28, జనవరి 2023, శనివారం

అరాళ కుంతలా

 అరాళ కుంతలా .🌹

🌺

ఒక రోజు నేను శ్రీ కృష్ణ తులాభారం సినిమా చూస్తున్నప్పుడు అందులో ఎన్ టీ రామారావు, జమున కాళ్ళు పట్టుకుంటే ఆవిడ తన్నిన సన్నివేశం లో ఘంటసాల గారు ఒక పద్యం పాడారు.

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్‌కబూని తాచిన అది నాకు మన్ననయా

చెల్వగు నీ పద పల్లవంబు మత్తనుపులకాగ్ర కంటకవితానము తాకిన నొచ్చుననుచు నేనయిద

అల్క మానవు కదా ఇకనైన అరాళ కుంతలా ...........

పద్యం అంతా బానే అర్ధం అయ్యింది కానీ .... అరాళ కుంతలా ... అంటే ఏంటో అర్ధం కాలేదు. మా పితృ పాదుల వారు పక్కనే ఉన్నారు కదా అని ఆయన్ని అడిగాను. నేను చదువుకోకుండా సినిమా చూస్తున్నానన్న కోపం లో ఆయన పక్కనే ఎప్పుడూ రెడీ గా ఉంచుకునే కమండలం లో కాసిని నీళ్ళు తీసి "నీకు ఆ పదానికి అర్ధం తెలియకుండు గాక" అని శపించారు. యధా విధి గా నేను శాపవిమోచన మార్గం అడిగాను. అప్పుడు ఆయన "ఆ పదానికి అర్ధం వేరొకరి ద్వారా నువ్వు తెలుసుకుంటావు." అని సెలవిచ్చారు.

పితృపాదుల వారి శాపం కారణం గా నా అంతట నేను దానికి అర్ధం తెలుసుకోలేకపోయాను. సరే అప్పటినుండీ చాలమంది ని అడిగి చూసాను. ఎవరూ అంత స్పష్టమైన సమాధానం చెప్పలేదు. మా పవన్ గాడ్నీ అడిగాను. వాడు "సంస్కృతం లో అరాళా అంటే అరటిపళ్ళు, కుంతలా అంటే ఎంతకిస్తావు?" అని అర్ధం అన్నాడు. ఆహా "అజ్ఞానీ సుఖీ" అని ఎందుకు అన్నారో అర్ధం అయ్యింది.

పోనీ ఎవరైనా అమ్మాయిని అడిగితే (లేదా అలా పిలిస్తే) ఎమైనా తెలుస్తుందేమొ అని మా క్లాస్ మేట్ కన్నడ సూర్య ప్రభ కుట్టింగార్ దగ్గరకి వెళ్ళి "అరాళ కుంతలా" అని పిలిచాను.

"ఒహ్ మై గాడ్!!! నువ్వు మలయాళం ఎప్పుడు నేర్చుకున్నావ్? ఐ టూ లవ్ యూ." అని సిగ్గు పడుతూ చేప్పింది. నేను అవాక్కయ్యాను.

ఇలా లాభం లేదని పేపర్లొ ప్రకటన ఇచ్చాను. "అరాళ కుంతలా ఎవరికైనా తెలుసా? (మధ్యలో "అంటే" అన్న పదం ఆ పేపర్ వాడు ప్రింట్ చెయ్యలేదు) తెలిస్తే నాకు ఫోన్ చేసిన వారికి నా అర్ధ రాజ్యం తో పాటు కన్నడ సూర్య ప్రభ కుట్టింగార్ ని ఇచ్చి వివాహం చేస్తాను" అని ప్రకటించాను.

ఒకడు ఫోన్ చేసి " సార్!!!!! నాపేరే అరాళ కుంతలా. మాది ఒరిస్సా. అర్ధ రాజ్యానికి దస్తావేజులు ఎప్పుడు ఇస్తారు? పెళ్ళి మాత్రం గ్రాండ్ గా చెయ్యాలి" అన్నాడు. ఫోన్ తీసి నేలమీద కొట్టాను.

ఈ విషయం గురించే చాల రోజులు ఆలోచించాను. పోనీ ఎవరైనా తెలుగు మాస్టారు కి తెలుస్తుందేమో అని మా ఇంటి పక్కనే ఉన్న స్కూల్ కి వెళ్ళి ఒక పిల్లని ఆపి తెలుగు మాస్టారు కోసం అడిగాను. ఆ పిల్ల "తెలుగు????? మీన్స్ వాట్?" అంది. మన భాష కి పట్టిన దౌర్భాగ్యానికి ఆ రోజు నేను అన్నం తిన లేదు. ఆ మాట విన్నందుకు ప్రాయశ్చిత్తం ఏంటని మా పితృపాదుల వారిని అడిగాను. రెండు వారాలు ఉపవాసం చేస్తూ, చెట్టు కొమ్మకి తలకిందులు గా వ్రేళ్ళాడుతూ తపస్సు చేయమన్నారు. అది నావల్ల కాక, ఆల్రెడీ అలా తపస్సు చేసిన మా నాన్న గారిని ముట్టు కుని "మమ" అన్నాను.

ఎన్ని రోజులైనా నాకు ఆ పదానికి అర్ధం తెలియ లేదు. ఒక రోజు గుళ్ళో కి వెళ్ళి అష్టోత్రం చేయించుకుంటే పూర్వ జన్మలో చేసిన పాపం ఏదైనా ఉంటే అది నశించి నాకు అర్ధం తెలుస్తుందని పక్కనే ఉన్న అయ్యప్ప గుళ్ళో కి వెళ్ళాను. పూజారి గారు వచ్చి

"నీ పేరు" అన్నారు.

-అప్పారావు -

"గోత్రం"

-అరాళ కుంతల-

పూజారి నన్ను అదోలా చూసి "అయ్యా మీ స్వగ్రామం అండమాన్ దీవులా? అన్నారు.

నా జీవితం మీద నాకే విరక్తి వచ్చింది. ఇంక నావల్ల కాక ఆ పదం గురించి మర్చి పోయాను.

ఈ మధ్య మళ్ళీ ఆ శ్రీకృష్ణ తులాభారం సినిమా చూడటం అనుకోకుండా జరిగింది. మళ్ళీ చెద పురుగు బుర్ర తొలిచెయ్యటం మొదలు పెట్టింది. నా అవస్థ చూసి మా రూం మేట్ సీరియస్ గా "గూగుల్ ఇట్ మ్యాన్" అన్నాడు.

"వార్నీ!!!!!! ఇన్ని రోజులు గా ఈ పని చెయ్యలేదు కదా అని అనుకున్నాను. కానీ మా పితృపాదుల వారి శాపం నాకు ఆ ఆలోచన రాకుండా చేసిందని నా ప్రగాఢ విశ్వాసం. సరే అని గూగుల్ చేసా. ఒక్క పేజీ లో మూడు లింకులు వచ్చాయి. ఒక లింకు తెరవగా అందులో "అరాళ కుంతలా అంటే పొడవైన నల్లని జుట్టు కలది" అని ఉంది.

కళ్ళమంట నీళ్ళు వచ్చాయి. శాపవిమోచనం అయ్యింది. మా రూం మేట్ స్వయం గా అర్ధం చెప్పక పోయినా ఆ ఐడియా ఇచ్చింది తనే కనుక ఆ శాపం వర్క్ అవుట్ అయ్యిందనే చెప్పాలి. ఒక వేళ ఆ అర్ధం కనక తప్పు ఐతే దయాద్ర హృదయం కలిగిన మారాజులు కాని మారాణులు కాని నాకు చెప్పవలసింది గా నా

ఆర్ద్రత తో కూడిన ప్రార్ధన . (ఆర్ద్రత అంటే ఏంటి? తరవాతి చెదపురుగు)

 కొస మెరుపులు:

1. ఈ పరిశోధన వళ్ళ నాకు వెండ్రుక అనే అనే పదం తెలిసింది. ఇన్నాళ్లు వెంట్రుక అని మాత్రమే తెలుసు. నిఘంటువులో 'వెండ్రుక'కే అర్ధం ఇవ్వబడింది. వెంట్రుక కోసం వెతికేతే వెండ్రుకని చూడుము అంటుంది.

2. శ్రీ కృష్ణుడికి సత్యభామ కాలు తాకడం కేవలం నంది తిమ్మన గారి కల్పన మాత్రమేనట. ఆ కల్పన ఎందుకు చెయ్యవలసొచ్చిందనడానికి ఒక కత ఎక్కడో చదివినట్టు గుర్తు. ఒకానొక సందర్భంలో శ్రీ కృష్ణదేవరాయలు వారికి వారి భార్యామణి కాలు తగిలిందని ఆయన భార్యమీద కోపంతో మాట్లాడకుండా ఉన్నాడంట. విషయం తెలిసిన నంది తిమ్మన భార్య కాలు తాకడం తప్పుకాదు అని రాయలవారికి చెప్పడంకోసం ఈ కల్పన చేసాడంట.


😀😀😀😀😀😀😀😀😀😀😀😀

స్వ ధర్మో నిధనం శ్రేయః

 నేను మతం మారి మీకు సేవ చేస్తాను.....

