్యేవి ఆవాలు-"

రాయలవారు కడుపుబ్బా నవ్వారు. మరి ఇంతకీ గ్రామచూర్ణం ఎలా చేస్తారు? అన్నారు.

ఏమీ లేదు- గ్రామం అంటే ఊరు; చూర్ణం అంటే పిండి- వెరసి 'ఊరుబిండి' అవుతుంది ప్రభూ. మన సీమలో అందరికీ ఇష్టమైన పచ్చడి కదా అది?" అన్నాడు రామకృష్ణుడు కొంటెగా.


"నల్లేరు, ఆవాలు, చింతపండు కలిపి చేసే వూరుపిండి సంస్కృత పండితుడినే భయపెట్టిందే, అంతగొప్ప పండితుడు పలాయనం చిత్తగించేట్లు చేసింది ఇది మామూలుది కాదు" నవ్వారు రాయలవారు

ఒక క్లిక్ తో డౌన్లోడ్ చేస్కోవచ్చు..

 ఈ బుక్స్ అన్ని ఒక క్లిక్ తో డౌన్లోడ్ చేస్కోవచ్చు.. 

🔰 *మహాభారతం*


🔰 *భాగవతం*


🔰 *భగవద్గీత*


🔰 *రామాయణం*


🔰 *వరలక్ష్మీ వ్రత పుస్తకం*


🔰 *కనకధార స్తోత్రం*


🔰 *శివాష్టకం*


🔰 *లింగాష్టకం*


🔰 *హనుమాన్ చాలీసా*


🔰 *ఆంజనేయ దండకం*


🔰 *వేంకటేశ్వర సుప్రభాతం*


🔰 *విష్ణు సహస్రనామ స్తోత్రం*


ఇంకా మరెన్నో పుస్తకాలు  డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి : https://www.hindutemplesguide.in/download-books/


👏 *మీరు షేర్ చేస్తే ఎందరో డౌన్లోడ్ చేసుకుంటారు*👏

మొగలిచెర్ల

 *జానకమ్మ నమ్మకం..*


"బుధవారం నుంచీ ఆదివారం దాకా ఐదు రోజులు ఉండాలని అనుకుంటున్నాను..నాకోసం ప్రత్యేకంగా రూము అక్కరలేదు..స్వామిసన్నిధిలోనే ఉంటాను..నీకు అభ్యంతరం లేదు కదా?" అని ఆ పెద్దావిడ నన్ను అడిగింది..ఆవిడపేరు జానకమ్మ గారు.ఆవిడకు పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టిన ఆరేడు ఏళ్లకే..ఆవిడ భర్త మరణించాడు..ఆ చిన్న పిల్లలను తన రెక్కల కష్టం తోటి పెంచి పెద్దచేశారు..అమ్మాయిని తన అన్నయ్య కుమారుడితో వివాహం జరిపించారు..కొడుకు కూడా వివాహం చేసుకొని ఉద్యోగం చేసుకుంటున్నాడు..ప్రస్తుతం కుమారుడి వద్ద ఉంటున్నది..


భర్త చనిపోయిన తరువాత ఒకనాడు జానకమ్మ గారు మొగిలిచెర్ల రావడం జరిగింది..అప్పటికి శ్రీ స్వామివారు సిద్ధిపొంది రెండు మూడేళ్లు అవుతోంది..మొగిలిచెర్ల గ్రామం నుంచీ నడుచుకుంటూ వచ్చి స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నది..తననూ తన బిడ్డలనూ చల్లంగా చూడు స్వామీ అని మనసులో ప్రార్ధించుకున్నది..ఆ మరుసటి సంవత్సరం కూతురికి అమ్మవారు పోసి..వళ్ళంతా పొక్కులు పొక్కులు గా వస్తే..మళ్లీ మొగిలిచెర్ల వచ్చి..కూతురి ఆరోగ్యం బాగుపడితే..తలనీలాలు సమర్పించుకొంటానని స్వామివారిని వేడుకున్నది..వారం రోజుల్లో అమ్మాయి ఆరోగ్యం బాగుపడింది..అనుకున్న విధంగానే తన తలనీలాలు స్వామివారి వద్ద సమర్పించుకున్నది..ఆనాటి నుంచీ ఏ కష్టం వచ్చినా..నేరుగా మొగిలిచెర్ల వచ్చి..స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి..తన కష్టాన్ని స్వామివారికి విన్నవించుకొని వెళ్లడం జానకమ్మ గారికి అలవాటు..