ఒకసారి పరమాచార్య వారు తమినాడు లోని కరంబకుడి నుండి పట్టుకొట్టయ్ అనే గ్రామానికి మకాం మారుస్తున్నారు. ఆయన కోసం కరంబకుడి నివాసి అయిన ఒక ముస్లిం వృద్దుడు వెనక పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అది మంచి ఎండా కాలం. రొప్పుతూ వస్తున్న వృద్దున్ని చూసి స్వామి ఆగారు.వృద్దుడు పండ్లు, పూలు స్వామి కి సమర్పించి నమస్కరించి నిలుచున్నాడు.

స్వామి "మీరు నన్ను కరం బకుడి లో చూచారుగా. మరల ఇంత రొప్పుతూ ఎందుకు వచ్చారు."

ముస్లిం వృద్దుడు " నేను మిమ్మల్ని కరంబకుడి లో చూసాను. అయినా మిమ్మల్ని చూడకుండా ఉండలేననిపించి మరల వచ్చాను. మా మతం లో అల్లా కు రూపం లేదు ఉంటే మీలా ఉంటాడు. అని నా అభిప్రాయం అందుకే మిమ్మల్ని చూడాలనిపించింది. మీ మతం లోకి మారి మీరు కోరిన సేవ చేస్తాను. నన్ను మీ మతం లోకి చేర్చుకొని మీ సేవా భాగ్యం కలిగించండి. "కన్నీళ్లతో గద్గద స్వరంతో.

స్వామి కరుణ వర్షించే కళ్ళతో చూస్తూ "మీకు నన్ను చూడాలనిపించి నప్పుడు నన్ను తలుచుకోండి. మీ ఆలోచనలలోకి నేను వస్తాను. అప్పుడు నేను మీ దగ్గర ఉన్నట్లే. దానికోసం మతం మారకూడదు." అని అనునయంగా చెప్పి స్వామి ముందుకు సాగారు.స్వామి కనుమరుగయ్యే వరకు కన్నీళ్లతో స్వామి నే చూస్తూ వృద్దుడు ఆగిపోయాడు.

**** మతం మానవుడు ఏర్పరుచుకున్న

కొన్ని కట్టుబాట్లు సంప్రదాయాల, విశ్వాసాల హద్దు.స్వామి వారు ఎవరి హద్దులలో వారుండి గమ్యాన్ని చేరవలేనని విశ్వసిస్తారు . "స్వ ధర్మో నిధనం శ్రేయః "అనే గీతాచార్యుని అభిప్రాయమే స్వామి వారి అభిప్రాయం.

దైవ సన్నిధి

 దైవ సన్నిధి 

తిరుమల కొండమీద కాలుపెట్టినది మొదలు ఏదోతెలియని ఒక దివ్య మనోభావన నిజానికి మనం భూమిమీదనే వున్నా సాక్షాత్తు ఆ వైకుంఠానికి వచ్చినంతగా మనం  ఆనందపడతాము. అందుకేనేమో కలియుగ వైకుంఠంగా తిరుమల క్షేత్రాన్ని అభివర్ణించారు. అక్కడ మన ఊరువారు ఎవరైనాకనపడితే మీకు దర్శనం అయ్యిందా, లేదండి ఇందాకనే వచ్చాము ఇంకాదర్శనం కాలేదు,  మా టికెట్లు సాయంత్రం 3 గంటలకు మేము ముందే బుక్ చేసుకున్నాము. అని ఇలా అనేక విధాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి గూర్చే ముచ్చటిస్తూవుంటారు.  నిజం చెప్పాలంటే తిరుమల కొండమీద గడిపిన రెండు మూడు రోజులు ప్రతివారు వారి నిత్య సాధారణ జీవితాన్ని పూర్తిగా మరచి కేవలం స్వామి గూర్చి మాత్రమే ఆలోచిస్తారు. దర్శనం టికెట్ కొనలేనివారు, దొరకని వారు గంటలకొద్దీ క్యూ షెడ్లలో ఉండి మరి స్వామివారి దర్శనం చేసుకోవటం కోసం ఎదురుచూస్తారు. అయ్యో ఇంతసేపు నేను క్యూలో ఉండాలా అని ఏమాత్రం సంకోచించరు  గోవిందా, గోవిందా అని గోవిందనామ స్మరణతో తిరుమల అంతా మారుమోగుతోంది.  అక్కడ ఉన్నంతసేపు త్రాగమా, తిన్నామా అనే భావన కూడా కలుగదు అంటే ఆకలి దప్పులు వేయవన్నమాట. మనుషులంతా గుండు చేయించుకొని వీధులమీద దర్శనమ్ ఇస్తారు. జుట్టుతో వున్నవారు అతితక్కువ మంది కనపడాతారు. గుండు చేయించుకోలేదు అంటే వాళ్ళు అప్పుడే బస్సు దిగారని అర్ధం. ఇదంతా యెట్లా సాధ్యం అంటే అదంతా అదేవ దేవుడి లీల అని అంటారు. 

దాదాపు తిరుమల దర్శించుకున్న భక్తులు అందరు తలనీలాలు సమర్పించటం అంటే గుండు చేయించుకోవటం ఆనవాయితీ. పిల్లలు ఎవరైనా నేను గుండు చేయించుకొని అంటే తప్పు అట్లా అనకూడదు కళ్ళు పోతాయి అని తల్లిదండ్రులు పిల్లలకు బలవంతంగా మరి గుండు చేయించటం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది స్త్రీలు కూడా శిరోముండనం చేయించుకోవటం మనమెరుగుదము. ఇప్పుడు స్త్రీల నిమిత్తం నారి క్షురకులని దేవస్థానం ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ముందుగా గుండు చేయించుకొని అటు పిమ్మటే స్వామి దర్శనం.  కొంతమంది ఆన్లైనులో ఇంటివద్దనే పూర్తీ కార్య క్రమాన్ని (ప్రోగ్రాం) నిర్ణయించుకొని తిరుపతికి రావటం మనమెరుగుదము.  మనిషికి దేహవ్యామోహాన్ని కలుగచేసేది ముఖము అందునా సుందరమైన కేశాలు దేహసౌందర్యాన్ని ఇనుమిడింప చేస్తాయి. అంటే ఒక మనిషి తాను అందంగా వున్నాను అనుకోవటానికి మూల కారణం  కేశాలు. కేశాలు నిర్ములిస్తే దేహ సౌందర్యం పూర్తిగా పోతుంది.  అందుకేనేమో ఈ ముండనవిధి.  శరీరం అందంగా .లేదని ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో అప్పుడు దేహవ్యామోహం వదిలి మనస్సు దైవం వైపు మళ్లుతుంది. మన ధర్మంలో సన్యాసులు ముండనం చేసుకొని ఉండటం చూస్తున్నాము. ఏతావాతా తేలేది ఏమిటంటే మనం దేహవ్యామోహం వదిలి దైవ చింతన చేయాలని.మాత్రమే  

సముద్రమట్టానికి ఎగువకు వెళుతున్నకొద్దీ అంటే సముద్రమట్టానికన్నా ఎక్కువ ఎత్తుకు వెళితే మనకు వాతావరణ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వస్తాయి అవి వాతావరణ పీడనం, గురుత్వాకర్షణ శక్తిలో తేడా, అంతే కాకుండా గాలిలో ఆక్సిజన్ శాతంలో మార్పు ఇలా అనేకమైన తేడాలు కలుగుతాయి. అందుకే మనకు భూమికన్నా ఎంతో ఎత్తుమీద విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎత్తయిన ప్రదేశాలలో మనిషి మనస్సు ప్రశాంతముగా,  సంతోషంగా,ఆనందంగా ఉంటుంది అన్నది నిజం. ఈ సత్యాన్ని  మన మహర్షులు ఎప్పుడో తెలుసుకున్నారు. ఆ మానసిక స్థితే మనిషిలో ఆత్యాత్మికతను మేల్కొలుపుతుంది. అందుకే  ఎత్తైన గుట్టలమీద, కొండలమీద దేవాలయాలు నిర్మించారు.  ఎప్పుడో నిర్మించిన దేవాలయాలు ఇప్పటికి పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతూవున్నాయి. ఆయా దేవాలయాల్లో నెలకొన్న దేవుళ్ళు  భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు. హిందుత్వంలో ప్రతిదీ శాస్త్రేయత కలిగి ఉంటుంది.  అంతరార్ధం తెలుసుకోలేని మూర్ఖులకు అది అర్ధం కాదు. 

తిరుమల కొండమీద రోజు కొన్ని లక్షలమంది వస్తున్నారంటే దానికి కారణం కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రమే కానీ మరొకటి కాదు. ఏడుకొండలు వున్నాయి కానీ ఇతర కొండలమీదికి ఒక్కరు కూడా వెళ్ళరు. ప్రతి భక్తుడు తిరుమలలో వున్నన్ని రోజులు తాను పూర్తిగా దైవ సన్నిధిలో ఉన్నట్లు భావిస్తాడు.  అంతే కాదు ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క రీతిలో స్వామి అనుగ్రహించినట్లు చెప్పుకుంటారు. ఒక్కసారి తిరుమలకు వచ్చిన భక్తుడు ఇంటికి వెళ్లిన తరువాత కొన్నిరోజుల వరకు తిరుమల విశేషాలు చేర్చించుకుంటూ ఆనందిస్తాడు.  ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల యాత్ర ఒక ఆనందానుభూతితో కూడిన అనుభవం.  ఈ అనుభవం ఈ వ్యాసం చదువుతున్న వారందరు పొంది వుంటారు అంటే అతిశయోక్తి కాదేమో. 

తిరుమల వెళ్లకుండానే నీకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే, నీకు తిరుమల కొండమీద వున్నప్పుడు కలిగే దైవ సన్నిధి అనే ఆనందభావన నీ ఇంట్లోనే కలిగితే యెట్లా ఉంటుంది.  ఆలోచించటానికి చాలా  బాగుంటుంది. కానీ అది యెట్లా సాధ్యం ఎట్టి పరిస్థితిలోకూడా సాధ్యం కాదు ఆలా అని ప్రతివారు అంటారు.  మన ధర్మంలో వున్న గొప్పతనం ఏమిటంటే ఒక నోము, వ్రతము, యజ్ఞ యాగాది క్రతువులు, దేవాలయాలలో దైవ దర్శనం ఇలా కొన్ని సత్ కర్మలు చేయటం వలన మానసికోల్లాసము కలిగి దివ్యమైన ఆనందానుభూతులు పొందుతాము.  తత్ద్వారా  ఏ లక్ష్యంతో ఆ య  సత్కర్మలు ఆచరించారో  ఆ యా లక్ష్య సిద్ది అంటే కోరికలు ఈడేరుతాయి ఒక్కమాటలో చెప్పాలంటే మునకు మన మీద మనకు తెలియకుండా పనిచేసే దైవ శక్తి ప్రేరితం అయ్యి ఆ ఫలితాలను ఇస్తుంది. 

తిరుమలలో ఉన్నంత కాలం ప్రతి భక్తుడు స్వామి సన్నిధిలోనే అంటే ఆయన రాజ్యంలోనే వున్నాడని తనను ఆ శ్రీ వెంకటేశ్వర స్వామే కాపాడుతాడనే ప్రఘాఢ విస్వాసంతో  ఉంటాడు. నిజానికి భక్తుని విశ్వాసమే భగవంతుడు, కాబట్టి తప్పకుండ భగవంతుడు కాపాడుతాడు. "మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః" అని అన్నారు కదా కాబట్టి ఎప్పుడైతే మనిషి మనస్సు పరిశుద్ధంగా దైవస్మరణతో ఉంటుందో అప్పుడు అది తేజోమయంగా, శుద్ధంగా ఉండి ధనాత్మకపు ఆలోచనలు  వస్తాయి. దాని పర్యవసానమే ఆ సత్కర్మ ఫలితాలుగా మనం పేర్కొనవచ్చు.  అందుకే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయి. సాధకుడు ఒక భక్తుడు తిరుమల కొండమీద పొందిన ఆనందానుభూతి తన ఇంట్లో, లేక ఏ చెట్టుకిందనో, నది వడ్డునో, కూడా పొందగలడు అది ఎట్లాగో చూద్దాం. 

చిన్న పిల్లవానికి సైకిలు త్రొక్కటం రాదు అప్పుడు వాడి తండ్రిగారో లేక అన్నగారో సైకిలు పట్టుకొని కొంత సమయం ఊతం ఇచ్చి నేర్పితే అప్పుడు బాలుడు స్వతంత్రంగా సైకిలు  త్రొక్కగలడు. అదేవిధంగా మనలో ఉన్న దైవశక్తిని తెలుసుకోలేక పోవటంచేత మనం కూడా సైకిలు నేర్చుకునే బాలుడు తన తండ్రిగారి మీద ఆధార పడినట్లు మనం భగవంతుని మీద బాహ్యంగా ఆధార పడాలి దానికోసమే తీర్ధాలు,  క్షేత్రాలు. నిజానికి తీర్థక్షేత్ర దర్శనం కేవలం మనలోని దైవాన్ని తెలుసుకోవటం కోసం తీసుకునే శిక్షణ  మాత్రమే. కానీ ఒక సాధకుడు భగవంతుని దర్శించటం కేవలం తనలోనే అనే విషయం తెలుసుకోవాలి. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మనిషి ఎప్పుడైతే అంతర్ముఖుడు అవుతాడో అప్పుడు తనకు తెలుస్తుంది భగవంతుడు బయట కాదు అంతరంగంలో వున్నాడని అప్పటినుంచి అసలైన వెతుకులాట మొదలవుతుంది అదే సాధనకు నాంది పలుకుతుంది. అప్పుడు సాధకుడు తిరుమల కొండమీద చేసినవే జీవితాంతం చేసి మోక్షాన్ని పొందుతాడు.  కొండమీద ఏమిచేసాడు అని ఆలోచిస్తే ముందుగా కొండ ఎక్కగానే గుండు చేయించుకున్నాడు అలానే తాను మోక్షాన్ని పొందాలనుకునే సాధకుడు దేహవ్యామోహాన్ని తొలగించుకోవటానికి సదా ముండనం చేసుకొని ఉంటాడు.  కొండమీద ఏరకంగా అయితే నిరంతర భగవత్ సంకీర్తనం చేస్తూ ఉంటాడో అలాగే సాధకుడు కూడా నిత్యం ఆ భగవంతునే స్మరిస్తూ భగవంతునిలోనే లీనమై వుంటూ నిరంతర సాధన చేస్తూ ఆత్మలోనే లయం అయి ఉంటాడు.  తత్ ద్వారా జీవన్ముక్తి పొందుతాడు.  సాధన ఎలా చేయాలి ఏ ఏ నియమాలు పాటించాలి అనేవి ఒక సత్ గురువు ద్వారా శిక్షణ పొంది ఆత్మా జ్ఞ్యానాన్ని పొందాలి.

ఓం తత్సత్ 

 ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

 



పంచకర్మ పద్ధతి

 ఆయుర్వేదం నందలి పంచకర్మ పద్ధతి - సంపూర్ణ వివరణ . 


     ఆయుర్వేదము నందు పంచకర్మ చికిత్సకు విశిష్ట స్థానం కలదు . ఈ పంచకర్మ చికిత్సను మొట్టమొదటగా తెలియచేసినవారు చరక మహర్షి . ముందుగా అసలు ఆయుర్వేదము నందు కర్మ అను పదానికి అర్థం తెలుసుకుందాం . 


       విషమదోషములను హరింపచేసి , ధాతువులను పరిశుద్ధముగా చేయు ఒక ప్రత్యేక వ్యాపారం ( Special operation ) నకే కర్మయని పేరు . ఈ కర్మలు 5 విధములుగా శాస్త్రము నందు గ్రహింపబడెను . వీటిలో నస్యకర్మ , వమనకర్మ , విరేచనకర్మ , నిరూహ వస్తి అను 4 కర్మలు శోధనములు (Eliminations ) . అందుచేతనే ఇవి లంకణ చికిత్స యందు ఇమిడి ఉన్నవి . వాతదోషములను హరింపచేసి , వాతదోషము శరీరముకు సంక్రమించకుండా అనువాసవ వస్తికర్మ శమించునదిగా ( Soothing Treatment ) చెప్పబడెను . 


       ఇప్పుడు మీకు పంచకర్మల గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 


 *  నస్యకర్మ  - 


        దీనికి శిరోవిరేచన కర్మ అని పిలుస్తారు . ద్రవరూపముగా గాని లేక చూర్ణ ( Powder ) రూపముగా గాని ఉన్న ఔషధములను నాసారంధ్రముల ద్వారా లోనికి పంపుటకే నస్యకర్మ అని పేరు . నాసామార్గములను శుభ్రపరచి , శిరస్సు నందు పేరుకుపోయిన శ్లేష్మమును హరించుట కొరకు ఈ నస్యకర్మ ను ఉపయోగించవచ్చు . 


 *  వమనకర్మ  - 


       వాంతి కలిగించు ఔషధాలను లోపలికి పంపి వాంతి చేపించి ఉదరము నందు గల వ్యర్ధములను బయటకి వెడలించు పద్దతి . 


 *  విరేచనకర్మ - 


       విరేచనములు కలిగించు ఔషధములను లోపలికి ఇచ్చి ప్రేగులు , మలాశయము మొదలగు వాని యందలి వ్యర్థములను విరేచనం ద్వారా బయటకి వెడలించుట. 


 *  నిరూహవస్తి - 


        ఈ ప్రక్రియ నందు ప్రేగులను శుభ్రపరచుటకు కొన్ని ద్రవ్యముల యొక్క కషాయములను గుదమార్గము ( మలద్వారం ) ద్వారా లొపలికి పంపుటకు నిరుహవస్తి అని పేరు . విషమమైన   ఉదావర్తము ( Irregular peristalsis ) చే జనించు ఆంత్రశూల ( Intestinal colic ) యందు మలబద్దకం నందు ఈ నిరుహవస్తి ఉపయోగించవలెను . 


 *  అనువాసనవ వస్తి - 


      దీనినే స్నేహవస్తి అని కూడా చెప్పెదరు . ప్రేగులను శుభ్రపరుచటే కాక , వాతదోషము వలన కలుగు వికారములను ఉపశమిపచేయుటకై ఓషధద్రవ్యములచే తయారుచేయబడిన తైలమును గుదమార్గముగా లోనికి పంపుటనే  అనువాసనవ వస్తి అని పేరు ఇది వాతమును హరించుటలో శ్రేష్టమైనది . 


        ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

27, జనవరి 2023, శుక్రవారం

సుబ్బరామయ్య మాష్టర్

 🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏


*గ్రంథం:* సర్వసమర్థుడు , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*శ్రీ సాయి, శ్రీ స్వామివారు ఒక్కరే!*


*భగవంతుడు ఒక్కడే. కాలానుగుణముగా అనేకమంది మహనీయుల రూపాలలో అవతరించి భక్త రక్షణ చేస్తుంటారు.* ఈ మహనీయుల అందరి మధ్య ఐక్యతేకానీ, సామాన్య మానవులకు వలె విరోధ భావం ఉండదు. శ్రీ సాయినాధుని భక్తురాలికి, శ్రీ వెంకయ్య స్వామివారు భౌతిక దర్శనం ప్రసాదించి, వారి భిక్షను స్వీకరించడం ద్వారా, మహనీయుల మధ్య మనకుండే భేదభావం నశింపజేసుకోమని బోధిస్తున్నారు.


అనంతలక్ష్మి సత్యవతి, నెం.46, 3వ అవెన్యూ DAE టౌన్ షిప్, కల్పాకం - 603 102, తమిళనాడు,


 1997 లో "సాయినాథా! నాకు మంచి క్వార్టరు చూపిస్తే నీ పేరుతో అన్నానికి లేని అభాగ్యునికి అన్నం పెడతానని మొక్కుకున్నారు. తనకు మంచి ఇల్లు దొరికింది. కాని అన్నాని లేని అభాగ్యునికి అన్నం పెడతానన్నమాట చెల్లించలేక ఎవరో ఒక ఆయాకు భోజనానికిగాను డబ్బిచ్చారు. తన తప్పు గ్రహించి నిరుపేదయైన మరొకరికి అన్నం పెట్టాలనుకున్నారు. కానీ 25 రోజుల వరకు ఎవ్వరూ దొరకలేదు. 25 వ రోజున, నేను నా మాట చెల్లించుకోలేకున్నాను బాబా, అన్నానికి లేని నిరుపేదను చూపండి అని చెప్పుకున్నది.


 నాడు మధ్యాహ్నం 11:30 గంటలకు - ఎముకల గూడు వలెనున్న ముసలాయన, భిక్షగాళ్ళెవరూ రాని మా మూడవ అంతస్తు మేడ మెట్లెక్కి వచ్చి, అన్నం అడిగారు. రాత్రి వండిన అన్నం చాలా ఉంది. అది పెట్టాలనుకున్నాను. వెంటనే ఆ తాత "వేడన్నం ఉందా? పెడతావా? అడిగారు. ఆహా! సాయి నా ప్రార్ధన మన్నించి వచ్చాడని వేడన్నం పార్శిలు కట్టి ఇచ్చాను. ఈ లోగా మా ఎదురింటామె కాఫీ ఇచ్చింది. ఆ మెట్ల మీద కూర్చొని తాగారు. ఒక్క నిమిషంలో అన్ని మెట్లు దిగి ఎలా వెళ్ళారో అర్ధం కాలేదు. వచ్చినది సాయినాధుడే అనుకున్నాను. ఆ తర్వాత మా ఇంట్లో సత్సంగం జరిగింది.


*స్మృతి మాత్ర ప్రసన్నాయ నమః* అనే పుస్తకంలోని శ్రీ వెంకయ్య స్వామి బొమ్మచూచాను. ఆనాడు మా యింటికి వచ్చి అన్నం తీసుకవెళ్ళిన మహనీయుడు వీరేనని స్పష్టంగా గుర్తించాను. సాయినాధుని భక్తురాలనైన మా యింటికి నా పిలుపు లేకుండానే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు వచ్చి భిక్ష గ్రహించారంటే *మహనీయులందరికీ రూపంలో భేదం తప్ప తత్వంలో ఎలాంటి భేదము లేదని బోధిస్తున్నారు*.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

"ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః"

     'శ్రీ సాయి లీలామృతం, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర. నిత్య పారాయణ గ్రంథం. రచన పూజ శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్.'

      "18 వ అధ్యాయం"

     -:శిరిడీలో ఉత్సవాలు:-

    -:పల్లకి - చావడి ఉత్సవం:-

    ఒకరోజు పెద్ద వర్షం వచ్చి మసీదు అంతా తడిసిపోయి బాబాకు కూర్చునేందుకు చోటు కూడా లేకపోయింది. భక్తులు ఆయన నాటి రాత్రికి చావడిలో ఉండమన్నారు. ఆయన అంగీకరించకపోయేసరికి పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకుపోయారు. ఆ రాత్రి ఆయన అక్కడ విశ్రమించారు. నాటి నుండి ఆయన ఒక రాత్రి మసీదులోనూ ఒక రాత్రి చావడిలోనూ నిద్రించేవారు. వారిని భక్తులు మసీదు నుండి చావడికి వేడుకలతో తీసుకెళ్లడం, క్రమంగా డిసెంబరు 10  1909 నాటికి అది గొప్ప చావడి ఉత్సవంగా రూపొంది, నేటికీ ఇది గురువారం రాత్రి పల్లకి ఉత్సవంగా జరుగుతున్నది.

      ఒకప్పుడు  హార్ధ  నుండి భక్తులు బాబాకోక పల్లకి పార్సిల్ చేసి పంపారు. బాబా దానిని మసీదు ముంగిట పెట్టించి మూడు మాసాలు దానిని తెరవనివ్వలేదు. ఒకరోజు రఘువీరపురంధరే చనువుగా, "బాబా ఈరోజు పల్లకి బయటకు తీసి, పూలతో అలంకరించి, అందులో మిమ్మల్ని చావడికి తీసుకుపోతామన్నాడు."  సాయి ఆ పార్సెల్ ఇప్పడానికే ఒప్పుకోలేదు. అయినా అతడు పంతంగా విప్పుతుంటే బాబా గద్దించి, పట్టరాని కోపంతో సట్కా తీసుకొని చంపేస్తానని అతని మీదకు పరిగెత్తారు. భక్తులు భయంతో పారిపోయారు. పురందరే అదేమీ పట్టించుకోకుండా నెమ్మదిగా పార్సిల్ విప్పి పల్లకిని పూలతో అలంకరించాడు. ఇక బాబా మౌనంగా ఉండిపోయారు. అది చూసిన పురందరే పంతంగా ఇకనుంచి మిమ్మల్ని పల్లకిలో ఊరేగింపుతో చావడికి తీసుకెళ్తాము!  అన్నాడు  అలా మాత్రం ఎన్నటికీ జరగనివ్వను అన్నారు బాబా  అతడు అయితే పల్లకి ఖాళీగా మూసుకుపోతాము ఏమి అన్నాడు   "సాయి ఉగ్రలై నీవు ముందు బయటికి పోతావా లేదా" అని చెడ్డగా తిడుతూ సట్కా తో బెదిరించారు  అతడు త్వరగా ఆ పని పూర్తి చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు. అతడు అనుమతి కోరినప్పుడు బాబా ఏమీ మాట్లాడకుండా ఊది ఇచ్చారు  తర్వాత చావడికి వెళ్ళవలసిన రోజు సాయంత్రం అయ్యేసరికి భక్తులందరూ మొట్టమొదటి పల్లకి ఉత్సవానికి మసీదు వద్ద చేరారు. బాబా మాత్రం పల్లకి ఎక్కనని భీష్మించారు. ఊరి నుంచి అప్పుడేవచ్చినపురందరే తాను సిద్ధం చేసిన పల్లకి లేకుంటే తాను ఉత్సవానికి రానన్నాడు. భక్తులు ఎంత బ్రతిమాలిన బాబా తమ పట్టు విడవలేదు. చివరకు పల్లకీ లో వారి పాదుకలు ఊరేగించాలని, సాయి పాదచారి ఐ ఊరేగింపుతో వెళ్లాలని, రాజీ కుదిరింది. "బాబా పల్లకి నేను కూడా మోసేదా" అన్నాడు పురందరే.  వద్దు నీవు 125 వత్తుల దివిటి పట్టుకో అన్నారు బాబా. అలా దివిటీల ఊరేగింపుతో పల్లకి చావడి చేరింది.

    నాటి ఉత్సవమయ్యాక సాయి పల్లకిని మసీదులో పెట్టనివ్వలేదు. కనుక మూడు నాలుగు రోజులు అది చావడిలోనే ఉన్నది. చివరికి ఎలాగో ఒక రాత్రి మాత్రం మసీదు ముంగిట ఉంచనిచ్చారు. రెండు వెండి సినిమాలు దొంగలు ఎత్తుకెళ్లారు. కనుక దానికి ఒక షెడ్డును నిర్మించ ఆరంభించాడు పురందరే. బాబా లెండి నుండి గబగబ వచ్చి ఏమిటి చేస్తున్నావ్? అని గద్దిస్తే, అతడు నవ్వుతూ చెప్పాడు.! ఆయన ఉ(గ్గు లై నువ్విక్కడినుంచి పోతావా లేక నీ తల పగలగొట్టనా? అని మీదకెళ్లారు. అతడాయనకాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలాడు. ఆయన మరింత గట్టిగా నాకు నువ్వు వద్దు, పల్లకి షెడ్డు అసలే వద్దు; నన్ను విసిగించకు పో... అని అరిచారు. కానీ అతడు చేస్తున్న పనిలో మాత్రం జోక్యం చేసుకోలేదు.