"అమ్మా..ఈసారి ఏదైనా పెద్ద సమస్య ఎదురైందా..? ఐదు రోజులు ఇక్కడే ఉండాలని అనుకున్నారు.." అని అడిగాను.."అవును నాయనా..మా అమ్మాయి ప్రసూన తెలుసుకదా..దానికి ఇద్దరు బిడ్డలు..ఇద్దరూ ఆడపిల్లలే..పెద్దదానికి పెళ్లి చేసింది..రెండో కూతురికి సంబంధాలు చూస్తున్నది..ఈ పిల్లకు చిన్న లోపం ఉంది..అప్పుడప్పుడూ మూర్ఛ లాగా వస్తుంది..వైద్యం చేయిస్తున్నారు కానీ..ఇంకా పూర్తిగా నయం కాలేదు..ఈ స్వామివారి వద్ద ఐదు రాత్రిళ్ళు నిద్ర చేయించు..నీ కూతురికి అన్ని రోగాలూ నయమైపోతాయి అని మా అమ్మాయికి నచ్చ చెప్పాను..అయితే దానిని నువ్వే అక్కడికి తీసుకెళ్లు..ఐదు రోజులూ అక్కడే వుండండి..నీ మాట ప్రకారం దానికి జబ్బు నయం అయితే..నేనూ, మా ఆయన కూడా స్వామివారికి తలనీలాలు ఇచ్చి..అన్నదానం చేస్తాము..అని నా కూతురు చెప్పింది..అందుకని నా మనుమరాలిని వెంటబెట్టుకొని వచ్చాను..ఈ ఐదు రోజులూ ఇక్కడే ఉంటాము.." అన్నది..


జానకమ్మ గారి పర్యవేక్షణలో..ఆమె మనుమరాలు ఐదు రోజులూ ఉదయం సాయంత్రం స్వామివారి మందిరం లో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసింది..ఇద్దరూ స్వామివారి మంటపం లోనే పడుకునే వారు..ప్రతిరోజూ ఉదయం స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని వచ్చేవారు..ఆ ఐదురోజుల్లో ఒక్కసారి కూడా ఆ అమ్మాయికి మూర్ఛ వ్యాధి కనబడలేదు..సోమవారం ఉదయం తన మనుమరాలిని తీసుకొని ఊరికి వెళుతూ.."అయ్యా ప్రసాదూ..ఈ పిల్లకు నయం అయింది..నేను గట్టిగా చెప్పగలను..దీని తల్లీతండ్రీ కూడా నిర్ధారించుకొని త్వరలో వచ్చి తలనీలాలు ఇస్తారు..తప్పదు..స్వామికిచ్చిన మాట కదా..అన్నదానం కూడా చేస్తారు..చూస్తూ ఉండు..స్వామి మహిమ నాకు తెలుసుకదా.." అని చెప్పి మరీ వెళ్లారు..


మరో నెలకల్లా జానకమ్మ గారి వెంట  కూతురు, అల్లుడూ, మనుమరాలు స్వామివారి మందిరానికి వచ్చారు.."ఈ స్వామివారి మహత్తు గురించి మా అమ్మ నమ్మకంగా చెప్పిన మాటే నిజం అయిందండీ..అమ్మాయికి పూర్తిగా నయం అయింది..అందుకే మేము స్వామికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాము..రేపటిరోజు అన్నదానానికి అయ్యే ఖర్చు మేమే భరిస్తాము.." అని జానకమ్మ గారి కూతురు చెప్పింది.."స్వామిని నలభై ఏళ్ల నుంచీ కొలుస్తున్నాను..ఏ కష్టం వచ్చినా నా వెంటే వుండి తీర్చాడు..మహానుభావుడు.." అంటూ జానకమ్మ గారు కళ్లనీళ్ళతో చెప్పారు..


స్వామివారి పై జానకమ్మ గారికి అపరిమిత భక్తీ విశ్వాసం..ఆ రెండే ఆమెను స్వామివారి దగ్గరకు చేర్చాయి..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కేదార్నాథుని

 *🕉️ కేదార్నాథుని  ‘జాగృత మహాదేవుడు’ అని ఎందుకు అంటారు, రెండు నిముషాల ఈ కథ మిమ్మల్ని రోమాంచితం చేస్తుంది 🕉️*




ఒక సారి ఒక శివభక్తుడు తన ఊరినుండి కేదారనాథ్ ధామానికి యాత్రకోసం బయలుదేరాడు. అప్పట్లో యాత్రాసాధనాలు, ప్రయాణ సౌకర్యాలు లేనందున, అతడు నడక ద్వారానే పయనించాడు। దారిలో ఎవరు కలిస్తే వారిని కేదారనాథ్ మార్గం అడిగేవాడు। మనసులో శివుని ధ్యానిస్తూ ఉండేవాడు। అట్లా నడుస్తూ నడుస్తూ నెలలు గడిచిపోయాయి।

చివరకు ఒక రోజు అతడు కేదారధామం చేరనే చేరాడు। కేదారనాథ్ లో మందిరం ద్వారాలను ఆరు నెలలే తెరుస్తారు, ఆరు నెలలు మూసి ఉంచుతారు। అతడు మందిరం ద్వారాలు మూసేవేళ అక్కడకు చేరాడు। పూజారికి అతడు ఆర్తితో చెప్పాడు- ‘నేనెంతో దూరం నుంచి పాదయాత్ర చేస్తూ వచ్చాను। కృప ఉంచి తలుపులు తీయండి. ఈశ్వరుని దర్శించనివ్వండి’। అని. కానీ అక్కడ నియమం ఏంటంటే ఒకసారి తలుపును మూస్తే ఇక మూసినట్టే। నియమం నియమమే మరి। అతడు చాలా దుఃఖపడ్డాడు। మాటిమాటికీ శివుని స్మరించాడు. ‘ప్రభో, ఒకే ఒక్కసారి దర్శనం ఇవ్వవా?’ అని। అతడు అందరిని ఎంత ప్రార్థించినా, ఎవరూ వినలేదు।

పూజారి అన్నాడు కదా- ‘ఇహ ఇక్కడకు ఆరు నెలలు గడిచాక రావాలి, ఆరునెలలయ్యాకే తలుపును తెరిచేది’ అని। ‘ఆరు నెలలపాటు ఇక్కడ మంచు కురుస్తుంది’। అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళిపోయారు। అతడక్కడే ఏడుస్తూ ఉండిపోయాడు। ఏడుస్తూ ఏడుస్తూ రాత్రి కాసాగింది. నలుదిక్కులా చీకట్లు కమ్మిపోయాయి। కానీ అతడికి విశ్వాసం తన శివుని మీద – ఆయన తప్పక కృప చూపుతాడని। అతడికి చాలా ఆకలి దప్పిక కూడా కలగసాగాయి।


అంతలోకి అతడు ఎవరో వస్తున్న శబ్దాన్ని విన్నాడు। చూస్తే ఒక సన్యాసి బాబా అతని వైపు వస్తున్నాడు। ఆ సన్యాసి బాబా అతడి వద్దకు వచ్చి దగ్గరలో కూర్చున్నాడు। అడిగాడు- ‘నాయనా, ఎక్కడినుంచి వస్తున్నావు?’ అని అతడు తన కథంతా చెప్పాడు. చెప్పి, ‘నేను ఇంత దూరం రావటం వ్యర్థం అయింది బాబాజీ’। అని బాధపడ్డాడు. బాబాజీ అతడిని ఓదార్చి, అన్నం తినిపించాడు। తరువాత చాలా సేపటివరకు బాబాజీ అతడితో మాట్లాడుతూండిపోయాడు। బాబాజీకి అతడి పై దయ కలిగింది। ఆయన- ‘నాయనా, నాకు రేపుదయం మందిరం తప్పక తెరుస్తారని అనిపిస్తున్నది। నీకు తప్పక దర్శనం దొరుకుతుందనిపిస్తున్నది’। అని అన్నాడు