      మధ్యాహ్నం హారతయ్యాక భక్తులందరూ భోజనాలు చేసి తిరిగి మసీదు చేరిన పురందరే మాత్రం వెళ్లకుండా పనిచేస్తూనే ఉన్నాడు  సాయి కొన్నిసార్లు అతని కి నెమ్మదిగా చెప్పారు, మందలించారు, గద్దించారు, భోజనానికి వెళ్లకుంటే కొడతానని బెదిరించారు. అయినా అతడు వినిపించుకోలేదు. పట్టరాని కోపంతో పలక్కుండా పదేపదే అతనికేసి చూస్తారు. చేత్తో పోట్ట తడుముకుంటారు,"ఆపనికిమాలిన వాడు భోజనానికి కూడా పోకుండా నా ప్రాణం తీస్తున్నాడు, నువ్వైనా పిలుచుకుపో!" అని కాక సాహెబ్ తో చెప్పారు  అతడు సెలవు పెట్టాడు  అధయ్యేలోగా పని పూర్తి చేయాలని చేస్తున్నాడు. అతనిని భోజనానికి పిలుచుకెళ్ళనా? అన్నాడు కాక. "వాడు రాడు, ఆ మూర్ఖుడు నేను చెప్పిన వినలేదు! అన్నారాయన. వెంటనే పురందరే వారి పాదాలపై పడి... పసిపిల్ల వానిలా ఏడుస్తుంటే! "ఎందుకు ఏడుస్తావ్? ఊరుకో! అన్నారు బాబా.అతడుకళ్ళుతుడుచుకొని "పొద్దటి నుండి నన్ను ఇంతలా తిడుతున్నారు. కొడతాను, చంపుతాను; అని బెదిరిస్తున్నారు, కానీ నేను ఒక్క పూట భోజనం చేయకపోతే అంత తల్లఢిల్లీ పోతున్నారే! నాపై మీకెందుకు దయ? మమ్మీoతలాపట్టించుకునేదేవరు? అన్నాడు. "నోరు ముయ్! వెళ్లిభోంచెయ్:కడుపుమండిపోతుంది!" అన్నాడు బాబా. అతడు రెండు అడుగులు వేసి, చటుక్కున వెనుక తిరిగి, నేను వెళితే మీరంతా పీకేస్తారు అన్నాడు. బాబా ప్రసన్నులై "నేనేమన్నా రాక్షసుడు నా!!!? నేను అలా ఏమి చేయనులే!" అన్నారు.

        "18 వ అధ్యాయం మొదటి భాగం సంపూర్ణం"

          'శుభం భవతు'

             🙏🙏🙏

కుష్టు రోగము గురించి సంపూర్ణ వివరణ - 1.

: కుష్టు రోగము గురించి సంపూర్ణ వివరణ - 1.


       కుష్టు రోగము మొత్తము 20 రకాలుగా ఉండును. ఇప్పుడు వాటిలోని రకాల గురించి వివరిస్తాను. అవి 


 * పుండరీక కుష్ఠము . 

 

 * విస్ఫోటక కుష్ఠము . 


 * పామాకుష్ఠము . 


 * గజచర్మ కుష్టము . 


 * కాకణ కుష్టము . 


 * కచ్చక కుష్టము . 


 * రుశ్యజిహ్వక కుష్టము . 


 * గళ కుష్టము . 


       పైన చెప్పిన ఎనిమిది మహాకుష్టు రోగములు .  


 * కపాల కుష్ఠు.


 * ఉదుంబర కుష్టు . 


 * మండల కుష్టు . 


 * విచర్చిక కుష్టు . 


 * వైపాదిక కుష్ఠు . 


 * కిట్టిబ కుష్టు . 


 * చర్మదద్రు కుష్టు . 


 * సిద్మ కుష్టు . 


 * శీతరుష్య కుష్టు . 


 * శ్విత్ర కుష్టు . 


 * విసర్ప కుష్టు .  


           పైన చెప్పిన 12 రకాలు మరియు మహా కుష్టులు 8 రకాలు కలిపి మొత్తం 20 రకాల కుష్టు వ్యాధులు ఉండును. 


           ఇప్పుడు మీకు ఒక్కోదాని గురించి సంపూర్ణంగా వివరిస్తాను. 


 * పుండరీక కుష్టు లక్షణము - 


         శరీరంపైన తామరరేకుల వలే మచ్చలు కలుగుట. రక్తం వ్యాపించు వరకు తెలుపుగా దట్టముగా ఉండటం , బరువుగా ఉండటం, నీరుకారుట , దురద కలిగి ఉండటం , మచ్చ మధ్యమున రక్తవర్ణం కలిగి ఉండటం ఈ లక్షణాలను బట్టి ఇది పుండరీక కుష్టు అని తెలుసుకొనవలెను . ఇది శరీరం నందు కఫాధిక్యత వలన కలుగును. ఇది మహా కుష్టు వ్యాధి . 


 * విస్పోటక కుష్టు లక్షణము -  


        స్ఫోటకము , దురద , తీవ్రదాహము కలుగుట , మచ్చలు ఎర్రగా ఉండటం , మెరియుచుండుట , పాండువర్ణం కలిగి ఉండటం , చేతులు , కడుపు యందలి మంట , నొప్పి కలిగి ఉండటం . ఈ లక్షణాలను బట్టి ఇది విస్పోటక కుష్టు అని తెలుసుకొనవలెను . ఇది మహా కుష్టు . 


 * పామాకుష్టు -  


       సూక్ష్మమైన కురుపులు గుంపులుగా వచ్చి ఆ కురుపులు నుండి తెల్లని పులినీరు కారును. తాపము , దురద కలుగును. ఈ లక్షణాలని బట్టి ఇది పామాకుష్టు అని తెలుసుకొనవలెను. ఇది మహాకుష్టుము. 


 * గజచర్మ కుష్టు -  


       చెమట పట్టకుండుట , మిక్కుటంగా ఉండటం. ఉదరము పెరుగును . శరీరం పైన మత్స్యపు తునకల వలే ఉండును. ఏనుగుచర్మం వలే నల్లగా ఉండును . ఈ లక్షణము కలిగినది గజచర్మ కుష్టుమని తెలుసుకొనవలెను . ఇది వాతాశ్లేష్మధిక్యం వలన జనించవలెను. ఇది మహాకుష్టుము . 


 * కాకకుష్టు లక్షణము - 


      కాకిముక్కుతో సమానమైన వర్ణం కలదిగా ఉండును. తీవ్రవేదన కలుగును. ఈ లక్షణం కాకకుష్టు లక్షణము. ఇది అసాధ్యము . 


 * కచ్చత్వక్కు ష్టు లక్షణము - 


       శరీరం ఎర్రనై మెరియుచుండును. నల్లటి రంగులో ఉండును. బాగా దురద ఉండును. తొడలు , చంక , మొల భాగము ల యందు జనించును. 


 * రుష్య జిహ్వ కుష్టు లక్షణము - 


       శరీరం కఠినంగా ఉండును. మచ్చల చుట్టు ఎర్రగా ఉండును. మధ్యలో నల్లగా ఉండును. వేదనతో కూడి ఉండును. దుప్పినాలుక వలే నల్లగా ఉండును. ఈ లక్షణాలు కలిగినది ఋష్య జిహ్వ కుష్టు లక్షణము. 


         తరవాతి పోస్టుల్లో మిగిలిన కుష్టువ్యాధుల లక్షణాల గురించి మరియు కుష్ఠు వ్యాధి రావటానికి గల కారణాల గురించి కూడా సంపూర్ణంగా వివరిస్తాను. 


 

       ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

[24/01, 9:18 pm] +91 98850 30034: కుష్ఠు రోగము గురించి సంపూర్ణ వివరణ - 2 . 


 * గళ కుష్టు లక్షణము - 


      నాలుక నల్లగా ఉండుట . కాళ్ళ యందు తాపము కలుగుట . మూడంగుళాల మచ్చలు కలిగి ఉండుట . ముక్కు నుంచి రక్తం కారును . స్వరము చెడును. ఇలాంటి లక్షణాలు కలిగినదా గళ కుష్టు అని తెలుసుకొనవలెను. ఇది త్రిదోషముల వలన జనించును. ఇది వచ్చిన మూడు మాసములలో నిశ్చయంగా చంపును. 


 * కపాల కుష్టు లక్షణము - 


     నల్లని మచ్చలు , ఎర్రని మచ్చలు కలుగును. దురద కలిగి ఉండును. సూదులతో పొడుస్తున్నట్టు వేదన ఉండును. ఈ లక్షణాలు కలిగినది కపాల కుష్టు అనబడును. ఇది అసాధ్యము . ఈ కుష్టు వాతాధిక్యత కలుగును. 


 * ఔదుంబర కుష్టు లక్షణము - 


      నొప్పి , మంట , ఎరుపు వర్ణం కలిగి ఉండి దూరదతో శరీరం అంతా వ్యాపించి ఉండును. వెంట్రుకలు ఎర్రని రంగుతో ఉండును. శరీరం మేడిపండు రంగుతో ఉండును. ఇటువంటి లక్షణములు కలిగినది ఔదంబర కుష్టు . ఇది శరీరం నందు పిత్తం పెరగటం వలన జనియించును . 


 * మండల కుష్టు లక్షణము - 


      తెల్లగా , ఎర్రగా , కఠినముగా , దట్టముగా , స్నిగ్ధముగా , మండలాకారముగా ఉండు మచ్చలు శరీరం అంతా వ్యాపించి ఉండును. ఇది కష్టసాధ్యము . కఫాధిక్యత వలన జనియించును . 