మాటల్లో పడి ఆ భక్తుడికి ఎప్పుడు కన్ను అంటిందో తెలియదు। సూర్యుడు కొద్దిగా ప్రకాశించేవేళకు భక్తుని కళ్ళు తెరుచుకున్నాయి। అతడు అటూ ఇటూ చూస్తే బాబాజీ చుట్టుపక్కల ఎక్కడా లేడు। అతడికి ఏదైనా అర్థమయ్యేలోపు పూజారి తమ మండలి అంతటితో కలిసి రావటం చూశాడు। అతడు పూజారికి ప్రణామం చేసి అన్నాడు – ‘నిన్ననేమో మీరు మందిరం ఆరునెలలాగి తీస్తామన్నారు కదా? ఈ మధ్య సమయంలో ఎవరూ ఇటు తొంగి చూడరని కూడా చెప్పారు కదా, కానీ మీరు ఉదయాన్నే వచ్చేశారే’। అని. పూజారి అతడి వంక పరిశీలించి చూస్తూ, గుర్తు పట్టటానికి ప్రయత్నిస్తూ, అడిగాడు – ‘నువ్వు మందిరం ద్వారం మూసేసే వేళకు వచ్చినవాడివే కదా? నన్ను కలిశావు కదా। ఆరునెలలయ్యాక తిరిగి వచ్చావా!’ అని. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు ఆశ్చర్యంగా – ‘లేదు, నేనెక్కడికీ పోనేలేదే। నిన్ననే కదా మిమ్మల్ని కలిసింది, రాత్రి నేను ఇక్కడే పడుకున్నాను। నేనెటూ కదలలేదు’। అని.

పూజారి ఆశ్చర్యానికి అంతే లేదు। ఆయన అన్నాడు – ‘కానీ నేను ఆరునెలల ముందు మందిరం మూసి వెళిపోయాక ఇదే రావటం। నీవు ఆరు నెలలు పాటు ఇక్కడ జీవించి ఎట్లా ఉండగలిగావు?’ అని. పూజారి, అతడి బృందం అంతా విపరీతంగా ఆశ్చర్యపోయారు। ఇంత చలిలో ఒక వ్యక్తి ఒంటరిగా ఆరునెలల పాటు జీవించి ఎట్లా ఉండగలడు? అప్పుడు ఆ భక్తుడు ఆయనకు ఆ సన్యాసి బాబా రావటం, కలవటం, ఆయనతో గడిపిన సమయం, విషయం అంతా వివరించాడు। ‘ఒక సన్యాసి వచ్చాడు- పొడుగ్గా ఉన్నాడు, పెద్ద గడ్డం, జటలు, ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో డమరుకం పట్టుకుని, మృగచర్మం కప్పుకుని ఉండినాడు’। అని.

వెంటనే పూజారి, ఇతరులు అందరూ అతడి చరణాలపై పడిపోయారు। ఇట్లా అన్నారు – ‘మేము జీవితమంతా వెచ్చించాము, కానీ ఈశ్వరుని దర్శనం పొందలేకపోయాము, నిజమైన భక్తుడివి నీవే। నీవు సాక్షాత్తు భగవంతుడినే, శివుడినే దర్శనం చేసేసుకున్నావు। ఆయనే తన యోగమాయతో నీకు ఆరునెలలు ఒక రాత్రిగా మార్పు చేసేశాడు। కాలఖండాన్ని తగ్గించి చిన్నగా చేసేశాడు। ఇదంతా నీ పవిత్రమైన మనస్సు, శ్రద్ధ విశ్వాసాల కారణంగానే అయింది। మేము నీ భక్తి కి ప్రణామాలు అర్పిస్తున్నాము’। అని.


*జయ బాబా కేదారనాథ్*🕉️

సేనా జలం*(

 *సేనా జలం*(ఆర్మీ వాటర్) 

***************************

బిస్లరీ.,అక్వాఫినా అనేవి వాటర్ బాటిల్స్ అమ్ముతున్న విదేశీ కంపెనీలు.

వీటిని కొనడంవల్ల ఈ డబ్బు విదేశాలకు వెళ్తుంది.

కావున అందరికీ మనవి చేసేదేమంటే?

మీరు ప్రయాణం చేసేటప్పుడుగానీ లేదా మార్కెట్ కు షాపింగ్ కు వెళ్లినప్పుడుగానీ నీళ్ల బాటిల్ కొనాలంటే *సేనా జలం* ఆర్మీ వాటర్ అని అడగండి. 

ఇది అంతటా లభ్యమౌతుంది.

అలాగే ఇది చాలా చవక కూడా.

*భారత ఆర్మీ భార్యల సంక్షేమ సంఘం* సేనా జలం ను ఏర్పాటు చేసింది. 

భారత ఆర్మీ జనరల్ విపిన్ రావత్ గారి భార్య అయిన మధుళికా రావత్ గారు దీనిని ఏర్పాటు చేశారు. 

ఇది అర లీటరు మరియు లీటరు బాటల్లలో లభిస్తుంది.

అర లీటరు బాటిల్ రూ.6/-.లీటరు బాటిల్ రూ.10/-.మాత్రమే.

ఇతర కంపెనీలైతే లీటరుకు కనీసం రూ.20/-కు అమ్ముతాయి. 

*సేనా జలమును* అమ్మగా వచ్చిన లాభము ఆర్మీ సంక్షేమ సంఘానికి చేరుతుంది.తద్వారా ఈ డబ్బు మరణించిన సైనిక కుటుంబాలకు మరియు వారి పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది. 

భారత ఆర్మీ భార్యల సంక్షేమ సంఘం ఈ నీటిని ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పటి నుండి ఎక్కడ కూడా టీ.వీల్లో గానీ పేపర్లలో గానీ ఎలాంటి ప్రచారం జరగలేదు.!? 

పబ్లిసిటీ చేయడానికి సైన్యం వద్ద అంత డబ్బు కూడా లేదు.!? 

అలాగే ఏ ఒక్క సెలబ్రిటీ కూడా వీటి గురించి ప్రచారం చేయడానికి ముందుకు రాలేదు.!? 

అందుచేత కొందరికే ఈ ఆర్మీ వాటర్ గురించి తెలుసు. 

కావున మనందరం చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏమంటే? 

మనం నీళ్ల బాటిల్ కొనాలంటే ఖచ్చితంగా ఈ ఆర్మీ వాటర్ ను అడగాల్సిందే.

*ఆర్మీ వాటర్ కొందాం.* 

*సైనిక కుటుంబాలను కాపాడుకుందాం.* 

జైజవాన్✊జైహింద్💪జైభారత్🙏

(ఒక ఇంగ్లీషు మెసేజ్ కు తెలుగు అనువాదం) 

ధన్యవాదాలు🙏🤝

ఫార్వార్డ్ చేయడం మరచిపోకండి.

The Supreme Court on Thursday reserved orders on the lifting of the extension of the limitation period for filing of cases granted by the Court in March last year on account of COVID-19 pandemic and the national lockdown. A bench comprising Chief Justice of India SA Bobde, Justices L Nageswara Rao, and S Ravindra Bhat reserved orders after hearing the suggestions of the Attorney General for India, KK Venugopal. Suggestions of Attorney General The AG submitted a note with the following suggestions : 1. In computing the period of limitation, period from 15.03.2020 to 14.03.2021 shall stand excluded. 2. The balance period of limitation remaining as on 15.03.2020 shall be available w.e.f 15.03.2021.All person shall have an extra period of 90 days w.e.f 15.03.2021. If the balance period available is greater than 90 days, the greater period will be available for limitation with effect from 15.03.2021. 3. The exclusion of the period 15.03.2020 to 14.03.2021 will also apply to proceedings under Arbitration and Conciliation Act, Negotiable Instruments Act and Commercial Courts Act. 4.  If lockdown is re-imposed in any parts of the country, such lockdown period will also be excluded from computing limitation. 5. The Government of India will amend the regulations to enable persons in containment zones to go out for emergency services, which will include legal filing purposes. SG requests for making the order applicable to PMLA attachment proceedings The Solicitor General, Tushar Mehta, requested the bench to make the exclusion of limitation period applicable to the period for confirmation of attachment proceedings under Sections 26 and 32 of the Prevention of Money Laundering Act as well. However, Senior Advocates Sidharth Luthra and Advocate Arshdeep Khurana told the bench that this issue was pending in appeal in the Delhi High Court. The bench was told that a single bench of the Delhi High Court had taken the view that the suo moto extension of limitation was not applicable to PMLA attachment proceedings. Against the singe bench decision, the Enforcement Directorate has filed appeal, which is pending before the Division Bench. The SG submitted that it was necessary to exclude limitation for PMLA proceedings as well so that attachment worth crores of rupees will lapse. Senior Advocate Luthra urged the bench not to mention anything about PMLA proceedings in the order as it will have the effect of allowing the appeals pending in the Delhi HC without hearing the parties. The CJI said that the bench will pass appropriate orders in this regard after considering the issue. Another lawyer mentioned that the bench had passed an order in July last year in the suo moto proceedings allowing the service of notice through WhatsApp and other online messenger services. The lawyer requested the bench to allow the continuation of that order. The CJI replied that the present proceeding was concerned only with the limitation period for filing of cases and observed that the bench did not wish to "complicate the matter". Yesterday, a 3-judge bench headed by CJI had indicated that the suo moto extension of limitation will be lifted, and a 90 days grace period will be given with effect from the date of lifting of the same. It was on March 23 last year that the Supreme Court extended the limitation period for filing in all courts and tribunals with effect from March 15, 2020, until further orders. A bench headed by the Chief Justice of India passed this order suo moto taking note of the difficulties posed by the COVID-19 pandemic. On May 6, the Court extended the application of the order to proceedings under Arbitration Act and Section 138 of the Negotiable Instruments Act. Later, in July 2020, the SC clarified that this order will apply to Section 29A and 23(4) of the Arbitration and Conciliation Act, 1996 and Section 12A of the Commercial Courts Act, 2015. In December 2020, a two-judge bench of the SC had said that the suo moto extension of limitation