 * ప్రసూతి కుష్టు లక్షణము - 


     అంగములలో సూదులతో పొడుస్తున్నట్లు వేదన ఉండును . శరీరము నందు స్పర్శజ్ఞానం లేకుండా ఉండును. ఈ లక్షణాలు బట్టి ప్రసూతి కుష్టు అనబడును. కొందరు దీనిని మహా కుష్టు అంటారు. ఇది వాతపిత్త ప్రకోపం వలన జనియించును . 


 * విచ్చరిక కుష్టు లక్షణము - 


      దట్టమైన మచ్చలు కలిగి తెల్లగా , ఎర్రగా ఉండును. నీరు కారుచుండును. దురద , మంట కలుగును. ఈ లక్షణాలు కలిగినది విచ్చరిక కుష్టు అని తెలుసుకొనవలెను . ఇది తరచుగా వాతాపిత్తాధిక్యత వలన కలుగును. 


 * వైపాదిక కుష్టు లక్షణము - 


      శరీరం పగిలి ఉండును. తీవ్రమైన వేదన కలిగి ఉండును. చేతులు , కాళ్ళు ఉష్ణంగా ఉండి ఎర్రగా ఉండును. ఈ లక్షణాలు కలిగినది వైపాదిక కుష్టుగా పరిగణించవలెను. ఇది వాతాశ్లేష్మధిక్యత వలన వచ్చును. 


 * కిట్టిబ కుష్టు లక్షణము - 


      శరీరం పైన మచ్చలు నీలవర్ణంగా ఉండును. బిరుసుగా ఉండును. దురదగా ఉండును. మచ్చలు మందంగా ఉండును. ఈ లక్షణములు కలిగినది కిట్టిబ కుష్టు అని తెలుసుకొనవలెను. ఇది వాత, శ్లేష్మధిక్యత వలన కలుగును. 


 * చర్మ దళ కుష్టు లక్షణము - 


     ఎర్రని మచ్చలు కలిగి ఉండును. నొప్పితో కూడుకుని ఉండును. మచ్చలు బిరుసుగా ఉండును. దురద కలిగి ఉండును. మచ్చల నుండి నీరుకారును. శరీరం అంతా బొబ్బలు లేచును . శరీరం పగులును. తాకిన నొప్పి కలగదు . మచ్చలు దట్టముగా ఉండును. మచ్చలు మెరియును . ఇటువంటి లక్షణములు కలిగినది చర్మ దళ కుష్టు అని తెలిసుకొనవలెను . ఇది మహాకుష్టు . 


 * దద్రు కుష్టు లక్షణము - 


       శరీరం అంతా వ్రణాలు లేచును . వ్రణములు దురదతో కూడి ఉండి ఎర్రగా ఉండును. వ్రణములు తెల్లగా ఉండును. ఇటువంటి లక్షణములు కలిగినది దద్రు కుష్టు అని తెలుసుకొనవలెను. ఇది కఫపిత్త ప్రకోపం వలన జనియించును . 


 * సిధ్మ కుష్టు లక్షణము - 


      ఎరుపు , తెలుపు కలిగిన మచ్చలు కలుగుట. మచ్చల నుంచి తెల్లటి పిండి వలే రాలును. ఇది ఎక్కువుగా రొమ్ముల మధ్యభాగం , మోచేతులు , మోకాలి కింద భాగము నందు జనియించును . దీనిని సోరియాసిస్ అని ఆంగ్లము నందు పిలుస్తారు . ఇది వాతాశ్లేష్మాదిక్యత వలన కలుగును. 


 * శతారుష్య కుష్టు లక్షణము - 


      మచ్చలు ఎరుపుగా , నలుపుగా , దట్టముగా ఉండును. మచ్చల నుండి నీరు కారుచుండును. మచ్చలు మెరియుచుండును . దురద , శూల , మంటతో కూడుకుని అనేక వ్రణములు శరీరంపైన కలుగును. ఇది పిత్తశ్లేష్మధిక్యత వలన కలుగును. 


 * శ్విత్ర కుష్టు లక్షణము - 


       ఇది శంఖవర్ణము కలిగినదై సర్వాంగముల యందు వ్యాపించి ఉండిన ఇది అసాధ్యము . శరీరం అంతా వ్యాపించి ఉండి శరీరం కృశించి ఉండిన కష్టసాధ్యం . మర్మభాగముల యందు , అరచేతి యందు జనియించి అగ్నివలె మండుచుండిన అసాధ్యము అని తెలియవలెను . మరియు ఎక్కువకాలం నుండి ఉండిన ఎప్పటికి నయం కాదు. దీనిని బొల్లి అని పిలుస్తారు . ఇది వాతాధిక్యత వలన జనియించును . 


             కుష్టు వ్యాధులలోని రకాల గురించి మీకు వివరించాను . తరవాతి పోస్టు నందు కుష్టు వ్యాధి రావడానికి గల కారణాల గురించి సంపూర్ణంగా వివరిస్తాను. 


  

  

       ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

[26/01, 4:23 am] +91 98850 30034: కుష్ఠురోగము గురించి సంపూర్ణ వివరణ - 3 . 


   అంతకు ముందు పోస్టులలో మీకు కుష్టు వ్యాధి గురించి మీకు వివరించాను. ఇప్పుడు మీకు అసలు కుష్టువ్యాధి రావడానికి గల కారణాలు గురించి వివరిస్తాను. 


 కుష్టువ్యాధి రావడానికి గల కారణాలు - 


  * మత్స్యము , పాలు మరియు పాలపదార్ధాలు కలిపి సేవించటం . 


 * ద్రవరూపం , గట్టిగా ఉన్న అన్నపానాలు సేవించడం . 


 * వాంతి మరియు మలమూత్రాల వేగాన్ని బలవంతంగా ఆపడం . 


 * భుజించిన వెంటనే అతిగా వ్యాయామం చేయుట . 


 * అతిగా ఎండలో తిరుగుట. 


 * శీతల మరియు వేడి పదార్ధాలను వెంటవెంటనే సేవించుట . 


 * వేడిమి , భయము , శ్రమ ఉన్నప్పుడు శీతోదకము ( చల్లని నీరు ) అతిగా సేవించుట . 


 * సరిగ్గా ఉడకని అన్నము మరియు ఆహారపదార్ధాలు సేవించుట . 


 * ఉపవాస విరుద్ద ఆహారాన్ని సేవించుట . 


 * ఒకసారి ఆహారాన్ని తీసుకున్న తరువాత పూర్తిగా అరగక ముందే మరలా ఆహారాన్ని తీసుకోవడం . 


 * కొత్తబియ్యపు అన్నం , పెరుగు , చేపలు , మినుములు , ఉప్పు , పులుసు , ముల్లంగి , గట్టిపడిన అన్నం తినడం , నువ్వులు , పాలు , బెల్లము ఎక్కువుగా సేవించటం . 


 * భుజించిన వెంటనే సంభోగక్రియ జరపడం , పగటి యందు నిద్రించుట , పాపకర్మలు చేయుట . 


        పైన చెప్పిన విధముగా విరుద్ద ఆహారాలను సేవించుట మూలముగా శరీరం నందు వాతాది దోషములు ప్రకోపించి దుష్టత్వాన్ని పొంది కుష్టురోగము కలుగచేయును . ఇలా దోషమును పొందుట వలన మనుష్యునికి 18 రకాల కుష్టులు సంప్రాప్తిస్తున్నవి. అందు మహాకుష్టులు 7 రకములు , క్షుద్ర కుష్టువులు 11 రకాలు . 


 కుష్టు రోగము రావడానికి ముందు కనిపించు లక్షణములు - 


 * కుష్టు రోగము రాబోయే ముందు ఆ స్థలము నందు తాకిన మిక్కిలి నున్నగా గాని లేక గరుకుగా ఉండును. 


 * మచ్చస్థానము నందు చెమట పట్టుట లేక ఎండినట్లు ఉండుట . 


 * మిగిలిన శరీరపు రంగు కంటే ఆ స్థలము నందు రంగు మారి ఉండుట . 


 * దురద కలిగి ఉండటం. 


 * చర్మము స్పర్శజ్ఞానము లేకుండా ఉండటం . 


 * ఆ స్థలము నందు పొడిచినట్లు అనిపించుట. 


 * కందిరీగ కరిచినట్లు దద్దుర్లు లేచుట . 


 * శ్రమ చేయకనే ఆయాసం కలుగుట . 


 * శరీరంపైన వ్రణములు లేచి అందునుండి పోట్లు కలుగుట. 


 * అతిత్వరగా వ్రణం ఏర్పడి పెద్దగా మారి చిరకాలం ఉండటం. 


 * పుట్టిన వ్రణం గట్టిగా ఉండును. 


 * రక్తం నల్లగా ఉండటం , వెంట్రుకల కుదుళ్ళు నొప్పితో కూడుకుని ఉండటం.  


       పైన చెప్పిన లక్షణములు అన్నియు శరీరం నందు కుష్టు ఏర్పడటానికి ముందు కనిపించు లక్షణములు. వాటిని అత్యంత జాగ్రత్తగా గమనిస్తూ త్వరితగతిన చికిత్స తీసికొనవలెను. 


 కుష్టు రోగము నందు ఆహార నియమాలు - 


 ఆచరించవలసినవి - 


 * పాతబియ్యపు అన్నం . 


 * యవలు . 


 * గోధుమలు పాతవి. 


 * చామలు . 


 * కొర్రలు . 


 * పచ్చపెసలు . 