 The Supreme Court on Thursday reserved orders on the lifting of the extension of the limitation period for filing of cases granted by the Court in March last year on account of COVID-19 pandemic and the national lockdown.

A bench comprising Chief Justice of India SA Bobde, Justices L Nageswara Rao, and S Ravindra Bhat reserved orders after hearing the suggestions of the Attorney General for India, KK Venugopal.

Suggestions of Attorney General

The AG submitted a note with the following suggestions :

1. In computing the period of limitation, period from 15.03.2020 to 14.03.2021 shall stand excluded.

2. The balance period of limitation remaining as on 15.03.2020 shall be available w.e.f 15.03.2021.All person shall have an extra period of 90 days w.e.f 15.03.2021. If the balance period available is greater than 90 days, the greater period will be available for limitation with effect from 15.03.2021.

3. The exclusion of the period 15.03.2020 to 14.03.2021 will also apply to proceedings under Arbitration and Conciliation Act, Negotiable Instruments Act and Commercial Courts Act.

4.  If lockdown is re-imposed in any parts of the country, such lockdown period will also be excluded from computing limitation.

5. The Government of India will amend the regulations to enable persons in containment zones to go out for emergency services, which will include legal filing purposes.

SG requests for making the order applicable to PMLA attachment proceedings

The Solicitor General, Tushar Mehta, requested the bench to make the exclusion of limitation period applicable to the period for confirmation of attachment proceedings under Sections 26 and 32 of the Prevention of Money Laundering Act as well.

However, Senior Advocates Sidharth Luthra and Advocate Arshdeep Khurana told the bench that this issue was pending in appeal in the Delhi High Court. The bench was told that a single bench of the Delhi High Court had taken the view that the suo moto extension of limitation was not applicable to PMLA attachment proceedings. Against the singe bench decision, the Enforcement Directorate has filed appeal, which is pending before the Division Bench.

The SG submitted that it was necessary to exclude limitation for PMLA proceedings as well so that attachment worth crores of rupees will lapse.

Senior Advocate Luthra urged the bench not to mention anything about PMLA proceedings in the order as it will have the effect of allowing the appeals pending in the Delhi HC without hearing the parties.

The CJI said that the bench will pass appropriate orders in this regard after considering the issue.

Another lawyer mentioned that the bench had passed an order in July last year in the suo moto proceedings allowing the service of notice through WhatsApp and other online messenger services. The lawyer requested the bench to allow the continuation of that order.

The CJI replied that the present proceeding was concerned only with the limitation period for filing of cases and observed that the bench did not wish to "complicate the matter".

Yesterday, a 3-judge bench headed by CJI had indicated that the suo moto extension of limitation will be lifted, and a 90 days grace period will be given with effect from the date of lifting of the same.


It was on March 23 last year that the Supreme Court extended the limitation period for filing in all courts and tribunals with effect from March 15, 2020, until further orders. A bench headed by the Chief Justice of India passed this order suo moto taking note of the difficulties posed by the COVID-19 pandemic.


On May 6, the Court extended the application of the order to proceedings under Arbitration Act and Section 138 of the Negotiable Instruments Act.


Later, in July 2020, the SC clarified that this order will apply to Section 29A and 23(4) of the Arbitration and Conciliation Act, 1996 and Section 12A of the Commercial Courts Act, 2015.

In December 2020, a two-judge bench of the SC had said that the suo moto extension of limitation was still in force.