 * కందికట్టు . 


 * చేదు గల కూరలు . 


 * పొట్లకాయ . 


 * చండ్ర . 


 * వేపపువ్వు . 


 * కస్తూరి , చందనం . 


 * కుంకుమపువ్వు , ఇంగువ . 


  ఆచరించకూడనివి - 


 * పులుసు పదార్దాలు . 


 * అతి ఉప్పు , అతి కారపు పదార్దాలు . 


 * పెరుగు , మినుములు , పాలపదార్ధాలు . 


 * బెల్లము , పప్పు , నువ్వులు . 


 * చేపలు , మాంసపదార్ధాలు , కోడిగుడ్డు . 


 * నిలువ పచ్చళ్లు , చల్లటినీరు , టీ , కాఫీ . 


 * నూనె వేపుళ్ళు , బేకరీ పదార్దాలు నిషిద్దం. 


        పైన చెప్పినటువంటి ఆహారనియమాలు పాటిస్తూ సరైన వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసికొనవలెను. వ్యాధి పూర్తిగా నయమైన తరువాత కూడా ఒక సంవత్సరం పాటు పథ్యం చేయుచున్న శరీరం నందలి ఏదన్నా దోషం ఉన్నను అంతరించిపోవును. 


                  సమాప్తం 


         ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

[27/01, 1:12 pm] +91 98850 30034: దగ్గులు హరించుటకు సులభ యోగం - 


  వెల్లుల్లిపాయలు , మిరియాలు ఒక్కోటి 10 గ్రాములు బెల్లం 20 గ్రాములు మూడింటిని మెత్తగా మర్దించి కుంకుడు గింజలు అంత మాత్రలుగా చేసి పూటకి ఒక్క మాత్ర చొప్పున బుగ్గన పెట్టుకొని రసం మింగుతున్న అన్ని రకాల దగ్గులు హరించును . పిల్లలకు కందిగింజ అంత మోతాదు చనుబాలతో కలిపి ఇవ్వాలి .


       ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

ముందున్న కర్తవ్యం

 *సాయి ఇన్‌స్పైర్స్ - జనవరి 26, 2023*


_ధనికుడైనా, పేదవాడైనా, ప్రతి మనిషి ధర్మం ఏమిటి? భగవాన్ ఈ రోజు మనకు స్పష్టంగా మరియు ప్రేమగా గుర్తు చేస్తున్నారు._


*కోట్ల రూపాయలు వెచ్చించి దానధర్మాలు చేయడంలో గొప్పతనం ఉండదు. మీ ఆలోచనలు, మాటలు మరియు పనులు ప్రేమతో నిండి ఉండాలి. మీ తోటివారి బాధలను తగ్గించే ప్రయత్నం చేయండి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే అందరినీ ప్రేమించు. ఇదే నీ ధర్మం.*


*ధర్మం అంటే దానధర్మాలు చేయడం మాత్రమే కాదు. మీరు మీ హృదయాన్ని ధర్మబద్ధమైన భావాలతో నింపుకోవాలి మరియు స్వార్థం మరియు దురాశలను విడిచిపెట్టాలి. ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోండి. మీ తోటివారిని 'ఇతరులు'గా పరిగణించవద్దు. మీ ప్రేమను అందరితో పంచుకోండి; స్నేహపూర్వకంగా జీవించండి మరియు ఐక్యతను పెంపొందించుకోండి. ప్రేమ ద్వారా మాత్రమే మీరు ఇతరుల హృదయాలను గెలుచుకోగలరు మరియు వారిని మార్చగలరు. అందుకే, ప్రేమను పెంపొందించుకోవడం మరియు ఇతరులతో పంచుకోవడం ఈ కాలపు అవసరం. దేవుని పట్ల ప్రేమను మరియు మీ కంటే తక్కువ అదృష్టవంతుల పట్ల కరుణను పెంపొందించుకోండి! ఇది విద్య యొక్క సారాంశం.*


*మీ తల్లిదండ్రులకు సేవ చేయండి మరియు వారిని సంతోషపెట్టండి. ఇంట్లో మీ అమ్మ పడుతున్న బాధల గురించి మీరు పట్టించుకోనప్పుడు మీ ప్రేమను ఇతరులతో పంచుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? మీ తల్లిదండ్రులను ప్రేమించడం మరియు వారికి సేవ చేయడం మీ ముందున్న కర్తవ్యం. అప్పుడు మీరు మీ ప్రేమను ఇతరులతో పంచుకోవచ్చు!*


- డివైన్ డిస్కోర్స్, అక్టోబర్ 23, 2004.

26, జనవరి 2023, గురువారం

మోదీజీకి ప్రత్యర్థి ఎవరు

 *ప్రధాని నరేంద్ర మోదీజీకి ప్రత్యర్థి ఎవరు మరియు ఎందుకు....?


 నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఇప్పటి వరకు కోటి 8 లక్షల రూపాయల విలువైన 80 వేల కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసింది.  అంత డబ్బు పోగొట్టుకున్న వారు మోడీ జీని మాత్రమే ద్వేషిస్తారు.


 అవినీతిపరుల నుంచి ఇప్పటి వరకు రూ.1,20,000 కోట్ల నల్లధనాన్ని ఈడీ పట్టుకుంది.  నల్లధనం దోచుకున్న వారు మోడీని ద్వేషించకపోతే ఏం చేస్తారు?

 

 ఫిజర్ మరియు మోడర్నా వంటి అమెరికన్ కంపెనీల నుండి మోడీ జి కరోనా వ్యాక్సిన్‌ని ఆర్డర్ చేయలేదు.  అతను స్వదేశీ వ్యాక్సిన్‌ను భారతదేశంలోనే తయారు చేశాడు మరియు తద్వారా అమెరికన్ కంపెనీలు భారీ వ్యాపారం చేసే అవకాశాన్ని నాశనం చేశాడు.


 మోదీ జీ యోగా, ఆయుర్వేదం, పౌష్టికాహారం, వ్యాధుల నివారణపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు.  అటువంటి పరిస్థితిలో, అంతర్జాతీయ డ్రగ్ లాబీ మోడీ జీని ద్వేషించదు, కాబట్టి అది ఏమి చేస్తుంది?


 మోదీ జీ ఆయుధ వ్యాపారుల నుంచి ఆయుధాలు కొనడం మానేసి నేరుగా ఫ్రాన్స్ నుంచి రాఫెల్‌ను కొనుగోలు చేశారు.  మోదీ జీ భారతదేశంలోనే రక్షణ పరికరాలను తయారు చేయడం ప్రారంభించి, రక్షణ కొనుగోళ్లను తగ్గించారు.  ఆ సూపర్ పవర్ ఫుల్ అంతర్జాతీయ రక్షణ లాబీ మోడీ జీని ఎందుకు ద్వేషించదు?


 మోదీ జీ మధ్యప్రాచ్య దేశాల నుంచి ఖరీదైన చమురును తీసుకోవడం మానేసి రష్యా నుంచి పెద్దమొత్తంలో తక్కువ ధరకు చమురును తీసుకోవడం ప్రారంభించారు.  ఆ మిడిల్ ఈస్ట్ ఆయిల్ మాఫియా మోడీని ఎందుకు ద్వేషించదు?

 

 భారతదేశంలో పాతుకుపోయిన కుళ్లిపోయిన వ్యవస్థను మోదీజీ శుభ్రం చేస్తున్నారు.  75 ఏళ్లుగా దేశ రక్తాన్ని పీల్చిన అవినీతిపరులు మోదీకి వ్యతిరేకంగా ఏకమయ్యారు.  మోదీని ఆపేందుకు వారు ఏమైనా చేయగలరు.


 ప్రపంచంలో మూడు శక్తివంతమైన లాబీలు పాలించాయి-*

 *1.  రక్షణ లాబీ*

 *2.  చమురు లాబీ*

 *3.  మెడిసిన్ లాబీ*


 ఈ మూడు లాబీలకు వ్యతిరేకంగా మోడీ జీ కలిసి పోరాడుతున్నారు.  వీరంతా మోడీని ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు.


 *మోదీ జీకి మరో టర్మ్ ఇవ్వండి, అప్పుడు ఈ అవినీతిపరులు అంతం అవుతారు.  మోడీ జీకి ఒకే ఒక శక్తి ఉంది మరియు అది భారతదేశ ప్రజలు.  మోడీ జీతో దృఢంగా నిలబడండి.*


  *జై హింద్!

 భారత్ మాతా కీ జై!

 వందేమాతరం !*


 *దయచేసి కనీసం ఐదు గ్రూపులను పంపండి*

 *కొందరు పంపరు*

 *అయితే మీరు తప్పకుండా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా                                      *మోడీ రామ్*

వసంత పంచమీ

 శ్లోకం:☝️

*మహో అర్ణః సరస్వతీ*
  *ప్ర చేతయతి కేతునా*
*ధియో విశ్వ వి రాజతి l*
  - ఋగ్ వేదం

భావం: ఓ సరస్వతీ దేవి! అనంతమైన నీ జ్ఞాన సముద్రం నుండి మా అందరికీ జ్ఞానాన్ని అందిస్తున్నావు. అపారమైన నీ కరుణతో ఈ సమస్త జగత్తును బుద్ధి జ్ఞానములతో అలంకరించుము.🙏
*అందరికీ వసంత పంచమీ శుభాకాంక్షలు!*🇮🇳

ఒకే దేవుడు దాగి ఉన్నాడు

 శ్లోకం:☝️

*ఏకో దేవః సర్వభూతేషు గూఢః*

 *సర్వవ్యాపి సర్వభూతాన్తరాత్మా I*

*కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః*

 *సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ ||*

  - శ్వాతాశ్వతర ఉపనిషత్


భావం: సమస్త జీవరాశులలో ఒకే దేవుడు దాగి ఉన్నాడు. అతడు సర్వవ్యాపి (all pervading , omni present), సమస్త జీవరాశులలో అంతరాత్మ. అతను అన్ని కర్మలను పర్యవేక్షిస్తాడు. అతను అన్ని జీవులకు ఉనికి (existence). ఆయనే సాక్షి (witness) , స్వచ్ఛమైన చైతన్యం (pure consciousness). అతను ఒకడు , అతను కాకుండ రెండవది లేనివాడు , అద్వయుడు. అతను అన్ని గుణాలకు (properties or attributes) అతీతుడు.🙏

తేడా ఏంటో తెలుసా..?

 *August 15 నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..? ఖచ్చితంగా అన్ని తెలిసిన మేధావులం.. తెలిసి తప్పు చేయొద్దు తెలవకపోతే తెలుసుకొని సరిదిద్దుదాం..మరచిపోవద్దు*


ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రాగా.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం.


 అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. 


*ఆ తేడా ఏమిటో  తెలుసుకుందాము*👇


👉ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు.

 *ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు.* మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం  వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. 


👉గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు.  జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా *త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు*. ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు.

 ( *గమనిక*:  ఇక్కడ  జనవరి 26 నాడు జెండాను already కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి ).


దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది.


 స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు.

అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. 


అయితే ఇక్కడ గమనించాల్సిన  వ్యత్యాసం ఏమిటంటే..


👉 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను *ఎగురవేస్తారు*(Flag Hoisting).

👉గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను  *ఆవిష్కరిస్తారు*(Flag Unfurling) .


ఇంకొక వ్యత్యాసం  ఏమిటంటే .. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. 


👉స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం *ఎర్రకోటలో* జరుగుతుంది.


👉 గణతంత్ర దినోత్సవం జనవరి 26  నాడు *రాజ్‌పథ్‌లో* జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.


ఈ విషయం ఇప్పటికీ చాలా మంది ఈ దేశ పౌరులకు తెలియదు.(చదువుకున్న వాళ్లకు కూడా చాలా వరకు తెలియదు).


కావున ఈ information ను share చేసి మన వాళ్లకి అవగాహన  కల్పించడం మన బాధ్యతగా భావించండి. ముఖ్యంగా విద్యార్దులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.

భారత్  మాతా కీ జై....🇮🇳🇮🇳🇮🇳

జనగణమన

 *జనగణమన..* 


పిడికిలి బిగించి

నడుములు నిటారెట్టి

గొంతులు పిక్కటిల్లి

శ్వాసలన్నీ బిగబెట్టి

పలుకులన్నీ ఒక మాట

వందేమాతరం గీతమేగి

జన గణ మన

ఆలపిస్తుంటే

గగనాన త్రివర్ణం రెపరెఫలాడే..


జెండా ఊంచా రహే హమారా.


భారత దేశం

రత్నగర్భ సుసంపన్నం.


భిన్నత్వంలో ఏకత్వం...

కులమతాల ఐకమత్యం..


వేష,భాషలు వేరైనా

ప్రాంతాలు అనేకమైన

దేశమొక్కటే భారతీయం.


స్వేచ్చా స్వాతంత్ర్యం విరసిల్లే..

హక్కుల బాటన

నేటి భారతం.


రాజ్యాంగం అమలయ్యే

గణతంత్రం సిద్దించే

సువిశాల భారతావని

ప్రపంచానికే ఆదర్శమై...


స్వాతంత్ర్య కాంక్షన

ప్రాణాలొడ్డిన వీరులొకవైపు

ఉరితాడులను ముద్దాడిన సమిధలొకవైపు...


శాంతి మంత్రంతో పోరు సలిపిన స్వాతంత్ర్య సమర యోధులొక వైపు..


స్వేచ్చాగాలులు వీచిన వేళ..


ఎక్కడో అపసృతులు..

స్వేచ్చా సమాన హక్కులు లేని రాజ్యమది...


రాజ్యాంగ రూపకల్పనతో

అన్ని హక్కులకు ప్రాణం పోసిన తరుణం...


అది అమలయ్యిన నాడే ఈ గణతంత్ర దినోత్సవం.


అంబేద్కర్ అంటే దారిలో పెట్టిన విగ్రహం కాదు.

అది సమాజానికి దిశ, దశను చూపే రాజ్యాంగ నిర్మాత..


ఎలిగెత్తి పిలవాలి

నా దేశం భారతదేశం

సమాన హక్కులు కలిగివున్నది.


ఈ నేలన ఎన్ని వన్నెలు ఉన్నా 

భారతావనికి మువ్వన్నెలనే అందం...


అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం..


భారతదేశం నా మాతృభూమి......


వందేమాతరం.


శుభాకాంక్షలతో


అశోక్ చక్రవర్తి.నీలకంఠం.

9391456575.

వసంత పంచమి*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

      *నేడు… వసంత పంచమి*


          *వసంత పంచమి విశిష్టత*

                    ➖➖➖


*సరస్వతీదేవిని మాఘపంచమినాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు.*


*సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు.* 


*సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు.*


*ఈ శ్రీపంచమినే ‘వసంత పంచమి’ అని ‘మదన పంచమి’ అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది.* 


*ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.*


*మాఘమాసం శిశిరఋతువులో వసంతుని స్వాగతచిహ్నముగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.*


*అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు.*


*మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని ‘శివానుజ’ అని పిలుస్తారు.* 


*శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.*


*”చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా” అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని, సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.*


*అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది.* 


*అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.*

 

*ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు.* 


*జ్ఞానకాంతిని పొందినవారికి ఆయుధాల అవసరం ఏమీ వుండదు కదా. ఈ తల్లిని తెల్లని పూవులతోను, శ్వేత వస్త్రాలతోను, శ్రీగంథముతోను, అలంకరిస్తారు.* 


*పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని, నేతితోకూడిన వంటలను, నారికేళము, అరటిపండ్లను చెఱకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు.*


*”వాగేశ్వరీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి” ఇలా అనేక నామాలున్నప్పటికీ “సామాంపాతు సరస్వతీ.... “ అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట.*


*సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావస్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు.* 


*వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు.* 


*పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.*

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ధనాశాపరులకు

 శ్లోకం:

అర్థాతురాణాం నగురుర్నబంధు:, కామాతురాణాం నభయం నలజ్జా !

విద్యాతురాణాం నసుఖం ననిద్రా, క్షుధా తురాణాం నరుచిర్నపక్వం !!


తాత్పర్యము:

ధనాశాపరులకు గురువు, బంధువుల పట్టింపు లేదు, కామం కళ్ళకెక్కిన వాడికి భయమూ, సిగ్గు ఉండదు. విద్యాపేక్ష కలవానికి సుఖము, నిద్ర ఉండదు. ఆకలిగొన్న వానికి రుచి గూర్చి, ఉడకటం గురించి ఆలోచన ఉండదు.

*💐💐శుభం భూయాత్💐💐*

పరివేదన చెందనవసరములేదు.

 శ్రీ ఆది శంకర - వేదాంతం


1. మాతా నాస్తి, పితా నాస్తి, 

నాస్తి బంధు సహోదరః| 

అర్థం నాస్తి, గృహం నాస్తి, 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, 

జాయా దుఃఖం పునః పునః| 

సంసార సాగరం దుఃఖం 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


3. కామః క్రోధశ్చ, లోభశ్చ 

దేహే తిష్ఠతి తస్కరాః| 

జ్ఞాన రత్నాపహారాయ 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా :- కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


4. ఆశయా బధ్యతే జంతుః 

కర్మణా బహు చింతయా| 

ఆయుక్షీణం న జానాతి 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో, జీవితాలు గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


5. సంపదః స్వప్న సంకాశాః 

యౌవనం కుసుమోపమ్| 

విధుఛ్చచంచల ఆయుషం 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు. యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


6. క్షణం విత్తం, క్షణం చిత్తం, 

క్షణం జీవితమావయోః| 

యమస్య కరుణా నాస్తి 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


7. యావత్ కాలం భవేత్ కర్మ 

తావత్ తిష్ఠతి జంతవః| 

తస్మిన్ క్షీణే వినశ్యంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో, అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు. 


8. ఋణానుబంధ రూపేణ 

పశుపత్నిసుతాలయః| 

ఋణక్షయే క్షయం యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు. 


9. పక్వాని తరుపర్ణాని 

పతంతి క్రమశో యథా| 

తథైవ జంతవః కాలే 

తత్ర కా పరివేదన|| 


తా:- పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? 


10. ఏక వృక్ష సమారూఢ 

నానాజాతి విహంగమాః| 

ప్రభతే క్రమశో యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ నవసరములేదు. 


11. ఇదం కాష్టం ఇదం కాష్టం 

నధ్యం వహతి సంగతః| 

సంయోగాశ్చ వియోగాశ్చ 

కా తత్ర పరివేదన|| 


తా - ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు.